*దమ్మపేట అభివృద్ధికి దిశానిర్దేశం – రూ.1.20 కోట్ల పనులకు శ్రీకారం*
📅 16.06.2026 | మంగళవారం
“ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే పల్లె పిల్లల భవిష్యత్తు బంగారుమయం”
*అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ జారె ఆదినారాయణ గారు,* దమ్మపేట మండలంలో రూ.1,20,80,000 విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, రవాణా, చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పనులు గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది అవుతాయని తెలిపారు.
🔹 అంకంపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కొడిసెలగూడెంలో టిడబ్ల్యూయూపీఎస్ పాఠశాలకు నిర్మించిన ప్రహరీ గోడ ప్రారంభం
🔹 పట్వారిగూడెంలో రూ.36 లక్షలతో నిర్మించిన 8 సీసీ రోడ్ల ప్రారంభోత్సవం
🔹 దిబ్బగూడెంలో రూ.10 లక్షలతో ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం
🔹 మెండివారి గ్రామంలో రూ.11.80 లక్షలతో 2 సీసీ రోడ్ల ప్రారంభం
🔹 నాగుపల్లిలో రూ.15 లక్షలతో ఆధునిక అంగన్వాడీ భవనం ప్రారంభం
🔹 తొట్టిపంపు గ్రామంలో రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ
🔹 గొర్రెగుట్టలో రూ.20 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ
🔹 కొత్తూరులో రూ.8 లక్షలతో అంగన్వాడీ భవనం
🔹 పాత చీపురుగూడెంలో రూ.10 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారానే పల్లె పిల్లలకు उज్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని చెప్పారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతా ప్రమాణాలు, విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ విద్యార్థులు పట్టణ విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి ఎదగడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
🌿 ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రోడ్లు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ


