ShareChat
click to see wallet page
search
భగవాన్ రమణ మహర్షి 76వ ఆరాధనోత్సవం : "నేను అనే భావం ఎక్కడినుంచి వస్తోందో అన్వేషిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు. ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడినుంచి పుడుతోందో ఆ బుద్ధిని మార్చినట్లైతే మనస్సు దానిలో లీనమై పోతుంది. అదే తపస్సు." అని చెప్పిన భగవాన్ రమణ మహర్షుల వారి పుణ్యతిథి నేడు. ఆ రోజుల్లో రమణ మహర్షి వద్దకు వచ్చిన మహాభక్తుల్లో రామస్వామి అయ్యర్ ఒకరు. ఆహారం కూడా తీసుకోలేని అనారోగ్యంతో బాధపడే అతను స్వామి పెట్టిన రొట్టెలు తిని ఆరోగ్యవంతుడయ్యాడు. జనం విపరీతంగా పెరగటం ప్రారంభమైంది. జీవనమంతా దుఃఖమయమైన ‘ఎచ్చమ్మాళ్’ అనే మహిళ కూడా నిత్యము మహర్షిని దర్శించేది. ఆమెకు స్వామి దర్శనమాత్రంతో శాంతి కలిగింది. శేషజీవితాన్ని రమణుల చెంతనే సాధనలతో గడుపుతూ స్వామి సేవలో శ్రద్ధ వహించింది. రమణుల వద్దకు విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. యఫ్.హెచ్.హంప్రీన అనే వ్యక్తి అసిస్టెంట్ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా పని చేసేవాడు. ఆయన మూడుసార్లుస్వామి వద్దకు వచ్చి సందేహాలు తీర్చుకొన్నారు. ఇలా అందరి సమస్యలను తీర్చిన రమణ మహర్షిని ఆయన పుణ్యతిథి రోజున స్మరించుకుందాం. ఈరోజున భగవాన్ రమణ మహర్షి ఆరాధన దినోత్సవంగా జరుపుకుంటారు. #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