JanaSena Party Telangana
534 views 2 days ago
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా, గత నెల 29వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల ద్వారా, పార్టీలో వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 36 వేలకుపైగా జనసేన శ్రేణుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, కమిటీల ఎంపిక ప్రక్రియను జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. జనసేన నాయకులు, సాధక్స్, జనసైనికులు, వీరమహిళల నుండి వారిలోని నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, ప్రజాసేవ, రాజకీయ అనుభవం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీలలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలను ఖరారు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మిగతా నియోజకవర్గాలలో కూడా స్వీయ పర్యవేక్షణలో ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తి చేయనున్నారు. #JSPMembershipToLeadership #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️రాజకీయాలు #😇My Status
10 likes
18 shares

More like this