Madhubabu to
ShareChat
click to see wallet page
@2214663664
2214663664
Madhubabu to
@2214663664
ఐ లవ్ షేర్ చాట్
#📀యేసయ్య కీర్తనలు🎙
📀యేసయ్య కీర్తనలు🎙 - కోటిరూపాయలు ఇచ్చినా నేనూచేయను [క్రీస్తు ప్రేమను బట్టెనేను ఇది చేస్తునెర్నైను. ವಾಝ್ದುಗಾರು | 1950లలోజరిగిన సంఘటన ఇది నరసాపురం లెప్రసీహాస్పిటలను ఇన్సపెక్షన్ చేయదానికి హైదరాబాద్లోని డైరెక్టర్ ఫర్ మెడికల్సైన్సెస్నుండి లధికారులు వచ్చారు 6 సమయంలో దాక్టర్ షార్టుగారు OP క్లినిక్కు వచ్ినవారి కాళ్లకి ఉన్నపుండ్లు శుభ్రం చేసిద్రెస్సింగ్ చేస్తున్నారు రోగికాలు కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వస్తుంది పుంద్లనుండి చీములు, పురుగులు పడుతున్నాయి పాదైపోయిన కాలివేళ్ల 'రాలిపోతున్నాయి దాక్టర్ షార్టుగారు ఓపిగ్గా తాలూకు ఎముకలు సున్నితంగా కట్టుకడుతున్నారు 'సమయంలో ఇన్స్పెక్షన్కు వచ్చిన అధికారులు ఈ దృశ్యం వెనుక నుండి చూసి నిర్ధాంతపోయారు: "కోటిరూపాయలు ఇచ్చినా నేనుమీరుచేస్తున్నపని చేయలేను" అన్నారు ఆ అధికారి దానికి దాక్టర్ షార్టుగారు బదులిస్తూ "కోటిరూపాయలిచ్చినానేనూ చేయను అయితే క్రీస్తు; నన్నుతొందర చేస్తున్నదానినిబట్టినాకు ) ನಿಎಂಲ್ಲು ' అన్నారు రదినాల్లో 550 మంది 'Save. ದಂಡನಾರು ನಶಚಿ5ಲ: తప్పదం లేదు' ಅಭ5 ಕೂಅಂ , అందులో | OQ క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము ನಿಕ್ಟಿಯಂ ` KMY ವೆಯುಮನ್ನದಿ ` 2 &808 5:14 జోబ్సుదర్శన్ Dಖalus 1783 కోటిరూపాయలు ఇచ్చినా నేనూచేయను [క్రీస్తు ప్రేమను బట్టెనేను ఇది చేస్తునెర్నైను. ವಾಝ್ದುಗಾರು | 1950లలోజరిగిన సంఘటన ఇది నరసాపురం లెప్రసీహాస్పిటలను ఇన్సపెక్షన్ చేయదానికి హైదరాబాద్లోని డైరెక్టర్ ఫర్ మెడికల్సైన్సెస్నుండి లధికారులు వచ్చారు 6 సమయంలో దాక్టర్ షార్టుగారు OP క్లినిక్కు వచ్ినవారి కాళ్లకి ఉన్నపుండ్లు శుభ్రం చేసిద్రెస్సింగ్ చేస్తున్నారు రోగికాలు కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వస్తుంది పుంద్లనుండి చీములు, పురుగులు పడుతున్నాయి పాదైపోయిన కాలివేళ్ల 'రాలిపోతున్నాయి దాక్టర్ షార్టుగారు ఓపిగ్గా తాలూకు ఎముకలు సున్నితంగా కట్టుకడుతున్నారు 'సమయంలో ఇన్స్పెక్షన్కు వచ్చిన అధికారులు ఈ దృశ్యం వెనుక నుండి చూసి నిర్ధాంతపోయారు: "కోటిరూపాయలు ఇచ్చినా నేనుమీరుచేస్తున్నపని చేయలేను" అన్నారు ఆ అధికారి దానికి దాక్టర్ షార్టుగారు బదులిస్తూ "కోటిరూపాయలిచ్చినానేనూ చేయను అయితే క్రీస్తు; నన్నుతొందర చేస్తున్నదానినిబట్టినాకు ) ನಿಎಂಲ್ಲು ' అన్నారు రదినాల్లో 550 మంది 'Save. ದಂಡನಾರು ನಶಚಿ5ಲ: తప్పదం లేదు' ಅಭ5 ಕೂಅಂ , అందులో | OQ క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము ನಿಕ್ಟಿಯಂ ` KMY ವೆಯುಮನ್ನದಿ ` 2 &808 5:14 జోబ్సుదర్శన్ Dಖalus 1783 - ShareChat
*🪹యెషయా🪹* *(📜ప్రవచనము💝)* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *యెషయా గ్రంథం గురించి షార్ట్ మెసేజ్ లో పూర్తి వివరణ👇ఈ వ్రంధములో బైబిల్ మొత్తం మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చదవండి షేర్🙏చేయండి🤝* *1️⃣ఎవరు వ్రాశారు:* యెషయా *2️⃣ఎప్పుడు వ్రాశారు* : క్రీ॥పూ॥ 739-681 సం॥లలో *3️⃣ఏది మూల వాక్యము* : మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5) *4️⃣ఏది మూల పదం* : దేవుని ప్రజలు సమకూర్చబడుట, రక్షణ వాగ్దానం. *5️⃣ఎవరు ముఖ్యమైన వ్యక్తి* : యెషయా *6️⃣ఏమిటి యెషయా అనే పేరుకు అర్థం* : యెహోవాయే నా రక్షకుడు/దేవుడే రక్షణ *7️⃣ఎందుకు వ్రాశారు?* అష్షూరీయులు తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యములను స్వాధీనం చేసుకుంటూ ఇశ్రాయేలు మీదికి కూడా దండెత్తి క్రీ॥పూ॥ 720 సం॥లో సంపూర్తిగా తమ స్వాధీనం చేసుకొనిరి. ఆ సమయంలోనే అధిక భాగము జనులను వారు చెరగొనిపోయారు. ఇశ్రాయేలీయుల పతనము తరువాత యూదారాజ్యమునకు కూడా దేవుని తీర్పు జరుగునని, జనులు దేవునివైపు తిరిగితే మెస్సీయా ద్వారా రక్షణ కలుగునని, అందుకు దేవునియందు కలిగియుండవలసిన విశ్వాసము గురించిన సంగతుల గూర్చి యెషయా ఈ గ్రంథములో లిఖించెను. పద్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్యం వర్ధిల్లుతున్నప్పుడు వ్రాయబడ్డాయి. కానీ ప్రవక్తల గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజలు దుర్భర దుస్థితిలో ఉన్నప్పుడు వ్రాయబడెను. ఇశ్రాయేలు ప్రజలు దుస్థితిలో ఉన్నప్పుడు వారిని ఉద్దరించడానికి, ఉజ్జీవింపజేయడానికి దేవుడు ప్రవక్తలను పంపెను. "అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను, వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి" *2 రాజులు 17:13,14.* నూతన నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చెను అనే మాట పలుమార్లు మనం చూస్తాం. దేవుడు చేసిన నిబంధనను మీరి జీవిస్తున్న తన ప్రజలను బహు ధైర్యముతో హెచ్చరిక చేయుటకు దేవుడు యెషయాను ప్రవక్తగా ఏర్పర్చుకొనెను. వారిలో నలుగురు పెద్ద ప్రవక్తలుగా, 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిరి. వారి పరిచర్య కాలము, గ్రంథాలను బట్టే పెద్ద, చిన్న అనే పేరు వచ్చెను. *8️⃣ఏమి సూచిస్తుంది?* ప్రభువైన యేసుక్రీస్తును వధకు తేబడిన గొర్రెగా, మహిమపరచబడిన సేవకునిగా, సమాధానకర్తగా, మెస్సీయగా ఈ గ్రంథము సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య 66. ఈ యెషయా గ్రంథములో ఉన్న మొత్తం అధ్యాయాల సంఖ్య కూడా 66. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ధర్మశాస్త్రము గూర్చి, ధర్మశాస్త్రమును మీరినటువంటివారు పొందుకునే శిక్ష గూర్చి తెలియజేస్తే ఈ యెషయా గ్రంథంలోని *మొదటి 39 అధ్యాయములు 'దేవుని తీర్పు' శిక్షను గూర్చి తెలియజేస్తాయి.* *క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు దేవుని ప్రేమను గూర్చి, దేవుని కృపను గూర్చి, దేవుని క్షమను గూర్చి తెలియజేస్తే అదే రీతిగా యెషయా గ్రంథంలోని రెండవ భాగమైన 27 అధ్యాయములు దేవుని ప్రేమ, క్షమ, కనికరమును గూర్చి వ్రాయబడెను.* ప్రవక్తల కాలము 500 సం॥రాలు (క్రీ॥పూ॥ 950-450 వరకు) *9️⃣యెషయా ప్రవక్తగా ఉన్న కాలం...* . *(యెషయా 1:1)* 💥*ఉజ్జియా* . క్రీ॥పూ॥ 790-739 సం|| వరకు *💥యోతాము* . క్రీ॥పూ॥ 739-731 సం॥ వరకు *💥ఆహాజు* . క్రీ॥పూ॥ 731-715 సం॥ వరకు *💥హిజ్కియా* . క్రీ॥పూ॥ 715-686 సం॥ వరకు *🔟యెషయా అద్భుతమైన ప్రవక్త👇* *1.పశ్చాత్తాపం* (యెషయా 6:5) *2.పరిశుద్ధపరచబడడం* యెషయా 6:5 *3.పరిచర్యకు సిద్ధం* (యెషయా 6:8) *4.పంపించడం* (యెషయా 6:9) *5.ప్రార్ధించడం* (2దిన 32:20) యెషయా సుమారు 60 సం॥లు ప్రవక్తగా పనిచేశాడు. పైన తెలుపబడిన ఈ నలుగురు రాజుల పరిపాలనా కాలంలో యెషయా ప్రవక్తగా ఉంటూ రాజులను, ప్రజలను సరిచేస్తూ, హెచ్చరిస్తూ, దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు. తనకివ్వబడిన బాధ్యతలు అద్భుతముగా నిర్వహించాడు. యెషయా ప్రవక్తగా తాను పనిచేస్తున్న ఆ రోజుల్లో హోషేయ, మీకా సమకాలీన ప్రవక్తలుగా ఉండేవారు. *💥యెషయా ప్రసంగ సారాంశము:💥* “యెహోవాయే మా రక్షణ". కొన్ని అధ్యాయాల్లో దేవుని తీర్పు, ఉగ్రతను గూర్చి, ధర్మశాస్త్రము, శిక్షను గూర్చి వ్రాయబడ్డాయి. అదే సమయంలో దేవుని రక్షణ, క్షమాపణ ఎలా పొందుకోవచ్చునో వ్రాయబడింది. అనగా శిక్షలేనిదే రక్షణకు విలువలేదు, అవసరము లేదు. *1️⃣1️⃣యెషయా గ్రంథములో ప్రభువైన* *🩸యేసుక్రీస్తు యొక్క ఆనవాలు* *1. ఆయన జననము* (యెషయా7:14; 9:6) *2. ఆయన కుటుంబము* (యెషయా 11:1) *3. ఆయన అభిషేకము* (యెషయా11:2) *4. ఆయన స్వభావము* (యెషయా11:3,4) *5. ఆయన సిలువ మరణము* (యెషయా 53) *6.ఆయన పునరుత్థానము* (యెషయా 25:8) *7.ఆయన పాలన* (యెషయా11:6-9) *పాత నిబంధన* యొక్క ప్రవచనాత్మక భాగములో ఉన్న 17 పుస్తకాలలో (యెషయా నుండి మలాకీ) యెషయా గ్రంథము మొదటిది. మనం తెలుసుకున్నట్లుగా యెషయా గ్రంథము రెండు భాగాలుగా విభజించబడింది. కాని వాస్తవంగా యెషయా తన గ్రంథమును అధ్యాయములుగా విభజింపలేదు. సగటు వ్యక్తి బైబిల్ను తేలికగా చదువగలుగునట్లు కొన్ని శతాబ్దాల క్రితమే అధ్యాయములు, వచనములుగా విభజించడం జరిగింది. యెషయా గ్రంథము మొదటి భాగములో పాత నిబంధన ప్రవచనములు కనిపిస్తే రెండవ భాగములో క్రొత్త నిబంధన ప్రవచనములు మనం చూస్తాము. *యెషయా గ్రంథములో 6వ అధ్యాయము మొదటి భాగములో అతి ముఖ్యమైన అధ్యాయము,* ఇందులో యెషయా ప్రభువును సింహాసనము మీద చూశాడు, ఆ తరువాత ఆయనను సేవించుటకు పిలువబడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండవ భాగములో *53వ అధ్యాయము అతి ముఖ్యమైనది.