Ravi Talluri
*_ఈ రోజు ప్రశ్న కు సమాధానం._*
*_ప్రశ్న : రొమశ మహర్షి ఎవరూ. ఆయన ప్రస్తుతం ఎక్కడ తపో సమాధి లో ఉన్నారు_*.
*_సమాధానం :- మార్కండేయ పురాణం, మహాభారతం, దేవి భాగవతం లో పేర్కొన్న విషయాలు ఈ పోస్ట్ కు అదారం._*
*_ఒక సారి_* *_ఇంద్రుడికి ఒక అద్భుతమైన_* *_భవనం కట్టుకోవాలి_*
*_ఆనిపించి విశ్వకర్మ ను పిలిచి తన కోసం అద్భుతమైన భవనం నిర్మించాలని కోరారు.దాంతో విశ్వకర్మ ఒక అద్భుతమైన భవనం నిర్మించాడు _కానీ ఆ భవనం ఇంద్రునికి నచ్చలేదు_*.
*_సరే ఆని ఇంకో భవనం నిర్మించాడు కానీ అదికూడా నచ్చలేదు_*.
*_ఇలా ఎన్ని సార్లు ఎన్ని భవనాలు నిర్మించిన ఇంద్రునికి నచ్చకపోవడం తో విశ్వ కర్మ ఆలోచన లో పడ్డాడు._*
*_అప్పుడు అక్కడికి వచ్చిన నారద మహర్షి విశ్వ కర్మ యొక్క విచారాన్ని చూసి విషయం కనుక్కొని. నేను ఇంద్రుని తో మాట్లాడుతాను ఆని చెప్పి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు._*
*_అప్పుడు ఇంద్రుడు కూడ విచారం లోనే ఉన్నాడు. ఎందుకంటే తనకు నచ్చినట్లు విశ్వకర్మ లాంటి వాడే ఒక భవనం నిర్మించలేక పోయాడే ఆని_*.
*_అప్పుడు నారద మహర్షి ఇంద్రుని తో అన్నాడు నీకు నచ్చిన అద్భుతమైన భవనం ఒకటి భూలోకం లో ఉంది రా చూపిస్తా ఆని.సరే ఆని ఇద్దరూ భూలోకము లోని సిద్ధాశ్రమానికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక ఋషి చినిగి పోయిన చాప ను నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు.అతడి శరీరం మొత్తం వెంట్రుకలు లో నిండిపోయింది. అతడి ఛాతి మీద మాత్రం వెంట్రుకలు లేక నున్న గ ఉంది._*
*_అప్పుడు ఇంద్రుడు ఇక్కడ అద్భుతమైన భవనం ఉంది అన్నారు కదా దేవర్షి ఎక్కడ ఆని అడిగాడు. అప్పుడు నారదుడు ఆదిగో ఆ మహర్షి ఉన్నాడే అదే ఆ భవనం ఆని ఆ ఋషి వద్దకు వెళ్లి ఆయనకు భక్తి తో నమస్కరించాడు నారదుడు. దాంతో నారదుడు నమస్కరించాడు అంటే ఆయన ఎంతో గొప్ప వాడు అయి ఉంటాడు ఆని ఇంద్రుడు కూడ ఆయనకు నమస్కరించాడు. అప్పుడు నారదుడు ఆ ఋషి తో అన్నాడు మహర్షి అందరూ ఎంతో గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టుకొని అందులో సుఖం గ ఉన్నారు మీరు చూస్తే ఇలా చెట్టు కింద చినిగి పోయిన చాప ను నెత్తిన పెట్టుకుని ఉన్నారు మీరు కూడా ఒక ఆశ్రమం కట్టుకోవచ్చు కదా అన్నాడు_*.
*_అప్పుడు ఆ ఋషి అన్నాడు. నేను అల్పాయువు కలిగిన వాడిని నాకెందుకు నారదా అశృమాలు ఆని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నేను ఇంద్రుడినీ మహర్షి మీ ఆయువు ఎంతో చెప్పండి మీకు అమృతన్ని ఇచ్చి మిమ్మల్ని అమరుణ్ణి చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ ఋషి ఇలా అన్నాడు నా ఆయువు ఎంత ఇంద్ర నా శరీరం పై ఉన్న రొమాలు అన్ని రాలిపోగానే నేను మరణిస్తాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రోమాలు అన్ని ఎప్పుడూ రాలిపోతాయ్ ఆని అడిగితే ఒక బ్రహ్మ యొక్క ఆయువు పూర్తి కాగానే ఒక రోమం రాలి పోతుంది. ఇప్పటికే నా వక్ష స్థలం పై ఉన్న రోమాలు రాలి పోయి నున్న గ అయిపోయింది_* *_చూసావా. ఇక నా శరీరం పై ఉన్న అన్ని రోమాలు రాలి పోగానే నేను మరణిస్తాను నాకు అమృతం ఎందుకు లే ఇంద్ర ఆని అన్నాడు. అంటే అతడి శరీరం పై ఒక్క వెంట్రుక రాలిపోవాలి అంటే ఒక బ్రహ్మ జీవిత కాలం పూర్తి అవ్వాలి.ఆ మాట వినగా ఇంద్రుడికి మూర్చ వచ్చినంత పని అయింది._*
*_ఇంతకు బ్రహ్మ ఆయువు ఎంత ఆని ఒక్క సారి చూద్దాం_*.
*_కృత యుగం_*
*_త్రేతా యుగ_*
*_ద్వాపర యుగం_*
*_కలి యుగం_*.
*_ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక చతుర్యుగం_*
*_ఒక చతుర్యుగానికి 4320000 సంవత్సరాలు_*.
