ShareChat
click to see wallet page
search
అభివృద్ధి ద్వారా అమరవీరులకు నిజమైన నివాళి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 📅 02.06.2026 – మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేటలో నిర్వహించిన వేడుకల్లో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుతో భాష, యాస, సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్
🌍నా తెలంగాణ - ShareChat