ShareChat
click to see wallet page
search
#🇮🇳 మన దేశ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 10-04-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - భారత్ కు ముక్తినిచ్చేందుకు తండ్రి వచ్చారు, పిల్లలైన మీరు ఈ సమయములో తండ్రికి సహాయకులుగా అవుతారు, భారత్ యే ప్రాచీన ఖండము’’ ప్రశ్న:-ఉన్నతమైన గమ్యములో ఆటంకాలు కలిగించేటటువంటి చిన్న-చిన్న విషయాలు ఏమిటి? జవాబు:-ఒకవేళ దేనిపట్లనైనా కొద్దిగా అభిరుచి ఉన్నా, అనాసక్త వృత్తి లేకపోయినా, మంచివి ధరించాలి, తినాలి అని బుద్ధి భ్రమిస్తూ ఉన్నా... ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవడములో ఆటంకాలను కలిగిస్తాయి, అందుకే బాబా అంటారు - పిల్లలూ, వనవాహములో ఉండండి, మీరు అన్నింటినీ మర్చిపోవాలి, ఈ శరీరము కూడా గుర్తుండకూడదు. ఓంశాంతి. ఈ భారత్ యే అవినాశీ ఖండమని మరియు దీని అసలైన పేరు భారతఖండమని పిల్లలకు అర్థం చేయించారు. హిందుస్థాన్ అనే పేరైతే తర్వాత వచ్చింది. భారత్ ను ఆధ్యాత్మిక ఖండమని అంటారు, ఇది ప్రాచీన ఖండము. కొత్త ప్రపంచములో భారత ఖండము ఉన్నప్పుడు వేరే ఖండాలేవీ ఉండేవి కావు. ముఖ్యమైన ధర్మాలు ఇస్లామ్, బౌద్ధ మరియు క్రిస్టియన్ ధర్మాలు. ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడ్డాయి. భారత్ అవినాశీ ఖండము, దీనినే స్వర్గము, హెవెన్ అని అంటారు. కొత్త ప్రపంచములో కొత్త ఖండముగా ఒక్క భారత్ మాత్రమే ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరమపిత పరమాత్మ, స్వర్గ రచయిత అయిన హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ భారత్ అవినాశీ ఖండమని భారతవాసులకు తెలుసు. భారత్ స్వర్గముగా ఉండేది. ఎవరైనా మరణించినప్పుడు, వారు స్వర్గస్థులయ్యారని అంటారు, స్వర్గము ఎక్కడో పైన ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరములో కూడా వైకుంఠము యొక్క చిత్రాలను పైకప్పులో చూపించారు. భారత్ యే స్వర్గముగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని, ఇప్పుడైతే నరకముగా ఉందని ఎవరి బుద్ధిలోకీ రాదు. ఇది కూడా అజ్ఞానమే కదా. జ్ఞానము మరియు అజ్ఞానము అనే రెండు విషయాలు ఉంటాయి. జ్ఞానాన్ని పగలు అని, అజ్ఞానాన్ని రాత్రి అని అంటారు. అపారమైన ప్రకాశము మరియు ఘోర అంధకారమని అంటారు. ప్రకాశము అనగా ఉన్నతి, అంధకారమనగా పతనము. మనుష్యులు సూర్యాస్తమయాన్ని చూడడానికి సన్ సెట్ పాయింటు వద్దకు వెళ్తారు. ఇప్పుడది హద్దు విషయము. దీనిని బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మా అయితే ప్రజాపిత కావున తప్పకుండా వారు ప్రజలకు పిత అవుతారు. జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు, అజ్ఞాన అంధకారము వినాశనమయిందని అంటారు. ఈ విషయాలను ప్రపంచములోనివారెవరూ అర్థం చేసుకోరు. ఇది కొత్త ప్రపంచము కోసం కొత్త జ్ఞానము. హెవెన్ కోసం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇచ్చే జ్ఞానము కావాలి. ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్ అని పాడుతారు కూడా కావున వారు టీచర్ కూడా అయినట్లు. ఫాదర్ ను పతిత-పావనుడు అని అంటారు, ఇంకెవ్వరినీ పతిత-పావనుడు అని అనలేరు. శ్రీకృష్ణుడిని కూడా అలా అనలేరు. ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడైతే అందరికీ ఫాదర్ కాదు. అతను పెద్దవాడై వివాహము చేసుకున్న తర్వాత, ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతారు. రాధా-కృష్ణులను రాకుమారీ, రాకుమారుడు అని అంటారు. వారి స్వయంవరము కూడా ఎప్పుడో జరిగి ఉంటుంది. వివాహము తర్వాతనే తల్లిదండ్రులుగా అవ్వగలరు. కృష్ణుడిని ఎప్పుడూ ఎవ్వరూ వరల్డ్ గాడ్ ఫాదర్ అని అనలేరు. వరల్డ్ గాడ్ ఫాదర్ అని కేవలం నిరాకార తండ్రి ఒక్కరినే అంటారు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివబాబాను అనలేరు. గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మా. వారి నుండి వంశవృక్షము వెలువడుతుంది. వారు (శివబాబా) నిరాకార గాడ్ ఫాదర్, నిరాకార ఆత్మలకు తండ్రి. నిరాకార ఆత్మలు ఇక్కడ శరీరములో ఉన్నప్పుడు భక్తి మార్గములో వారిని పిలుస్తారు. మీరు ఈ కొత్త విషయాలన్నింటినీ వింటున్నారు. యథార్థ రీతిలో ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి అంటారు, నేను సమ్ముఖములో కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఇక తర్వాత ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు యథార్థమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలకే సమ్ముఖములో అర్థం చేయించి వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. అవి యథార్థముగానైతే తయారవ్వవు ఎందుకంటే సత్యమైన ప్రపంచము సమాప్తమై అసత్య ఖండముగా మారిపోతుంది. కనుక ఇక్కడ అసత్యమైన విషయాలే ఉంటాయి ఎందుకంటే దిగే కళే ఉంటుంది. సత్యము ద్వారానైతే ఎక్కే కళ ఏర్పడుతుంది. భక్తి రాత్రి వంటిది, అంధకారములో ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అంతటి ఘోర అంధకారము ఉంటుంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ప్రతి ముంగిట భ్రమిస్తూ ఉంటారు. ఈ సూర్యునికి కూడా ఉదయించడము మరియు అస్తమించడము ఉంటుంది, పిల్లలు వెళ్ళి దానిని చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించడాన్ని చూడాలి. భారత్ యొక్క ఉన్నతి మరియు భారత్ యొక్క పతనము. సూర్యుడు అస్తమించినట్లుగా, భారత్ కూడా అస్తమిస్తుంది. భారత్ యొక్క నావ కిందకు వెళ్ళిపోతుందని, మళ్ళీ తండ్రి వచ్చి దానికి ముక్తినిచ్చారని సత్యనారాయణుడి కథలో చూపిస్తారు. మీరు ఈ భారత్ కు మళ్ళీ విముక్తిని ఇస్తారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు ఆహ్వానము కూడా ఇస్తారు. నవ-నిర్మాణ ప్రదర్శనీ అనే పేరు బాగుంది. కొత్త ప్రపంచము ఎలా స్థాపనవుతుంది అన్నది చూపించే ప్రదర్శనీ ఇది. చిత్రాల ద్వారా అర్థం చేయించడము జరుగుతుంది. అదే పేరు కొనసాగడము మంచిది. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది మరియు ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచము పతనమవుతుంది, అందుకే ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది మీరు చూపిస్తారు. రాజ్యాన్ని తీసుకోవడము మరియు కోల్పోవడము అనేది కూడా ఒక కథ. 5 వేల సంవత్సరాల క్రితం ఏముండేది. సూర్యవంశీయుల రాజ్యముండేదని అంటారు. తర్వాత చంద్రవంశీయుల రాజ్య స్థాపన జరిగింది. వారు ఒకరి నుండి మరొకరు రాజ్యాన్ని తీసుకుంటారు. ఫలానావారి నుండి రాజ్యాన్ని తీసుకున్నట్లుగా చూపిస్తారు. వారు మెట్ల వరుస చిత్రాన్ని ఏమీ అర్థం చేసుకోరు. మీరు బంగారుయుగము నుండి వెండియుగములోకి మెట్లు దిగుతూ వెళ్ళారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది 84 జన్మల మెట్లు వరుస. మెట్లు దిగవలసి ఉంటుంది, మళ్ళీ ఎక్కవలసి కూడా ఉంటుంది. పతనము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. భారత్ యొక్క పతనము ఎంత సమయము, ఉన్నతి ఎంత సమయము. భారతవాసుల పతనము మరియు