Mohan
588 views 15 hours ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party 🎯 కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు వారం అప్పగిస్తే.. ఊరూరా నీళ్లు పారిస్తం 🌊 💥 కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్ 🔥 ✅ కాళేశ్వరం: తెలంగాణకు వరం ❌ రేవంత్‌: రాష్ర్టానికి శనేశ్వరం 📣 కన్నెపల్లి నుంచి గోదావరి నీళ్లను ఎత్తిపోయలేరా? రెండు పిల్లర్ల రిపేరుకు 31 నెలలుగా కాలయాపనా? 📢 కేసీఆర్‌పై కక్షతో తెలంగాణ రైతాంగాన్ని శిక్షిస్తారా? 🚨 ఎల్‌నినోతో వానల్లేక, పొలాలు ఎండుతుంటే.. లక్ష క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి వదిలేస్తారా? 🎯 వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలి. లేదంటే ప్రాజెక్టును ముట్టడించి పంపులను ఆన్‌ చేస్తం 🆘 యూరియా, కరెంటు ఇవ్వాల్సి వస్తదనే నీళ్లిస్తలేరు. మేం రైతుల కోసం వస్తే సీఎంకు భయమెందుకు? ⛔ కన్నెపల్లికి వెళ్లకుండా మమ్మల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకున్న తీరును తెలంగాణ సమాజం చూసింది 🔸 మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంప్‌హౌస్‌లు ప్రారంభించాలె కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడం వెనుక రేవంత్‌రెడ్డి భారీ కుట్ర ఉన్నది. అది రైతాంగాన్ని శాశ్వతంగా దెబ్బతీయడమే. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతు చేయిస్తే రైతులకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే యూరియా సరఫరా చేయాలి. యూరియా సరఫరా చేస్తే పంట కొనాలి. పంట కొనుగోలు చేస్తే ఆ సొమ్ము చెల్లించాలి. దానికి తోడు బోనస్‌ వేయాలి. ఇన్ని చేసే బదులు అసలు మేడిగడ్డను రిపేర్‌ చేయకపోతేనే బెటర్‌ కదా! అనే ఆలోచనకు వచ్చే అద్భుతమైన ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి పడావు పెట్టిండు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలె. లక్షల క్యూసెక్కుల నీటిని వృథాగా కిందికి పారదోలుతున్న అంశంలో అధికారులు, కాంగ్రెస్‌ నాయకులను రైతులు గల్లా పట్టి అడుగాలె. రైతుల గోస పట్టించుకొని ప్రభుత్వం వెంటనే పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలె. లేదంటే 50, 60 వేల మందితో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మేమే ఆన్‌చేస్తం.
8 likes
11 shares

More like this