*స్వర్ణ ఆంధ్ర - స్వఛ ఆంధ్ర, మూడవ శనివారంలో భాగంగా - జలం జీవం సంరక్షణే మన లక్ష్యం - రాజుపాలెంలో జల హారతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
మార్కాపురం జిల్లా, కొమరోలు మండలం, రాజుపాలెం:
స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఆధ్వర్యంలో “నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రాకు మార్గం” అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో 'జల హారతి' మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామస్తులు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువు వద్ద గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో జల హారతి ఇచ్చారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. పెరుగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను ఒక బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. "ప్రతి నీటి బొట్టును కాపాడుకోవడం ద్వారానే మనం భవిష్యత్ తరాలకు సురక్షితమైన నీటి వనరులను అందించగలం" అని ఆయన పేర్కొన్నారు.*
*ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులతో, నాయకులతో కార్యకర్తలతో రాష్ట్రాన్ని "స్వర్ణ ఆంధ్ర - స్వఛ ఆంధ్ర" గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేయించారు.*
*ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, నాయకులు తోటా వెంకటేశ్వర్లు, ఖాదర్, రసూల్, విజయ్, కొమరోలు మండలం నాయకులు, రాజుపాలెం గ్రామస్థులు మరియు RWS అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.* #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్