* ఈ అధ్యాయములో యేసయ్య ఏరీతిగా వధకు తేబడిన గొఱ్ఱవలె యొద్దకు కొనిపోబడి, వధించబడుట మనం చూస్తాము. ఈ పుస్తకములో ప్రత్యేకముగా దేవుని గూర్చి "సైన్యములకధిపతియగు యెహోవా” అని 62 సార్లు, “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు" అని 30 సార్లు మనకు కనిపిస్తాయి. *1️⃣2️⃣యెషయా గ్రంథంలో యేసయ్య ప్రస్తావన* *🩸యేసయ్య జన్మను గూర్చి* 7:14 *🩸యేసయ్య సువార్తను గూర్చి* 61:5 *🩸యేసయ్య మరణము గూర్చి* 53:1-13 *🩸యేసయ్య రాకడను గూర్చి* 60:2-3 *యేసయ్య రాజ్యము గూర్చి* 66:22 *💥యెషయా 1-39 అధ్యాయాలు* (పాతనిబంధనకు సూచన) *💥యెషయా 40-66 అధ్యాయాలు* (క్రొత్తనిబంధనకు సూచన) *పరిశుద్ధ* గ్రంథంలోని నూతన నిబంధనలో మత్తయి వ్రాసిన సువార్త, మార్కు వ్రాసిన సువార్త అని ఎలా పేర్లు ఉన్నాయో అలాగే పాత నిబంధనలో “యెషయా వ్రాసిన సువార్త" అని యెషయా గ్రంథానికి మరో పేరు కలదు. యెషయా గ్రంథములో రక్షణను గూర్చి 26 సార్లు లిఖించబడియుండగా మిగిలిన వాటిలో కేవలం 8 సార్లు మాత్రమే రక్షణను గూర్చి ప్రస్తావించడం జరిగింది. అనగా యెషయా రక్షణ గూర్చి మిగిలిన ప్రవక్తల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చెను. ప్రవక్త యొక్క పరిచర్య సమూయేలుతో ప్రారంభమాయెను. యెషయా మరియు మీకా సమకాలికులు. పరిశుద్ధ గ్రంథములో మొత్తంగా 17 ప్రవక్తల పుస్తకాలు చేర్చడమైనది. ఓబద్యా, యోవేలు, యోనా, ఆమోసు, హోషేయ, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ఈ క్రమములో వారి వారి కాలముల ప్రకారం ప్రవక్తలుగా పనిచేశారు. యూదా చెఱకు పోకముందు- ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ప్రవక్తలుగా పనిచేశారు. *💥1️⃣3️⃣ప్రవక్తల సందేశం:* 👉దేవుని మాట వినకపోతే చెదరగొట్టబడతారు. 👉చెరపట్టబడినవారు తిరిగివస్తారు. 👉రక్షకుడు అనగా మెస్సీయా వస్తాడు. 👉చెదరిపోయినవారు మరలా సమకూర్చబడతారు. 👉మెస్సీయ ప్రపంచ పాలన. *1️⃣4️⃣ఏ అధ్యాయాలు ఏమి తెలియజేస్తున్నాయి?* *1-6:* ఉజ్జియా, యోతాము రాజులుగా ఉండే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *7-14 :* ఆహాజు రాజుగా పరిపాలించే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *15-39:* హిజ్కియా రాజుగా పరిపాలించే రోజుల్లో పరిపాలన గూర్చి, అక్కడ ప్రజలను గూర్చి, ప్రవచించిన మాటల గూర్చి *40-66:* దేవుని క్షమ గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని ప్రణాళిక గూర్చి, దేవుని వాగ్దానములను గూర్చి తెలియజేస్తాయి. మీకు కావాలంటే వాట్సప్ ద్వారా పంపకూడదు WhatsApp Number 7207673134 #📀యేసయ్య కీర్తనలు🎙
#📀యేసయ్య కీర్తనలు🎙 *సిప్పోరా జీవితం నుండి ఆత్మీయ పాఠాలు* 🛐🛐🛐✝️✝️✝️🕎🕎🕎 💮 *"సిప్పోరా" గురించిన విషయాలను ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే సిప్పోరా జీవితం ద్వార మనం నేర్చుకోవలసినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కూడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను.! 💫 *సిప్పోరా మోషేకు భార్య.* మోషే భార్యనే ఈ సిప్పోరా. ఈ సిప్పోరా మిద్యాను యాజకుడైనటువంటి "హిత్రో" కుమార్తె. మోషే భార్య.! 👉 *సిప్పోరా అనే పేరుకు "పిచ్చుక" అని అర్ధం.!* 💫 కాబట్టి పిచ్చుకలా చాలా బలహీనమైనటువంటి మనస్తత్వాన్ని కలిగింది అని చెప్పుకుంటారు. ఎందుకంటే పిచ్చుక చాలా బలహీనమైనది. *సిప్పోరా పేరును బట్టి బలహీనురాలే గానీ ప్రభువులో మాత్రం బలవంతురాలు అని చెప్పవచ్చు.!* 💫 సిప్పోరాకు గొర్రెలున్నాయి,అలాగే తండ్రి గొర్రెల కాపరి. కాబట్టే సిప్పోరా తండ్రి గొర్రెలను కూడ మేపింది. తన భర్తకు పరలోకపు తండ్రి అప్పగించినటువంటి గొర్రెలను ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించడానికి తన వంతు సహకరించింది *దేవుని పరిచర్యకు పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ధన్య జీవి ఈ సిప్పోరా.!* 💫 మోషే గురించి చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడింది బైబిల్ లో. అంతేకాదు మంచి ప్రాముఖ్యతనిచ్చి చదువుకుంటాం. గొప్పగా చెప్తాం మోషే గురించి. *అలాంటి "మోషేకు" భార్య ఈమె* ఆ భార్యగా ఎలా ఉంది ఆయనకి ఎలా సహకరించినదనేది కూడ గొప్ప విషయమే అని చెప్పవచ్చు.! 💫 *ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడుగా సాత్వికుడిగా పేరొందినటువంటి మోషేకు సాటియైన సహకారిగా ఉంది ఆ భార్య.!* 👉 *దేవుని ఉగ్రత నుంచి భర్తను రక్షించుకున్నది వివేకవతిగా ఉంది సిప్పోరా.!* 💫 *"సిప్పోరా" మిద్యానీయురాలు.* అబ్రాహాము పెళ్ళి చేసుకున్నటువంటి అంటే పునర్వివాహం చేసుకున్నటువంటి కెతురా వల్ల పుట్టినవాడు అరేబియా హిత్యోఫియా ప్రాంతాల్లో ఉన్నటువంటి మిద్యానువాడు. ఈ మిద్యాను దేశం. *ఈ దేశాన్నే "కూషు" దేశంగా కూడ అంటారు.* కూషు దేశంగా కూడ పిలువబడింది.! 💫 *మోషే అబ్రాహాము సంతానానికి చెందినటువంటి సిప్పోరానే వివాహం చేసుకుంటాడు.* కాకపోతే అన్యులు మిద్యానీయులు కాబట్టి వారు వేరే కానీ కొందరు అంటారు సిప్పోరా నిగ్రో స్త్రీ అంటారు. నిగ్రోకి చెందినటువంటి స్త్రీ అంటారు కానీ కాదు. *ఆమె కూషు దేశంలో నివసించినందు వల్ల "కూషు దేశస్తురాలు" అని పిలువబడింది.* (సంఖ్యాకాండము,12 :1,2) వాక్యాలలో కూడ కూషు దేశస్తురాలు మోషే రెండవ భార్య అని కొంతమంది అంటారు కానీ దానికి ఆధారం ఏమి లేదు.! 👉 *ఈ మిద్యానీయురాలైనటువంటి సిప్పోరాయే కూషు దేశస్తురాలు అని చెప్పి సేవకులు చెప్తూ ఉంటారు.!* 👉 *అయితే "సిప్పోరా" గురించినటువంటి మంచి లక్షణాలను సిప్పోరా గురించినటువంటి విషయాలు మనం క్షుణ్ణంగా వివరంగా మనం తెలుసుకుందాం.!* 👉1️⃣ *మొదటి లక్షణం సిప్పోరాకు" సహనం ఎక్కువ. ?* 🌓🌓🟡🟡🟤🟤🟢🟢🔵🔵 💫 *"సిప్పోరాకు" సహనం ఎక్కువ. సహనం గల స్త్రీ ఈమె సిప్పోరా* (నిర్గమకాండము,2:16,17,18) వ అధ్యాయంలో మనకు ఈమె సహనమేంటో మనకు తెలుస్తది. సిప్పోరా తన అక్కా చెల్లెళ్ళతో కలసి తండ్రి గొర్రెలను మేపేది. సాయంకాలానికి వారు మందకు నీళ్ళు పెట్టేవారు. అయితే మందకు నీళ్ళు పెట్టడానికి ఈ తొట్లను నింపుతూ ఉంటే వేరే గొర్రెల కాపరులు వచ్చి వారిని వెళ్ళగొట్టేవారు. అందువలన ప్రతి రోజు సిప్పోరాకు ఆటంకం ఏర్పడేది. తన సహోదరులతో కలసి ఆలస్యంగా ఇంటికి వచ్చేవారు. అయినా సరే ఈమె గొర్రల కాపరులతో జగడమాడినట్లు మనకు పరిశుద్ధ గ్రంధంలో ఎక్కడా కూడ కనపడదు. ఆలస్యమైన తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చి ఇల్లు చేరేది అంటే అలాంటి మనస్తత్వం అలాంటి సహనం కలిగినటువంటి స్త్రీగా ఈ సిప్పోరా మనకు కనపడుతుంది. 💫 నేడు మనం చూస్తున్నాం నీకు అప్పగించిన బాధ్యతల్లో సహనంతో నమ్మకంతో ఎవరైనా ఉంటున్నారా.? *తన సహనం వల్ల సిప్పోరా ఇశ్రాయేలీయులకు విమోచకుడు నాయకుడైనటువంటి "మోషేకు" సాటియైనటువంటి సహకారిగా ఉంది.!* 💫 ఆమె పక్షాన దేవుడు ఆమెపై సణిగినటువంటి వారిపై కూడ దేవుడు వ్యాజ్యమాడేటట్లు మనం వాక్యంలో చూస్తాం. (పిలిప్పీ పత్రిక,4:5) లో పౌలు గారు అంటారు *మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి అంటాడు* అంత సహనం మనకి కావాలి అది సిప్పోరా నేర్పించే మొదటి పాఠం.! 👉2️⃣ *ఇక రెండవ లక్షణం తండ్రికి విధేయురాలు* 🔴🔴🟣🟣🌑🌑🟠🟠🌓🌓🟡 💫 తండ్రికి విధేయురాలు ఈ సిప్పోరా. తండ్రికి చాలా విధేయత చూపించినటువంటి కుమార్తెగా ఉంటుంది సిప్పోరా. సిప్పోరా తన తండ్రికి విధేయురాలిగానే ఉంది.తండ్రి మందను కూడ మేపేది. 💫 గొర్రెల కాపరుల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదురైనా గానీ తన విధి నిర్వహణలో నమ్మకత్వాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోలేదు. నిరూపించుకుంది సిప్పోరా. ఐతే మందకు నీరు పెట్టే విషయంలో మోషే సహాయపడతాడు. అలా సహాయపడినటువంటి మోషేను తాను స్వతంత్రించి ఇంటికేమి ఆహ్వానించలేదు. కానీ తండ్రి వెళ్ళి పిలుచుక రమ్మని చెప్పినప్పుడు అప్పుడు సిప్పోరా తండ్రికి విధేయత చూపింది.! 💫 *పరదేశిగా మిద్యానులో తన గొర్రెలను..తన తండ్రి గొర్రెలను..కాస్తున్నటువంటి మోషేను తన తండ్రి ఇష్ట ప్రకారం సిప్పోరా వివాహం చేసుకుంటుంది.* తన తండ్రి చిత్త ప్రకారమే తండ్రి ఇష్ట ప్రకారమే చేసుకుంటుంది. ఎంత మాదిరికరమైనటువంటి కుమార్తె ఈ సిప్పోరా. ఎంత విధేయత కలిగినటువంటి కుమార్తె. 💫 *ఈ రోజుల్లో అనేకమంది కుమార్తెలు వారి వివాహ విషయాలలో చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం.. వింటూ ఉంటాం..!!* 💫 *వివాహం అనేది దేవుని ఏర్పాటు.* మీరు ఎన్నుకొనేటువంటి లేదా స్వీకరించేటువంటి లేదా వివాహమాడేటువంటి విషయంలో జాగ్రత్తగా పరిశీలించండి. *విధేయత కలిగి ఉండాలి.* దేవుని పట్ల విధేయత & కుటుంబం పట్ల విధేయత,ముఖ్యంగా తండ్రికి విధేయత చూపించే కుమార్తెగా సిప్పోరా కనపడుతుంది అలా మీరు కూడ ఉండాలి.! 