*ఇది అచ్చంగా సినిమా స్టోరీలా ఉన్నప్పటికీ ఎంతమాత్రమూ కాదు. ఒకరి జీవితంలో ఎంతో విషాదం ఉన్నప్పటికీ వాటన్నింటిని దాటుకుని సంతోషకరమైన జ్ఞాపకాలతో బతికేస్తూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు.*
*ఆయన ఉన్నత చదువులు చదివారు. అది పూర్వపు రోజుల్లో అక్కడనుండి దేశం కానీ దేశంలో గొప్పస్థాయిలో స్థిరపడ్డారు*.
*ఆపై ఒక తెలుగింటి అమ్మాయిని వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు జీవితం సంతోషకరంగ నడుస్తుంది అనుకునేలోపు అనుకోని విషాదం ఎదురైంది అది ఎవ్వరు ఊహించని విధంగా*
*ఇప్పుడు చెబుతున్న ఆ గొప్పవ్యక్తి #కాకినాడ కు చెందిన డాక్టర్ #శ్రీ_చంద్రశేఖర్ గారు.*
*బహుశా ఇలా డాక్టర్ చంద్రశేఖర్ గారు అని చెబితే అతికొద్ది మందికి మాత్రమే తెలుస్తుందేమో అదే* *డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్* *గారు అంటే మరెంతోమందికి ఆయన సుపరిచితులు.*
*1943 నవంబర్ 20 తేదీన ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామంలో జన్మించారు చంద్రశేఖర్ గారు. చిన్నతనం నుండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో పెరిగిన ఆయన అక్కడే హైస్కూల్ లో అలానే ఆర్ట్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. అక్కడ నుండి విశాఖపట్నం లో బీఎస్సి, ఎమ్మెస్సీ చేశారు. ఆ పై చదువుల కోసం 1965 లో కెనడా వెళ్లారు. అక్కడే ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. కానీ ఎంత ఉన్నత స్థానాలు చేరిన స్వదేశం అంటే ఎంతో అభిమానం ఆయనకు. తెలుగింటి అమ్మాయి అయిన శ్రీమతి మంజరి గారిని 1975 సంవత్సరంలో వివాహమాడారు. వారికీ ఇద్దరు పిల్లలు శ్రీకిరణ్, శారద*.
*వివాహం చేసుకొని కెనడాలో కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. మంజరి గారు తమ్ముడు పెళ్లి కోసం అని 1985 జూన్ 23 తేదీన ఇద్దరి పిల్లలు ఆరేళ్ళ కిరణ్, మూడేళ్ళ శారద లతో కెనడా నుండి ఇండియా బయలుదేరారు. 329 మంది ప్రయాణికులతో కెనడా నుండి ఢిల్లీ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ చేశారనే వార్త ఎవత్తు దేశాన్నే శోకసంద్రం లో ముంచేసింది. ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం లో కుప్పకూలిన విమానం వార్త విన్న కాసేపటికి మొత్తం 329 మంది ప్రయాణికులు మరణించారని ద్రువీకరించగా తమ వారికోసం ఎయిర్పోర్ట్ లో ఎదురుచూస్తున్న బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా ఎంతో విషాదం నెలకొంది*.
*కొన్ని గంటల ముందే తమ వాళ్ళని ఎయిర్ ఇండియా విమానం ఎక్కించిన చంద్రశేఖర్ గారికి ఆ వార్త తెలిసింది. కానీ ఆ వార్తను అయన ఎంతవరకు నిముర్చుకోలేదు కొన్ని నెలల పాటు తీవ్రవాదులు వాళ్ళని బంధించి ఉంటారని ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటారు అనే ఆశతో ఉన్నారు. కానీ ఆశ కు నిరాశ తోడై ఇద్దరి పిల్లలతో సహా తన భార్య మంజరి గారు మరణించారని తెలిసి ఎంతో కృంగిపోయారు. మంజరి గారితో వివాహం అనంతరం కెనడా లో ఉన్న సమయం లోనే స్వదేశంలో నిరుపేదల కోసం తమ వంతుగా ఏమైనా చేయాలని ఆకలితో ఎవరు అలమటించకూడదని అందరూ బాగుండాలని దానికి తమవంతుగా ఏమైనా చేయాలని అనుకునేవారు దానికి గాను కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. భార్య పిల్లలు మరణం అనంతరం తన జీవితం ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా ఉండకూడదని భార్య ఆశయాలను భాద్యతగా నెరవేర్చాలని చంద్రశేఖర్ గారు నిర్ణయించుకున్నారు.*
*కెనడా లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా కు బయలుదేరారు*. *1989 సంవత్సరం లో మంజరి సంకురాత్రి మెమోరియల్ ఫౌండేషన్ ను స్థాపించారు. కాకినాడ కు దగ్గరలో ఉన్న తిమ్మవరం గ్రామంలో అనాధ శరణాలయం ఏర్పాటు చేసి ఆకలి బాధలు తీర్చాలనుకున్నారు*. *ఆ రోజుల్లో చదువు మీద అంతగా అవగాహన లేకపోవడం వలన ఎంతోమంది పిల్లలు పనులకు వెళ్లడం చూసి చలించిన ఆయన వారితో మాట్లాడి గ్రామీణ పిల్లలకు సాయంత్రం బడి ఏర్పాటు చేసి చదువు చెప్పేవారు. 1992 లో 25 మంది విద్యార్థులతో మొదలైన సాయంత్రం పాఠశాల నేడు శారద విద్యాలయం పేరుతొ వందల మంది విద్యార్థులకు చదువును బోధిస్తున్నారు*.
