Honey_Cherry@Paidi_saritha
అచ్చంపేట నియోజకవర్గంలో NPRD INDIA దివ్యాంగుల భవనాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించిన శుభసందర్భంగా, NPRD INDIA జాతీయ ఉపాధ్యక్షులు గజ్జి పైడి కుమార్ సభనుద్దేశించి ప్రసంగించిన సందర్బంలో అచ్చంపేట నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించి, దానిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం Nprd India దివ్యాంగుల హక్కుల పోరాటంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఈ భవన నిర్మాణానికి సహకరించిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీ కృష్ణ గారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భవనం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని, దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధికి, వారి సమస్యలపై చర్చించుకోవడానికి మరియు ఒకరికొకరు మద్దతుగా నిలవడానికి ఒక కేంద్రాంగా ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న పెన్షన్లు, ఉద్యోగ అవకాశాలు, మరియు ఇతర సంక్షేమ పథకాల అమలులో ఉన్న అడ్డంకులను తొలగించాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.ఐక్యతతో ముందుకు: దివ్యాంగులందరూ తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని, NPRD INDIA ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని గజ్జి పైడి కుమార్ స్పష్టం చేశారు.#షేర్ చాట్ బజార్👍 #🌍నా తెలంగాణ #షేర్ చాట్ బజార్👍 @ShareChat Telugu @షేర్చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @Puppy Srujana Srujana