👉3️⃣ *మూడవ అంశం భర్తనుఅనుసరించింది సిప్పోరా* 🌑🌑🟠🟠🔵🟢🟢🟤🟤🟡🟡 💫 భర్తను అనుసరించింది ఈ భార్య. *ఈ సిప్పోరా భర్త మాటను అనుసరించేది.* మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడైనటువంటి యెహోవా మోషేతో మాట్లాడి తాను విడిచి వచ్చినటువంటి ఐగుప్తునకు తిరిగి వెళ్ళమని ఇశ్రాయేలీయుల విడుదల విషయమై ఫరోతో మాట్లాడమని అజ్ఞాపిస్తారు.! 💫 మోషే తన మామయైనటువంటి హిత్రో దగ్గర అనుమతి తీసుకొని ఐగుప్తుకు బయలుదేరాడు. మోషే తన భార్య కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు వెళ్తాడు. (నిర్గమకాండము,4:20) లో చూస్తాం.! 💫 ఒకప్పుడు మోషే ప్రాణ భయంతో ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడో అక్కడికే మళ్ళీ ప్రయాణమవుతుంటే సిప్పోరా దేవునికి అడ్డుగా మాత్రం నిలబడలేదు. *తన కుమారులతో పాటు తాను కూడ భర్తను వెంబడించింది.* తన తండ్రి ఇంటిని స్వజనాన్ని వదిలి బయలు దేరింది. మనం కూడ ఎట్లా ఉంటున్నామో ఆలోచించండి.? *దేవుని పనుల్లో భర్తకు జత పనివారుగా ఉండగలుగుతున్నామా.?* కష్టమైనా..శ్రమైనా..దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా.? మనల్ని పిలిచేటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. 💫 *సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడ ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.* (ఎఫెసీ,5:24) లో.. 💫 *తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేతనే తమను తాము అలంకరించుకున్నారు అని* (మొదటి పేతురు,3:5) లో మనకు కనపడుతుంది. ఆ విధంగా భర్తకు విధేయత చూపి నమ్మకంగా నడిచినటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి.! 👉4️⃣ *నాలుగవది దేవుని చేతిలో నుంచి భర్తను రక్షించుకున్నది సిప్పోరా* 🌓🌓🟡🟡🟤🟤🟢🟢🔵🔵 💫 దేవుని చేతి నుంచి భర్తను రక్షించుకున్నది సిప్పోరా. *యెహోవా చేతి నుంచి మోషేను కాపాడుకుంది.* మిద్యాను నుంచి ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించినటువంటి దేవుడు మోషేను మార్గం మధ్యలో చంపాలని చూస్తాడు *చంపజూసాడు అని* (నిర్గమకాండము,4:24) లో కనపడుతుంది. కారణం ఏంటి అంటే.? *"సున్నతి" పొందాలని.* యెహోవా తన ప్రజలకు ఆజ్ఞాపించాడు అందు చేతనే విశ్వాసులు తండ్రియైనటువంటి అబ్రాహాము తన కుమారునితో సహా అందరికి కూడ తన ఇంట ఉన్నటువంటి పురుషులందరు కూడ ఒకే దినాన సున్నతి పొందారు. (ఆదికాండము,17) వ అధ్యాయంలో చూస్తాం.! 💫 *"సున్నతి" అనేది తనకు కలిగిన విశ్వాసం వలనైనా నీతికి ముద్ర.* ఒక నీతికి ముద్రగా అది కనపడుతుంది. (రోమా పత్రిక,4:11) లో *తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అనేది ఉంటది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు.* అలాగే (నిర్గమకాండము,12:48) లో ఉంటుంది. *పస్కాను ఆచరింపగోరిన పక్షమున అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందాలి అని* పస్కాను ఆచరించడానికి సున్నతి ఒక యోగ్యతగా ఉండేది. అందుకే యాకోబు సహోదరులు కూడ తన సహోదరియైనటువంటి "దీనా" విషయంలో కూడ హివ్వియుడైనటువంటి సున్నతి లేని షెకెముకు పెళ్ళికి ఇవ్వాలి అని అడిగినప్పుడు,పెళ్ళి చేయమని అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. మేము ఈ కార్యాలు చేయలేం. *సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇవ్వలేము అది మాకు అవమానము అంటారు* (ఆదికాండము 34:14) లో.. 💫 *ఐతే మోషే తన కుమారునికి "సున్నతి" చేయించలేదిక్కడ.* అది గ్రహించింది సిప్పోరా. తండ్రిగా మోషే తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. ఒకవేళ సిప్పోరాయే తన కుమారునికి సున్నతి చేయటం వ్యతిరేకించి ఉండవచ్చు. చేయించక పోవచ్చు. మోషేని యెహోవా చంపజూసినప్పుడు ఆమె తన తప్పును తాను తెలుసుకొని *తానే తన కుమారునికి సున్నతి చేసింది.* యెహోవా చేతి నుంచి తన భర్తను రక్షించుకుంది. తన తప్పును తానే తెలుసుకుంది. అలా సరిచేసుకోవడానికి ఎంత తగ్గింపు ఉండాలి మరి మీరు ఎలా ఉన్నారు.? మీ భర్తకు ఆశీర్వాదకరంగా ఉన్నారా.? లేక కీడు రకంగా ఉన్నారా.? *గుణవతియైన భార్య గురించి పరిశుద్ద గ్రంధం చాలా చెప్తుంది.!* 💫 *ఆమె తాను బ్రతుకు దినములన్నియు కూడ అతనికి మేలే గానీ కీడేమీ చేయలేదు అని* (సామెతల గ్రంధం,31) అధ్యాయంలో ఉంటుంది.! 💫 *శ్రమలే వచ్చినా..కష్టాలే వచ్చినా..లేదా చిక్కుల్లో ఉన్నా గానీ భార్య భర్తకు సపోర్ట్ గా ఉండాలి. రక్షించేదిగా ఉండాలి.* ఒకవేళ భర్తే తప్పు చేసినా కూడ భార్య సరి చేయాలి. అలాంటి బాధ్యతనే సిప్పోరా నెరవేర్చింది. తన భర్తకు వ్యతిరేకత చూపించలేదు. భర్త మీద అజమాయిషి చేయలేదు. భర్త మాట వినకుండ లేదు. విధేయతగానే ఉంటుంది. *భర్తను కూడ కష్టకాలంలో రక్షించుకుంది.* అదే తీరు నేడు మన భార్యలకు.. నేడు మీ స్త్రీలకు..నేడు మీ పరిస్థితులకు..కూడ అన్వహించుకోవాలి అని గుర్తు చేస్తున్నాను.! 👉 5️⃣ *ఐదవది సంబందించినటువంటి రక్త సంబంధిగా మారిపోయింది భార్య* 🟣🟣🔴🔴🌓🌓🟡🟡🟤🟤🟢🟢 💫 భర్తకు సంబంధించినటువంటి రక్త సంబంధిగా మారిపోయింది భార్య. "సున్నతి" అనేది యెహోవా దేవుడు చేసినటువంటి నిబంధనకు గుర్తు అని మనకు తెలుసు. *మీ ఇంట పుట్టిన వాడు వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉంటుందని* (ఆదికాండము,17:13) లో ఉంటుంది. ఇది యెహోవా అబ్రాహాముకిచ్చినటువంటి నిబంధనకు గుర్తు.! 💫 సిప్పోరా కుమారునికి సున్నతి చేయుట ద్వార తనను రక్త సంబందమైనటువంటి నిబంధనలోకి వచ్చింది. *రక్తము చేత మాత్రమే నిబంధన ప్రతిష్టించబడింది* అని (హెబ్రి పత్రిక,9:18) లో మనం చూస్తాం.! అందుచేతే నిబంధనలోకి రావడం అంటే నిబంధనలోకి రావడం ద్వారానే తన భర్తకు రక్త సంబంధమైనటువంటి నిబంధన భర్త అని సిప్పోరా గుర్తించింది.! 💫 కానీ *ఇప్పుడైతే శరీరం నుంచి రక్తం చిందించాల్సిన అవసరం లేదు* (మొదటి పేతురు,1:19) ప్రకారం. ఎందుకంటే.? *అమూల్యము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చిందించబడింది* మీరు కూడ వ్యతిరేకంగానో..అత్త గారికి వ్యతిరేకంగా..భర్తకు వ్యతిరేకంగా..కాకుండ రక్త సంబందులై ఒకే కుటుంబంతో ఒకే శరీరంతో ఏక దాటిగా ఒకే మనసు కలిగి జీవించాలి అని గుర్తుచేస్తున్నాను.! 👉6️⃣ *ఆరవది భర్త పరిచర్యలో సహాయం* 🟠🟠🔵🔵🌑🌑🟢🟢🟤🟤🟡🟡 💫 భర్త పరిచర్యలో భర్త పనిలో కూడ సహకరించింది సిప్పోరా. *నేడు చాలా మంది స్త్రీలు భర్త చేసే పనులకు గానీ..పరిచర్యకు గానీ..సంబందం లేకుండ పట్టించుకోకుండ ఉంటారు.* 💫 మోషే ఇశ్రాయేలియులను ఐగుప్తు నుంచి విడిపించిన సందర్భంలో ఆయన దేవుని పనిలో నిమగ్నమయ్యేటట్లు ప్రార్ధనకు ఆటంకం కలగకుండ ఉండేటట్లు ఆమె కుమారులను మోషే దగ్గరకు తీసుకొనివచ్చి (నిర్గమకాండము,18:1) లో చూడండి *దేవుని పనికి ప్రాధాన్యతనిచ్చింది, దేవుని పని నిమిత్తం తన భర్తను యెడబాసి ఉండటానికి సిప్పోరా అంగీకరించింది* భార్య సహకరించం బట్టే దేవుని ఇళ్ళంతటిలోను కూడ నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు "మోషే" 👉 *మోషే అలా ఉండగలిగాడు అంటే భార్య సహకారం చాలా అవసరం.!* 💫 భార్యగా నీ భర్త అధ్యాత్మిక ఔనత్యానికి గానీ..పనికి గానీ.. నీ కుటుంబ పోషనకు గానీ..దేవుని విశ్వాసానికి గానీ..నీవు ప్రోత్సాహకారిగా ఉన్నావో లేదో పరీక్షించుకోండి. వారి పనిలో గానీ,ఉద్యోగంలో గానీ,కష్టాలలో గానీ,పరిచర్యలో గానీ, *ఏ విషయంలోనైనా సరే "భార్య" సహకారం అనేది చాలా చాలా అవసరమని మరొక్కసారి గుర్తు చేసుకొండి.!* 👉 *అంతేకాదు ప్రతి కుటుంబంలో కూడ ఉండేది ఏంటి అంటే.? అత్త మామలు లేదా తోడి కోడళ్ళు లేదా ఆడపడుచుల చేత ఇబ్బందులు అనేవి ఉంటాయ్.!* 👉 7️⃣ *ఏడవ అంశం ఏంటంటే ఇలాంటి ఆడ బిడ్డల చేత త్రునీకరించబడటం* 🟥🟪🟧🟦🟩🟫⬛🟨 💫 ఈ సిప్పోరా ఆడబిడ్డల చేత త్రునీకరించబడింది. మోషే ఈ కూషు దేశస్తురాలైనటువంటి ఈ స్త్రీని ఈ సిప్పోరానీ పెళ్ళి చేసుకున్నాడు. *కాబట్టి అతడు పెళ్ళి చేసుకున్నటువంటి ఆ స్త్రీ నీ బట్టి "మిర్యాము" "అహరోనులు" అతనికి విరోధంగా మాట్లాడారు.* 💫 *ఈ మిర్యాము ఈ మోషేకి సహోదరి. అహరోను సహోదరుడు.* వీళ్ళు విరోధంగా మాట్లాడారు. ఈ మిర్యాము సిప్పోరా రాకతో సిప్పోరా రాగానే అసూయ పడింది. పైగా మోషే దృష్టిలో ఇంకా నేను తక్కువ స్థానం పొందాను అని అనుకుంది. *సిప్పోరా యందు అసూయ పడింది.* సిప్పోరా విషయంలో బాధపడింది. కానీ జ్ఞానయుక్తమైనటువంటి సిప్పోరా తండ్రి హిత్రో సలహా మేరకు ఈ సలహాను మోషే పాటించడం కూడ మిర్యాము ఇష్టపడలేదు. సిప్పోరా తండ్రిని సహోదరుడ్ని తమ కనాను యాత్రలో తోడు రమ్మని మోషే పిలవడం మిర్యాముకు నచ్చలేదు. తండ్రిని వారి సహోదరులను కూడ పిలిచాడు ఈ మోషే. కానీ అది కూడ నచ్చలేదు. *అసూయ రగులుకొని "మిర్యాము" ఈ సిప్పోరాను త్రునీకరించింది.