జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ
* పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు
* ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక ప్రణాళిక అవసరం
* మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు
* మునికూడలి పుష్కర ఘాట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతాం
* మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ గా నామకరణం
* దేశంలోనే మొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలి
* గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ తపన. ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం. పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరిలోకి కలవడకుండా చర్యలు తీసుకోవాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలుగా తీర్చేదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేయాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై శనివారం గోదావరి పుష్కరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... ‘‘గోదావరి పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ ల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ముఖ్యంగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇందుకు అనుగుణంగా పని చేయండి. పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలను మార్చుకునే గదులు, జల్లు స్నానాలు, రోడ్లు, డ్రైయిన్లు, ఆలయాలు, ఇతర ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండేలా చూడండి. వాహనాల నిలుపుదలకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రత్యేకంగా ఇవ్వండి. ఏ ప్రాంతం వైపు నుంచి వచ్చే వారు ఆ ప్రాంతంలోనే స్నానాలను ఆచరించి వెళ్లేలా చూడండి. ఘాట్ వెడల్పు, వచ్చే జనంపై ముందస్తు అంచనా అనేది చాలా ముఖ్యం. అవసరం అయితే వచ్చే భక్తులను బట్టి ఘాట్ వెడల్పు పెంచుకునే వెసులుబాటును ముందస్తుగానే ఉంచుకోండి.
పంచాయతీల నుంచి చుక్క మురుగు నీరు గోదావరిలో కలవకూడదు
గోదావరిలోకి మురుగు నీరు కలవకుండా పక్కా చర్యలు తీసుకోవాలి. పంచాయతీల మురుగు నీటి వ్యవస్థను సరిదిద్దాలి. పుష్కరాలకు సంబంధించిన పంచాయతీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైయిన్ల ద్వారా మురుగు నీటిని సమూలంగా అరికట్టేలా పంచాయతీలవారీగా ప్రణాళికను సిద్ధం చేయండి. గోదావరిలోకి పంచాయతీల నుంచి చుక్క మురుగునీరు కూడా రాకుండా చేయాలి. దీనికి సంబంధించి ఏ పనులు చేయాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అనే ప్రణాళికను వెంటనే చూసుకోవాలి. ప్రధాన ఘాట్లలో గోదావరికి హారతి కార్యక్రమం గురించి దేవాదాయ శాఖను సమన్వయం చేసుకొని ఆలయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయండి. మ్యాజిక్ డ్రైన్ల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీల్లో మురుగు నీరు కనిపించకుండా ఈ డ్రైన్లు చేస్తున్నాయి.
మునికూడలి ఘాట్ జాతీయ స్థాయి మోడల్ కావాలి
సీతానగరం వద్ద ఉన్న మునికూడలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ పేరిట తీర్చిదిద్దాలి.
80 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఘాట్ లో 75 వేల మంది పుష్కర స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ఘాట్ వద్ద అవసరం అయిన అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయండి. పార్కింగ్ కోసం రైతుల పొలాలను ఉపయోగించినా, మట్టి తీసినా పార్కింగ్ ఫీజులో వారికి వాటా ఇచ్చేలా ప్లాన్ చేయండి. వారి అనుమతి తీసుకొని పుష్కరాలకు వారి సహాయసహకారాలతోనే ముందుకు వెళ్దాం. ఈ ఘాట్ వద్ద సోమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలున్నాయి. వీటిని ఆధునీకరించే పనులు వేగవంతం చేయండి. నేను ఈ నెలలో జరగనున్న కేబినెట్ సమావేశం తర్వాత మునికూడలి ఘాట్ ను సందర్శిస్తాను. చేయాల్సిన పనులను స్వయంగా పరిశీలిస్తాను. సమష్టిగా పనిచేసి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఓఎస్డీ శ్రీ వెంకటకృష్ణ ఉన్నారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే


