ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #adilabad #రాజకీయాలు,#ఆదిలాబాద్ #trending #latest news
adilabad - కల ప్రజల గళం ... మిద్దెచింత తీరేదెన్నడో ? ఆరున్నర దశాబ్దాలుగా చీకట్లోనే గిరిజనుల బతుకు రోడ్డు .. కరెంట్ లేదు .. కనీస సౌకర్యాలూ లేవు • రాత్రిపూట గడప దాటాలంటే పాముల బెడద • 200 మంది గిరిజనులు వెలుగులకు దూరం • సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గిరిజనులు కలం , ఆదిలాబాద్ బ్యూరో : దశాబ్దాలుగా గిరిజన బిడ్డల బతుకుల్లో అంధకారం . గుడ్డి దీపాలే దిక్కు . రాత్రిపూట గడప దాటితే పాములు కాటేస్తాయనే ప్రాణభయం . ఆదివాసీ గూడేనికి అటవీ అధికారులు ఎందుకు అడ్డం తిరుగుతున్నారు ? అంధకారంలోని ఆదివాసీ గూడెంపై ప్రత్యేక కథనం . నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత ఆదివాసీ గూడెం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది . గూడెంలో కనీస విద్యుత్ సౌకర్యం కూడా లేదు . ప్రపంచం డిజిటల్ యుగంలో దూసుకుపోతుంటే , గూడెంలోని ఆదివాసీ కుటుంబాలు దశాబ్దాలుగా చీకటిలోని మగ్గిపోతున్నాయి . గూడెనికి సరైన రోడ్డు లేకపోవడం , విద్యుత్ సదుపాయం లేక గిరిజనులు బతుకులు నానాటికీ దుర్భరంగా మారుతున్నాయి . సాయంత్రం అయిందంటే గూడెం అంధకారంలోకి పోతుంది . అడవి కావడంతో తరచూ పాములు ఇళ్లలోకి చొరబడి ప్రాణభయాన్ని కలిగిస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గూడెం పరిస్థితులు ఇలా .. దట్టమైన అటవీ ప్రాంతంలోని గూడెంలో సుమారు 200 మంది గిరిజనులు నివాసం . ఇంటి గడప దాటాలన్నా భయపడాల్సిన పరిస్థితి . అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో అడ్డంకిగా అటవీ శాఖ నిబంధనలు . ఆయిల్ ఇంజన్లతోనే సాగు గిరిజన రైతులు ఇంకా పాత పద్ధతులకే పరిమితమయ్యారు . పత్తి , మొక్కజొన్న , వరి , జొన్న , కూరగాయల సాగు చేస్తున్నా కానీ , విద్యుత్ సౌకర్యం లేక రైతులు ఆయిల్ ఇంజన్లతోనే బావుల నుంచి నీటిని పంటలకు అందిస్తున్నారు . ఆయిల్ ఇంజన్ల నిర్వహణకు భారీగా డీజిల్ అవసరమవుతుండడంతో ఆర్థిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ప్రతి వారం వేల రూపాయలు డీజిల్ కే ఖర్చవుతుందని చెబుతున్నారు . పంటల ద్వారా వచ్చే ఆదాయం అంతా డీజిల్ కే సరిపోతుందని రైతు అత్రం మాణిక్ రావు తలకు బ్యాటరీ పెట్టుకుని మహిళ పని . దీపం వెలుతురులో చదువుతున్న విద్యార్థి ( ఫైల్ ) Kalam Main Fri , 19 June 2026 చెబుతున్నారు . సాగు చేసినా లాభం లేక అప్పులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు . అటవీ నిబంధనల పేరిట అడ్డంకులు ? దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం కోసం అధికారులు చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు . అటవీ ప్రాంతం కావడంతో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు అనుమతులు సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు . దశాబ్దాలుగా చీకట్లోనే జీవిస్తున్న తమ గూడెనికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని , సోలార్ విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని , రోడ్డు నిర్మించాలని మిద్దెచింత గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు . గుడ్డి దీపాల కిందే బతుకు __ ఇప్పటికీ విద్యుత్ లేకపోవడంతో గిరిజన కుటుంబాలు గుడ్డి దీపాలనే ఆధారంగా చేసుకుని బతుకుతున్నాయి . ముఖ్యంగా మహిళలు రాత్రిపూట వంట పనులు , ఇంటి పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . కొందరు తలకు బ్యాటరీ లైట్లు కట్టుకుని పనులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది . ' చీకట్లో ఏం తింటున్నామో , ఎలా బతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితి . ప్రతి రాత్రి భయంతోనే గడుస్తుంది ' అని గిరిజన మహిళ లీలా బాయి ఆవేదన వ్యక్తం చేశారు . విద్యుత్ లేక గిరిజన విద్యార్థుల చదువులు కూడా దెబ్బతింటున్నాయి . సరైన వెలుతురు లేకపోవడంతో చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు . తమ భవిష్యత్ అంధకారంగా మారుతుందని వాపోతున్నారు . - ShareChat