గిరిపుత్రుల పాలిట ఆపద్బాంధవులైన బుజారే శారద, ఆమె భర్త చిట్టిబాబు రెడ్డిలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పాపికొండల అభయారణ్యానికి ఆనుకుని ఉన్న కాకిసనూరు గ్రామస్తులకు ఏ కష్టం వచ్చినా, అనారోగ్యమైనా గోదావరి నదిపై పడవ ప్రయాణమే దిక్కు. 2012లో విధుల్లో చేరిన శారద తన భర్త సాయంతో పడవపై రోగులు, గర్భిణులను కోయిదా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స పూర్తయ్యాక మళ్లీ గ్రామానికి చేరుస్తూ.. నిస్వార్ధ సేవలందిస్తున్నారు. గర్భిణులను, రోగులను కోయిదా ఆసుపత్రికి చేర్చి చికిత్స తర్వాత స్వగ్రామానికి చేరుస్తూ ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మీ సేవా దృక్పథానికి సెల్యూట్ చేస్తున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