* ఇలాంటి ప్రతి పరిస్థితి కూడ వారి మద్య కూడ ఉన్నాయ్.! 💫 అందువల్లే మోషే మీద ఈ మిర్యాము అహరోనులిద్దరు కూడ సణిగారు. తిట్టుకున్నారు. *అయినా సరే సిప్పోరా నోరు తెరచి జవాబిచ్చినట్లు గానీ..వారికి ఎదురు తిరిగినట్టు గానీ..వారితో దెబ్బలాడినట్లు గానీ..పరిశుద్ధ గ్రంధంలో మనకు కనపడదు.!* 💫 *సిప్పోరా సహనానికి ప్రతీక ఈ సంఘటన.* దేవుని పని కొరకు తన భర్తను కొన్ని సంవత్సరాల పాటు యెడబాసినటువంబటి సిప్పోరా తమ కలయిక అనంతరం కూడ మిర్యాము వల్ల బాధ పడింది. అయినా సరే సిప్పోరా ఓర్చుకుంది. ఇలా చేస్తున్నటువంటి మిర్యాము మాటలు దేవుడు విన్నాడు. ప్రత్యక్షపు గుడారానికి రమ్మని ముగ్గురికి ఆజ్ఞాపించాడు. ఆయన కోపం అహరోను మిర్యాములపై రగులుకుంది. *వెంటనే మిర్యాముకు కుష్ఠు రోగం వచ్చింది* పాపానికి సంకేతమైన కుష్ఠు వల్ల మిర్యాము చేసిన పాపం సమాజం అంతటికి కూడ అందరికి కూడ చెప్పినట్టే అయ్యింది.! 💫 మోషే ప్రార్థన విని యెహోవా మిర్యాముని క్షమించినా గానీ పాపానికి ఫలితం ఇశ్రాయేలియుల ప్రజలకు హెచ్చరికగా ఈ మిర్యాము ఉంది. అది సిగ్గుచేటు. అవమానం. పశ్చాత్తాపంతో పాలెము వెలుపల ఏడు దినములు గడిపింది ఆమె. (సంఖ్యాకాండము,12 :15) లో చూడండి. *వాగ్దాన దేశంలో ప్రవేశించకుండానే మిర్యాము సీను అరణ్య ప్రాంతంలో మరణించి పాతిపెట్టబడింది.* (సంఖ్యాకాండము,20:1) లో ఇదంతా చూస్తాం.! 💫 *కాబట్టి మీరెలా ఉన్నారో "అసూయ" భయంకరమైటువంటి పాపమని గుర్తించండి.* ఎదుటి వాళ్ళతో అసూయ..తోడి కోడళ్ళతో అసూయ..తోబుట్టువులతో అసూయ.. భయంకరమైనటువంటి పాపంలోకి తీసుక వెళ్తుంది. మీ కుటుంబాన్ని విచ్చిన్నం చేస్తుంది. స్వార్ధపు అంచుల్లో ఉంటున్నారు. స్వార్ధపు ఆలోచనలోనే ఉంటున్నారు. సహకారం లేదు. సహాయం లేదు. కుటుంబానికి ఒక దైర్యం లేదు. వివేకము లేదు ఆలోచించండి.? మాటంటే పడటం లేదు. మాటలు ఎక్కువగా మాట్లాడటం కూడ జరుగుతుంది. ఒకరినొకరు విమర్శించుకోవడం, ద్వేషించుకోవడం,తిట్టుకోవడం,కుటుంబాన్ని విచ్చిన్నం చేసుకుంటున్నారు.! 👉 *ఇతరుల ఉన్నతిని సద్గుణాలను బట్టి సంతోషిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అని గుర్తుంచుకోండి* 😊 💫 *సిప్పోరా మోషేను దేవుడు ఆశీర్వదించి వారిద్దరికి కూడ మంచి బహుమతిగా "గెర్షేము" "ఎలియాజరు" అనేటువంటి కుమారులను ఆశీర్వదించాడు. అలాంటిది ఈ సిప్పోరా జీవితం.!* 💫 కాబట్టి ఆ సిప్పోరా గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే *తన సహనమనబడేటువంటి సుగుణంతో అలంకరించబడినటువంటి ఉత్తమ ఇల్లాలు ఈ సిప్పోరా* సిప్పోరా జీవితమైతే ఇది కానీ..సిప్పోరా జీవితం ద్వార మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడ ఇవన్నీ అని తలంచుకోండి.! 💫 *మీ కుటుంబాలలో ఈ లక్షణాలు ఉండేలా చూసుకోండి. ప్రతీ భార్య కూడ ఉత్తమమైనటువంటి సుగుణమనేటువంటి "సహనం" అనేటువంటి సుగుణాన్ని ధరించుకోనేటువంటి ఇల్లాలుగా భార్యగా ఉండాలి అని మాత్రం గుర్తుంచుకోండి.!* 👉 *దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికి కూడ తోడైయుండి బలపరచును గాక...!*
#📀యేసయ్య కీర్తనలు🎙 *(📜ప్రవచనము💝)* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *యెషయా గ్రంథం గురించి షార్ట్ మెసేజ్ లో పూర్తి వివరణ👇ఈ వ్రంధములో బైబిల్ మొత్తం మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు చదవండి షేర్🙏చేయండి🤝* *1️⃣ఎవరు వ్రాశారు:* యెషయా *2️⃣ఎప్పుడు వ్రాశారు* : క్రీ॥పూ॥ 739-681 సం॥లలో *3️⃣ఏది మూల వాక్యము* : మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. (యెషయా 53:5) *4️⃣ఏది మూల పదం* : దేవుని ప్రజలు సమకూర్చబడుట, రక్షణ వాగ్దానం. *5️⃣ఎవరు ముఖ్యమైన వ్యక్తి* : యెషయా *6️⃣ఏమిటి యెషయా అనే పేరుకు అర్థం* : యెహోవాయే నా రక్షకుడు/దేవుడే రక్షణ *7️⃣ఎందుకు వ్రాశారు?* అష్షూరీయులు తమ చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యములను స్వాధీనం చేసుకుంటూ ఇశ్రాయేలు మీదికి కూడా దండెత్తి క్రీ॥పూ॥ 720 సం॥లో సంపూర్తిగా తమ స్వాధీనం చేసుకొనిరి. ఆ సమయంలోనే అధిక భాగము జనులను వారు చెరగొనిపోయారు. ఇశ్రాయేలీయుల పతనము తరువాత యూదారాజ్యమునకు కూడా దేవుని తీర్పు జరుగునని, జనులు దేవునివైపు తిరిగితే మెస్సీయా ద్వారా రక్షణ కలుగునని, అందుకు దేవునియందు కలిగియుండవలసిన విశ్వాసము గురించిన సంగతుల గూర్చి యెషయా ఈ గ్రంథములో లిఖించెను. పద్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్యం వర్ధిల్లుతున్నప్పుడు వ్రాయబడ్డాయి. కానీ ప్రవక్తల గ్రంథాలు ఇశ్రాయేలు ప్రజలు దుర్భర దుస్థితిలో ఉన్నప్పుడు వ్రాయబడెను. ఇశ్రాయేలు ప్రజలు దుస్థితిలో ఉన్నప్పుడు వారిని ఉద్దరించడానికి, ఉజ్జీవింపజేయడానికి దేవుడు ప్రవక్తలను పంపెను. "అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను, వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి" *2 రాజులు 17:13,14.* నూతన నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చెను అనే మాట పలుమార్లు మనం చూస్తాం. దేవుడు చేసిన నిబంధనను మీరి జీవిస్తున్న తన ప్రజలను బహు ధైర్యముతో హెచ్చరిక చేయుటకు దేవుడు యెషయాను ప్రవక్తగా ఏర్పర్చుకొనెను. వారిలో నలుగురు పెద్ద ప్రవక్తలుగా, 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిరి. వారి పరిచర్య కాలము, గ్రంథాలను బట్టే పెద్ద, చిన్న అనే పేరు వచ్చెను. *8️⃣ఏమి సూచిస్తుంది?* ప్రభువైన యేసుక్రీస్తును వధకు తేబడిన గొర్రెగా, మహిమపరచబడిన సేవకునిగా, సమాధానకర్తగా, మెస్సీయగా ఈ గ్రంథము సూచిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య 66. ఈ యెషయా గ్రంథములో ఉన్న మొత్తం అధ్యాయాల సంఖ్య కూడా 66. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ధర్మశాస్త్రము గూర్చి, ధర్మశాస్త్రమును మీరినటువంటివారు పొందుకునే శిక్ష గూర్చి తెలియజేస్తే ఈ యెషయా గ్రంథంలోని *మొదటి 39 అధ్యాయములు 'దేవుని తీర్పు' శిక్షను గూర్చి తెలియజేస్తాయి.* *క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు దేవుని ప్రేమను గూర్చి, దేవుని కృపను గూర్చి, దేవుని క్షమను గూర్చి తెలియజేస్తే అదే రీతిగా యెషయా గ్రంథంలోని రెండవ భాగమైన 27 అధ్యాయములు దేవుని ప్రేమ, క్షమ, కనికరమును గూర్చి వ్రాయబడెను.* ప్రవక్తల కాలము 500 సం॥రాలు (క్రీ॥పూ॥ 950-450 వరకు) *9️⃣యెషయా ప్రవక్తగా ఉన్న కాలం...* . *(యెషయా 1:1)* 💥*ఉజ్జియా* . క్రీ॥పూ॥ 790-739 సం|| వరకు *💥యోతాము* . క్రీ॥పూ॥ 739-731 సం॥ వరకు *💥ఆహాజు* . క్రీ॥పూ॥ 731-715 సం॥ వరకు *💥హిజ్కియా* . క్రీ॥పూ॥ 715-686 సం॥ వరకు *🔟యెషయా అద్భుతమైన ప్రవక్త👇* *1.పశ్చాత్తాపం* (యెషయా 6:5) *2.పరిశుద్ధపరచబడడం* యెషయా 6:5 *3.పరిచర్యకు సిద్ధం* (యెషయా 6:8) *4.పంపించడం* (యెషయా 6:9) *5.ప్రార్ధించడం* (2దిన 32:20) యెషయా సుమారు 60 సం॥లు ప్రవక్తగా పనిచేశాడు. పైన తెలుపబడిన ఈ నలుగురు రాజుల పరిపాలనా కాలంలో యెషయా ప్రవక్తగా ఉంటూ రాజులను, ప్రజలను సరిచేస్తూ, హెచ్చరిస్తూ, దేవుని వర్తమానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు. తనకివ్వబడిన బాధ్యతలు అద్భుతముగా నిర్వహించాడు. యెషయా ప్రవక్తగా తాను పనిచేస్తున్న ఆ రోజుల్లో హోషేయ, మీకా సమకాలీన ప్రవక్తలుగా ఉండేవారు. *💥యెషయా ప్రసంగ సారాంశము:💥* “యెహోవాయే మా రక్షణ". కొన్ని అధ్యాయాల్లో దేవుని తీర్పు, ఉగ్రతను గూర్చి, ధర్మశాస్త్రము, శిక్షను గూర్చి వ్రాయబడ్డాయి. అదే సమయంలో దేవుని రక్షణ, క్షమాపణ ఎలా పొందుకోవచ్చునో వ్రాయబడింది. అనగా శిక్షలేనిదే రక్షణకు విలువలేదు, అవసరము లేదు. *1️⃣1️⃣యెషయా గ్రంథములో ప్రభువైన* *🩸యేసుక్రీస్తు యొక్క ఆనవాలు* *1. ఆయన జననము* (యెషయా7:14; 9:6) *2. ఆయన కుటుంబము* (యెషయా 11:1) *3. ఆయన అభిషేకము* (యెషయా11:2) *4. ఆయన స్వభావము* (యెషయా11:3,4) *5. ఆయన సిలువ మరణము* (యెషయా 53) *6.ఆయన పునరుత్థానము* (యెషయా 25:8) *7.ఆయన పాలన* (యెషయా11:6-9) *పాత నిబంధన* యొక్క ప్రవచనాత్మక భాగములో ఉన్న 17 పుస్తకాలలో (యెషయా నుండి మలాకీ) యెషయా గ్రంథము మొదటిది. మనం తెలుసుకున్నట్లుగా యెషయా గ్రంథము రెండు భాగాలుగా విభజించబడింది. కాని వాస్తవంగా యెషయా తన గ్రంథమును అధ్యాయములుగా విభజింపలేదు. సగటు వ్యక్తి బైబిల్ను తేలికగా చదువగలుగునట్లు కొన్ని శతాబ్దాల క్రితమే అధ్యాయములు, వచనములుగా విభజించడం జరిగింది. యెషయా గ్రంథము మొదటి భాగములో పాత నిబంధన ప్రవచనములు కనిపిస్తే రెండవ భాగములో క్రొత్త నిబంధన ప్రవచనములు మనం చూస్తాము. *యెషయా గ్రంథములో 6వ అధ్యాయము మొదటి భాగములో అతి ముఖ్యమైన అధ్యాయము,* ఇందులో యెషయా ప్రభువును సింహాసనము మీద చూశాడు, ఆ తరువాత ఆయనను సేవించుటకు పిలువబడ్డాడు. ఇది ఇలా ఉండగా రెండవ భాగములో *53వ అధ్యాయము అతి ముఖ్యమైనది.