Rajyalakshmii
450 views 6 days ago
విద్యార్థులకు కేంద్రం బంపర్ ఆఫర్..గ్యారంటీ లేకుండా రూ.10 లక్షల లోన్ కేంద్ర ప్రభుత్వం "పీఎం విద్యాలక్ష్మి" పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణం పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంటే కోర్సు కాలంతో పాటు అదనంగా ఒక ఏడాది వరకు 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. రూ.4.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తి వడ్డీ మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. కోర్సు పూర్తైన తర్వాత 15 ఏళ్ల వరకు లోన్‌ తిరిగి చెల్లించే సౌలభ్యం కూడా ఉంది. #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status
9 likes
15 shares

More like this