ShareChat
click to see wallet page
search
#Kalam #KalamPaper #KalamEpaper #kalamDaily #kalamNewsPaper #viral #trending #face reganination #latest news
viral - కల కల ప్రజల గళం .... 3 ఫేస్ స్కాన్ .. చిట్టా ఓపెన్ • • విమానాశ్రయాల్లో త్వరలో సరికొత్త టెక్నాలజీ హైదరాబాద్ సహా ఆరు ఎయిర్ పోర్టుల్లో పైలట్ ప్రాజెక్టుగా .. • ప్రతిపాదనలు సిద్ధం చేసిన సీఐఎస్ఎఫ్ ఎయిర్పోర్టులో కెమెరా ముందు నిలబడితే చాలు .. ఆ వ్యక్తి గత చరిత్ర మొత్తం బయటకు వచ్చేలా కేంద్రం కొత్త వ్యవస్థను అందుబాటులోకి రాబోతున్నది . ఉగ్రవాదులు , లుక్ ఔట్ నోటీసులున్న నిందితులు దేశం దాటి పోకుండా , దేశంలోకి అడుగుపెట్టకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతను విమానాశ్రయాల్లో తీసుకురాబోతున్నారు . ఇందుకోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( సీఐఎస్ఎఫ్ ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది . ప్రస్తుతం ప్రయాణికుల సౌకర్యం కోసం వినియోగిస్తున్న డిజి యాత్ర ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయనున్నారు . ఉగ్రవాద అనుమానితులు , పరారీలో ఉన్న నేరస్థులు , లుక్అవుట్ సర్క్యులర్ ఉన్న వ్యక్తులను రియల్టైమ్లో గుర్తించేలా తీర్చిదిద్దాలని యోచిస్తోంది.ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రధాన ఏమిటి డిజి యాత్ర యాప్ ? ఇప్పటి వరకు ఎలా పనిచేస్తోంది ? 5 ప్రస్తుతం ఈ యాప్ లో ప్రయాణికుడు యాప్లో నమోదు చేసుకుని , ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాన్ని ధృవీకరించి , బోర్డింగ్ పాస్ను అప్లోడ్ చేస్తారు . విమానాశ్రయ ప్రవేశ ద్వారంలో కెమెరా ముఖాన్ని గుర్తించి , బోర్డింగ్ వివరాలతో సరిపోల్చి ఆటోమేటిక్గా ప్రవేశానికి అనుమతి ఇస్తుంది . ఈ విధానం వల్ల చెక్ - ఇన్ సమయం తగ్గడం , సీఐఎస్ఎఫ్ తనిఖీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరాయి . విమానాశ్రయాల్లో అమల్లో ఉన్న డిజి యాత్ర వ్యవస్థను కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయనున్నారు . 2018 లో కేంద్ర పౌర విమానయాన శాఖ డిజి యాత్ర యాప్ ప్రారంభించింది . ప్రయాణికులకు పేపర్ లెస్ సేవలు అందించడం .. సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యాప్ ను తీసుకొచ్చింది . ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి బోర్డింగ్ వరకు ఎలాంటి ఐడీ కార్డులు చూపకుండా కేవలం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికత ఉపయోగించేలా రూపొందించారు . 2022 డిసెంబరులో ఢిల్లీ , బెంగళూరు , వారణాసి విమానాశ్రయాల్లో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం హైదరాబాద్ , చెన్నై , కోల్కతా , పుణే , విజయవాడ సహా 24 కు పైగా విమానాశ్రయాలకు విస్తరించింది . 2025 నాటికి 55 లక్షలకుపైగా మంది యాప్ను డౌన్లోడ్ చేసుకోగా , సుమారు మూడు కోట్ల మంది ఈ సేవను వినియోగించారు . జాతీయ భద్రతా కోసం డిజి యాత్ర యాప్ ను కేవలం ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే కాకుండా జాతీయ భద్రతా వ్యవస్థలో భాగంగా మార్చాలని సీఐఎస్ఎఫ్ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది . ఇందుకోసం ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా సేకరించే చిత్రాలను నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తో అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది . దీంతో ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే జాతీయ డేటాబేస్ లోని వివరాలతో సరిపోల్చి ఉగ్రవాద అనుమానితులు , పరారీలో ఉన్న నేరస్థులు , లుక్ అవుట్ సర్క్యులర్ ఉన్న వ్యక్తులు , నకిలీ గుర్తింపులతో ప్రయాణించే వారిని సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది .. ఆరు విమానాశ్రయాల్లోనే తొలి దశ మొదట ఢిల్లీ , ముంబయి , బెంగళూరు , ఏమిటీ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ? 2008 ముంబయి ఉగ్రదాడుల అనంతరం కేంద్రం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ను స్థాపించింది . ఈ సంస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నది . ఇందులో ఆధార్ , పాస్పోర్ట్ , ఇమ్మిగ్రేషన్ రికార్డులు , విమాన , రైల్వే ప్రయాణ వివరాలు , బ్యాంకింగ్ సమాచారం , వాహనాల నమోదు , ఫాస్టాగ్ , టెలికాం మెటాడేటా , నేర రికార్డులు తదితరు పలు డేటాబేస్లు అనుసంధానమై ఉన్నాయి . అవసరమైనప్పుడు దర్యాప్తు , నిఘా సంస్థలు ఈ సమాచారాన్ని వినియోగిస్తాయి . హైదరాబాద్ , చెన్నై , కోల్కతా విమానాశ్రయాల్లో ఈ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సీఐఎస్ఎఫ్ ప్రతిపాదించింది . ప్రతి సీసీటీవీ కెమెరాకు ఈ సాఫ్ట్వేర్ను అమర్చకుండా . ప్రధానంగా ప్రవేశ , నిష్క్రమణ ప్రాంతాల్లో మాత్రమే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది . గోప్యతపై ఆందోళనలు ఈ ప్రతిపాదనపై పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . సామూహిక నిఘా , బయోమెట్రిక్ డేటా భద్రత , నిర్దోషులను పొరపాటున అనుమానితులుగా గుర్తించే ప్రమాదం వంటి అంశాలపై స్పష్టమైన విధానాలు అవసరమని పేర్కొంటున్నాయి . ప్రయాణికుల బయోమెట్రిక్ సమాచారాన్ని శాశ్వతంగా నిల్వ చేయబోమని , ప్రయాణం పూర్తైన తర్వాత నిర్దిష్ట వ్యవధిలో తొలగిస్తామని డిజి యాత్ర అధికారులు మాత్రం చెబుతున్నారు . ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రణాళిక దశలోనే ఉంది . కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది . Kalam Main Wed , 24 June 2026 - ShareChat