* ఈ అధ్యాయములో యేసయ్య ఏరీతిగా వధకు తేబడిన గొఱ్ఱవలె యొద్దకు కొనిపోబడి, వధించబడుట మనం చూస్తాము. ఈ పుస్తకములో ప్రత్యేకముగా దేవుని గూర్చి "సైన్యములకధిపతియగు యెహోవా” అని 62 సార్లు, “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు" అని 30 సార్లు మనకు కనిపిస్తాయి. *1️⃣2️⃣యెషయా గ్రంథంలో యేసయ్య ప్రస్తావన* *🩸యేసయ్య జన్మను గూర్చి* 7:14 *🩸యేసయ్య సువార్తను గూర్చి* 61:5 *🩸యేసయ్య మరణము గూర్చి* 53:1-13 *🩸యేసయ్య రాకడను గూర్చి* 60:2-3 *యేసయ్య రాజ్యము గూర్చి* 66:22 *💥యెషయా 1-39 అధ్యాయాలు* (పాతనిబంధనకు సూచన) *💥యెషయా 40-66 అధ్యాయాలు* (క్రొత్తనిబంధనకు సూచన) *పరిశుద్ధ* గ్రంథంలోని నూతన నిబంధనలో మత్తయి వ్రాసిన సువార్త, మార్కు వ్రాసిన సువార్త అని ఎలా పేర్లు ఉన్నాయో అలాగే పాత నిబంధనలో “యెషయా వ్రాసిన సువార్త" అని యెషయా గ్రంథానికి మరో పేరు కలదు. యెషయా గ్రంథములో రక్షణను గూర్చి 26 సార్లు లిఖించబడియుండగా మిగిలిన వాటిలో కేవలం 8 సార్లు మాత్రమే రక్షణను గూర్చి ప్రస్తావించడం జరిగింది. అనగా యెషయా రక్షణ గూర్చి మిగిలిన ప్రవక్తల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చెను. ప్రవక్త యొక్క పరిచర్య సమూయేలుతో ప్రారంభమాయెను. యెషయా మరియు మీకా సమకాలికులు. పరిశుద్ధ గ్రంథములో మొత్తంగా 17 ప్రవక్తల పుస్తకాలు చేర్చడమైనది. ఓబద్యా, యోవేలు, యోనా, ఆమోసు, హోషేయ, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ఈ క్రమములో వారి వారి కాలముల ప్రకారం ప్రవక్తలుగా పనిచేశారు. యూదా చెఱకు పోకముందు- ఓబద్యా, యోవేలు, యెషయా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, యిర్మీయా ప్రవక్తలుగా పనిచేశారు. *💥1️⃣3️⃣ప్రవక్తల సందేశం:* 👉దేవుని మాట వినకపోతే చెదరగొట్టబడతారు. 👉చెరపట్టబడినవారు తిరిగివస్తారు. 👉రక్షకుడు అనగా మెస్సీయా వస్తాడు. 👉చెదరిపోయినవారు మరలా సమకూర్చబడతారు. 👉మెస్సీయ ప్రపంచ పాలన. *1️⃣4️⃣ఏ అధ్యాయాలు ఏమి తెలియజేస్తున్నాయి?* *1-6:* ఉజ్జియా, యోతాము రాజులుగా ఉండే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *7-14 :* ఆహాజు రాజుగా పరిపాలించే రోజుల్లో యెషయా ప్రవక్తగా ప్రవచించిన మాటల గూర్చి *15-39:* హిజ్కియా రాజుగా పరిపాలించే రోజుల్లో పరిపాలన గూర్చి, అక్కడ ప్రజలను గూర్చి, ప్రవచించిన మాటల గూర్చి *40-66:* దేవుని క్షమ గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని ప్రణాళిక గూర్చి, దేవుని వాగ్దానములను గూర్చి తెలియజేస్తాయి.
#📀యేసయ్య కీర్తనలు🎙
📀యేసయ్య కీర్తనలు🎙 - ShareChat
#📀యేసయ్య కీర్తనలు🎙 FRIDAY MESSAGE* 01-05-2026 *శుక్రవారపు సందేశం* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *అంశం* : *కృప* *వాక్య భాగం* : యెషయా54:10 ➖➖➖➖➖➖➖➖ *2026 మేనేల వాగ్దానం* ➖➖➖➖➖➖➖➖ *పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు.* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ *కీర్తనలు 48:9 - దేవా, మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించితిమి.* 🔜🔜🔜🔜🔜🔜 *ఆయన కృప మనలను విడిచి పోకుండా ఉండేందుకు ఏం చేయాలి..??* ➖➖➖➖➖➖➖➖ 1️⃣ *ఆయన ఆజ్ఞలను అనుసరించాలి వారికె కృప* - ద్వితియో 7:9 *ఉదా: దావీదు* 1రాజులు 15:4 2సముయొలు 7:15 -------------------+++----------------- 2️⃣ *ఆయన యుందు భయభక్తులు కలిగి ఉండాలి -వారికె కృప* - కీర్తన 103:17 *ఉదా :యోబు* యోబు 1:1 -------------------+++-------------- 3️⃣ *ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి -వారి కెకృప* - 1 రాజులు 3:6 *ఉదా : దావిదు* ------------------+++---------------- 4️⃣ *యెహోవా యందు నమ్మికఉంచేవారికె - కృప* - కీర్తన 32:10 కీర్తన 52:8 *ఉదా : అబ్రహము* రోమా 4:3 ----------------++++------------- 5️⃣ *ఆయనను శాశ్వతంగా ప్రేమించేవారికె - కృప* - ఎఫెస్సీ 6:24 *ఉదా: దావీదు* కీర్తన 116:1 అందుకే గోర్రెల కాపరైన దావీదు కుటుంబం లో నుండి రాజ్యానిఎలె రాజులు వచ్చారు. కారణం దేవుని కృప -------------++++----------------- 6️⃣ *దీనులుగా ఉండేవారికె - కృప* - యాకోబు 4:6 - 1పేతురు 5:5 ఉదా :*అయన దీనులనె లక్ష్య ను* కీర్తన 138:6 యెషయ 57:15 -------------++++----------------- 7️⃣ *పరిశుద్ధులుగా ఉండేవారికె -కృప* - ప్రకటన 22:21 అనగా మనలందరిని యేసు ప్రభు సరిశుద్దులగా చేసి మనకు కృపనిచ్చును 1థెస్సలోనిక 3:12 -------------------+++-------------- 🟪 *GOD BLESS YOU* 🟪 ----------------+++-----------------
#📀యేసయ్య కీర్తనలు🎙 ‘𝟑‘ పనులుచేస్తే నీ జీవితం ధన్యం!* 〰️〰️➖➖➖➖〰️〰️ 🔴 *1. క్షమించబడ్డారా - ఇతరులను క్షమించండి :* ఒకరోజు ఓ సహోదరి దగ్గరకి సాతాను వెళ్ళి, నువ్వు పరమ పవిత్రరాలు అని అనుకుంటున్నావా, నీవు చేసిన పాపిష్టి పనులన్ని నాకు జ్ఞాపకం ఉన్నాయి, మరి నీకు జ్ఞాపకం లేవా అని ప్రశ్నిస్తూ ఆమె గతంలో చేసిన పాపాలను గూర్చి సైతాను జ్ఞాపకం చేయడం మొదలుపెట్టాడు. అందుకామే; నీవు నా పాపాలను గూర్చి మాట్లాడుతున్నావు కదా, పడమటి వైపుకు వెళ్ళు నా పాపాలు కనిపిస్తాయి అని చెప్పింది. సాతాను పడమటికి వెళ్ళి వచ్చిన తరువాత, ఇప్పుడు తూర్పు వైపుకు వెళ్ళు నా పాపాలు కనిపిస్తాయి అని తూర్పుకు పంపించింది. బైబిల్ సెలవిస్తుంది; *“పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరచి యున్నాడు”* (కీర్తనలు 103:12). అనగా పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరం మనము గతంలో చేసిన పాపాలను దేవుడు మన నుంచి దూరము చేసేశాడు. ఆయన మన పాపములన్నిటిని క్షమించాడు. ఇక ఎన్నడు ఆయన మన గతాన్ని జ్ఞాపకం చేసుకోడు. *దేవుడు మనల్ని క్షమించిన కారణం..మనం క్షమించబడటానికి! ఇతరులను క్షమించడానికి!!* మీరు చేసిన తప్పులను దేవుడు క్షమించాలని మీరు కోరుతున్నట్లయితే, మీ యెడల తప్పు చేసినవారిని కూడా మీరు క్షమించాలి. దేవుని వద్ద నుండి పొందుకున్న క్షమాపణ మీ జీవితంలో సంపూర్ణం కావాలంటే మీరు కూడా ఇతరులను క్షమించాలి. అనగా, మీ సంతోషాన్ని చూసి ఏడ్చేవాళ్ళని – క్షమించండి! మీ అభివృద్దిని చూసి అసూయపడేవాళ్ళని – క్షమించండి! మీరు విజయం సాధిస్తున్నప్పుడు విమర్శించేవాళ్ళని - క్షమించండి! *వాళ్ళు క్షమించబడటానికి అర్హులు కాకపోయినా, ప్రశాంతంగా జీవించడానికి మీరు అర్హులు! కాబట్టి వారిని క్షమించేయండి!* *📖 మత్తయి 18:23-35* పదివేల తలాంతులు అప్పు ఉన్నవాడిని తన యజమాని క్షమిస్తే, క్షమాపణ పొందుకున్న వ్యక్తి నూరు దేనారములు అప్పు ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి గొంతుపట్టుకుని అప్పు మొత్తం చెల్లించమని చెప్పాడు. అందుకతడు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, అతన్ని చెరసాలలో వేయించాడు. అది తెలిసినటువంటి యాజమాని అతన్ని పిలిపించి; నీవు చేసింది ఏమిటి? పదివేల తలాంతులు నీవు అప్పు ఉన్నప్పటికీ నిన్ను క్షమిస్తే, నూరు దేనారములు అప్పు ఉన్నవాడిని క్షమించలేకపోయావా? *నేను నిన్ను క్షమించినట్లుగా, నీవు వాడిని క్షమించలేదు గనుక చివరి తలాంతు చెల్లించెంత వరకు నీవు చెరసాలలో ఉండాల్సిందే అని శిక్ష విధించాడు.* ప్రియ సహోదరీ.. సహోదరా! దేవుడు మిమ్మును క్షమించిన ప్రధాన కారణం మీరు క్షమించబడతారని, ఇతరులను క్షమిస్తారని! ఒకరోజు ఒక యజమాని మరియు అతని దగ్గర పనిచేసే కుర్రవాడు కలసి కొంతమంది బానిసలను కొనడానికి మార్కెట్ కి వెళ్లారు. యజమాని ముగ్గురు బలమైన బానిసలను కొన్నాడు, ప్రక్కనే నాలుగోవ ఉన్నాడు. అతను చూడటానికి చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ కుర్రవాడు...అయ్యా! ఈ నాలుగోవ బానిసను కూడా మనం కొందము అని చెప్పాడు. అతను చూస్తే రోగిష్టిలా ఉన్నాడు, అతన్ని కొనుక్కుంటే మనమే అతనికి సేవలు చేయాల్సి వస్తుంది. అతను మనకి వద్దురా అని చెప్పాడు. అప్పుడా కుర్రవాడు; అయ్యా! నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు ఏమి కొరలేదు, మీరు చెప్పిందంతా నేను చేసాను. దయచేసి అతన్ని కొనుక్కుందాము అని ప్రాధేయపడ్డాడు. యజమాని ఆ కుర్రవాడి మాట నమ్మి అతన్ని కొన్నాడు. కొన్నా మూడు రోజులకే మంచం అతడు పట్టేసాడు. అతను చేయాల్సిన పని కూడా ఈ కుర్రవాడే చేసేవాడు, అంతేకాకుండా రోగంతో మంచం మీద పడినప్పుడు ఈ కుర్రవాడు వెళ్లి అతనికి అన్నం పెట్టేవాడు, అతడు మంచం పాడు చేస్తే ఈ కుర్రవాడే వెళ్లి మొత్తం శుభ్రం చేసేవాడు. ఇదంతా అక్కడున్నటువంటి పనివారు గమనించి యజమాని దగ్గరకు వెళ్ళి అయ్యా...