టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో ఒకేసారి పాసైన తల్లీకొడుకు ఆనందానుభూతిని పంచుకుంటూ..పరస్పరం అభినందించుకున్న దృశ్యం ఒక అద్భుతం. మాటలలో వర్ణించలేనిది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి గృహిణిగా ఉంటూనే చదవాలనే లక్ష్యంతో ఓపెన్ స్కూలులో చేరి టెన్త్ పరీక్షలు రాశారు. కొడుకు విజయ్ కూడా టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. ఇద్దరూ ఫలితాల కోసం ఎదురుచూసిన ఉద్విగ్న క్షణాలు..తల్లి 360 మార్కులతో, తనయుడు 562 మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యారని తెలిసిన క్షణాన వారిద్దరి సంబరాలు చూసి ఎంతో ఆనందించాను. అభినందనలు తల్లీ.. ఆశీస్సులు విజయ్.. చిన్న చిన్న కారణాలతో చదువు ఆపేసిన వారు లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్