ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను(8×12) రూపొందించి అందరినీ ఆకట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ గారిని ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించాను. చేనేత కళాకారుడైన సత్యనారాయణ గారు తన నైపుణ్యంతో ఎక్కడా అతుకులు లేకుండా.. కేవలం 2,400 దారాలను ఉపయోగించి నేరుగా మగ్గంపైనే మనదేశ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి అందరికీ గర్వకారణంగా నిలిచారు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