ఉన్నతి. మనుష్యులకు ఉత్సుకతను ఎలా కలిగించాలి అని విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. అంతేకాక సోదరీ, సోదరులారా, వచ్చి అర్థం చేసుకోండి అన్న ఆహ్వానాన్ని కూడా ఇవ్వాలి. తండ్రి మహిమను ముందుగా తెలియజేయాలి. శివబాబా మహిమను తెలిపే ఒక బోర్డు కూడా ఉండాలి. పతిత-పావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు, సుఖ-శాంతుల సాగరుడు, సంపద సాగరుడు, సర్వుల సద్గతిదాత, జగత్ పిత, జగత్ శిక్షకుడు, జగత్ గురువు అయిన శివబాబా నుండి మీ సూర్యవంశీ, చంద్రవంశీ వారసత్వాన్ని తీసుకోండి అని బోర్డుపై ఉండాలి. అప్పుడు మనుష్యులకు తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి మహిమ మరియు శ్రీకృష్ణుని మహిమ వేర్వేరు. ఇది మీ బుద్ధిలో కూర్చుని ఉంది. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు రోజంతా పరుగులు పెడుతూ ఉంటారు. తమ లౌకిక ఉద్యోగము ఉన్నప్పటికీ, సెలవు తీసుకుని సేవలో నిమగ్నమవుతారు. ఇది ఉన్నదే ఈశ్వరీయ గవర్నమెంట్. విశేషముగా కుమార్తెలు, ఒకవేళ ఇటువంటి సేవలో నిమగ్నమైనట్లయితే, ఎంతో పేరును తీసుకురాగలరు. సర్వీసబుల్ పిల్లలకు పాలన అయితే మంచి రీతిలో జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే శివబాబా భండారా నిండుగా ఉంటుంది. ఏ భండారా నుండైతే తిన్నారో, ఆ భండారా నిండుగా, కాల కంటకాలకు దూరముగా ఉంటుంది. మీరు శివ వంశీయులు. వారు రచయిత, ఇది వారి రచన. ‘బాబుల్’ (తండ్రి) అనే పేరు చాలా మధురమైనది. శివుడు ప్రియుడు కూడా కదా. శివబాబా మహిమయే వేరు. నిరాకారుడు అనే పదం వ్రాయడము వలన, వారికి ఎటువంటి ఆకారము లేదని భావిస్తారు. అత్యంత ప్రియమైనవారు శివబాబా - పరమప్రియుడు అని తప్పకుండా వ్రాయాలి. ఈ సమయములో వాళ్ళు కూడా యుద్ధ మైదానములో ఉన్నారు మరియు మీరు కూడా యుద్ధ మైదానములో ఉన్నారు. శివశక్తులు అహింసకులని అంటూ ఉంటారు. కానీ చిత్రాలలో దేవీలకు కూడా ఆయుధాలను చూపించి హింసను చూపించారు. వాస్తవానికి మీరు యోగబలము లేక స్మృతిబలము ద్వారా విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఆయుధాలు మొదలైనవాటి మాటే లేదు. గంగ యొక్క ప్రభావము చాలా ఉంది. చాలామందికి సాక్షాత్కారము కూడా జరుగుతుంది. గంగా జలము లభిస్తే ఉద్ధరణ జరుగుతుందని భక్తి మార్గములో భావిస్తారు, అందుకే గుప్త గంగ అని అంటూ ఉంటారు. బాణము వేయగానే గంగ వెలువడిందని అంటారు. గోముఖము నుండి కూడా గంగను చూపిస్తారు. మీరు అడిగితే, గుప్త గంగ వెలువడుతూ ఉందని అంటారు. త్రివేణిలో కూడా సరస్వతిని గుప్తముగా చూపించారు. మనుష్యులైతే ఎన్నో విషయాలను తయారుచేసారు. ఇక్కడైతే ఒకటే విషయము ఉంది. కేవలం అల్ఫ్ (భగవంతుడు), అంతే. అల్లాహ్ వచ్చి బహిష్త్ ను స్థాపన చేస్తారు. ఖుదా హెవెన్ ను స్థాపన చేస్తారు. ఈశ్వరుడు స్వర్గాన్ని స్థాపన చేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఒక్కరే. వారు తమ-తమ భాషలలో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ అల్లాహ్ నుండి తప్పకుండా స్వర్గ రాజ్యాధికారము లభిస్తుందని భావిస్తారు. ఇక్కడైతే తండ్రి, మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము తప్పకుండా గుర్తుకొస్తుంది. స్వర్గము రచయిత యొక్క రచన. రాముడు నరకాన్ని రచించారని అనరు. నిరాకార రచయిత ఎవరు అనేది భారతవాసులకు అసలు తెలియదు. నరకానికి రచయిత రావణుడని, అతడిని కాలుస్తారని మీకు తెలుసు. రావణ రాజ్యములో భక్తి మార్గపు అంటు ఎంత పెద్దది. రావణుడి రూపాన్ని కూడా