*_అలాంటి చతుర్యుగాలు 71 ఐతే ఒక మన్వoనతరం_*.
*_ఓక మన్వంతరానికి ఒక ఇంద్రుని ఆయువు పూర్తి ఔతుంది._*
*_అలాగే ఇంద్రుని తో పాటు అప్పటి వరకు దిక్పాలకులు గ పదవుల్లో ఉన్న అందరు దేవతలు తమ ఆయువు ను పూర్తి చేసుకొని కొత్త దిక్పాలకులు పదవులు స్వికరిస్తారు_*.
*_అంటే ఉదాహరణ కు ఇప్పటి వైవశ్వత మన్వంతరం లో కష్యప మహర్షి కుమారుడు పురందరుడు ఇంద్ర పదవి లో ఉన్నాడు అలాగే బృగు మహర్షి కూతురు పౌలోమి శచి దేవిగా ఉంది_*
*_తరువాత రాబోయే సావర్ణిమన్వంతరం లో_*
*_బలి చక్రవర్తి ఇంద్ర పదవి నీ పొందితే ఆయన భార్య వింద్యావళి శచి దేవి గ పదవి నీ పొందుతుంది._*
*_ఆలా ప్రతి మన్వంతరానికి సప్త ఋషులు, దిక్పాలకులు దేవ గణాలు మారుతూ ఉంటారు_*.
*_అలాంటి మన్వంతరాలు 14 పూర్తి ఐతే ఒక కల్పం_*
*_అలాంటి కల్పాలు రెండు ఐతే బ్రహ్మ దేవునికి ఒక రోజు_*.
*_అలాంటి రోజులు 360 ఐతే బ్రహ్మ దేవుని కీ ఒక సంవత్సరము_*.
*_అలాంటి సంవత్సరాలు వంద పూర్తి ఐతే ఒక బ్రహ్మ ఆయువు పూర్తి ఔతుంది._*
*_ఇప్పుడు ఉన్న చతుర్ముఖ బ్రహ్మ కు ఇప్పుటికి 50 ఏళ్ళు పూర్తి అయి యాభై ఒకటో ఏడు నడుస్తుంది. ఆయన కు ఇంకో 49 ఏళ్ళ పూర్తి అవ్వగానే ఆంజనేయ స్వామి బ్రహ్మ పదవి నీ పొందుతాడు. అందుకే ఆంజనేయ స్వామి నీ భవిష్యత్తు బ్రహ్మ ఆని అంటారు._*
*_ఒక బ్రహ్మ ఆయువు పూర్తి ఐతే రోమశ మహర్షి శరీరం పై ఒక రోమం రాలి పోతుంధి. ఆయన శరీరం పై ఎన్ని కోట్ల రొమాలు ఉన్నాయో.. ఆని కోట్ల మంది బ్రహ్మ లు తమ ఆయువు పూర్తి చేసుకొంటే కానీ రోమశ మహర్షి ఆయువు పూర్తి కాదు._*
*_ఇవన్నీ గ్రహించిన ఇంద్రుడు తన అజ్ఞానం ను గ్రహించి అక్కడి నుండి వెళ్ళిపోయి విశ్వ కర్మ కట్టించిన ఒక మంచి భవనాన్ని ఎంచుకొని అందులో నివసించాడు_*.
*_ఇక పోతే రోమశ మహర్షి గురించి చాలా పురాణాల్లో వివరించారు._* *_రోమశ మహర్షి పాండవులతో వనవాస కాలం లో వారితో కలిసి తీర్థ యాత్రలు చేశాడు._*
*_అలాగే పరమ రామ భక్తుడు ఐన కాక భూషండుడికి రామ మంత్రాన్ని ఇచ్చింది కూడా ఈ రొమశ మహర్షి. గతం లో మనం కాకభూషండు డి గురించి కూడ ఛేప్పుకొన్నాం._*
*_శివుడు,విష్ణువు,అమ్మవారు_* *_శాశ్వతులు నాశనం లేని వారు_*.
*_వారి తరువాత అధిక ఆయువు కలిగిన వ్యక్తి ఈ రొమశ మహర్షి_*.
*_ప్రస్తుతం రొమశ మహర్షి శ్రీ కాళహస్తి క్షేత్రం లో_*
*_స్వామి వారి ఆలయం లో దర్శనం చేసుకొని బయట కు వచ్చే టప్పుడు ఎడమ పక్క ఒక చిన్న గూడు లో రొమశ మహర్షి ఆని ఒక విగ్రహం ఉంటుంది._* *_ఆ విగ్రహం కింద భూగృహము లో ఇప్పటికి రొమశ మహర్షి తపో సమాధి లో ఉన్నారు_*.
*_శ్రీ కాళహస్తి వెళ్ళినప్పుడు ఆలయం లోకి వెళ్లే ముందు గడప ను మాత్రం తొక్క కుండా వెళ్ళండి ఎందుకంటే ఆ గడప కు ఒక వైపు మహా కవి దూర్జటీ సమాధి ఉంది. మరో వైపు రోమశ మహర్షి తపో సమాధి లో ఉన్నారు_*
*_శ్రీ కాళహస్తి పంచభూత లింగాలలో ఒకటి ఆని అందరికి తెలుసు అలాగే త్రయoభీకా క్షేత్రాలలో కూడ ఒకటి అందుకే అక్కడ స్వామి కీ అమ్మ కీ ఇద్దరికీ సమాన వైభవం._*
*_నాకు శ్రీ కాళహస్తి ఆలయానికి పోతే అమ్మ ఒడి లో ఉన్న భావం కలుగుతుంది_* #మన సంప్రదాయాలు సమాచారం