#ఏపీ అప్ డేట్స్..📖
*✈️సింగపూర్ 'స్టడీ' టూర్.. కోటి రూపాయల 'ప్యాకేజీ'!🇸🇬*
ఏపీ మంత్రుల బృందం రేపటి నుంచి సింగపూర్ విమానం ఎక్కబోతోంది.
అచ్చెన్నాయుడు గారు సింగపూర్లో వ్యవసాయం ఎక్కడ జరుగుతుందో వెతికి పట్టుకుని, అక్కడ 'అరక' ఎలా కడతారో ఏపీ రైతులకు వివరిస్తారట!
వంగలపూడి అనిత గారు సింగపూర్ వీధుల్లో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చూసి, మన ఊర్లో "హోం గార్డుల" సంఖ్య పెంచాలా వద్దా అని తేలుస్తారట.
నారాయణ గారు ఎలాగూ అమరావతిని సింగపూర్ చేయాలి కాబట్టి, అక్కడ ఇటుకల సైజును కొలవడానికి టేపు పట్టుకుని వెళ్తున్నారని టాక్.
మొత్తం మంజూరైన నిధులు రూ. 95,18,145.
(అంటే అక్షరాలా కోటి రూపాయలకి చిల్లర తక్కువన్నమాట!)
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని రోజూ చెప్తారు కానీ, 'స్టడీ' టూర్లకి మాత్రం నిధులు 'జెట్' స్పీడుతో మంజూరవుతాయి.
ఏడుగురు మంత్రులు ఒకేసారి వెళ్తే, ఇక్కడ సెక్రటేరియట్లో ఫైళ్ల మీద సంతకాలు పెట్టేదెవరు? ఆ.. సారీ! అంతా ఆన్లైన్ కదా, అక్కడ మెరీనా బే సాండ్స్ లో కూర్చుని 'డిజిటల్ ఆంధ్ర'ను నడిపిస్తారన్నమాట!
#SingaporeTour #


