*_22/04/2026 - వైశాఖ శుద్ధ పంచమి - శ్రీ రామానుజాచార్య జయంతి_*
*శ్రీ రామానుజాచార్యులు 1017వ సంవత్సరంలో శ్రీపెరంబదూరులో కేశవ సోమయాజి, కాంతిమతి దంపతులకు జన్మించారు. రామానుజ అంటే రాముని అనుజుడు (తమ్ముడు) లక్ష్మణుడు. దీనితో లక్ష్మణుడు రామానుజాచార్యులుగా అవతరించినట్లు ప్రతీతి. రామాయణంలో ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతారం పొందినట్లు ఐతిహ్యం. రామానుజాచార్యులు వైష్ణవతత్వం సిద్ధాంతాన్నిప్రవచించారు. 11 వ శతాబ్దంలొ (1017లో జన్మించిన ఆచార్యులు 1137లో తన 120 వ ఏట శ్రీరంగంలో అదృశ్యమైనట్లు వివరాలు చెబుతున్నాయి*.
*ఏటా రామానుజుల జయంతి తమిళ సౌరపంచాంగం ప్రకారం జరుపుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 న ఆయన జయంతి జరుగనున్నది. వైశాఖ శుద్ద పక్షంలో ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజున రామానుజుల జయంతి జరుపుతారు. మద్రాసు నగరంలో (నేటి చెన్నయ్) తిరువళ్లిక్కేణిలో వెలసిన పార్థసారథి ఆలయం ప్రధాన దైవం పార్థసారథి స్వామి అనుగ్రహంతో పింగళ నామ సంవత్సరం చైత్రమాసం (తమిళుల) శుక్లపక్షంలో ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజున రామానుజాచార్యులు ( ఏప్రిల్ 4, 1017) జన్మించినట్లు వివరాలు చెబుతున్నాయి. రామానుజాచార్యులు జన్మించి వెయ్యేళ్లు పై చిలుకు సంవత్సరాలు గడిచాయి. ఎందరో రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అయితే రామానుజుల ప్రవచనాలు, సిద్ధంతాలు నేటికీ అమలులో ఉన్నది.*
*_సమానత్వ విగ్రహం:_*
*రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు చక్కగా జరుగనున్నాయి. 1017 లో జన్మించిన ఆచార్యులవారికి 2017లో సహస్రాబ్ది వేడుకలు జరపడానికి రంగం సిద్ధమయింది. హైదరాబాద్ శివార్లలోని షంషాబాద్ లో చిన్న జీయర్ స్వామి 50 ఎకరాల విస్తీర్ణంలో “స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ” పేరుతో సమానత్వ విగ్రహం నిర్మించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే కూర్చొని ఉన్నట్లు రూపొందించబడిన అతిపెద్ద (216అడుగుల ఎత్తు) విగ్రహం. ఇక్కడ 108 దివ్యదేశాల నమూనాలు ఉన్నాయి. దేవుని ఎదుట అందరూ సమానులే అని ప్రవచించిన తొలి ప్రవక్త రామానుజాచార్యులు కావడంతో ఆయన విగ్రహానికి సమానత్వ విగ్రహం అని పేరు పెట్టారు..*
*కర్నాటక లోని మేల్కోటెలో*,
*(తిరునారాయణపురం) తమిళనాడులో శ్రీరంగంలో, మరియు శ్రీపెరంబదూరులో రామానుజుల విగ్రహాలు నెలకొని ఉన్నాయి. ఆయన ఆదేశం మేరకు శిష్యులు ఈ విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రామానుజాచార్యులు ఈ విగ్రహాలను కౌగలించుకొని తన మహత్యాన్ని వాటిలో చొప్పించినట్లు ఐతిహ్యం ఉన్నది. ఈ మూడు విగ్రహాలను తనిగండ తిరుమెణి అని పేర్కొంటారు. ఆచార్యులవారు 120 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ విగ్రహాలు రూపొందాయి*.
*శ్రీపెరంబదూరులో అరుళ్ మిగు ఆది కేశవ పెరుమాళ్ మరియు శ్రీ బాష్యకార స్వామి ఆలయాలు నెలకొని ఉన్నాయి. కొన్ని విశిష్టమైన దినాలలో ఆచార్యులు భక్తులకు దర్శనం కల్పిస్తారని చెబుతారు*. *శ్రీపెరంబదూరు ఆలయంలో ప్రతిరోజూ పండుగ వేడుకే. భక్తులు తమ తలపై అనంతసరస్సు తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని రామానుజుల విగ్రహానికి అభిషేకం జరిపి నెయ్యి దీపాలు వెలిగిస్తారు*.
*సర్వమానవ సమానత్వమే ఆయన ఆశయం. ఆ రోజులలో సమాజంలో కరాళ నృత్యం చేస్తున్న అంటరానితనాన్ని ఆయన నిర్మూలించారు. దేవతార్చనలో, విగ్రహారాధనలో అందరికీ సమాన హక్కు ఉన్నదని చాటిచెప్పిన మహామనీషి ఆయన. రామానుజులు అస్పృశ్యులకు ఆలయ ప్రవేశం కల్పించారు*.
*ఆయన గురువు యామనాచార్యుల కోరిక మేరకు ఆచార్యులు వైష్ణవమతానికి ఆధిపత్యం వహించారు*. *రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. ఈ తత్వం మధ్వాచార్యుల ద్వైతం కంటే. ఆదిశంకరుల అద్వైతం కంటే విభిన్నమైనది. ఆయన అద్వైత సిద్ధాంతానికి దూరమై ఉపనిషత్తుల, బ్రహ్మసూత్రాలను మేళవించి భక్తితత్వాన్ని చాటిచెప్పారు* #మన సంప్రదాయాలు సమాచారం


