#ఇది ఏపీ ప్రభుత్వ అధికారుల తీరు ...
*ఓ తల్లి నదిలో మునిగిపోతున్న కొడుకును కాపాడుకువడానికి తన ప్రాణలను సైతం లెక్క చేయకుండా వడిలోనే కొడుకును గట్టిగా పట్టుకొని చేసిన కృషికి ఫలితం లేకుండానే తల్లి కొడుకు మృతి చెందారు.. అది అలా ఉంటే బాపట్లలో మాత్రం మరో తల్లి ఎర్రటి ఎండలో తన కొడుకును ఒడిలో పెట్టుకుని పట్టణంలో భిక్షాటన చేస్తూ పిల్లవాడిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది.. నదిలో మునిగిపోతున్న తల్లి కొడుకుని ఎటు తిరిగి కాపాడుకోలేకపోయారు.. బాపట్లలో ఓ తల్లి చిన్నారిని ఎర్రటి ఎండలో తిప్పుతూ భిక్షాటన చేస్తూ పిల్లవాడిని ఇబ్బందికి గురి చేస్తున్న బాపట్లలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ,బాలల సంరక్షణ అధికారులు ఏం చేస్తున్నారొ అర్థం కావడం లేదు... పాఠశాలలకు, స్కూలుకు,కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి చిన్నారుల సంరక్షణ కోసం మేము పనిచేస్తున్నాం, కృషి చేస్తున్నాం,మా త్యాగాలకు అవార్డులు వస్తున్నాయి అని డప్పు కొట్టుకుంటున్నారు కానీ ప్రధాన రహదారులలో చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తూ పిల్లలను ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు ప్రత్యేక డ్రైవ్ లు పెట్టి అటువంటి వారిని గుర్తించడం లేదో ప్రశ్నార్ధకంగా మారింది.. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలే జిల్లా ప్రధాన కేంద్రంలో కనిపిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ పిల్లలు కాదుగా అన్నట్టుగా నిర్లక్ష్యం వహించడం చిన్నారులకు శాపంగా మారింది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ప్రధాన రహదారుల్లో చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు అధికారులను కోరుతున్నారు.*


