మే డే ను పురస్కరించుకుని కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు భవన నిర్మాణ కార్మికులను కలిశారు. కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం వద్దకు వెళ్లిన సీఎం అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పలకరించారు. తాపీ మేస్త్రీ అల్లా భక్షు, అక్కడ కూలీగా పనిచేస్తున్న మహిళ సుమలతతో మాట్లాడి వారి రోజు వారీ ఉపాధి, కుటుంబ నేపథ్యం, ఇబ్బందులను గురించి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అనంతరం వారికి మన మిత్ర వాట్సప్ యాప్ను ద్వారా అందిస్తున్న పౌరసేవల గురించి వివరించారు. యాప్ ద్వారా కార్మికులకు అందుబాటులో ఉన్న సేవలు, వాటిని ఉపయోగించుకునే తీరును స్వయంగా తెలియచేశారు. అదే భవనంలోని మొదటి అంతస్తులో పని చేస్తున్న రాడ్ బెండింగ్ కార్మికుడు కొండేటి సీమయ్య, సెంట్రింగ్ కార్మికుడు బోలెం శ్రీనివాసరావుతో మాట్లాడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిరావు అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వటంతో కార్మికుల సంక్షేమంలో భాగంగా రూ.20వేల చెక్కును ఆమెకు ఆర్థికసాయంగా ముఖ్యమంత్రి అందించారు.
#LabourDay
#ChandrababuNaidu
#AndhraPradesh #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్


