
JanaSena Party Telangana
@jsp_telangana_updates
https://www.youtube.com/@janasenapartytelanganapk
సొంత అన్న లేని లోటు తీర్చిన పవన్ అన్న - శ్రీ నారా లోకేష్ !
#🟡నారా లోకేష్ #🟥జనసేన #😎మా నాయకుడు గ్రేట్✊ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😥ఎమోషనల్ స్టేటస్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు ,కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూటమి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చారిత్రక తీర్పును ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఓటరుకు, రైతుకు, నాయకుడికి, కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల జీవితాలకు దగ్గరగా ఉండే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. నవ భారత నిర్మాణంలో పంచాయతీల పాత్రను వివరించారు. భావితరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడమే కూటమి ప్రభుత్వ సమష్టి బాధ్యత అని తెలిపారు.
#pawankalyan #Chandrababu
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🗞పాలిటిక్స్ టుడే
భారత ప్రధాన మంత్రిగా 12 వసంతాలు పూర్తి చేసుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,399 రోజుల పాటు సుదీర్ఘంగా దేశానికి సేవలందించిన ప్రధానిగా శ్రీ @narendramodi గారు చరిత్ర సృష్టించిన సందర్భంగా, @BJP4India జాతీయాధ్యక్షులు శ్రీ @NitinNabin గారి అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన NDA సమావేశంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను అభినందిస్తూ, ఆయనను ఘనంగా సత్కరించారు.
#12YearsOfSeva #ViksitBharat2047
#LongestServingElectedPMModi
#✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలపై అధికారులు, కార్మికులను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణం అని కార్మికులు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నిర్వహణా లోపాలే తమ తోటివారి ఉసురు తీశాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు ఉన్నారు.
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🏛️రాజకీయాలు #🔊తెలుగు చాట్రూమ్😍 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకు సంబంధించి, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
#VizagSteelPlant #Visakhapatnam
#🟥జనసేన #✋బీజేపీ🌷 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😥ఎమోషనల్ స్టేటస్ #I ♥ my family
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు
జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ
* పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు
* ప్రతి పంచాయతీలోనూ ప్రత్యేక ప్రణాళిక అవసరం
* మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు
* మునికూడలి పుష్కర ఘాట్ ను మోడల్ గా తీర్చిదిద్దుతాం
* మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ గా నామకరణం
* దేశంలోనే మొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలి నిలవాలి
* గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై సమీక్ష చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ తపన. ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం. పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరిలోకి కలవడకుండా చర్యలు తీసుకోవాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలుగా తీర్చేదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేయాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై శనివారం గోదావరి పుష్కరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... ‘‘గోదావరి పుష్కర ఘాట్లు, పుష్కర నగర్ ల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ముఖ్యంగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇందుకు అనుగుణంగా పని చేయండి. పుష్కర నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలను మార్చుకునే గదులు, జల్లు స్నానాలు, రోడ్లు, డ్రైయిన్లు, ఆలయాలు, ఇతర ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండేలా చూడండి. వాహనాల నిలుపుదలకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రత్యేకంగా ఇవ్వండి. ఏ ప్రాంతం వైపు నుంచి వచ్చే వారు ఆ ప్రాంతంలోనే స్నానాలను ఆచరించి వెళ్లేలా చూడండి. ఘాట్ వెడల్పు, వచ్చే జనంపై ముందస్తు అంచనా అనేది చాలా ముఖ్యం. అవసరం అయితే వచ్చే భక్తులను బట్టి ఘాట్ వెడల్పు పెంచుకునే వెసులుబాటును ముందస్తుగానే ఉంచుకోండి.
పంచాయతీల నుంచి చుక్క మురుగు నీరు గోదావరిలో కలవకూడదు
గోదావరిలోకి మురుగు నీరు కలవకుండా పక్కా చర్యలు తీసుకోవాలి. పంచాయతీల మురుగు నీటి వ్యవస్థను సరిదిద్దాలి. పుష్కరాలకు సంబంధించిన పంచాయతీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైయిన్ల ద్వారా మురుగు నీటిని సమూలంగా అరికట్టేలా పంచాయతీలవారీగా ప్రణాళికను సిద్ధం చేయండి. గోదావరిలోకి పంచాయతీల నుంచి చుక్క మురుగునీరు కూడా రాకుండా చేయాలి. దీనికి సంబంధించి ఏ పనులు చేయాలి..? ఎంత ఖర్చు అవుతుంది..? అనే ప్రణాళికను వెంటనే చూసుకోవాలి. ప్రధాన ఘాట్లలో గోదావరికి హారతి కార్యక్రమం గురించి దేవాదాయ శాఖను సమన్వయం చేసుకొని ఆలయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయండి. మ్యాజిక్ డ్రైన్ల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీల్లో మురుగు నీరు కనిపించకుండా ఈ డ్రైన్లు చేస్తున్నాయి.
మునికూడలి ఘాట్ జాతీయ స్థాయి మోడల్ కావాలి
సీతానగరం వద్ద ఉన్న మునికూడలి ఘాట్ ను జాతీయ స్థాయి మోడల్ ఘాట్ గా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. మునికూడలి ఘాట్ కి సప్తర్షి పుష్కర్ ఘాట్ పేరిట తీర్చిదిద్దాలి.
80 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఘాట్ లో 75 వేల మంది పుష్కర స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ఘాట్ వద్ద అవసరం అయిన అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయండి. పార్కింగ్ కోసం రైతుల పొలాలను ఉపయోగించినా, మట్టి తీసినా పార్కింగ్ ఫీజులో వారికి వాటా ఇచ్చేలా ప్లాన్ చేయండి. వారి అనుమతి తీసుకొని పుష్కరాలకు వారి సహాయసహకారాలతోనే ముందుకు వెళ్దాం. ఈ ఘాట్ వద్ద సోమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలున్నాయి. వీటిని ఆధునీకరించే పనులు వేగవంతం చేయండి. నేను ఈ నెలలో జరగనున్న కేబినెట్ సమావేశం తర్వాత మునికూడలి ఘాట్ ను సందర్శిస్తాను. చేయాల్సిన పనులను స్వయంగా పరిశీలిస్తాను. సమష్టిగా పనిచేసి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఓఎస్డీ శ్రీ వెంకటకృష్ణ ఉన్నారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం
* మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ @PawanKalyan గారు
* డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు.
•ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్
అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
•కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ
అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పీసీసీఎఫ్ శ్రీ పీవీ చలపతిరావు గారు, అటవీశాఖ సలహాదారుడు శ్రీ మల్లికార్జునరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, మైలవరం ఇంఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన రావు గారు తదితరులు పాల్గొన్నారు.
#WorldEnvironmentDay
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🌻🌷పూల మొక్కలు🌼🌻 #🌳నేచర్ ఫోటోగ్రఫీ📷 #📸 వీధి ఫోటోగ్రఫీ
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🌲పచ్చని చెట్లు🌲 #🌻🌷పూల మొక్కలు🌼🌻 #🏞 ప్రకృతి అందాలు
2 Years for the Carnage!
#GameChangerPK
#PawanKalyanAneNenu
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔊షేర్చాట్ చాట్రూమ్😍 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్








