VIRAL: మేకపై స్వారీ చేస్తూ స్కూలుకు
పిల్లలు బస్సులు, ఆటోలు, బైకులు, సైకిళ్లపై స్కూలుకు వెళ్లడం చూస్తుంటాం. కానీ మేకపై కూర్చొని పాఠశాలకు వెళ్లడం మీరెప్పుడైనా చూశారా? మేఘాలయలోని గారో హిల్స్కు చెందిన ఓ బాలుడు ఇలాగే వెళ్లాడు. బ్యాగు వేసుకొని మేకపై కూర్చుని అతడు స్కూలుకు వెళ్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, ఇది జంతువుల పట్ల క్రూరత్వమేనని కొందరు తప్పుబడుతున్నారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
VIRAL: డ్రోన్ పోయినా.. విజువల్స్ వర్త్ వర్మ!
ఫ్లెమింగో పక్షుల అందాలను ఓ కెమెరామెన్ డ్రోన్తో అద్భుతంగా బంధించారు. ఆ క్రమంలో సుమారు రూ.4 లక్షల డ్రోన్ ఉప్పు నీటిలో పడి పాడైపోయింది. అయితే విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని పై వీడియోను ఆయన పంచుకున్నారు. నీలి సముద్రంపై వందలాది పింక్ ఫ్లెమింగోలు ఒకేసారి ఎగురుతున్న దృశ్యం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. 'డ్రోన్ పోయినా వీడియో వర్తు వర్మ.. వర్తు' అంటూ నెటిజన్లు ఈ వీడియోను కొనియాడుతున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
చిన్నారి దారుణ హత్య.. 'ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా'
కేరళంలో చిన్నారి అర్షిద్ (1.5y) ఘటన కంటతడి పెట్టిస్తోంది. మారుతండ్రి అష్కర్ గొంతులో అన్నం ఇరుక్కుందని ఇటీవల బాలుడిని ఆస్పత్రిలో చేర్చగా చనిపోయాడు. పోస్టుమార్టంలో బాడీపై 51 గాయాలు కనిపించడంతో హత్యగా తేల్చి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గతంలో గాయాలతో ఉన్న చిన్నారి వీడియో వైరలవుతుండగా 'ఇంత నొప్పిని ఎలా భరించావు నాన్నా' అంటూ నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ఆ కిరాతకుణ్ని చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణచివేతపై పోరాడి, శాంతియుత పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామన్నారు. ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
నేను రంగులు మార్చలేను.. బ్లాక్ & వైట్ సూట్పై విజయ్
తాను సూట్ ధరించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తమిళనాడు CM విజయ్ కౌంటర్ ఇచ్చారు. 'సూట్ వేసుకున్నందుకు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏం మనం కోటు సూటు వేసుకోకూడదా? నేను రంగులు మార్చలేను. రంగురంగుల దుస్తులు ధరించలేను. అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా ఉంటానని చెప్పేందుకే ఇలా బ్లాక్&వైట్ సూట్ వేసుకుంటున్నా. నా దుస్తుల మాదిరే రాజకీయాలూ నలుపు-తెలుపులా స్పష్టంగా ఉంటాయి' అని తిరుచ్చి సభలో అన్నారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత.. రోడ్డుపైనే వ్యక్తి నిరసన
VIP కాన్వాయ్ కోసం మండే ఎండల్లో ట్రాఫికను ఎక్కువసేపు ఆపివేస్తుండటంపై విమర్శలొస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని ఎయిర్పోర్టు రోడ్డులో గవర్నర్ కాన్వాయ్ కోసం 30నిమిషాల పాటు వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గర్భిణీ అయిన భార్యను తీసుకువెళ్తున్న ఒక వ్యక్తి ఈ ట్రాఫిక్లో చిక్కుకుపోయాడు.
దీంతో ఆయన రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగారు. పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పక్కకు తీసుకెళ్లారు #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
తెల్ల జింకను ఎప్పుడైనా చూశారా?
అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అత్యంత అరుదైన 'అల్బినో హాగ్ డీర్' (తెల్ల జింక) కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ Xలో పంచుకున్నారు. 'ఇలాంటి అరుదైన దృశ్యాలు నిత్యం కనిపించవు. తెల్ల జింకల సంరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని ఆయన పేర్కొన్నారు. జన్యు మార్పిడి వల్ల తెల్లగా మారే ఇలాంటి జింకలు కజిరంగాలోని 40వేల జింకల్లో ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయని సమాచారం #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
VIRAL: చావు అంచుల నుంచి తల్లి ఒడికి!
వన్యప్రాణుల సంరక్షణలో తమిళనాడు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. తెన్కాశి అడవుల్లో గాయాలతో, డీహైడ్రేషన్తో చావుబతుకుల్లో ఉన్న ఓ పిల్ల ఏనుగును అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అది నడవలేక ఇబ్బందిపడటంతో అడవిలోకే X-ray మెషీను తీసుకెళ్లి నాలుగు రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి ప్రాణం పోశారు. అంతేకాకుండా తల్లి ఏనుగు జాడ కనిపెట్టి ఆ పిల్లను మందతో విజయవంతంగా కలిపారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
భారత్లో సైప్రస్ అధ్యక్షుడి పర్యటన.. కీలక డీల్స్
సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక డీల్స్ జరిగాయి. ఫిన్టేక్ ఎకోసిస్టమ్స్, రీసెర్చ్ హబ్స్, కౌంటర్ టెర్రరిజం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై MoUలు కుదిరాయి. భారత్లో సైప్రస్ పెట్టుబడులు పదేళ్లలో రెండింతలు అయ్యాయని, వచ్చే ఐదేళ్లలో ఇవి డబుల్ చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. కాగా పాక్కు సపోర్ట్ చేసే తుర్కియేకు కౌంటర్గా భారత్ సైప్రస్తో బంధాన్ని పెంచుకుంటోంది. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
స్కూటీ ఢీకొట్టడంతో ముక్కలైన ఏనుగు దంతం!
ఉత్తరాఖండ్ లోని ఖతీమా రోడ్డుపై ఓ విచిత్రమైన ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళా టీచర్ అడవి నుంచి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఏనుగును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగు దంతం విరిగి మూడు ముక్కలై కింద పడిపోయింది. దీంతో ఏనుగు భయపడి వెంటనే అడవిలోకి పారిపోగా గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
కాగా ఈ ఘటనపై చేసిన మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్





