VIDEO: నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది!
రైల్వే భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పహర్పూర్ స్టేషన్లో ట్రాక్ల మధ్య కలప దుంగలను డంప్ చేశారు. అయితే అటుగా వచ్చిన రైలు దుంగలను ఢీకొట్టడంతో ఒక మొద్దు ఎగిరి పక్కనే ఉన్న మహిళకు తగిలిన వీడియో వైరలవుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు రైలు ద్వారా అక్రమంగా కలపను తరలించి ట్రాక్ల మధ్య అన్లోడ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
కట్టుకున్న భార్య కోసం కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు!
నవమాసాలు మోసి కని పెంచిన అమ్మను భార్య ఒత్తిడితో ఓ కొడుకు నడిరోడ్డుపై వదిలేశాడు. మధ్య ప్రదేశ్లోని మందసౌర్ జరిగిన ఈ ఘటన నాగరిక సమాజానికి మచ్చగా మారింది. కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో 80 ఏళ్ల ఆ వృద్ధురాలు పడిగాపులు కాసిన దృశ్యం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
* పిల్లలే తమ లోకంగా జీవించే తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండండి. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
#😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 పార్టీలకు బెలూన్స్తో డెకరేషన్ చేస్తున్నారా?
పార్టీ అనగానే డెకరేషన్ కోసం కొందరు గ్యాస్ ఫిల్ చేసిన బెలూన్స్ వాడుతుంటారు. అవి ఎంత ప్రమాదకరమో చెప్పే వీడియో ఒకటి SMలో వైరలవుతోంది. ముంబైలోని ఓ అపార్టుమెంట్లో ఓ మహిళ పార్టీ కోసం బెలూన్స్ ఆర్డర్ ఇచ్చారు. వాటిని లిఫ్ట్లోకి తీసుకెళ్లగానే అకస్మాత్తుగా పేలిపోయి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇలాంటి బెలూన్స్ వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
అమెరికాతో ఒప్పందం.. మోదీకి ఎంపీల సన్మానం
ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యు లందరికీ మోదీ అభివాదం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. మరోవైపు ఇండియాపై విధించిన టారిఫ్స్ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
నేను డబ్బుకు లొంగే రకం కాదు: TVK చీఫ్ విజయ్
TVK పార్టీ వార్షికోత్సవంలో నటుడు విజయ్ రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు తమ పార్టే అసలైన టాప్ ఇంజిన్ అని, ఇతర పార్టీల డబ్బా ఇంజిన్లను నమ్మవద్దని అన్నారు. తాను ఎవరికీ లొంగనని, డబ్బుతో కొనలేరని చెప్పారు. అన్నాడీఎంకే, బీజేపీలను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేస్తూనే రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధమన్న సంకేతాలిచ్చారు. జన నాయగన్ మూవీ కష్టాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్తో కలిసి చిందులేశారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
VIRAL: రెడీమేడ్ సాంబార్ కిట్..
గ్రోసరీ స్టోర్లో అమ్మకానికి ఉంచిన 'సాంబార్ కిట్' వీడియో నెట్టింట వైరలవుతోంది. సాంబార్ చేయడానికి అవసరమైన కూరగాయలను కలిపి ఆ కిట్లో ప్యాక్ చేశారు. అయితే ఇది బ్యాచ్లర్స్కు బాగా ఉపయోగపడుతుందని కొందరు దీన్ని సమర్థిస్తున్నారు. మరికొందరు ధరపై (రూ.113) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 10M వ్యూస్ దాటిన ఈ వీడియో సోమరితనానికి చిహ్నమా లేక సమయం ఆదా చేసే మార్గమా అనే చర్చకు దారితీసింది #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం
TG: సిట్ విచారణ అనంతరం పార్టీ కీలక నేతలతో భేటీ అయిన BRS అధినేత కేసీఆర్ తర్వాత బయటకొచ్చి కార్య కర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్ లోని ఆయన నివాసానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయమే చేరుకున్న వారిని పోలీసులు బీఆర్ఎస్ భవన్ వద్దే అడ్డుకున్నారు. ఓ దశలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసీఆర్ కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లనున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
మేడారం జాతరలో లేడీ IPS డాన్స్ వైరల్.. బ్యాక్గ్రౌండ్ తెలుసా?
TG: మేడారం జాతరలో మంత్రి సీతక్కతో కలిసి థింసా నృత్యం చేసిన ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. చక్కని అభినయం, సంప్రదాయమైన నృత్యం చూసి నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూపీకి చెందిన వసుంధర 2023 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ ఏసీపీగా ఉన్నారు. ఈమె IAS అజయు పెళ్లి చేసుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
VIRAL: జేసీబీలతో ప్రసాదాన్ని మిక్స్ చేశారు!
గరిటెలతో కాకుండా జేసీబీతో ఆహారాన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర ఘట్టాన్ని రాజస్థాన్లోని భైరూజీ ఆలయ జాతరలో చూడొచ్చు. లక్షలాది మంది భక్తుల కోసం 65,100 కిలోల చూర్మ ప్రసాదాన్ని వండటం మనుషుల వల్ల కాదని నిర్వాహకులు ఈ భారీ యంత్రాలను వాడారు. కుప్పలు తెప్పలుగా ఉన్న పిండిని, నెయ్యిని కలపడానికి జేసీబీలు 'భారీ గరిటెలు'గా మారిపోయాయి. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
స్టేజీపై వధూవరుల రొమాన్స్.. పూజారి ఏం చేశాడంటే? (Viral)
వెడ్డింగ్ స్టేజీపై రొమాంటిక్ పోజులు ఇస్తున్న జంటకు పూజారి షాకిచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటోషూట్లో కెమెరామన్ చెప్పినట్లు వధూవరులు పోజులు ఇచ్చారు. హగ్ చేసుకొని ముద్దులకు రెడీ అవుతుండగా పూజారి ఎంట్రీ ఇచ్చాడు. వారిని ఆపేసి ఫొటోలు తీయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో వధూవరులతో పాటు అతిథులూ అవాక్కయ్యారు. కొందరు పూజారికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆయన పద్ధతి బాగాలేదని విమర్శిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్



