మహబూబ్నగర్ జిల్లా పోలీసుల రైతులకు విజ్ఞప్తి
పంట కోత అనంతరం పంట వ్యర్థాలను కాల్చడం వలన భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండాలని మహబూబ్నగర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల:
భూమిలోని పోషకాలు నశిస్తాయి
వాయు కాలుష్యం పెరుగుతుంది
శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుంది
అందువల్ల రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా, సేంద్రియ ఎరువుల తయారీకి లేదా ఇతర ఉపయోగాలకు వినియోగించాలని సూచనలు జారీ చేయడం జరిగినది.
“మన భూమి… మన భవిష్యత్తు… రండి కలిసి కాపాడుకుందాం”
#MahabubnagarPolice #📰 వార్తలు

