HYD: జాతి ఏదైనా తల్లి వేదన ఒక్కటే!
మానవత్వానికి మాయని మచ్చ ఈ ఘటన. కుక్క పిల్లలను కవర్లో కట్టి శంషాబాద్లోని తొండుపల్లిలో రక్షసానందం పొందారు కొందరు. మార్నింగ్ వాక్కు వెళ్లిన యువకులు ఓ కుక్క వారి చుట్టూ తిరుగుతూ వెంట రమ్మని పిలిచినట్టు అనిపించి దాన్నే ఫాలో అయ్యారు. ఆ శునకం పడే వేదనను గమనించి వేలాడదీసిన కవర్ను కిందకు దించారు. అందులోని కళ్లు తెరవని చిన్న పిల్లలను తల్లి దగ్గరకు చేర్చారు. తల్లి పడే మనోవేదన అక్కడి వారిని కదలించింది #🆕షేర్చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
మంచి నాయకుడిగా మారేదెలా?.. మోదీ ఆన్సరిదే
ఇతరుల నుంచి ఎంత స్ఫూర్తి పొందినా క్రమశిక్షణ, స్థిరత్వం లేకపోతే ఫలితాలను పొందలేరని PM మోదీ తెలిపారు. పరీక్షా పే చర్చలో ఆయన స్టూడెంట్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంచి నాయకుడిగా ఎలా మారాలన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ 'చొరవ తీసుకునే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా తన ఆలోచనలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. నిబద్ధతతో పనిచేయాలి. అదే నాయకుడి లక్షణం' అని పేర్కొన్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
ఒరేయ్ పొట్టోడా' అంటూ కేటీఆర్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు
TG: CM రేవంత్ పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'భూపాలపల్లి జిల్లాను తొలగించబోమని CM అంటున్నాడు. నువ్వేమైనా పెట్టావా తీసేయడానికి? రెండేళ్లలో నువ్వు చేసిందేముంది? KCRను తిడితే మాత్రం ఒరేయ్ పొట్టోడా నిన్ను వదిలిపెట్టం. నీ టైమ్ రెండేళ్లే. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. మా కార్యకర్తలను వేధిస్తే పోలీసుల తోకలూ కట్ చేస్తాం' అంటూ భూపాలపల్లి ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
వామ్మో.. ఒకే దగ్గర వందలాది కోతులు!
తెలంగాణలో కోతుల సమస్య ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి పై వీడియో మంచి ఉదాహరణ. జనగామ జిల్లా పాలకుర్తి మం. వల్మిడిలో వందలాది కోతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశాయి. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయని, చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ఒక్క దగ్గరే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
మోనికా' సాంగ్.. బుల్డోడి స్టెప్పులు చూడండి!
రజినీకాంత్ కూలీ సినిమాలోని 'మోనికా' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ పాటకు డాన్స్ చేసిన పూజా హెగ్దే, సౌబిన్ షాహిర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా పూజాతో కలిసి ఓ చిన్నారి వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అచ్చం సౌబిన్ మాదిరే పిల్లాడు డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
VIRAL: మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాడు
కేరళలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో రోడ్డుపై జారిపడగా సరిగ్గా అదే సమయంలో ఎదురుగా స్కూల్ బస్సు వచ్చింది. అతడు జారుకుంటూ నేరుగా బస్సు టైర్ల కిందకు వెళ్లినా ఆవగింజంత దూరంలో ప్రాణాపాయం తప్పింది. చావు అంచుల్లోకి వెళ్లి క్షేమంగా బయటపడ్డ అతడిని చూసి అందరూ మృత్యుంజయుడు అని ఆశ్చర్య పోతున్నారు. దేవుడే రక్షించాడంటూ పోస్టులు పెడుతున్నారు. #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
ముంబై మెట్రో స్టేషన్లోనే నిశ్చితార్థం
ముంబై మెట్రో స్టేషన్ ఒక అరుదైన ప్రేమ కథకు వేదికైంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న జంటకు కులం పేరుతో అమ్మాయి తండ్రి నిశ్చితార్థం క్యాన్సిల్ చేయగా.. అబ్బాయి చిన్నమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లో ఏడుస్తున్న అబ్బాయిని చూసి చలించిపోయిన ఆమె అమ్మాయిని అక్కడికే పిలిపించి మెట్రో ప్లాట్ఫారమ్పైనే తంతు పూర్తి చేశారు. ఈ 'మెట్రో నిశ్చితార్థం' ఇప్పుడు SMలో హాట్ టాపిక్గా మారింది #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
పిల్లల రిక్వెస్ట్.. రోడ్డు మంజూరు చేసిన పవన్
AP: 'బురదలో నడవలేకపోతున్నాం. రోడ్డు వేయించండి సార్' అని పిల్లలు చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లిలో స్కూలుకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో విద్యార్థులు వీడియో చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అధికారులతో వివరాలు తెప్పించుకున్నారు. రూ.86 లక్షలతో 1.6 కి.మీ. రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
VIDEO: నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది!
రైల్వే భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పహర్పూర్ స్టేషన్లో ట్రాక్ల మధ్య కలప దుంగలను డంప్ చేశారు. అయితే అటుగా వచ్చిన రైలు దుంగలను ఢీకొట్టడంతో ఒక మొద్దు ఎగిరి పక్కనే ఉన్న మహిళకు తగిలిన వీడియో వైరలవుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు రైలు ద్వారా అక్రమంగా కలపను తరలించి ట్రాక్ల మధ్య అన్లోడ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
కట్టుకున్న భార్య కోసం కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు!
నవమాసాలు మోసి కని పెంచిన అమ్మను భార్య ఒత్తిడితో ఓ కొడుకు నడిరోడ్డుపై వదిలేశాడు. మధ్య ప్రదేశ్లోని మందసౌర్ జరిగిన ఈ ఘటన నాగరిక సమాజానికి మచ్చగా మారింది. కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో 80 ఏళ్ల ఆ వృద్ధురాలు పడిగాపులు కాసిన దృశ్యం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
* పిల్లలే తమ లోకంగా జీవించే తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండండి. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్