ఆ కుర్రవాడు మిమ్మల్ని మోసం చేసాడు. మీరు కొన్నటువంటి ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు ఈ కుర్రవాని యొక్క తండ్రే! అని చెప్పారు. యజమాని ఆ కుర్రవాన్ని పిలిపించి; నన్ను మోసం చేసావు కదా.. అతను నీ తండ్రి అని నాకు ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించాడు. అయ్యా! అతను నా తండ్రి కాదు కాబట్టే చెప్పలేదు. ప్రొద్దుట లేచినప్పటినుంచి వాడికి సకల పరిచర్యలు చేస్తున్నావ్ అంట! నీకు పెట్టిన ఆహారం తీసుకెళ్లి వాడికి పెడుతున్నావ్ అంట! అని యజమాని మరలా ప్రశ్నించాడు. "అవునండి అతనికి ఆరోగ్యం బాలేదు కాబట్టి, ఆహారం సరిపోవడం లేదు కాబట్టి అతనికి నా ఆహారం పెట్టాను" అప్పుడా యజమాని; ఆహారం పెట్టినందుకు కాదు అతను మీ నాన్న అని నాకు ఎందుకు చెప్పలేదు. "మా నాన్న కాదు కాబట్టే చెప్పలేదు, అతనికి నాకు ఏ సంబంధము లేదు" అని ఆ కుర్రవాడు చెప్పాడు. మరి ఎందుకు వాడిని అంతగా ప్రేమిస్తున్నావ్? అని యజమాని అడిగాడు. మా ఇంటిలో నేను ఒక్కన్నే కొడుకుని, మా అమ్మ నాన్న నన్ను అల్లారి ముద్దుగా పెంచుకున్నారు. నేను గొప్పవాన్ని కావాలని నా తల్లిదండ్రులు కలలు కన్నారు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే, ఒక వ్యక్తి నన్ను కిడ్నప్ చేసి మార్కెట్ కు తీసుకువచ్చి అమ్మేశాడు! ఆరోజు నుండి ఈరోజు వరకు నేను మా అమ్మ నాన్నని చూడలేదు. నన్ను కిడ్నప్ చేసి మార్కెట్ లో అమ్మేసి నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదండీ..నేను రోజు సేవలు చేస్తున్నటువంటి ఈ వ్యక్తే! అని చెప్పాడు. అప్పుడా యజమాని; నీకు అంతా ద్రోహం చేసిన వాడికి నువ్వెందుకురా ఇన్ని సేవలు చేస్తున్నావ్? అని అడిగితే, "శత్రువులను క్షమించాలి, శత్రువుకు క్రీస్తు ప్రేమ చూపించాలి” అని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది. నా జీవితంలో నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసిన వీడికంటే గొప్ప శత్రువు ఎవరున్నారు! నా శత్రువుకు క్రీస్తు ప్రేమను చూపించాలనే ఆనాడు ఇతన్ని కొనమని చెప్పాను. కనీసం ఇతను చచ్చిపోయే ముందైనా దేవుని ప్రేమ చూపిస్తే వాడు రక్షించబడతాడాని, క్రీస్తును ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అని యాజమానికి వివరించి చెప్పాడు. *మీ మనసులో క్షమాపణ లేకపోతే, మీరు క్షమాపణను అనుభవించడం సాధ్యము కాదు!* 🔴 *2. రక్షించబడ్డారా - రక్షకుడిని లోకానికి పరిచయం చేయండి :* రక్షింపబడిన మనం రక్షకుడిని(యేసును) లోకానికి పరిచయం చేయాలి. నిత్యము కాలిపోతున్న అగ్నిలో నుండి మనం రక్షించబడ్డాము. రక్షింపబడిన మనం భాగ్యవంతులము! ఓ భక్తుడు ఇలా సెలవిచ్చాడు; రక్షింపబడినవాడు నిజంగా భాగ్యవంతుడు. కానీ రక్షింపబడి గబగబా వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ అగ్నిని చల్లార్చి మరికొంతమందిని రక్షించేవాడు మాహా భాగ్యవంతుడు! ప్రియ సహోదరీ... సహోదరా! మీరు నిజంగా రక్షించబడితే, ఇతరుల రక్షణ కొరకు ప్రయాస పడతారు. *“నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు”* (సామెతలు 11:30). రక్షించబడిన మీరు మరొకరి రక్షణ కొరకు ప్రయాస పడకుండా, ప్రార్థన చేయకుండా ఉంటున్నట్లయితే దేవుడు మీకు ఇచ్చిన రక్షణను ఎంతోకొంత నిర్లక్ష్యం చేస్తున్నారనేది వాస్తవం! *“బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకా శించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు”* (దానియేలు 12:3). ఒక రోజు నేను విమానంలో ప్రయాణం చేస్తుండగా, అనుకోకుండగా విమానం ప్రమాదంగుండా వెళ్ళింది. కాబట్టి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో అర్జెంటుగా లాండ్ అవ్వాలి అని విమాన సిబ్బందివారు తెలియజేశారు. విమానంలో ఉన్నవారందరం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నాం. దేవుని మహా కృపను బట్టి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో లాండ్ చేశారు. విమానం రిపేర్ అయిన తారువాత పిలుస్తాము, మీరు ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్ళి వేట్ చేయండి అని మాకు ఒక పాస్ ఇచ్చి పంపించారు. వెళ్ళి కూర్చున్నాము, మరొక వైపు బాగా ఆకలి వేస్తుంది. నాతో పాటు ఉన్నవాళ్ళందరు రెస్టారెంట్ ముందు కూర్చుని తింటున్నారు. నేను అక్కడికి వెళ్లి చూస్తే రెండు మూడు చికెన్ ముక్కలు 500-600 రూ. రేటు ఉంది. ఇక తప్పక రెండు చికెన్ ముక్కలు ఒక కూల్ డ్రింక్ కొనుక్కుని తిన్నాను. తిన్న తరువాత, విమానం రిపేర్ అయిపోయింది అని సమాచారం వచ్చింది. లైన్ లో విమానంలోకి వెళ్తున్న సమయంలో నా చేతిలో ఉన్న పాస్ ని పరిశీలించి చూస్తే కింద ఈ విధంగా వ్రాసి ఉంది “గమనిక: మీరు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ పోర్ట్ లో దిగారు గనుక, మీరు ఈ ఎయిర్ పోర్ట్ లో ఏమి తిన్నప్పటికి ఉచితంగానే తినవచ్చు” అని వ్రాసి ఉంది. నాతోపాటు ప్రయాణం చేసిన వారందరికీ ఈ విషయం తెలుసు. కానీ నాకు తెలీదు. వారికి తెలిసినప్పటికి నాకు చెప్పలేదు, కనీసం కౌంటర్ లో ఉన్నవాడు కూడా చెప్పలేదు ఫుడ్ ఫ్రీ అని. వారికి తెలిసిన సత్యాన్ని నాకు చెప్పకుండా పడి పడి తినేశారు అని నేను లోలోపల మదనపడిపోతూ ఉంటే, ఆ సమయంలో దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు; “నా కుమారుడా మూడు చికెన్ ముక్కల కోసమే నాకు చెప్పలేదు చెప్పలేదు అని లోలోపల మదనపడిపొతున్నావే...నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు నా ప్రాణాన్నే అర్పించాను. ఈ సత్యాన్ని నీవు లోకానికి తెలియజేయకపోతే నేనెంత బాదపడలో ఒక్కసారి ఆలోచించు. నీకు తెలిసిన సత్యాన్ని ఎంతమందికి తెలియజేయగలవో అంతమందికి తెలియచెయ్యి! ఇది నేను నీకు ఇస్తున్న భాద్యత” అని దేవుడు చెప్పాడు. *రక్షింపబడిన మనం అనేకమందికి రక్షకుడిని పరిచయం చేయడం - మాహాభాగ్యం!* 🔴 *3. దీవించబడ్డారా - దీవెనలను పంచిపెట్టండి :* ఈ లోకంలో ఉన్నవాటికంటే, మనం పొందుకున్న పాప క్షమాపణ, రక్షణ బహు విలువైంది. ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతటినీ తీసుకెళ్ళి ఒక తక్కెట్లో పెట్టినసరే మనకి క్షమాపణ వచ్చే అవకాశం ఉండదు. ఈ భూమి మీద ఉన్న ధనము, వెండి, బంగారం, వజ్రాలు ఒక తక్కెట్లో పెట్టినసరే ఒక్కరు కూడా పరలోకము వెళ్ళడం అసాధ్యం! “యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు” (కీర్తనలు 33:12). *దీవించబడినవారు ధన్యులు!* దేవుడు మనలను దీవించాడు...తన ప్రియ కుమారుడైన యేసును మన కొరకు అనుగ్రహించి, మన జీవితాన్ని ధన్యకరంగా మార్చాడు. దేవుడు మనల్ని దీవించిన కారణం, ఇతరులకు దీవెనకరంగా ఉంటామని. *“నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును”* (సామెతలు 11:10). *“దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును”* (సామెతలు 22:9). *“దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుకతీయక ఇచ్చుచుండును”* (సామెతలు 21:26). మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచకపోతే, మన ఆశీర్వాదము అభివృద్ది చెందడం సాద్యం కాదు! ఒక గురువు గారు తన ఇద్దరి శిష్యులను పిలచి, ఒకడికేమో కాళీ సంచే ఇచ్చాడు, మరొకడికేమో సంచి నిండా అరటి పండ్లు ఇచ్చాడు. ఈ అరటి పళ్ళు సంచే చాలా బరువుగా ఉంది, ఆ ఖాళీ సంచి చాలా తేలికగా ఉంది. ఆ గురువు గారు మొదటి శిష్యునితో; ఈ సంచులో ఉన్న ఈ పండ్లన్ని నీకు కనిపించిన పేదవారికి పంచుకుంటూ పలనా పట్టణానికి చేరుకో అని చెప్పాడు. రెండోవాడికి ఖాళీ సంచి ఇచ్చి; నీకు కావాల్సినవి అన్ని కూడా ఈ సంచులో నింపుకుంటూ ఆ పట్టణానికి వేళ్ళు అని చెప్పాడు. అరటి పండ్లు కలిగిన బరువైన సంచి భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, అది అతనికి చాలా భారంగా ఉంది. అతనికి కనిపించిన పేదవారికి, వృద్ధాశ్రయంలో ఉన్న వృద్ధులకు ఆ అరటి పండ్లు మొత్తం పంచిపెట్టసాడు కొంత దూరం వెళ్లేసరికి ఆ సంచి కాళీ అయిపోయింది. ఫలితంగా అతని ప్రయాణం తెలికగా మారింది! ప్రశాంతంగా ముందుకు సాగిపోయాడు!! రెండోవాడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వాడికి కావాల్సిన వస్తువులు అన్ని కొనుక్కుంటూ సంచి మొత్తం నింపేసుకున్నాడు, అలా నింపుకుంటూ 30 నిమిషాలు ప్రయాణం చేసేసరికి వాడికి కావాల్సిన అన్నిటి చేత ఆ సంచి నిండిపోయింది. బరువు పెరిగిపోయింది, ప్రయాణం భారంగా మారిపోయింది *ప్రియ చదువరీ ❗* ఈ లోక యాత్ర ముగించేరోజు వచ్చినప్పుడు, మీకు ఉన్నదంతా పంచిపెట్టేసి ప్రశాంతంగా వెళ్లిపోతారా? లేదా, అన్ని నాకే కావాలి అని, వాటిని పొందే ప్రక్రియలో సగంలోనే అర్థాంతరంగా మరణించి, మీరు కలిగున్న దీవెనలను విడిచిపెట్టి పోతారా? మీరు మరణించిన తరువాత ఎవరికి ఉపయోగం ఉండదు. *మీరు సంపాధించిన దానిని మీరు బ్రతికున్నప్పుడే పంచిపెట్టేసి, పరలోకంలో ఐశ్వర్యవంతులు కావడం గొప్ప ఆశీర్వాదం!* మీరు కలిగున్న దీవెనలను పంచిపెట్టకపోతే, దేవుడు మిమ్మును దీవించినందుకు బాదపడతాడు. మీరు కలిగున్న దీవెన చిన్న దీవెన కావచ్చు, మీకు ఉన్న స్థితి దీనస్థితి కావచ్చు, ఆ దీనస్థితిలోనే, ఆ చిన్న దీవెనలోనే మీరు చేయగలిగిన సహాయం చేయండి, మీరు పంచి పెట్టగలిగిన దీవెనలను పంచిపెట్టండి!👍🙇‍♀️🙏