చాలా భయంకరముగా తయారుచేసారు. రావణుడు మా శత్రువు అని అంటారు కూడా. విస్తారము ఎక్కువగా ఉన్నందుకు, రావణుడి శరీరాన్ని కూడా పెద్దదిగా తయారుచేస్తారు అని తండ్రి దీని అర్థాన్ని తెలియజేసారు. శివబాబా అయితే బిందువు కానీ చిత్రాన్ని పెద్దదిగా తయారుచేసారు. లేదంటే బిందువుకు ఎలా పూజ జరుగుతుంది. పూజారులుగా అయితే అవ్వాలి కదా. ఆత్మ గురించి - భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రమని అంటారు. మళ్ళీ ఆత్మయే పరమాత్మ అని అంటారు. అటువంటప్పుడు వారు వేలాది సూర్యుల కన్నా ఎక్కువ తేజోమయముగా ఎలా ఉండగలరు. ఆత్మను వర్ణిస్తారు కానీ అర్థం చేసుకోరు. ఒకవేళ పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అయినట్లయితే, వారు ప్రతి ఒక్కరిలోనూ ఎలా ప్రవేశించగలరు. ఇవి ఎంతటి అయథార్థమైన విషయాలు, వీటిని వింటూ ఎలా అయిపోయారు. ఆత్మయే పరమాత్మ అని అంటారు, అదే నిజమైతే తండ్రి రూపము కూడా అలాగే ఉంటుంది కదా, కానీ పూజ కోసం పెద్ద రూపాన్ని తయారుచేసారు. రాతితో ఎంతో పెద్ద-పెద్ద చిత్రాలను తయారుచేస్తారు. గుహలలో పాండవులను పెద్ద-పెద్ద రూపాలలో చూపించారు కానీ ఏమీ తెలియదు. ఇది చదువు. వ్యాపారము మరియు చదువు వేర్వేరు. తండ్రి చదివిస్తారు కూడా, అలాగే వ్యాపారాన్ని కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా ముందు తండ్రి మహిమ ఉండాలి. తండ్రి యొక్క పూర్తి మహిమను వ్రాయాలి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా వస్తాయి, అందుకే మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు అని అంటారు. ఆయుధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి బుద్ధితాళాన్ని తెరుస్తారు. ఈ గోద్రెజ్ తాళాన్ని ఎవరూ తెరవలేరు. తండ్రిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు, బాబా పిల్లలను అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా, ఇదే స్థానములో, ఇదే రోజున ఎప్పుడు కలిశారు? అప్పుడు పిల్లలు - అవును బాబా, 5 వేల సంవత్సరాల క్రితం కలిసాము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలను ఇలా ఎవరూ అడగలేరు. ఇవి ఎంత గుహ్యమైన, అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా జ్ఞానానికి చెందిన యుక్తులను ఎన్ని అర్థం చేయిస్తారు. కానీ ధారణ నంబరువారుగా జరుగుతుంది. శివబాబా మహిమ వేరు, బ్రహ్మా-విష్ణు-శంకరుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు. ఇది అనాది డ్రామా. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మనము మూలవతనానికి ఎలా వెళ్తాము, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుని ఉంది. వెళ్ళే సమయములో వయా సూక్ష్మవతనము వెళ్తాము కానీ పై నుండి కిందకు వచ్చే సమయములో సూక్ష్మవతనము ఉండదు. సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారము ఎప్పుడూ ఎవరికీ కలగనే కలగదు. సూక్ష్మవతనము యొక్క సాక్షాత్కారము కోసం ఎవరూ తపస్య చేయరు ఎందుకంటే దాని గురించి ఎవరికీ తెలియదు. సూక్ష్మవతనానికి భక్తులెవరూ ఉండరు. సూక్ష్మవతనాన్ని ఇప్పుడు రచిస్తారు, వయా సూక్ష్మవతనము వెళ్ళి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తారు. ఈ సమయములో మీరు అక్కడికి వెళ్తూ-వస్తూ ఉంటారు. మీ నిశ్చితార్థము జరిగింది, ఇది పుట్టినిల్లు. విష్ణువును తండ్రి అని అనరు. అది అత్తవారిల్లు. కన్య అత్తవారింటికి వెళ్ళినప్పుడు, పాత వస్త్రాలన్నింటినీ వదిలి వెళ్తుంది. మీరైతే పాత ప్రపంచాన్నే