వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్
బెయిల్ రద్దు చేసిన కోర్ట్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిక్ షాకిచ్చింది కోర్ట్. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు చేసింది. అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దయింది. బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను ప్రలోభపెట్టారు అనంతబాబు. సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరిపారు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24 న అరెస్టు చేసిన పోలీసులు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనంతబాబు. హత్య కేసులో బెయిల్ పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్ట్ బెయిల్ రద్దు చేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ వేశారు. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యేవరకు జైలులోనే ఉండనున్నారు. ఈనెల 20 నుంచి డ్రైవర్ హత్యకేసు రెగ్యులర్ విచారణ ప్రారంభిస్తామని కోర్టు తెలిపింది. #❌తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు బంద్..శుభకార్యాలకు బ్రేక్..?


