గంగమ్మ తల్లి జాతర సాక్షిగా :
గంగమ్మ తల్లి జాతర సాక్షిగా అందరికీ ఈ పేరు వినగానే ఏదో అనుకుంటున్నారు కదా.అది కొంచం వరకే నిజం. తిరుమల శ్రీవారికి చెల్లెలుగా విరాజిల్లుతున్న తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి.900 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన గంగమ్మ ఆలయం లో ఎక్కడ లేని వినూత్న సాంప్రదయంతో 8 రోజుల పాటు వివిధ రకాల వేషధారణలతో జాతర వైభవంగా సాగనుంది.
ఈ జాతర అత్యంత వైభవంగా జరుగనుంది. సాధారణంగా గ్రామదేవతలకు మూడురోజులు ఉత్సవం నిర్వహిస్తారు. కానీ తిరుపతి గంగజాతర మాత్రం ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ పక్కల గల రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.
పాతకాలంలోని జీవన శైలి, అప్పటి ఆచార వ్యవహారాలు, గ్రామదేవతలను ఏ విధంగా కొలిచే వారో ఇప్పటికీ అదే ఫాలో అవుతూ చేస్తారు ఈ ఉత్సవాలన్నీ ఈ కార్యక్రమంలో దేవదాయశాఖతో పాటు TTD, ప్రముకులు కూడా జాతరలో పాలుపంచుకుంటారు.
ఈ జాతర చరిత్ర....!
పూర్వం తిరుపతిని పాలేగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఓ పాలేగాడు అందమైన యువతులను బలాత్కరించేవాడు. స్త్రీ జాతిని రక్షించడానికి తిరుపతి నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాలకులంలో గంగమ్మగా జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. యుక్త వయస్సుకు వచ్చిన గంగమ్మపై పాలేగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడు. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. తనను అంతమొందించడానికి అవతరించిన గంగమ్మ అని తెలుసుకున్న పాలేగాడు పారిపోయి కనిపించకుండా దాక్కున్నాడు. పాలేగాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి గాలించింది. చివరికి గంగమ్మ దొరవేషం వేసుకోవడంతో..తన ప్రభువు వచ్చాడనుకుని పాలేగాడు బయటకు రాగానే తలనరికి సంహరించింది. ఈ దుష్టశిక్షణను తలుచుకుని ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలు జాతర చేస్తున్నారు.
టీటీడీ నుంచి సారె
తిరుపతి గంగమ్మ సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో శనివారం రోజున TTD నుంచి గంగమ్మకు సారెను అందిస్తారు. శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు, కుంకుమలు, శేషవస్త్రాలను గోవింద రాజ స్వామి వారి ఆలయానికి చేర్చుతారు. అక్కడ పూజలు చేసిన తరువాత టీటీడీ అధికారులు గంగమ్మ ఆలయం అధికారులకు అందజేస్తారు. అక్కడి నుంచి నగరంలో ఊరేగింపు గా ఆలయంలో తీసుకొస్తారు.
ఈ జాతర ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది ?
ఈ జాతర మొత్తం 09 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జాతరలో తొలి రోజు ఈనెల 05వ తేదీ మంగళవారం గంగమ్మ పుట్టినిల్లు అయిన అవిలాలలో జాతర నిర్వహిస్తారు. అక్కడ సాయంత్రం గ్రామం నుంచి పసుపు కుంకుమలు ఆలయ అధికారులకు అందజేస్తారు. అర్థరాత్రి సమయంలో తిరుపతి హద్దులు గా చెప్పే నాలుగు దిక్కుల్లో హద్దు వేసి జాతర ప్రారంభమైందని చాటింపు వేస్తారు. చాటు పెడితే గ్రామస్తులు పొలిమేర దాటి వెళ్లకూడదని ప్రతీతి. 06వ తేదీ బుధవారం భైరాగివేషం, 07వ తేదీ గురువారం బండ వేషం, 08వ తేదీ తోటి వేషంను కైకాల కులస్తులు, చాకలి కులస్తులు, భక్తులు వేస్తారు. 09వ తేదీ దొర వేషం, 10న మాతంగి వేషం, 11న సున్నపు కుండలను కైకాల కులస్తులు, చాకలి కులస్తులు మాత్రమే వేస్తారు. 12న సప్పరాలు, గంగజాతర జరుగుతుంది. ఆ రోజున పురుషులు ఆడ వేషంలో కనిపిస్తారు. 13న వేకువజామున గంగమ్మ విశ్వరూపం ఏర్పాటు చేసి చెంప నరకడంతో జాతర ముగుస్తుంది. గంగమ్మ విశ్వరూపం నుంచి వచ్చే మట్టిని ఇంట్లో పెట్టుకుని అనారోగ్యంతో ఉన్నప్పుడు నీటిలో కలిపి తాగితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🪔తాతయ్యగుంట గంగమ్మ తల్లి...🙏 #🙏తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి🕉️🚩


