ShareChat
click to see wallet page
search
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు జ్ఞానప్రదాత. తనను నమ్మి కొలచినవారిని ఈ స్వామి నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆ స్వామి కొలువై వున్న దివ్యక్షేత్రాలలో తమిళనాడులోని ఆరు క్షేత్రాలు ఎంతో మహిమాన్వితమైనవి. అవే పళని, తిరుత్తణి, తిరుచందూరు, పళముదిర్‌చోకై, తిరుప్పారకుండ్రం, స్వామి మలై ఈ ఆరు క్షేత్రాలలో కార్తికేయుని దర్శించినవారికి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తసులభుడు. ఆ స్వామిని నమ్మి కొలచినవారికి ఎటువంటి ఆపదా కలుగదు. ఆంధ్రదేశంలోనూ, తమిళనాడులోనూ, ఎందరో భక్తులకు స్వామి కులదైవం. ఏమైనా గ్రహబాధలతో బాధ పడుతున్నవారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే వెంటనే ఆ బాధల నుండి విముక్తులవుతారు. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. సంతానం కావలసినవారు, ఆర్థిక బాధలతో సతమతమవుతున్నవారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే వెంటనే ఆ సమస్యల నుండి బయటపడతారు. #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - : : - ShareChat