Mohan
622 views 3 days ago
#🌍నా తెలంగాణ #కాళేశ్వరం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party ✅ కుట్ర కూలింది, నిజం తేలింది ✊🏻 📃 ఎన్డీఎస్‌ఏ ప్రకటనతో జలద్రోహం బట్టబయలు 📢📣 నీళ్ల లిఫ్టింగ్‌పై నిర్ణయం రాష్ట్ర సర్కార్‌దే 🚨 కాళేశ్వరంపై ఎన్డీఎస్‌ఏ ఖుల్లంఖుల్లా! 🌊 కరువు పరిస్థితుల్లో రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాల్నా, వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 🔹 బరాజ్‌ల భద్రత, నిర్మాణ పటిష్టత వరకే మా పరిధి.. ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేదు 🆘 ఇన్నాళ్లూ రిపోర్ట్‌ మాటున దాక్కొని ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్‌ సర్కార్‌ పన్నాగం పటాపంచలు 🚨 కరువు వేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్డీఎస్‌ఏ సభ్యుడు రాకేశ్‌ తోతేజా స్పష్టీకరణ. ఇన్నాళ్లు ఎన్డీఎస్‌ఏ రిపోర్టు సాకుతో సర్కార్‌ డ్రామా 📣 బరాజ్‌ నింపవద్దని, నీళ్లు ఎత్తిపోయవద్దని చెప్పిందంటూ అడ్డగోలుగా రేవంత్‌ అబద్ధాలు 🚨 అదే వంకతో ప్రాజెక్టును పడావుపెట్టి ఏపీకి నీళ్లు. ఎన్డీఎస్‌ఏ ప్రకటనతో జలద్రోహం బట్టబయలు కుట్ర బట్టబయలైంది. కాళేశ్వరంపై రేవంత్‌ సర్కార్‌ పన్నాగం పటాపంచలైంది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదికను అడ్డుపెట్టి.. బీఆర్‌ఎస్‌పై నెపం నెట్టి.. ఇన్నాళ్లూ నీళ్లు ఎత్తిపోయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గం బయటపడింది. బరాజుల్లో నీళ్లు నింపవద్దని.. సాగు, తాగు అవసరాలకు నీటిని ఎత్తిపోయవద్దని ఎన్డీఎస్‌ఏ చెప్పిందంటూ ఇన్నాళ్లూ అందరి కండ్లకు గంతలు కడుతూ వచ్చిన కాంగ్రెస్‌ కపటనీతి బయటపడింది. నీటి ఎత్తిపోతలు తమ పరిధి కాదని, దానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎన్డీఎస్‌ఏ కుండబద్దలు కొట్టింది. కాళేశ్వరుడి సాక్షిగా సర్కార్‌ అబద్ధాలు.. ప్రాణహిత నీళ్లల్లో నిలువునా మునిగిపోయాయి. కాళేశ్వరంపై అక్కసుతో, కేసీఆర్‌ మీద కక్షతో ప్రాజెక్టును పడావు పెట్టింది కాంగ్రెస్‌ సర్కార్‌. పొలాలను ఎండబెట్టింది. సాగు నీళ్లు ఇవ్వాలంటూ రైతు కోరినా, బీఆర్‌ఎస్‌ పోరాడినా వినకుండా.. వచ్చిన నీటిని వచ్చినట్టు ఆంధ్రాకు పారించింది. మేడిగడ్డపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికను బయటపెట్టకుండా ఇన్నాళ్లూ నాటకాలు ఆడిన రేవంత్‌ ప్రభుత్వం ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. కాలపరీక్షకు నిలిచే తెలంగాణ జీవనరేఖ.. కాళేశ్వరం! కరువును తీర్చే కల్పవల్లి కాళేశ్వరం! మహా సంకల్పం చుట్టూ అల్లుకున్న కుట్రలన్నీ ఏనాటికైనా కూలిపోవాల్సిందే! #KaleshwaramProject
9 likes
11 shares

More like this