ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీఆర్ చౌరస్తాలో
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రక్షణ సేన పార్టీ బోధ్ నియోజకవర్గ ఇన్చార్జ్, స్టేట్ అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జిల్లా నాయకులు వేణుగోపాల్, లలిత యాదవ్లతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రమోద్తో గంగారెడ్డి తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#telangana
00:46

