##😁 పొలిటికల్ ట్రోల్స్ #appolitics#political trolls 😆😅😄 #political punch #political jokes
*అప్పుల కుప్పగా ఆ రాష్ట్రం.. సీఎం సహా మంత్రుల జీతాల్లో కోత❗*
APRIL 23, 2026🎯
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన జీతాన్ని సగానికి సగం కోసేసుకునే పరిస్థితి వస్తే? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సైతం తమ వేతనాలను వదులుకోవాల్సినంత దారుణమైన ఆర్థిక సంక్షోభం దాపురిస్తే? సామాన్యులు ఈ వార్త చూసి “నాకేంటి?” అని అనుకోవచ్చు. కానీ, లక్ష కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక రాష్ట్ర ఖజానా ఖాళీ అయితే.. రేపు ఆ భారం పరోక్షంగా పడేది పన్నులు కట్టే సామాన్యుడిపైనే!
ఇదీ హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత దయనీయ పరిస్థితి. ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉంటే ఏమంటారు? సింపుల్ గా దివాళా తీసింది అని అంటారు. పరిశ్రమలకు పెట్టే పేరు
ఖాయిలా పడ్డాయని. అలాగే భారీ కర్మాగారాల విషయం అయితే బలి పీఠం మీద ఉన్నాయని చెబుతారు. మరి రాష్ట్రం అప్పులతో అన్ని రకాలుగా దిగజారిపోతే ఏమంటారు? దివాళా దీసింది అనే అంటారు. ఇది ఆర్ధిక నిపుణులు చెప్పే మాట.
ఈ రోజున చూస్తే కేంద్రం తో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పుల విషయంలో పోటీ పడుతున్నాయి. ప్రతీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర చూస్తే ఎవరి అప్పు ఎంతో తెలుస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ చేతిలో మూడు రాష్ట్రాలు ఉంటే అందులో కర్ణాటక తెలంగాణాతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ ఉంది. దేశంలో ఎక్కడా లేని హామీలను హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చింది.
2022 లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో, కాంగ్రెస్ లక్ష కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అంతే కాదు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ని పునరుద్ధరిస్తామని కూడా ఎక్కడా అమలు చేయలేని భారీ హామీ ఇచ్చింది. మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించడం వంటి ముఖ్యమైన సామాజిక సంక్షేమ హామీలను కూడా ఇచ్చింది. అయితే అదే సమయంలో రాష్ట్ర రుణం సంగతిని కాంగ్రెస్ ఎన్నికలలో విజయం కోసం విమర్శించింది.
ఈ హామీల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం పునరుద్ధరించింది. ముఖ్యమంత్రి నారీ సమ్మాన్ నిధి కింద మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు. అయితే లక్ష ఉద్యోగాల వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయింది. తన ఉద్యోగులకు ఓపీఎస్ ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది.
కానీ ఇపుడు ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మార్చి 2026 నాటికి, రాష్ట్ర ఖజానా జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. రాష్ట్ర బడ్జెట్ రూ.58,000 కోట్లు కాగా, ఆదాయం కేవలం రూ.20,000 కోట్లు మాత్రమే. రాష్ట్ర అప్పులు దాదాపు రూ.90,000 కోట్లకు చేరాయి. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 45 శాతానికి పైగా ఉంది.
23 ప్రతి రూపాయిలో, జీతాలకు 27 పైసలు, పెన్షన్లకు 21 పైసలు, వడ్డీ చెల్లింపులకు 13 పైసలు, అప్పుల తిరిగి చెల్లింపులకు 9
పైసలు ఖర్చు అవుతున్నాయి. ఇది మొత్తం రెవెన్యూ ఖర్చులలో 70 శాతానికి పైగా ఉంది. అభివృద్ధి పనులకు కేవలం 20 శాతం మాత్రమే మిగులుతోంది. దీంతో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తన జీతంలో 50 శాతం కోతతో సహా అనేక పొదుపు చర్యలను ప్రకటించారు.
మంత్రులు, సీనియర్ అధికారుల జీతాల్లో కూడా కోతలు విధించారు. ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను ఆరు నెలల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కఠినమైన నిర్ణయం ఏప్రిల్ 2026 నుంచి సరిగ్గా ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఏకంగా ముఖ్యమంత్రి జీతంలో 50 శాతం కోత విధించారు.
ఇక డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల వేతనాల్లో 30 శాతం.. మిగిలిన ఎమ్మెల్యేలందరికీ 20 శాతం మేర జీతాలను నిలిపివేశారు. ఈ ఆర్థిక కోత కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారుల వేతనాల్లో 30 శాతం, అలాగే మధ్యస్థాయి అధికారుల జీతాల్లో 20 శాతం కోత పడుతోంది. ఆర్థిక క్రమశిక్షణను గాడిలో పెట్టడానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒకప్పుడు ప్రశాంతమైన హిమాచల్ కొండలు ఇప్పుడు అప్పుల కుంపటిలా ఎందుకు మారాయి? దీనికి ప్రధాన కారణం 16వ ఆర్థిక సంఘం తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం. హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంతాలకు ఆదాయ మార్గాలు తక్కువగా ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ నిబంధనల వల్ల భారీ పరిశ్రమలు పెట్టలేరు. కానీ, ప్రజా సేవల నిర్వహణకు మాత్రం ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ఈ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా 'రెవెన్యూ లోటు గ్రాంట్' కింద భారీగా నిధులు ఇచ్చేది. కానీ, రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడటం తగ్గించుకోవాలని, జీతాలు, పెన్షన్ల పేరుతో చేసే విపరీతమైన వృథా ఖర్చులను అరికట్టాలని 16వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఈ సిఫార్సుల మేరకు ఆ రెవెన్యూ లోటు గ్రాంట్ను కేంద్రం నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది.
దీంతో హిమాచల్కు ఏటా ఢిల్లీ నుంచి వచ్చే సుమారు రూ. 8,000 కోట్ల నిధులు అమాంతం ఆగిపోయాయి.
ఇప్పటికే అక్షరాలా రూ. లక్ష కోట్లకు పైగా అప్పుల భారం మోస్తున్న ఆ రాష్ట్రానికి ఇది చావుదెబ్బ లాంటిది! జీతాలు కట్ చేస్తున్నామని భయపడొద్దని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాస్త గాడిలో పడిన తర్వాత ఆ వాయిదా వేసిన మొత్తాన్ని కచ్చితంగా తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
ఇవి కేవలం తాత్కాలిక చర్యలు మాత్రమేనని స్పష్టం చేసింది. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక, తెలంగాణల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కర్ణాటకలో హామీల అమలు వల్ల రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీంతో ధరలను పెంచి ఖజానా నింపుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం యత్నిస్తోంది.
మరోవైపు హామీల అమలుపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హామీలు అమలు చేయలేని
కారణంగానే ఈ డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఒకటి రెండు హామీలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా లబ్ధిదారులందరికీ అందిన పరిస్థితులు కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీరు చూస్తోన్న విశ్లేషకులు కేవలం ఎన్నికల్లో గెలవడానికే ఇష్టారాజ్యంగా వాగ్దానాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు.


