ShareChat
click to see wallet page
search
*_సుందరకాండ-హనుమ_* *_36 వ భాగం_* *నమోస్తు రామాయ సలక్ష్మణాయ* *దేవ్యైచ తస్యై జనకాత్మజాయై* *నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో* *నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః* ⁠ *_స్వామి హనుమ రుద్రాంశ కలిగినవారు. రావణుని కలిసి రాముని ప్రతాపము తెలియజేసి సీతను అప్పగించవలసినదిగా తెలియజేయాలని సంకల్పించారు.⁠_* *అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః|* *రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||* *దాసోsహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః|* *హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః||* *న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|* *శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||* *అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|* *సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్|*⁠ *_అస్త్రవిద్యలో విదుడైన రామునికి జయము. మహాబలుడైన లక్ష్మణునికి కూడా జయము. రాఘవునిచే పాలింపబడు సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను హతమార్చు హనుమంతుడను నేను క్లిష్టకార్యములను సాధించగల కోసలేంద్రుడైన రామునికి దాసుడను. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ ఉన్న నాకు యుద్ధములో వేయిమంది రావణులు కూడా నాకు సమానులు కారు. రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా లంకాపురిని ధ్వంసము చేసి మైథిలి కి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'._* *_ఈ విధముగా పలికిన హనుమను చూసిన రాక్షసులు భయకంపితులై రావణుని వద్దకు పరుగులు పెట్టి తాము చూసిన హనుమను రావణునికి తెలియజేసిరి_*. *_రావణాసురుడు తమ సైన్యములో బలవంతులైన రాక్షసులను హనుమను పట్టి తీసుకురమ్మని ఆనతిచ్చెను_*. *_స్వామి హనుమ ఉగ్రరూపము దాల్చి అశోకవనమున శింశుపా వృక్షమును తప్ప మిగిలిన వనమును ప్రాసాదములను ధ్వంసము చేయసాగెను_*. *_అప్పుడు అగ్ని ఉద్భవించెను. ప్రాసాదము దగ్ధము అయ్యెను. అప్పుడు మండుచున్న ఆ ప్రాసాదము చూస్తూ ఇంద్రుడు వజ్రాయుధముతో అసురులను హతమార్చిన విధి రాక్షసులను హతమార్చి , హనుమంతుడు అంతరిక్షములో నుండి ఈ వచనములను పలికెను_*. *_మహాత్ముడు బలవంతుడు అయిన సుగ్రీవుని వశములో వున్న నాలాంటి వానరేంద్రులు వేలకొలదీ పంపబడిరి. మేము అనేకమంది భూమండలము అంతా సంచరిస్తున్నామ "కొందరు పది ఏనుగుల బలము కలవారు. కొందరు దానికి పదిరెట్ల బలము కలవారున్నారు. కొందరు వేయి ఏనుగుల బలము కలవారున్నారు. కొందరు వరద ప్రావాహపు బలము కలవారు. కొందరు వాయుబలము కలవారు. మరి ఇంకొందరు అప్రమేయమైన బలము కలవారు'. ఈలాంటి అనేకమంది యోధులతో దంతములు నఖములు ఆయుధములు గా గల వందవేలకోట్ల వానరులతో కలిసి అందరినీ అంతమొనర్చగల సుగ్రీవుడు ఇక్కడికి వచ్చును, 'ఈ లంకాపురి వుండదు. మీరు ఉండరు. రావణుడు ఉండడు. ఎందుకు అనగా మహాత్ముడగు ఇక్ష్వాకు నాధునితో బద్ద వైరము చేసికొనినందువలన'_* *_ఈ విధముగా స్వామి హనుమ తమ పరాక్రమమును ప్రదర్శిస్తూ లంకా వాసులకు రావణునికి హెచ్చరికలు పంపెను.⁠_* #మన సంప్రదాయాలు సమాచారం