ShareChat
click to see wallet page
search
*'స్వచ్ఛ రథం’తో పర్యావరణ మార్పు – పరిసరాల పరిశుభ్రతే సమాజ లక్ష్యం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి* *మార్కాపురం జిల్లా, రాచర్ల మండలం, రాచర్ల* :: గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత మరియు వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వచ్ఛ రథం కేవలం చెత్త సేకరణ వాహనం మాత్రమే కాదని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చే ఒక సామాజిక ఉద్యమమని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలకు చెత్త నిర్వహణపై అవగాహన కల్పించడం, ప్లాస్టిక్, ఇనుము, కాగితం వంటి వ్యర్థాలను పారవేయకుండా, వాటిని తిరిగి వినియోగించుకునే (రీసైక్లింగ్) అలవాటును పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. “వినియోగించని వస్తువులను ఇవ్వండి – సరుకులు పొందండి” అనే నినాదంతో ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ, వ్యర్థాల బదులుగా నిత్యావసర సరుకులు అందించడం ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నామని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నిల్వలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సురక్షితంగా సేకరించడం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడాన్ని నిరోధించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. దీంతో దోమల పెరుగుదల తగ్గి, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా నివారించవచ్చని అన్నారు. *రాచర్ల మండలం మరియు గ్రామీణ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాల మాదిరిగా స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే వినూత్న కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.* “ప్రతి ఇల్లు స్వచ్ఛంగా ఉంటేనే ఊరు స్వచ్ఛంగా ఉంటుంది; ఊరు స్వచ్ఛంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ రథం సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ca 00 AP39708820 ca 00 AP39708820 - ShareChat