వామ్మో.. ఒకే దగ్గర వందలాది కోతులు!
తెలంగాణలో కోతుల సమస్య ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి పై వీడియో మంచి ఉదాహరణ. జనగామ జిల్లా పాలకుర్తి మం. వల్మిడిలో వందలాది కోతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేశాయి. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయని, చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ ఒక్క దగ్గరే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
మోనికా' సాంగ్.. బుల్డోడి స్టెప్పులు చూడండి!
రజినీకాంత్ కూలీ సినిమాలోని 'మోనికా' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ పాటకు డాన్స్ చేసిన పూజా హెగ్దే, సౌబిన్ షాహిర్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా పూజాతో కలిసి ఓ చిన్నారి వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అచ్చం సౌబిన్ మాదిరే పిల్లాడు డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
VIRAL: మృత్యువు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చాడు
కేరళలో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో రోడ్డుపై జారిపడగా సరిగ్గా అదే సమయంలో ఎదురుగా స్కూల్ బస్సు వచ్చింది. అతడు జారుకుంటూ నేరుగా బస్సు టైర్ల కిందకు వెళ్లినా ఆవగింజంత దూరంలో ప్రాణాపాయం తప్పింది. చావు అంచుల్లోకి వెళ్లి క్షేమంగా బయటపడ్డ అతడిని చూసి అందరూ మృత్యుంజయుడు అని ఆశ్చర్య పోతున్నారు. దేవుడే రక్షించాడంటూ పోస్టులు పెడుతున్నారు. #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
ముంబై మెట్రో స్టేషన్లోనే నిశ్చితార్థం
ముంబై మెట్రో స్టేషన్ ఒక అరుదైన ప్రేమ కథకు వేదికైంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న జంటకు కులం పేరుతో అమ్మాయి తండ్రి నిశ్చితార్థం క్యాన్సిల్ చేయగా.. అబ్బాయి చిన్నమ్మ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లో ఏడుస్తున్న అబ్బాయిని చూసి చలించిపోయిన ఆమె అమ్మాయిని అక్కడికే పిలిపించి మెట్రో ప్లాట్ఫారమ్పైనే తంతు పూర్తి చేశారు. ఈ 'మెట్రో నిశ్చితార్థం' ఇప్పుడు SMలో హాట్ టాపిక్గా మారింది #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్
పిల్లల రిక్వెస్ట్.. రోడ్డు మంజూరు చేసిన పవన్
AP: 'బురదలో నడవలేకపోతున్నాం. రోడ్డు వేయించండి సార్' అని పిల్లలు చేసిన విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లిలో స్కూలుకు వెళ్లే రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో విద్యార్థులు వీడియో చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అధికారులతో వివరాలు తెప్పించుకున్నారు. రూ.86 లక్షలతో 1.6 కి.మీ. రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
VIDEO: నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది!
రైల్వే భద్రతా నిబంధనలు ఉల్లంఘించడంతో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పహర్పూర్ స్టేషన్లో ట్రాక్ల మధ్య కలప దుంగలను డంప్ చేశారు. అయితే అటుగా వచ్చిన రైలు దుంగలను ఢీకొట్టడంతో ఒక మొద్దు ఎగిరి పక్కనే ఉన్న మహిళకు తగిలిన వీడియో వైరలవుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరు రైలు ద్వారా అక్రమంగా కలపను తరలించి ట్రాక్ల మధ్య అన్లోడ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
కట్టుకున్న భార్య కోసం కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేశాడు!
నవమాసాలు మోసి కని పెంచిన అమ్మను భార్య ఒత్తిడితో ఓ కొడుకు నడిరోడ్డుపై వదిలేశాడు. మధ్య ప్రదేశ్లోని మందసౌర్ జరిగిన ఈ ఘటన నాగరిక సమాజానికి మచ్చగా మారింది. కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో 80 ఏళ్ల ఆ వృద్ధురాలు పడిగాపులు కాసిన దృశ్యం స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
* పిల్లలే తమ లోకంగా జీవించే తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండండి. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
#😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 పార్టీలకు బెలూన్స్తో డెకరేషన్ చేస్తున్నారా?
పార్టీ అనగానే డెకరేషన్ కోసం కొందరు గ్యాస్ ఫిల్ చేసిన బెలూన్స్ వాడుతుంటారు. అవి ఎంత ప్రమాదకరమో చెప్పే వీడియో ఒకటి SMలో వైరలవుతోంది. ముంబైలోని ఓ అపార్టుమెంట్లో ఓ మహిళ పార్టీ కోసం బెలూన్స్ ఆర్డర్ ఇచ్చారు. వాటిని లిఫ్ట్లోకి తీసుకెళ్లగానే అకస్మాత్తుగా పేలిపోయి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇలాంటి బెలూన్స్ వాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
అమెరికాతో ఒప్పందం.. మోదీకి ఎంపీల సన్మానం
ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని గజమాలతో ఘనంగా సన్మానించారు. పార్లమెంటులో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సభ్యు లందరికీ మోదీ అభివాదం చేశారు. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ ను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. మరోవైపు ఇండియాపై విధించిన టారిఫ్స్ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
నేను డబ్బుకు లొంగే రకం కాదు: TVK చీఫ్ విజయ్
TVK పార్టీ వార్షికోత్సవంలో నటుడు విజయ్ రాజకీయ విమర్శలతో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు తమ పార్టే అసలైన టాప్ ఇంజిన్ అని, ఇతర పార్టీల డబ్బా ఇంజిన్లను నమ్మవద్దని అన్నారు. తాను ఎవరికీ లొంగనని, డబ్బుతో కొనలేరని చెప్పారు. అన్నాడీఎంకే, బీజేపీలను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేస్తూనే రాబోయే ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధమన్న సంకేతాలిచ్చారు. జన నాయగన్ మూవీ కష్టాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్తో కలిసి చిందులేశారు. #🆕Current అప్డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్



