ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #సంపద సృష్టి ⁉️ #ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #ఎల్లో మీడియా.. 💥 *ఏపీ ఉద్యోగుల వేతనాల్లోనూ కోత.. వార్నింగ్ బెల్❗* APRIL 22, 2026🎯 హిమాచల్ ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభంతో ఆ రాష్ట్ర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతోద్యోగుల వేతనాల్లో భారీ కోత. ఆరు నెలల పాటు వారి జీతాల్లో 20 నుంచి 30 శాతం కోత విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ కోత మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకు మాత్రం మినహాయించింది. తిరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాతే, కోత విధించిన సొమ్ము చెల్లిస్తామని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాషంలో నెలకున్న ఆరిక పరిసితుల్ని ఆంధ్రప్రదేశ్తో పోల్చుతూ కూటమి ప్రభుత్వ అనుకూల పత్రిక రాసిన కథనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దడ పుట్టిస్తోంది. గత 23 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రూ.3,56,655 కోట్లు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు సగటున చంద్రబాబు ప్రభుత్వం రూ.516.8 కోట్లు చొప్పున అప్పు చేస్తోంది. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్టుగా, భవిష్యత్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చనే కూటమి ప్రభుత్వ అనుకూల పత్రిక కథనం ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనసును ప్రతిబింబించేలా అనుకూల మీడియా కథనాలు వండివార్చే సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు కథనం వెనుక ఉద్దేశాల్ని ఉద్యోగులు అంచనా కడుతున్నారు. ముందుగా ఆ కథనంలో ఏముందో చూద్దాం. “ఆదాయం చూస్తే అత్తెసరు. గాలి బుడగలా ఆర్థిక పరిస్థితి. చిన్నపాటి ఒత్తిడి తలెత్తితే పేలిపోవడమే. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల ఆర్థిక దుస్థితి. ఇప్పుడు ……… హిమాచల్ ప్రదేశ్ బయటపడింది. రేపు ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆశ్చర్యపోనక్కరలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎప్పుడో వెంటిలేటర్పైకి ఎక్కేసింది. రాష్ట్రానికి అప్పులు ఆగిపోతే ఆ క్షణమే కుప్పకూలిపోతుంది. ఏపీ విషయానికొస్తే……… ఏటా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి రూ.70,000 కోట్లు చెల్లించాలి. అప్పులపై అసలు, వడ్డీ కలిపి మరో రూ.75వేల కోట్లు! రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ రెండు పద్దులపై పెట్టే వ్యయమే ఎక్కువ. ఇవి తప్పనిసరి, తప్పించుకోలేని ఖర్చులు” ఇదీ హెచ్చరిక. గతంలో చంద్రబాబు విచ్చలవిడిగా హామీలిస్తూ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఇచ్చే హామీలకు, ఐదారు రాష్ట్రాల బడ్జెట్ అవసరమవుతుందని, అన్నీ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. అబ్బే, తాను సంపద సృష్టించి, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేరుస్తానని చంద్రబాబు అంటే, అనుకూల మీడియా డోలు వాయించింది. ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో కూడా హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే రావచ్చంటూ హెచ్చరిక. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో ఏపీని పోల్చి జనాన్ని హెచ్చరించడం వెనుక బలమైన కారణం వుంది. ఒకటి ఉద్యోగులెవరూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి ఇకపై తీసుకురాకుండా చేయడం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా వుందని, ఇలాగైతే హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగా వేతనాల్లో కోత విధించాల్సి వస్తుందనే హెచ్చరికను సంబంధిత సెక్షన్లో తీసుకెళ్లడం కూటమి ప్రభుత్వం, అలాగే అనుకూల మీడియా ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా, సక్రమంగా ఇవ్వకపోయినా ఏ ఒక్కరూ ప్రశ్నించే పరిస్థితి ఉత్పన్నం కాకూడదని పాలకులు, వారిని భుజాన మోసే మీడియాధిపతులు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక దుస్థితిని ఆసరాగా చేసుకుని, ఇప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, దాని అనుకూల మీడియా మైండ్ గేమ్ ఆడడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ అనుకూల మీడియా మోగించిన వార్నింగ్ బెల్గా చూడాల్సి వుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించకుండా, రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకుని నేడు అధికారంలో ఉన్నోళ్లు, అలాగే మద్దతుగా నిలిచే మీడియా అనుసరిస్తున్న తీరే ఎబ్బెట్టుగా వుంది. తమకు గిట్టని పాలకులు ఉన్నప్పుడు మాత్రం లేనివి, ఉన్నవి చెప్పి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడాన్ని చూశాం. జగన్ హయాంలో అప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక, సోమాలిమా అవుతాయని హెచ్చరించిన వారంతా, నేడు అంతకంటే దారుణ" పరిసితులుంటే వుంటే నోరు మెదపడం లేదు. ఆర్థిక పరిస్థితి చేయిదాటిపోతోందనే తరుణంలో, ఇదిగో ఇలాగైతే మనకూ హిమాచల్ ప్రదేశ్ దుస్థితే అని హెచ్చరిస్తుండడం ఆలోచింపజేస్తోంది. ఇదేదో మొదటి నుంచి చెబితే బాగుండేది కదా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఏది ఏమైనా మొదటగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దడ మొదలైందని చెప్పొచ్చు.
ఏపీ అప్ డేట్స్..📖 - 8 9 ೯ 8 9 ೯ - ShareChat