అమెరికాతో ఒప్పందం.. మోదీకి ఎంపీల సన్మానం
ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యు లందరికీ మోదీ అభివాదం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. మరోవైపు ఇండియాపై విధించిన టారిఫ్స్ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
నేను డబ్బుకు లొంగే రకం కాదు: TVK చీఫ్ విజయ్
TVK పార్టీ వార్షికోత్సవంలో నటుడు విజయ్ రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు తమ పార్టే అసలైన టాప్ ఇంజిన్ అని, ఇతర పార్టీల డబ్బా ఇంజిన్లను నమ్మవద్దని అన్నారు. తాను ఎవరికీ లొంగనని, డబ్బుతో కొనలేరని చెప్పారు. అన్నాడీఎంకే, బీజేపీలను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేస్తూనే రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధమన్న సంకేతాలిచ్చారు. జన నాయగన్ మూవీ కష్టాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్తో కలిసి చిందులేశారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
VIRAL: రెడీమేడ్ సాంబార్ కిట్..
గ్రోసరీ స్టోర్లో అమ్మకానికి ఉంచిన 'సాంబార్ కిట్' వీడియో నెట్టింట వైరలవుతోంది. సాంబార్ చేయడానికి అవసరమైన కూరగాయలను కలిపి ఆ కిట్లో ప్యాక్ చేశారు. అయితే ఇది బ్యాచ్లర్స్కు బాగా ఉపయోగపడుతుందని కొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు ధరపై (రూ.113) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 10M వ్యూస్ దాటిన ఈ వీడియో సోమరితనానికి చిహ్నమా లేక సమయం ఆదా చేసే మార్గమా అనే చర్చకు దారితీసింది #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం
TG: సిట్ విచారణ అనంతరం పార్టీ కీలక నేతలతో భేటీ అయిన BRS అధినేత కేసీఆర్ తర్వాత బయటకొచ్చి కార్య కర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్ లోని ఆయన నివాసానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయమే చేరుకున్న వారిని పోలీసులు బీఆర్ఎస్ భవన్ వద్దే అడ్డుకున్నారు. ఓ దశలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లనున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్.. బ్యాక్గ్రౌండ్ తెలుసా?
TG: మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కలిసి థింసా నృత్యం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. చక్కని అభినయం, సంప్రదాయమైన నృత్యం చూసి నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూపీకి చెందిన వసుంధర 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ ఏసీపీగా ఉన్నారు. ఈమె IAS అజయు పెళ్లి చేసుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
VIRAL: జేసీబీలతో ప్రసాదాన్ని మిక్స్ చేశారు!
గరిటెలతో కాకుండా జేసీబీతో ఆహారాన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర ఘట్టాన్ని రాజస్థాన్లోని భైరూజీ ఆలయ జాతరలో చూడొచ్చు. లక్షలాది మంది భక్తుల కోసం 65,100 కిలోల చూర్మ ప్రసాదాన్ని వండటం మనుషుల వల్ల కాదని నిర్వాహకులు ఈ భారీ యంత్రాలను వాడారు. కుప్పలు తెప్పలుగా ఉన్న పిండిని, నెయ్యిని కలపడానికి జేసీబీలు 'భారీ గరిటెలు'గా మారిపోయాయి. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
స్టేజీపై వధూవరుల రొమాన్స్.. పూజారి ఏం చేశాడంటే? (Viral)
వెడ్డింగ్ స్టేజీపై రొమాంటిక్ పోజులు ఇస్తున్న జంటకు పూజారి షాకిచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటోషూట్లో కెమెరామన్ చెప్పినట్లు వధూవరులు పోజులు ఇచ్చారు. హగ్ చేసుకొని ముద్దులకు రెడీ అవుతుండగా పూజారి ఎంట్రీ ఇచ్చాడు. వారిని ఆపేసి ఫొటోలు తీయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో వధూవరులతో పాటు అతిథులూ అవాక్కయ్యారు. కొందరు పూజారికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆయన పద్ధతి బాగాలేదని విమర్శిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
CUTE VIDEO: ఏనుగు బర్త్ డే ఎలా చేశారో చూడండి!
ఏనుగు పిల్ల బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కజిరంగా ఫారెస్ట్లో ఉండే ‘మోమో' అనే ఏనుగు పిల్ల పుట్టినరోజు సందర్భంగా కేక్తో పాటు దానికి ఇష్టమైన ఆహార పదార్థాలను అందించి ప్రత్యేకంగా నిర్వహించారు. 'అస్సాం అంటే ఇదే. మేము ప్రకృతితో పాటు మూగ జీవులతో స్నేహం చేస్తాం' అని సీఎం Xలో రాసుకొచ్చారు. #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్
VIRAL VIDEO: మంచు నదిని చూశారా?
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు పడుతోంది. తాజాగా చంబా (D) పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్లో 'మంచు నది' ప్రవాహం వీడియో SMలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచు పడుతోందని స్థానికులు చెప్పారు. చెట్లు, రోడ్లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయని తెలిపారు. మారుమూల గ్రామం కావడంతో మిగతా ప్రాంతాలతో కనెక్షన్ కట్ అయి జనజీవనం స్తంభించిందని వాపోయారు. #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
VIDEO: టూరిస్ట్ రిసార్ట్లను ముంచెత్తిన హిమపాతం
జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. గాండర్బల్ జిల్లా సోనమార్గో టూరిస్ట్ రిసార్ట్లను నిన్న రాత్రి 10:12 గంటల సమయంలో భారీ హిమపాతం ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ మంచు కురుస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ సహా పలు ప్రాంతాలకు హిమపాత హెచ్చరిక జారీ చేశారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦



