ShareChat
click to see wallet page
search
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం* *సమగ్ర శిక్ష* పత్రికా ప్రకటన-2_ (16.06.2026) *కేజీబీవీ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌లో కీలక మార్పు* • అభ్యర్థులకు టెట్ అర్హతపై సడలింపు... • ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరణ పొడిగింపు • సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలల్లో (KGBV) ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్స్, సీఆర్టీ, పీజీటీ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు, అదే విధంగా ఈ భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిబంధన నుండి తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి. శ్రీనివాసరావు IAS., గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 25న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సవరించిన నోటిఫికేషన్ ప్రకారం ‘దరఖాస్తు సమయానికి టెట్ అర్హత లేకపోయినా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు, తాము విధుల్లో చేరిన తేదీ నుండి ఒక ఏడాది లోపు ఖచ్చితంగా APTET లో అర్హత సాధించవలసి ఉంటుంది. నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించకపోతే ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి సేవలను ఆటోమేటిక్‌గా నిలిపివేయడం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. - *రాష్ట్ర పథక సంచాలకులు* (వారి తరఫున), సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ #🏆పోటీ పరీక్షల స్పెషల్