🪷197లింగ మహాపురాణం🪷
🍀శివలింగ స్థాపన🍀
#నూట తొంభై ఏడవ భాగం#
భక్తులు శివలింగమును భక్తి శ్రద్థలతో ప్రతిష్ఠ చేయాలి. లింగమునకు మొదట విశేష పూజ చేయాలి. పూజించిన లింగమును పవిత్రభూమిమధ్య లో శివాసనము పై ఉంచాలి. కుశలు,వస్త్రములతోఆచ్ఛాదించాలి. లోకపాలురు, దిక్పాలురు మొదలైన దేవతలను అక్షతలు, కుశలు, స్వస్తికములతో,విభిన్న రంగుల దారములతో , వజ్రాది ఆయుధ యుక్తమైన వస్త్రముతో చుట్టి, ఈశాన మంత్రం పఠిస్తూ లింగము గల మండలములో స్థాపించాలి.ధూప దీప యుక్తః మైనవస్త్రముయొక్కవితానమును లింగము ముందు ఏర్పాటు చేయాలి. కుశలతో చేసినమాల ను లింగ స్థానమునకు నాలుగు వైపులా కట్టాలి. తరువాత భక్తుడు ధూప దీపములతో కూడిన జలములో మూడు లేదా ఐదు రోజులు ఏకరాత్ర వాసముచేయాలి.ఈసమయంలో వేదాధ్యయనము తప్పని సరిగా చేయాలి. శివ భజనలు, వీణ మొదలైన వాద్యములతో శివగానములుఏర్పాటుచేయాలి. ఇందులో కింకిణి శబ్ద ధ్వని ఉండాలి. తరువాత స్వస్తికము పై ధ్యానము చేయాలి.
కొత్తగాకుండముతవ్విఅందులో అష్ట మంగళములు అనబడే ఎనిమిది పవిత్ర వస్తువులను ఉంచాలి. దిక్పాలకుల కోసం చుట్టూ అష్ట ధ్వజములతో అష్ట మండలములుఏర్పాటుచేయాలి. ప్రధాన కుండము ఈశాన్య దిక్కులో ఉండాలి.వేదిక మధ్యలో బంగారంతో చేసిన మహాశయ్య ఏర్పాటు చేయాలి. ఐదు వత్తుల దీపమునుఅక్కడ ఉంచాలి. శయ్య పై తెల్లటి వస్త్రము పరచి శివ లింగమును స్థాపించాలి. లింగము శిరస్సు తూర్పువైపుఉండేటట్టుచూడాలి.స్థాపనఈశానమంత్రములతో చేయాలి. రత్నాన్యాసము చేసి రత్నములను కలశము పైన ఉంచాలి.
కుశలతో కలిపి రెండు వస్త్రములనులింగమునకునాలుగుదిశలలచుట్టాలి.రత్నాన్యాసము చేసి నవ శక్తులను, వామ దేవాది దేవతలను ఉంచాలి. బంగారం, రత్నములు, పంచ ద్రవ్యాలు, నవధ్యానములను రాతి పై ఉంచాలి. బ్రహ్మ భాగ లింగమును శివగాయత్రిపఠిస్తూ ప్రతిష్ఠించాలి. విష్ణు గాయత్రి చేత వైష్ణవ లింగ భాగమును ప్రతిష్ఠించాలి. ప్రణవముతో లింగము అగ్రభాగాన శివుని ప్రతిష్ఠించాలి.
వేదిక మధ్యలో సర్వదేవతలను ప్రతిష్ఠించాలి.సర్వంనమః,శివాయనమఃఅంటూరుద్రాధ్యాయముతో సర్వముశుభ్రంచేయాలి. కలశములను వేదిక నాలుగు దిశలలో స్థాపించాలి. వేదిక పై శివునికి, శివానికి దక్షిణమున కుంభము పై ఉంచాలి. శివునికి ఉమాదేవికి మధ్యలో స్కందుని ఉంచాలి. బ్రహ్మను స్కందుని కుంభం పైన, విష్ణువుని ఈశుని కుంభము పై ఉంచాలి.
అంబిక మాతనువేదికమధ్యలో పుర్వోక్తవిధానములోస్థాపించాలి. సుగంధ జలముతో వర్ధని పాత్రను నింపాలి. దేవీమాతను అందులో స్థాపించాలి. శివ కుంభములో బంగారం, వెండి, రత్నములు వేయాలి. వర్ధని పాత్రలో విద్యేశ్వరులను గాయత్రి, అంగ మంత్రాలతో స్థాపించాలి.
అనంతుడు, ఈశుడు మరియు ఇతర దేవతలను దిశలలో గల కుంభములలో ప్రణవముతో ప్రారంభించి నమః తో అంతం చేస్తూ స్థాపించాలి. ఎనిమిది కుంభములను నూతన వస్త్రముతో మూయాలి. శివుని ముందు గాయత్రి మంత్రంతో అంగన్యాస, కరన్యాసములు చేసి హవనం చేయాలి. జయముతో ప్రారంభించి స్వీష్టతో సమాప్తం చేయాలి.
శివ కుంభపు వర్ధని జలమును నాలుగు దిశలలో చిలకరించి శివుని పై చల్లాలి. అన్ని మంత్రములతో శివునికి అభిషేక స్నానము చేసి పూజ చేయాలి. వేయి పణములు దక్షిణగా సమర్పించాలి. ఇందులో సగము ఇతరులకు దక్షిణగా ఇవ్వాలి. భూమి, గోవులు, వస్త్రములు, ఆభరణాలు శివునికి ప్రతినిధిత్వము వహించిన ఋత్విక్కునికి సమర్పించాలి.
పెద్ద ఉత్సవము లింగ స్థాపన సందర్భంలో ఏర్పాటు చేయాలి. తొమ్మిది లేదా ఏడు లేదా మూడు రోజులు లేదా ఒక రోజు హోమము, యాగము, సమర్పణ (బలి) చేయాలి. ప్రతిరోజూ శివుని పూజ తరువాత హవనము చేయాలి. సూర్యాది దేవతలకు హోమము చేయాలి. ఆభ్యంతర వాహాగ్నిలో రోజు దైనిక పూజ చేయాలి.
ఈవిధంగా శివలింగ ప్రతిష్ఠ చేసిన వారు శివలోకం చేరి శివుని సన్నిధిలో ఉంటారు. శివగణాలు, రుద్రులు, మునులు వారిని పూజిస్తారు. మూడు లోకాలలో గౌరవం, సన్మానం, పూజలు అందుకుంటారు.
https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ
*మిగతా కథ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

భగవాన్ రమణ
WhatsApp Group Invite