*చదువు చెప్పడం అంటే పాఠాలు భోదించడం మాత్రమే కాదని వారికి వృత్తి విద్యా కోర్సులు నేర్పించడం లాంటివి చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఈ విద్యాలయం నెలకొంది*.
*1993 సంవత్సరం లో మంజరి #సంకురాత్రి_మెమోరియల్_ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమారుడు పేరుమీద శ్రీకిరణ్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ను ఏర్పాటు చేశారు*.
*ఒక డాక్టర్ ఆరుగురి సిబ్బందితో మొదలైన ఆ వైద్యశాల నేటికి సుమారు మూడు లక్షల నలభై వేళ మందికి కాటరాక్ సర్జరీ లు ఉచితంగా చేశారు, దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి అవుట్ పేషెంట్ సర్వీసును ఉచితంగా అందించారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు శస్త్ర చికిత్సలు, ఆపరేషన్ లు చేస్తూ కేవలం డబ్బు ఉన్న వారి దగ్గర మాత్రమే అంటే స్థోమత ఉన్న వారి దగ్గర నుండి మాత్రమే తీసుకొని లేనివారికి పూర్తిగా ఉచితంగా సేవలను అందిస్తుంది ఈ సంస్థ*
*అంతేకాదు ఆసుపత్రి కి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు కూడా ఉచితంగా అందిస్తారు. ఇక్కడ జరిగిన కంటి ఆపరేషన్ లు తొంభై శాతం ఉచితంగా జరిగినవే అంటే ఆశ్చర్యపోతారు కానీ అదే నిజం. కెనడా, అమెరికా దేశాల నుండి అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్ లు కూడా సంవత్సరం లో ఒకసారి ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తారు. అలానే ఇక్కడ డాక్టర్ లకు తమ సలహాలు, సూచనలు అందిస్తారు. దూర ప్రాంతం నుండి వైద్యానికి వచ్చే వారికోసం కాకినాడ బస్ స్టేషన్ లో శ్రీకిరణ్ ఆసుపత్రి బస్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అవి ఉచితంగా ఆసుపత్రి వద్దకు చేర్చే ఏర్పాట్లు కూడా చేసారు*.
*ఇంతటితో ఆగకుండా తన సేవాకార్యక్రమాలలో మరింత ముందుకు కొనసాగుతూ* *1998 సంవత్సరం లో స్పందన సంస్థ ఏర్పాటు చేసి కాకినాడ పరిసర ప్రాంతాలలో ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు నిరాశ్రయులైనా ఎందరికో వారికి కావలసిన వసతులు భోజనం, బట్టలు లాంటి మరెన్నో అందించి స్పందన సంస్థ ద్వారా అండగా నిలిచారు, నేటికి నిలుస్తున్నారు.*
*చంద్రశేఖర్ గారి సేవలకు గుర్తింపుగా జాతీయ , అంతర్జాతీయ అవార్డులు, డాక్టరేట్ లు ఎన్నో ఆయనను వరించాయి*.
*ఒక కష్టం వస్తే కృంగిపోయి మానసికంగా దెబ్బతిన్న ఎంతో మంది వ్యక్తులు మనం చూశాం, ఆ బాధ నుండి బయట పడలేక మత్తుమందుల కి మద్యానికి బానిస అయిన వారిని చూసాము, చివరికి తమ జీవితాన్ని త్యజించిన వారిని కూడా మనం చూశాం. కానీ అటువంటి బాధ నుండి బయటపడి , తాను ఎంతగానో ప్రేమించిన తన కన్న కొడుకుని కూతుర్ని సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ చూసుకుంటూ, చివరికి అదే తన జీవిత పరమార్థం గా మార్చుకుని, కొన్ని వేల మంది జీవితాలలో వెలుగులు నింపిన ఈ సంకురాత్రి చంద్రశేఖర్ గారి జీవితం ప్రస్తుత సమాజంలో యువతీ యువకులు కి ఎంతో ఆదర్శనీయం*.
*వారి భార్య గోదావరి జిల్లాకి చెందిన వారు కావడం అదృష్టం అయితే , ఆయన గోదారికే అల్లుడుగా లభించడం ఇక్కడి ప్రజల అదృష్టం* #మన సంప్రదాయాలు సమాచారం


