తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
ShareChat
click to see wallet page
@111141297
111141297
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
@111141297
TRRS
*ఫెడరేషన్ చైర్మన్ ను నియామకంపై కాలయాపన తగదన్న గోపి రజక* ▪️ రజకులను కార్మికులుగా గుర్తించాలన్న సంగెం రమేష్ ▪️102 జీవోను అమలు చేయాలన్న నార్లగిరి కుమారస్వామి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 సం.లు కావస్తున్నా రజక ఫెడరేషన్ ఏర్పాటు చేయకపోవడంతో రజకుల అభివృద్ధి కుంటుపడిందని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ ఆవేదన వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రభుత్వం అతిధి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ అధ్యక్షతన 29-4-2026 బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, తెలంగాణ రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఇల్లందుల సాంబయ్య,ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగిరి కుమారస్వామి హాజరై మాట్లాడుతూ తక్షణమే రజక ఫెడరేషన్ చైర్మన్ ను ఏర్పాటు చేసి 15 మంది డైరెక్టర్లను నియమించి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. కులవృత్తిదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, 141 మున్సిపాలిటీల్లో అధునాతన ధోభీఘాట్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం 102 జీవో ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో దోభీ కాంట్రాక్టు రజకులకే కేటాయించాలని,45 సం.లు నిండిన వృత్తిదారుడికి ఫించన్ ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి జాలిగపు దుర్గయ్య,చెన్నరావుపేట పెద్దమనిషి చాపర్తి రాజు, ప్రధాన కార్యదర్శి ఉప్పుల వీరాస్వామి,అమినాబాద్ అధ్యక్షులు నీలగిరి రవి, పెద్దమనిషి దూదిగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
#సర్పంచ్_బందేయ్య_రజకపై హత్యాయత్నం చేసిన రాంరెడ్డిని అరెస్ట్ చేయాలి* ▪️ #లీమ్స్_హాస్పిటల్లో_బందేయ్యను_పరామర్శించిన #NDRS & #TRRS నాయకులు ▪️ #ACP , #SI లతో ఫోన్లో మాట్లాడిన #గోపి_రజక ▪️ #మీడియాతో_మాట్లాడిన #నడిమింటి_శ్రీనివాస్, #గోపి_రజక *రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లీమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న* చౌదరి గూడెం మండలం *ఎలుక గూడెం గ్రామ సర్పంచ్ బందేయ్యను* 28-4-2026 మంగళవారం హాస్పిటల్లో కలిసి *ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న* నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ *నడిమింటి శ్రీనివాస్*, రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక*, రాష్ట్ర అధికార ప్రతినిధి *ముత్యాల నర్సింగరావు* , రంగారెడ్డి జిల్లా కార్యదర్శి *శ్రీశైలం*.అనంతరం *నడిమింటి శ్రీనివాస్ స్పందిస్తూ* ప్రక్క ఊరికి చెందిన నలుగురు బందేయ్యపై దాడి చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఇద్దరినీ మాత్రమే అరెస్టు చేసి మిగత ఇద్దరినీ ప్రధానంగా మాజీ సర్పంచ్ రాంరెడ్డిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాసంక్షేమ ప్రభుత్వంలో సర్పంచ్ లకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏలా ఉంటుందో చెప్పనక్కర్లేదు అని ఆవేదన వ్యక్తంచేశారు. రాంరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి అత్యాయత్నం కేసు పెట్టాలని నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తుంది. కేసును తప్పుదోవ పట్టిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసును త్వరితగతిన పూర్తి చేయాలని ACP ,SI లను కోరారు.సర్పంచ్ బందేయ్య గారిపై జరిగిన దాడి విషయం తెలుసుకొని వెంటనే స్పందించి వారిని హాస్పిటల్లో చేర్పించినందుకు *షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారికి ధన్యవాదాలు*. అదేవిధంగా దోషులకు కఠినంగా శిక్ష పడేవరకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కోరారు. #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - 05 05 - ShareChat
*తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ బండి సదానందం నియామకం* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బండి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర కమిటి సమావేశంలో అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మణ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బండి సదానందం మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి జిల్లా అధ్యక్షులుగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రజకుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కాగా నియామకానికి సహకరించిన రాష్ట్ర బాధ్యులకు, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదునూరి వీరన్న, ఈస్ట్ జోన్ కన్వీనర్ నార్లగారి కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంగెం రమేష్ తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం  ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . {roe 99 Doe @೮೦ಗಾಣ' శధ్వర్యంలో . ನಜ0' మీజిలగ్లె (చాకలి] అభ్యిర్ధథుం  ০০ট ٨٥٥٥5 స్మెంటర్లకు . - ShareChat
*ఎస్సీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న గోపి రజక* ➖ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ▪️ రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న జిల్లా ఉపాధ్యక్షురాలు సిహెచ్ లలిత దేశవ్యాప్తంగా ఒకే కులవృత్తి చేసే రజకులకు భిన్న రిజర్వేషన్లు తగదని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడకుండ మిగతా 11 రాష్ట్రాలను తక్షణమే ఎస్సీలో చేర్చాలని *గోపి రజక* డిమాండ్ చేశారు. *వికారాబాద్ జిల్లా కోడంగల్ మండలం పర్సాపూర్* తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షురాలు *చాకలి లలిత* అధ్యక్షతన 26-4-2026 ఆదివారం ఏర్పాటు చేసిన మండల నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు *గోపి రజక* హాజరై మాట్లాడుతూ దశాబ్దాలుగా రజక నాయకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటాలు చేస్తున్న పోరాటాలను గుర్తించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2016లో *ఏనుముల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో , డీకే అరుణ 2023 ఎలక్షన్ సమయంలో, లోకేష్ యువగళం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు,శాసన మండలిలో కల్వకుంట్ల కవిత,జోడో పాదయాత్రలో రాహుల్ గాంధీ , లోక్ సభలో రెండు సార్లు ఎంపీలు దోబీలను ఎస్సీలో చేర్చాలని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు వివిధ సందర్భాలలో మాట్లాడటం జరిగింది*. కానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యాక ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని మాట్లాడకుండా మరుగున పడేయడం రజకులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం, వృత్తిదారుల సమస్యలను గాలికి వదిలేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లను ఈ ప్రభుత్వం చేయకుండా అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు *అన్నారం సాయిలు*, జిల్లా మహిళా అధ్యక్షురాలు *లక్ష్మీ* , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ *సిహెచ్ అశోక్* , జిల్లా ఉపాధ్యక్షులు *రావులపల్లి బాలప్ప, దౌల్తాబాద్ గడ్డమీద వెంకటప్ప, బిచ్చాల్ సిహెచ్ మొగులప్ప*, కోడంగల్ మండల అధ్యక్షులు *మొగులయ్య* తదితరులు పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు
🏛️రాజకీయాలు - ر 33 ದಿಯ್  ر 33 ದಿಯ್ - ShareChat