వదిలేస్తారు. మీ వనవాహానికి మరియు వారి వనవాహానికి ఎంత తేడా ఉంది. మీరు కూడా చాలా అనాసక్తులుగా ఉండాలి, దేహాభిమానాన్ని వదిలివేయాలి. ఖరీదైన చీరను ధరించినట్లయితే వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. నేను ఆత్మను అన్నది మర్చిపోతారు. ఈ సమయములో మీరు వనవాహములోనే ఉన్నారు. వనవాహము మరియు వానప్రస్థము, రెండూ ఒక్కటే. శరీరాన్నే వదిలేయాలి అన్నప్పుడు చీరను వదలరా. మామూలు చీర లభించినట్లయితే, మనసు చిన్నబుచ్చుకుంటారు. కానీ వాస్తవానికి ఇందులో సంతోషపడాలి, మామూలు వస్త్రము లభించడము ఎంతో మంచిది. మంచి వస్తువులనైతే సంభాళించవలసి ఉంటుంది. ఇవి ధరించాలి, ఇవి తినాలి అనే చిన్న-చిన్న విషయాలు కూడా ఉన్నత గమ్యాన్ని చేరుకోవడములో ఆటంకాలను కలిగిస్తాయి. గమ్యము చాలా పెద్దది. కథలో కూడా వినిపిస్తారు కదా - ఈ చేతికర్రను కూడా వదిలేయండి అని పతికి చెప్పినట్లుగా చూపిస్తారు. తండ్రి అంటారు - ఈ పాత వస్త్రము, పాత ప్రపంచము, అన్నీ సమాప్తమవ్వనున్నాయి, అందుకే ఈ మొత్తము ప్రపంచమంతటి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి, దీనిని అనంతమైన సన్యాసమని అంటారు. సన్యాసులైతే హద్దు సన్యాసము చేసారు, ఇప్పుడు వారు మళ్ళీ లోపల నగరాలలోకి వచ్చేసారు. ఇంతకుముందు వారిలో చాలా శక్తి ఉండేది. దిగజారేవారికి మహిమ ఏముంటుంది. చివరివరకు కొత్త-కొత్త ఆత్మలు కూడా పాత్రను అభినయించేందుకు వస్తూనే ఉంటారు, వారిలో ఎంత శక్తి ఉంటుంది. మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకునేందుకు ఎంత మంచి బుద్ధి కావాలి. సర్వీసబుల్ పిల్లలు సేవలో ఉత్సాహముతో ఉంటారు. బాబా ఏ విధముగా ఉత్సాహముతో ఉంటారో, అదే విధముగా జ్ఞానసాగరుని పిల్లలు కూడా భాషణ చేయాలి, ఇందులో నిరుత్సాహపడకూడదు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. బుద్ధితో అనంతమైన సన్యాసము చేయాలి. ఇది తిరిగి ఇంటికి వెళ్ళే సమయము, అందుకే పాత ప్రపంచము మరియు పాత శరీరము నుండి అనాసక్తులుగా ఉండాలి. 2. డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితముగా ఉండాలి. వరదానము:-బాప్ దాదాను మీ సహచరుడిగా భావిస్తూ డబుల్ ఫోర్సుతో కార్యము చేసే సహజయోగీ భవ ఏ కార్యము చేస్తున్నా సరే, బాప్ దాదాను మీ సహచరునిగా చేసుకోండి, అప్పుడు డబుల్ ఫోర్సుతో కార్యము జరుగుతుంది మరియు స్మృతి కూడా చాలా సహజముగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగా నిలిచి ఉంటుంది. కనుక ఈ విధముగా సహచరులుగా ఉన్నట్లయితే మరియు బుద్ధి ద్వారా నిరంతరము ఆ సత్యమైనవారి సాంగత్యము చేసినట్లయితే సహజయోగులుగా అవుతారు మరియు శక్తిశాలి సాంగత్యము ఉన్న కారణముగా ప్రతి కర్తవ్యములోనూ మీకు డబుల్ ఫోర్సు ఉంటుంది, తద్వారా ప్రతి కార్యములోనూ సఫలత అనుభూతి అవుతుంది. స్లోగన్:-ఎవరైతే ఎప్పుడూ మాయ ప్రభావములో పరవశమవ్వరో, వారు మహారథులు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చెయ్యండి’’ మధురతయే బ్రాహ్మణ జీవితము యొక్క మహానత. ఎక్కడైతే మధురత ఉంటుందో, అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మధురత రాదు. ఎంతగా బుద్ధిలో నషా ఉంటుందో, అంతగానే కర్మలలో నమ్రత మరియు మాటలలో మధురత ఉండాలి. ఇటువంటి నషాలో ఉన్నట్లయితే ఎప్పుడూ నష్టము జరగదు. సిద్ధిని ప్రాప్తి చేసుకున్నవారు స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మానులుగా, ప్రతి విషయములోనూ తమను తాము గుణగ్రాహకులుగా మరియు మధురతా సంపన్నులుగా తయారుచేసుకుంటారు. "