VIDEO: టూరిస్ట్ రిసార్ట్లను ముంచెత్తిన హిమపాతం
జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. గాండర్బల్ జిల్లా సోనమార్గో టూరిస్ట్ రిసార్ట్లను నిన్న రాత్రి 10:12 గంటల సమయంలో భారీ హిమపాతం ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ మంచు కురుస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ సహా పలు ప్రాంతాలకు హిమపాత హెచ్చరిక జారీ చేశారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦
VIDEO: గూగుల్ మ్యాప్స్ చూస్తూ మెట్ల మీదకి..!
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. జైపూర్లోని (RJ) బిర్లా మందిర్ వద్ద గూగుల్ మ్యాప్స్ చూస్తూ వెళ్లిన ఓ కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ కారును నేరుగా ఆలయ మెట్ల మీదకి తీసుకెళ్లడంతో వాహనం ఇరుక్కుపోయింది. పోలీసులు శ్రమించి కారును సురక్షితంగా కిందకు దించారు. తెలియని ప్రదేశంలో మ్యాప్స్ నమ్మి దూసుకెళ్లొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
ఆకాశంలో 'ఆపరేషన్ సిందూర్'.. చూశారా?
ఢిల్లీ కర్తవ్యపథ్పే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విన్యాసాలు అదరగొట్టాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తుచేసే ఫార్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రఫేల్, మిగ్-29, సుఖోయ్-30 జెట్స్ కలిసి గాలిలో 'తిలకం' ఆకారాన్ని సృష్టించాయి. ధ్రువ్ హెలికాప్టర్ ఆపరేషన్ సిందూర్ జెండాను ప్రదర్శించింది #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
కుప్పకూలిన విమానం
అమెరికాలో 8 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్(ట్విన్ ఇంజిన్ బాంబార్డియర్ ఛాలెంజర్ 600 టర్బోఫ్యాన్) కుప్పకూలిపోయింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం బాంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది చనిపోయి ఉండొచ్చని సమాచారం. ప్రమాదానికి మంచు తుఫానే కారణమా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
VIRAL: సెల్యూట్ ఇండియన్ ఆర్మీ
ఎముకలు కొరికే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ భారత సరిహద్దుల్లో మన సైనికులు అచంచలమైన ధైర్యంతో కాపలా కాస్తున్నారు. మనం ఇక్కడ స్వేచ్ఛగా నిద్రపోతుంటే వారేమో దేశ రక్షణ కోసం మంచు పడకలపై కునుకు తీస్తున్నారు. ఓ సైనికుడు ఆరుబయటే పడుకోగా దుప్పటిపై మంచు పేరుకుపోయింది. ఇది వారి 'ఉక్కు సంకల్పం', త్యాగానికి నిదర్శనం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న వీరులకు సెల్యూట్ చేద్దాం #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
భార్యపై ప్రేమ.. పేదరికాన్ని జయించిన పెద్దాయన!
భార్యపై తనకున్న ప్రేమకు పేదరికం అడ్డుకాదని నిరూపించారో పెద్దాయన. ఒడిశాలోని సంబల్పూరు చెందిన లోహర్ (70) భార్య జ్యోతికి పక్షవాతం వచ్చింది. కటక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. డబ్బు లేకపోవడంతో రిక్షాపై 300KM ఆమెను తీసుకెళ్లారు. చికిత్స చేయించి రిక్షాలోనే వెళ్తున్నారు. ఎవరి సాయం తీసుకోలేదు. 'నాకు రెండింటిపై ప్రేమ. ఒకటి నా భార్య, ఇంకోటి రిక్షా' అని చెబుతున్నారాయన. గ్రేట్ కదూ! #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
మద్యం ప్రియులకు హర్షవర్ధన్ విజ్ఞప్తి
మందు తాగేటప్పుడు చిన్న జాగ్రత్తతో కొంతైనా ఆరోగ్యం కాపాడుకోవచ్చని నటుడు హర్షవర్ధన్ చెబుతున్నారు.
'నితిన్ వాళ్ల ఆఫీస్లో వాళ్ల నాన్న గారితో డ్రింక్ చేస్తే ఒక పెగ్ తాగగానే గ్లాస్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగాకే రెండో డ్రింక్ తాగనిస్తారు. దానిని నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అలవాటు చేశాను. అలాగే తాగడానికి ముందు కనీసం ఒక హాఫ్ లీటర్ నీళ్లు తాగితే శరీరంపై ఎఫెక్ట్ తగ్గుతుంది' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
రిపబ్లిక్ డే పరేడ్లో 'OP సిందూర్' శకటం
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇప్పటికే పరేడ్ కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి వేడుకల్లో 'OP సిందూర్ విక్టరీ' శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. దాదాపు 88 గంటలపాటు జరిగిన ఈ మినీ వార్లో త్రివిధ దళాల పరాక్రమాలను ప్రతిబింబిస్తూ దీనిని తయారు చేశారు. సుఖోయ్ యుద్ధ విమానాలు, ఆకాశ్, బ్రహ్మోస్ క్షిపణులు, S400 పని తీరు, పాకిస్థాన్కు జరిగిన డ్యామేజ్ని కూడా ప్రదర్శించనున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
ట్రైన్ జర్నీలో సామాన్యుడి పరిస్థితి ఇది..!
భారతీయ రైల్వే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ ముంబై లోకల్ రైళ్లలో, జనరల్ బోగీల్లో సామాన్యుడి కష్టాలు తీరడం లేదు. కాలు పెట్టే సందు లేక కిక్కిరిసిన బోగీల్లో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఫుట్బార్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. సామాన్య ప్రయాణికుడి రక్షణ కోసం మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
అనంత్ అంబానీ రూ.13.7కోట్ల వాచ్ చూశారా?
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్ల సేకరణ ఒక హాబీ. ఇప్పటికే ఆయన వద్ద పదుల సంఖ్యలో కోట్ల విలువైన వాచ్లు ఉండగా తాజాగా ఆ జాబితాలోకి రూ.13.7కోట్ల 'జాకబ్ అండ్ కో' వనతార వాచ్ చేరింది. గుజరాత్లోని ఆయన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం థీమ్తో రూపొందిన ఈ వాచ్ మధ్యలో అనంత్ బొమ్మతో పాటు సింహం, బెంగాల్ టైగర్ బొమ్మలు ఉన్నాయి. 21.98 క్యారెట్లు& 397 అరుదైన డైమండ్స్ ఈ వాచ్ మెరిసిపోతోంది. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్



