ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తులు ఎవరికి ఎలా పంపిణీ కావాలనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే పత్రాన్నే వీలునామా అంటారు. సాధారణంగా ఇది మరణించిన వ్యక్తి చివరి కోరికగా పరిగణించబడుతుంది. అయితే భారతదేశంలో ఒక వీలునామా పూర్తిగా తుది నిర్ణయంగా భావించబడదు. అది మోసపూరితంగా తయారైందని, ఒత్తిడిలో రాయించబడిందని లేదా చట్టపరమైన ప్రమాణాలు పాటించలేదని అనుమానం ఉంటే, దానిని న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు. చట్టపరంగా సరైన విధంగా రూపొందించిన వీలునామా సాధారణంగా కోర్టులో ఆమోదం పొందుతుంది. అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా ఆస్తిపై హక్కు ఉన్నవారు దానిపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. #📖బిజినెస్

వీలునామాను కోర్టులో సవాల్ చేయవచ్చా? చట్టం ఏం చెబుతోందంటే?
ఒక వ్యక్తి మరణానంతరం ఆస్తి పంపిణీని తెలిపే వీలునామాను భారతదేశంలో కోర్టులో సవాలు చేయవచ్చు. మానసిక సామర్థ్యం లేకపోవడం, ఒత్తిడి, మోసం లేదా సరైన చట్టపరమైన ప్రక్రియ పాటించకపోవడం దీనికి ప్రధాన కారణాలు. సంతకాలు, సాక్షులు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ విశ్వసనీయతను పెంచుతుంది.

