స్టేజీపై వధూవరుల రొమాన్స్.. పూజారి ఏం చేశాడంటే? (Viral)
వెడ్డింగ్ స్టేజీపై రొమాంటిక్ పోజులు ఇస్తున్న జంటకు పూజారి షాకిచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటోషూట్లో కెమెరామన్ చెప్పినట్లు వధూవరులు పోజులు ఇచ్చారు. హగ్ చేసుకొని ముద్దులకు రెడీ అవుతుండగా పూజారి ఎంట్రీ ఇచ్చాడు. వారిని ఆపేసి ఫొటోలు తీయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో వధూవరులతో పాటు అతిథులూ అవాక్కయ్యారు. కొందరు పూజారికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆయన పద్ధతి బాగాలేదని విమర్శిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
CUTE VIDEO: ఏనుగు బర్త్ డే ఎలా చేశారో చూడండి!
ఏనుగు పిల్ల బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కజిరంగా ఫారెస్ట్లో ఉండే ‘మోమో' అనే ఏనుగు పిల్ల పుట్టినరోజు సందర్భంగా కేక్తో పాటు దానికి ఇష్టమైన ఆహార పదార్థాలను అందించి ప్రత్యేకంగా నిర్వహించారు. 'అస్సాం అంటే ఇదే. మేము ప్రకృతితో పాటు మూగ జీవులతో స్నేహం చేస్తాం' అని సీఎం Xలో రాసుకొచ్చారు. #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్
VIRAL VIDEO: మంచు నదిని చూశారా?
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు పడుతోంది. తాజాగా చంబా (D) పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్లో 'మంచు నది' ప్రవాహం వీడియో SMలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచు పడుతోందని స్థానికులు చెప్పారు. చెట్లు, రోడ్లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయని తెలిపారు. మారుమూల గ్రామం కావడంతో మిగతా ప్రాంతాలతో కనెక్షన్ కట్ అయి జనజీవనం స్తంభించిందని వాపోయారు. #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
VIDEO: టూరిస్ట్ రిసార్ట్లను ముంచెత్తిన హిమపాతం
జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. గాండర్బల్ జిల్లా సోనమార్గో టూరిస్ట్ రిసార్ట్లను నిన్న రాత్రి 10:12 గంటల సమయంలో భారీ హిమపాతం ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ మంచు కురుస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ సహా పలు ప్రాంతాలకు హిమపాత హెచ్చరిక జారీ చేశారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦
VIDEO: గూగుల్ మ్యాప్స్ చూస్తూ మెట్ల మీదకి..!
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. జైపూర్లోని (RJ) బిర్లా మందిర్ వద్ద గూగుల్ మ్యాప్స్ చూస్తూ వెళ్లిన ఓ కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ కారును నేరుగా ఆలయ మెట్ల మీదకి తీసుకెళ్లడంతో వాహనం ఇరుక్కుపోయింది. పోలీసులు శ్రమించి కారును సురక్షితంగా కిందకు దించారు. తెలియని ప్రదేశంలో మ్యాప్స్ నమ్మి దూసుకెళ్లొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
ఆకాశంలో 'ఆపరేషన్ సిందూర్'.. చూశారా?
ఢిల్లీ కర్తవ్యపథ్పే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విన్యాసాలు అదరగొట్టాయి. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తుచేసే ఫార్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులను ఏరివేసేందుకు ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం రఫేల్, మిగ్-29, సుఖోయ్-30 జెట్స్ కలిసి గాలిలో 'తిలకం' ఆకారాన్ని సృష్టించాయి. ధ్రువ్ హెలికాప్టర్ ఆపరేషన్ సిందూర్ జెండాను ప్రదర్శించింది #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
కుప్పకూలిన విమానం
అమెరికాలో 8 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్(ట్విన్ ఇంజిన్ బాంబార్డియర్ ఛాలెంజర్ 600 టర్బోఫ్యాన్) కుప్పకూలిపోయింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం బాంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది చనిపోయి ఉండొచ్చని సమాచారం. ప్రమాదానికి మంచు తుఫానే కారణమా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
VIRAL: సెల్యూట్ ఇండియన్ ఆర్మీ
ఎముకలు కొరికే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ భారత సరిహద్దుల్లో మన సైనికులు అచంచలమైన ధైర్యంతో కాపలా కాస్తున్నారు. మనం ఇక్కడ స్వేచ్ఛగా నిద్రపోతుంటే వారేమో దేశ రక్షణ కోసం మంచు పడకలపై కునుకు తీస్తున్నారు. ఓ సైనికుడు ఆరుబయటే పడుకోగా దుప్పటిపై మంచు పేరుకుపోయింది. ఇది వారి 'ఉక్కు సంకల్పం', త్యాగానికి నిదర్శనం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశాన్ని కాపాడుతున్న వీరులకు సెల్యూట్ చేద్దాం #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
భార్యపై ప్రేమ.. పేదరికాన్ని జయించిన పెద్దాయన!
భార్యపై తనకున్న ప్రేమకు పేదరికం అడ్డుకాదని నిరూపించారో పెద్దాయన. ఒడిశాలోని సంబల్పూరు చెందిన లోహర్ (70) భార్య జ్యోతికి పక్షవాతం వచ్చింది. కటక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. డబ్బు లేకపోవడంతో రిక్షాపై 300KM ఆమెను తీసుకెళ్లారు. చికిత్స చేయించి రిక్షాలోనే వెళ్తున్నారు. ఎవరి సాయం తీసుకోలేదు. 'నాకు రెండింటిపై ప్రేమ. ఒకటి నా భార్య, ఇంకోటి రిక్షా' అని చెబుతున్నారాయన. గ్రేట్ కదూ! #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
మద్యం ప్రియులకు హర్షవర్ధన్ విజ్ఞప్తి
మందు తాగేటప్పుడు చిన్న జాగ్రత్తతో కొంతైనా ఆరోగ్యం కాపాడుకోవచ్చని నటుడు హర్షవర్ధన్ చెబుతున్నారు.
'నితిన్ వాళ్ల ఆఫీస్లో వాళ్ల నాన్న గారితో డ్రింక్ చేస్తే ఒక పెగ్ తాగగానే గ్లాస్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగాకే రెండో డ్రింక్ తాగనిస్తారు. దానిని నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అలవాటు చేశాను. అలాగే తాగడానికి ముందు కనీసం ఒక హాఫ్ లీటర్ నీళ్లు తాగితే శరీరంపై ఎఫెక్ట్ తగ్గుతుంది' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్



