తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణచివేతపై పోరాడి, శాంతియుత పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామన్నారు. ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్



