#జయ_విజయుల కథలో దాగి ఉన్న గొప్ప సత్యం.
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ద్వారపాలకులుగా జయ, విజయులు ఉండేవారు. ఒకసారి సనక, సనందన, సనాతన, సనత్కుమారులు శ్రీహరిని దర్శించడానికి వచ్చారు. కానీ జయ విజయులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన మహర్షులు వారికి శాపం ఇచ్చారు.
ఆ శాపం కారణంగా జయ విజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించాల్సి వచ్చింది.
మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు...
రెండో జన్మలో రావణుడు, కుంభకర్ణుడు...
మూడో జన్మలో శిశుపాలుడు, దంతవక్రుడు...
ఈ మూడు జన్మల్లోనూ వారు శ్రీహరిని ప్రేమించలేదు... ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు... ఆయనను ద్వేషించారు...
కానీ ఒక విషయం గమనించాలి...
వారి మనసులో ఎప్పుడూ శ్రీహరే ఉండేవాడు.
కోపంతో అయినా... ద్వేషంతో అయినా... పగతో అయినా...
వాళ్లు ప్రతిక్షణం శ్రీహరినే తలచేవారు.
భక్తుడు కొంతసేపు భగవంతుని స్మరిస్తే... శత్రువు మాత్రం రోజంతా ఆయనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడు.
అందుకే పురాణాలు మనకు ఒక గొప్ప పాఠం చెబుతాయి...
ద్వేషం కూడా మనసును అదే వ్యక్తి చుట్టూ తిరిగేలా చేస్తుంది.
#💗నా మనస్సు లోని మాట #govinda #govinda govinda #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏 ఓం నమో నారాయణ


