విశిష్టమైన సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్ నివాసంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఏకాదశ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కాంక్షిస్తూ మహాశివుడికి రుద్రాభిషేకం చేశారు. రుత్వికుల వేదమంత్రాల మధ్య లోకేష్ దంపతులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
#NaraLokesh #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్


