#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #trs#kcr#ktr#harish rao#trs సైన్యం తెలంగాణ# 🚨 కాంగ్రెస్ పాలనలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం 🪨📣 దాని విలువ రూ. 1,600 కోట్లు 💰⚠️ 7 గనుల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్లో రికార్డు🆘 కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవు.. ఎక్కడ దాచిండ్రో భట్టి విక్రమార్క చెప్పాలె📢 ఆ బొగ్గు నిల్వ మీద కోల్ సెస్ కట్టినమన్నరు.. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినమని చెప్పిండ్రు👷🏻♂️ కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చాం.. సీఎస్ఆర్ ఫండ్ కూడా చెల్లించినమన్నరు📉 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణికి ఓవర్ డ్యూస్ రూ.4,000 కోట్లకు చేరినయ్🎯 కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో అనేది కార్మికుల నినాదం కావాలి💥 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
బీఆర్ఎస్ పాలనలో సిరుల గనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి స్కామ్ల గనిగా మారింది. 40లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు సింగరేణి అధికారిక వెబ్సైట్ చూపిస్తున్నది. దాని నుంచి ఆదాయం వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని తెలిపారు. రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు స్టాక్ వెబ్సైట్ రికార్డు ప్రకారం ఏడు గనుల వద్ద లేదు, మరి ఎక్కడున్నదో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చూపించాలి. అఖిలపక్షాన్ని గనుల వద్దకు తీసుకెళ్లి ఆ బొగ్గు స్టాక్ చూపించాలి, తన ఆరోపణలు తప్పు అయితే, క్షమాపణ కోరుతానని, ఒకవేళ అక్కడ బొగ్గు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి
కరెంట్ విషయంలో సింగరేణికి ఇంకా రూ.20 వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఓవర్ డ్యూస్ (ఓడీ) రూ.3,200 కోట్లు మాత్రమే ఉండగా, సింగరేణికి మాత్రం ఓడీ రూ.4 వేల కోట్లు ఉన్నది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణి ఈ రోజు ఓవర్ డ్యూస్లోకి పడిపోయింది.


