కిషోర్ గునుకుల
33.33% రిజర్వేషన్ నిర్ణయం సామాజిక న్యాయానికి బలమైన అడుగు
JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారి ఆశయాలకు అనుగుణంగా నిర్ణయం: #KishoreGunukula
నెల్లూరు, ఆగస్టు 26: ప్రతి వర్గానికి సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించాలన్న జనసేన అధినేత శ్రీ #PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా బీసీలకు 33.33% రిజర్వేషన్ కల్పించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం, అన్ని వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. బీసీలకు రాజకీయంగా, సామాజికంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
“ప్రతి వర్గానికి సముచిత ప్రాతినిధ్యం, సమాన అవకాశాలు కల్పించాలన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ నిర్ణయం సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం జనసేన పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది” అని కిషోర్ గునుకుల తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు Deputy CMO, Andhra Pradesh శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
బీసీలకు మరిన్ని అవకాశాలు, సముచిత ప్రాతినిధ్యం లభించేలా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కిషోర్ గునుకుల ఆకాంక్షించారు.
Naga Babu Nadendla Manohar JanaSena Shatagni Bommidi Nayakar
#PawanKalyanAneNenu #Andhrapradesh #Nellorecity
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే #🟥జనసేన