*మార్కాపురం జిల్లా, కంభంలో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు*
*ముఖ్య అతిథిగా పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, కందులాపురం సెంటర్లో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం*
కంభం మండలం, కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు గారి పుట్టినరోజును పురస్కరించుకుని కందులాపురం సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. స్వయంగా ప్రజలకు వడ్డించి, పేదలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ:
"నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76వ పడిలోకి అడుగుపెట్టడం మనందరికీ గర్వకారణం. ఆయన అనుభవం, విజన్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత నాయకుడు ఆయన. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాము," అని పేర్కొన్నారు.
_ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై బాబు.. జై జై బాబు అంటూ కార్యకర్తల నినాదాలతో కందులాపురం సెంటర్ మార్మోగింది._ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


