ShareChat
click to see wallet page
search
బైక్ ప్రమాదానికి గురైన బోయపాటిని పరామర్శించిన టిడిపి నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డి.. బెస్తవారిపేట మండలం, పెంచికలపాడు సమీపంలో, అర్ధవీడు మండలం యాచవరం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బోయపాటి వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అతని కుడి చేయికీ ఫ్రాక్చర్ అవటంతో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి గారు తక్షణమే కంభం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బోయపాటిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు, చేయి ఫ్రాక్చర్ అవ్వటంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో, కృష్ణ కిషోర్ రెడ్డి గారు నరసరావుపేట ప్రముఖ వైద్యశాల అయినటువంటి అమూల్య హాస్పిటల్ అధినేత, ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారితో మాట్లాడి బోయపాటికి మెరుగైన వైద్యం అందించాలని వారిని కోరారు. ఎటువంటి అధైర్య పడొద్దని బోయపాటికీ దైర్యం చెప్పారు.. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
🏛️రాజకీయాలు - ShareChat