*అర్ధవీడు కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు.*
*మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) పాఠశాలను గౌరవ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు.*
*ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న వసతులను సమగ్రంగా పరిశీలించారు.*
*తరగతి గదులు, కిచెన్ రూములు, బాత్రూములు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్, అలాగే నూతన గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.* *విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా తాగునీటి అందుబాటు, R.O. ప్లాంట్ పని తీరు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.*
*ఈ సందర్భంగా పాఠశాలలో పరిశుభ్రత లోపాలపై ఎమ్మెల్యే గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులు మరియు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు R.O. ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందించవలసిందిగా ఆదేశించారు.*
*అలాగే, విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు.*
*విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని, ప్రిన్సిపాల్ ను మందలించడం జరిగినది.*
*విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. కార్యక్రమం లో ఎంపీడీఓ ఖాసీం పీరా గారు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్