#📀యేసయ్య కీర్తనలు🎙 *#ఏప్రిల్_ముగింపు – #కృతజ్ఞత_సమయం* 🌿 👉 *ఇంకా కొన్ని గంటల్లో ఈ నెల ముగిసిపోతోంది… ఏప్రిల్ మన జీవితంలో ఒక అధ్యాయం అయిపోతోంది…* 👉 *ఈ నెలలో మనం నవ్వాం…కొన్ని సార్లు ఏడ్చాం…* *కొన్ని సార్లు అలసిపోయాం…కానీ…* *#ప్రతి_క్షణంలో_దేవుడు_మనతోనే_ఉన్నాడు.* 🔹 *మనకు తెలియని ప్రమాదాల నుండి కాపాడిన దేవుడు…* 🔹 *మన బలహీనతలో బలం ఇచ్చిన దేవుడు…* *మన ఆశలు చనిపోకుండా పట్టుకున్న #దేవుడు…* ✨ *మనం ఇక్కడివరకు వచ్చాం అంటే — అది మన శక్తి కాదు, #దేవుని_కృపే.* ✨ *మనం నిలబడగలిగాం అంటే — అది మన సామర్థ్యం కాదు, #ఆయన_సహాయమే.* 📖 బైబిల్ వాక్యం: *“ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చేయుడి.”* — 1 థెస్సలొనీకయులకు 5:18 💬 *#యువతకి_సందేశం :* 👉 *జీవితంలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోయినా…* 👉 *దేవుడు నీతో ఉన్నాడంటే నీ కథ ఇంకా ముగియలేదు. కృతజ్ఞతతో ముందుకు నడువు — దేవుడు ఇంకా గొప్పగా చేయబోతున్నాడు.* 👉 *గడిచిన నెలను కృతజ్ఞతతో ముగిస్తే... రాబోయే నెలను ఆశీర్వాదంతో ఆహ్వానిస్తాము*
#📀యేసయ్య కీర్తనలు🎙 లేయా ద్వార నేర్చుకొనే పాఠాలు📚 🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎 యాకోబు యొక్క భార్య "లేయా" గురించి పూర్తి వివరాలు..అలాగే లేయా ద్వార నేర్చుకొనే పాఠాలు కూడ ఈ వర్తమానంలో నేర్చుకుందాం పూర్తిగా చదవండి.!* 👉 లేయా అంటే (అడవి ఆవు) అని అర్ధమొస్తుంది. అంతే కాదు "అలసట" అనే అర్ధం వస్తుంది అడవి అవు లేదా అలసట.* 👉 *లేయా సాధు స్వభావం గల సహన శీలీ.* 👉 *లేయా లాభాను యొక్క పెద్ద కూతురు* 👉 *లాభానుకు ఇద్దరు కూతుర్లు పెద్దది "లేయా" చిన్నది "రాహేలు"* ✨️ *యాకోబును మొదటగా వివాహం చేసుకున్నటువంటి భార్య ఈ లేయా.* ఈ లేయా అంత అందమైనది కాదు. రాహేలు లాంటి అందము కూడ లేదు. రాహేలులా అందగత్తె కాకపోయినా..ఆమె ఆత్మీయ సౌందర్యమును బట్టే దేవుడు ఆమెను అత్యధికంగా హెచ్చించాడు. భర్త నిరాధరణ వల్ల క్రుంగిపోయినప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. ✨️ *లేయా తన చెల్లెలైనటువంటి రాహేలు చేత ద్వేషించబడినప్పుడు దేవుడు ఆమెను ఓదార్చాడు.* యూదాకు తల్లియై యూదా గోత్రపు సింహామైన యేసుక్రీస్తు వంశావళిలో నిలిచింది ఈ లేయా. 👉 *"లేయా" గురించినటువంటి కొన్ని పాఠాలు దాని ద్వార నేర్కుకొనే విషయాలు మనం తెలుసుకుందాం.!* ♻️ *మొదటి అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *తనను కోరుకోని వ్యక్తికి భార్య అయ్యింది లేయా* దొంగ పెళ్ళికి బలయ్యింది. యాకోబు రాహేలు కోసం తన మామయైనటువంటి లాభాను దగ్గర ఏడు సంవత్సరాలు కొలువు చేసాడు. కొలువు చేయవలసిన కాలం పూర్తయ్యింది. యాకోబు తన మామతో నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు నాకు ఆజ్ఞ ఇమ్మని చెప్తాడు. లాబాను ఆ ఊరి పెద్దలందరికి విందు చేయించి రాత్రి లేయాను యాకోబు దగ్గరికి పంప్పిస్తాడు. (ఆది,29:21-29) వాక్యాలలో.. ✨️ *యాకోబు కొలువు చేసింది రాహేలు కోసమైతే..ఈ లాభాను లేయాను యాకోబు దగ్గరకు పంప్పిస్తాడు.* తెల్లవారి ఆమె లేయా అని తెలుసుకున్నప్పుడు యాకోబు లాభానుతో నేను రాహేలు కోసం కదా నీ దగ్గర కొలువు చేసింది నీవు నాకేం చేసావని ప్రశ్నిస్తాడు. అందుకు లాభాను అంటాడు పెద్దదాని కంటే చిన్న దానిని ఇవ్వడం అనేది మా దేశ మర్యాద కాదు అని. ఈమె యొక్క వారము సంపూర్ణము చెయ్. ఇంకా ఏడు సంవత్సరాలు నాకు కొలువు చేసిన యెడల అప్పుడు నేను రాహేలును ఇస్తానని యాకోబుతో చెప్తాడు. అలా మరలా ఏడు సంవత్సరాలు పూర్తయిన తరువాత *ఈ లాభాను తన కుమార్తెయైనటువంటి "రాహేలును" యాకోబుకు భార్యగా ఇస్తాడు.* ఈ విధంగా లేయా యాకోబుకు భార్య అయ్యింది. లేయా తనని కోరుకోని వ్యక్తికి భార్య అయ్యింది. ఇష్టం లేని వ్యక్తికి భార్య అయ్యింది. యాకోబు ఇష్టపడతాడా అంటే.? యాకోబు రాహేలు కోసమే చూస్తున్నాడు. తన తండ్రి చేసిన మోసపు పెళ్ళి వల్ల ఎంతో మానసిక వేదనకు భర్త తిరస్కరణకు గురైంది. ✨️ అంతేకాదు ఈ లేయా జబ్బు కళ్ళు కలది అని ఉంటుంది. ఎందుకు అంటే.? ఆమె కళ్ళు సరిగా ఉండవు. రాహేలు రూపవతి,సౌందర్య వతి సుందరి. ఐతే లేయా మాత్రం కళ్ళు చెడ్డవి. యాకోబు బాహ్య సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. లేయా తన భార్య కావడం దేవుని చిత్తమని యాకోబు తలంచడం లేదు. అందుకే పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు. మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించండి అని (ఎఫెసీ,5:17) లో..పండుగ దినాలు,వారాలు,గడచిపోగానే రాహేలు కొరకు ఇంకొక ఏడు సంవత్సరాలు కొలువు చేస్తానని వాగ్దానం చేసి రాహేలును కూడా భార్యగా పొందాడు. నీవు కూడ యాకోబు వలె వెలి చూపును బట్టి ప్రవర్తిస్తున్నావేమో ఆలోచించండి. ✨️ *యాకోబు రాహేలును చాలా ప్రేమించాడు. ఎక్కువగా ఇష్టపడేవాడు.* ఏడు సంవత్సరాలు యాకోబు కొలువు చేస్తే కొద్ది దినాలుగా తోచాయి అంటాడు. అంటే ఆ ఏడేండ్ల శ్రమ కూడా కొన్ని దినాలలాగే తోచాయి అని. ఇలా మీ తప్పు కాకున్నా ఏ తప్పు లేకున్నా కూడా వేరొకరు చేసిన పొరపాటుకు నీ జీవితంలో బలైపోవాల్సిన పరిస్థితితులు కూడా ఉంటాయ్. నీ జీవితం బాధ పడే పరిస్థితి కూడా వస్తుంది. దేవుని పై ఆధారపడండి. లేయాను ఓదార్చిన దేవుడు మిమ్మల్ని కూడ ఓదారుస్తాడు. నమ్మకముంచండి.! ♻️ *ఇక రెండవ అంశం* 🟩🟫⬛⬜🟧🟥🟨🟦🟩🟪 ✨️ *దేవుని చేత ఆదరించబడింది లేయా* లేయా తాను భర్త చేత ప్రేమించబడాలని ఎంత గానో ఎదురు చూసింది. భర్త ప్రేమ కోసం పరితపించపోయింది. ఐతే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. లేయా ద్వేషించబడటం చూసినటువంటి దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ✨️ మనుషులు మనల్ని త్రునీకరించినప్పుడు మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఆ దేవుడు తన చేతులు చాపుతున్నాడు. *సంతానం ద్వార దేవుడు లేయాకు ఆదరణ కలిగించాడు.* నీవు ఎవరి చేతనైన ద్వేషించబడి నిరాధారణకు గురైతే నీవు ప్రేమించే వారి నుంచి ఎప్పుడైనా దూరం చేయబడితే అలాంటి పరిస్థితుల్లో నిన్ను ఆదరించడానికి నీ ఆధరణ కర్త సిద్ధంగా ఉన్నాడు. అలా దేవుని చేత ఆదరించబడింది ఈ లేయా అలాగే సంతానాన్ని పొందిది లేయా (ఆదికాండము,29:31,32) వాక్యాలలో... ♻️ *మూడవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *దేవున్ని స్తుతించింది లేయా యాకోబు వలన నిరాధరణ పొందిన లేయాను దేవుడు చూసాడు. ఆదరించాడు. లేయాకు మొదటి కుమారుడ్ని ఇచ్చాడు "రూబేను" రూబేను ను పొందినప్పుడు ప్రభువు తన శ్రమను చూసాడు అని గ్రహించింది. తరువాత "షిమ్యోను" పుడతాడు షిమ్యోనును పొందినప్పుడు తాను ద్వేషించబడ్డాను అను సత్యాన్ని దేవుడు విన్నాడు కాబట్టి షిమ్యోనునిచ్చాడు అని గ్రహించింది. ✨️ ఆ తరువాత "లేవి" లేవిని పొందినప్పుడు కూడా తన భర్త ఇంకా ప్రేమిస్తాడేమో ఇకనైన ప్రేమిస్తాడేమో అని ఆశించింది. ఐతే నాలుగవ కుమారుడు "యూదా" యూదా కలిగినప్పుడు తన దృష్టిని భర్త నుండి దేవుని వైపు మలచుకోవాలని నా దేవున్ని నేను స్తుతిస్తాను అని నిర్ణయించుకుంది లేయా. నిర్నిమిత్తంగా ద్వేషించబడిన లేయా తన దృష్టి సరియైన వైపుకే త్రిప్పుకోగలిగింది. (ఆదికాండము,29:35) వాక్యాలలో.. ✨️ మీరు ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో బాధల్లో ఎవరి వైపు చూస్తున్నారు. ఇతరుల చేత ద్వేషించబడుతున్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు. మీరు లోకం నుంచి మీ చూపును మలచుకొని సృష్ఠి కర్తయైన దేవుని వైపు చూడగలుగుతున్నారా.? నీ ప్రభువు నిన్ను మర్చిపోలేదు. నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అని గ్రహించాలి. ✨️ ఇంకా ఎంత కాలం లోకం వైపు చూస్తాం. లోకాన్నే ప్రేమిస్తాం. ఆదరణ కొరకు ఎదురు చూస్తాం. నిన్ను ఆదరించాలని దేవుడు తన గాయపడిన హస్తాన్ని నీవైపు చూపిస్తున్నప్పుడు నీకు సేద తీర్చాలి అని ఆశిస్తున్నప్పుడు మీరు చూడాలి. తన సొంత భర్త చేత అలాగే సొంత చెల్లెల్ల చేత ద్వేషించబడిన లేయా తన నిరాధరణ స్థితిలో తనకు మనశాంతి నిచ్చే దేవునిలో ఆనందించడానికి తీర్మానించుకుంది. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిజానికి లేయా తన భర్త వల్ల నిరాధరణకు గురి కాకపోతే దేవునికి ఇంత దగ్గరయ్యేది కాదేమో యాకోబు అత్యధికంగా ప్రేమించాడు రాహేలును.. ✨️ భర్త ప్రేమించిన రాహేలు దేవుని వల్ల మేలు పొంది కూడా గృహ దేవతలను దొంగిలించి బేతేలుకు బయలు దేరింది. యాకోబు నిరాధరణ,రాహేలు అసూయ,లేయాకు బలమయ్యాయ్. లేయాను దేవునికి దగ్గర చేసాయ్. ✨️ మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి శ్రమలు కూడా మనల్ని దేవునికి సమీపంగా దగ్గరగా చేయడానికే అని మనం గ్రహించాలి. దేవుడు మనకు అభయమిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను నిలువబెట్టే శక్తి మంతుడు దేవుడే. ♻️ *నాలుగవ అంశం* 🟪🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *భాగ్యవతి అని పిలిపించుకుంది లేయా భాగ్యవతియైనది లేయా. లేయా యాకోబు ప్రేమ కోసం ప్రాకులాడింది గానీ పొందలేకపోయింది. తన దృష్టిని మనుషుల వైపు నుంచి దేవుని వైపుకు మలచుకుంది. లేయా దేవున్ని స్తుతించాలి అని తీర్మానించుకుంది. తనకి సంతానం ఇంక కలిగే అవకాశం లేదని గ్రహించింది. ✨️ లేయా తన దాసియైనటువంటి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. లేయా దాసి "జిల్పా" యాకోబుకు భార్యగా ఇచ్చింది. ఆమె ద్వార "గాదు" అనేటువంటి కుమారుడ్ని పొందింది. ఇది కూడా అదృష్టమే అనుకున్నది. *నిజమే లేయా దేవునిలో చాలా భాగ్యవంతురాలు.* లేయా ఫలించిన ద్రాక్షా వల్లి. ఎందుకంటే.? దేవుని యందు భయభక్తులు గల వారు ఇలా ఆశీర్వదించబడతారాని బైబిల్ చెప్తుంది. ✨️ లేయా తన కుమారుడు తెచ్చినటువంటి పుత్ర దాత ఫలాన్నిచ్చి యాకోబును కొనుక్కున్నది. దేవుడు ఆమె మనవి విని ఆమెకు ఇంకా ఇద్దరు కుమారులను ఇచ్చాడు. ఒక్క కుమార్తెను కూడా ఇచ్చాడు. వారే "ఇశ్శాఖారు" "జెబూలోనూ" అలాగే కుమార్తె "దీనా" లేయాను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను పొందింది. (ఆదికాండము,30:9-13) వాక్యాలలో... ✨️ దేవునికి దగ్గరై ఆయన చేత ఆశీర్వదించబడింది లేయా దేవుడు అబ్రాహాతో చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చడానికి ఆయన వెలుపలికి తీసుకవచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాలు లెక్కించుము నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానాన్ని అలా చేస్తాను అని చెప్పాడు. అంత ధన్యత పొందింది భాగ్యురాలుగా ఉంది లేయా. ♻️ *ఐదవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *భర్తకు సహకరించింది లేయా* భర్తకు సహకరిస్తూనే ఉంది. యాకోబు దేవుడు తనతో మాట్లాడిన ప్రకారం లాభానును హారానును విడచి బేతేలు వెళ్ళాలి అని తీర్మానించుకుంటాడు. రాహేలుతో పాటు లేయా కూడా అందుకు సమ్మతించింది. దేవుడు నీతో చెప్పినట్లే చేయమని చెప్పింది. దేవుడు ఏం చెప్పాడో అలాగే చేయమని చెప్పింది ఎంత విశ్వాసమో చూడండి. భర్తతో ఏకీభవించే మనస్తత్వం కూడా ఉంది లేయాకు. (ఆదికాండము,31:16) వాక్యాలలో ✨️ మనము కూడ..మీరు కూడా మీ భర్తతో ఏకీభవించాలి ప్రతీ సారి. దేవుడు కోరుకున్న విధంగా లేయా యాకోబుకు సాటియైన సహాయంగా ఉన్నది. మరి మీరెలా ఉంటున్నారు.? మీరు మీ స్వపురుషునికు లోబడి ఉండాలి అదే వాక్యం మనకు చెప్తుంది (1పేతురు,3:1) వాక్యంలో.. ♻️ *ఆరవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *దేవుని నడుపుదలనే కోరుకున్నది లేయా* లేయా యాకోబు వల్ల నిరాధరించబడింది. రాహేలు వల్ల ద్వేషించబడింది. అలాంటి స్థితిలో లేయా తండ్రి ఇంట ఉంటే ఆమెకు తండ్రి అండ ఉంటుంది. ఐతే లేయా యాకోబు మాటలకు లోబడి ఇష్టపూర్వకంగా తండ్రి ఇల్లు వదిలి భర్తతో దూర ప్రాంతానికి వెళ్ళడానికి సిద్దపడింది. దీనంతటికి కారణం ఒకటే.? అదే లేయా దేవునిపై ఆధార పడటం. ఆధారపడింది. అందుకే ఇలా అంటుంది దేవుడు మీతో చెప్పిందల్లా చేయమని. అదే తండ్రి ఇల్లు వదిలేటప్పుడు రాహేలు మాత్రం గృహ దేవతలను దొంగిలించింది. ఆ దేవతలు తనకు సహాయపడతాయేమో అని రాహేలు అనుకుంది. ఐతే లేయా మాత్రం దేవతలను విగ్రహాలను ఆశ్రయించలేదు. *జీవం గల దేవున్నే నిజంగా ఆశ్రయించింది.* అందుకే గృహ దేవతలను తెచ్చుకోలేదు. (ఆదికాండము,32:3-23) వాక్యాలలో.. ✨️ యాకోబు అన్న ఏశావు. ఏశావు ఎదుర్కొని వస్తున్నాడని విని యాకోబు తన సంపదను మనుష్యులను గుంపులుగా చేసాడు. దాసీలను వారి పిల్లలను ముందుంచాడు. వారి వెనుక లేయాను ఆమె సంతానాన్ని ఉంచాడు. చిట్ట చివరన తనకు ఇష్టమైనటువంటి భార్య రాహేలును ఆమె కుమారుడు యోసేపును ఉంచాడు. ఒకవేళ ఏశావు హాని చేస్తే గనుక దాసీలు వారి పిల్లలకు,లేయాకు,ఆమె సంతానానికి కూడా ప్రమాదమే. ఆ తర్వాతే రాహేలు ఎదుర్కోబడుతుంది. ఎలాంటి వ్యత్యాసాలు చూసినా లేయా అంత ఓర్పు వహించిందో చూడండి. ✨️ *లేయా దేవునిపై ఆధారపడింది గనుకనే ఇలాంటి సుగుణాలు చూపగలిగింది.* మరి మీరెలా ఉంటున్నారో ఆలోచించండి.? ఆయనపై ఆధారపడుతున్నారా.? పూర్తిగా ఆదారపడి ప్రతీ శ్రమను ఓర్చుకుంటున్నారా.? ఆయన యందు విశ్వాసముంచువారు ఎప్పటికి కూడా సిగ్గు పరచబడరు. *ఓర్చుకున్నవారికి దేవుడు తప్పక ప్రతి ఫలమిస్తాడు.* మన శ్రమలలో గానీ,కష్టాలు వచ్చినప్పుడు గానీ,లేయా వలె దేవునిలో నిరీక్షణ కలిగి ఉండాలి అని మనకు తెలియజేస్తుంది.! ♻️ *ఏడవ అంశం* 🟫⬛⬜🟧🟥🟨🟦🟫🟩🟪 ✨️ *కుమార్తె వల్ల బాధ పడింది లేయా* కుమార్తె ప్రవర్తన వలన వేదన పడింది లేయా. షెకెము అనేటువంటి ఊరు ముందర యాకోబు గుడారం వేసాడు. దీనా ఆ దేశపు కుమార్తలను చూడటానికి వెళ్ళింది. ఆ దేశ నేత హమోరు. హమోరు కుమారుడైనటువంటి షెకెము దీనాను చెర పట్టి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో అవమాన కరమైనటువంటి కార్యము. చేయరానటువంటి పని. కనుక కోపంతో లేయా కుమారులైనటువంటి లేవి షిమ్యోనులు ఆ ఊరు వారందరిని కూడా చంపి దీనాను ఇంటికి తెచ్చారు. (ఆదికాండము,34) వ అధ్యాయంలో. ఆ తర్వాత షెకెము ప్రాంతాన్ని విడచిపెట్టి బేతేలుకు వెళ్తారు. దీనా గురించినటువంటి విషయాన్ని అంతటిని కూడా ఒక మెసేజ్ లో వివరించాను గనుక అది కూడా చదవండి. ఐతే తర్వాత కాలంలో దీనాకు వివాహమైనట్లు కనపడలేదు. యోసేపు యాకోబు కుటుంబాన్నంతా కూడ ఐగుప్తుకు పిలిపించినప్పుడు దీనా తండ్రి ఇంటనే ఉన్నది అని మనకు తెలుస్తుంది. ✨️ దీనా లేయాకు ఒక్క గానొక్క కుమార్తె. ఆమె ముద్దు ముచ్చట తీరలేదు. దీనా వల్ల లేయాకు తన చివరి దశలో ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుందో అలోచించండి. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే.? మీ పిల్లలను ప్రభువు భోధనలో క్రమశిక్షణలో పెంచాలి అని బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది (ఎఫెసీ,6:4) వాక్యంలో ✨️ మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు.? వారి ప్రవర్తన మారుతుంది..ప్రవర్తన వల్ల కుటుంబంలో ఆనందానికి తావు ఉండదు. ఇందు విషయమై ప్రభువు యొక్క శక్తిని జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఒక్కొక్క సారి పిల్లల వల్ల కాదు ఎదురయ్యేటువంటి ప్రమాదం వల్ల..ఎదురయ్యేటువంటి వ్యక్తుల వల్ల..కూడా ప్రమాదం పొంచి వస్తుంది ఆలోచించండి.! ♻️ *ఎనిమిదవ అంశం* 🟪🟩🟫⬛⬜🟧🟥🟨🟦 ✨️ *అధిక్యత పొందింది లేయా* యాకోబు ఇశ్రాయేలియుల 12 గోత్రాలను కూడా దీవించాడు. దీవించి ఇలా చెప్తాడు. హిత్తియుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రి యొద్ద నన్ను పాతి పెట్టండి.ఆ గుహ కానాను దేశమందలి మమ్రే యెదుట మక్పేలా పొలంలో ఉంది. అబ్రాహాము దానిని హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద స్మశాన భూమి కొరకు స్వాస్థ్యంగా కొన్నాడు. అక్కడే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్యయైనా రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను కూడా లేయాను పాతి పెట్టాను అంటాడు. అంటే లేయా మరణించింది. పితరుల యొద్ద పాతి పెట్టబడింది. ✨️ ఐగుప్తు చేరిన యాకోబు కూడ తాను చనిపోయిన తర్వాత లేయా వద్దనే పాతి పెట్టబడాలని కోరుకుంటున్నాడు ఇది ఎంత ఆదిక్యత. రాహేలు ఎఫ్రాత మార్గంలోనే మరణించి సమాది చేయబడింది. ఐతే లేయా మాత్రం పితరుల యొద్ద సమాది చేయబడింది. ✨️ ఈ లేయా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన స్త్రీ. దేవుని వాగ్ధానము అబ్రహముకిచ్చిన వాగ్ధానం ప్రకారం ఈమె వంశాభివృద్ధికి దేవుడు వాడుకున్నటువంటి స్త్రీ. దేవుడు పిలిచిన బేతేలుకు చేరి వాగ్ధాన దేశంలో మృతి పొంది పితరుల యొద్ద చేర్చబడింది లేయా ధన్యజీవి. ✨️ అందము లేనప్పటికి బాహ్య సౌందర్యము కంటే అంతర్గ సౌందర్యం కలిగి బెత్లేహేము ప్రజల చేత కీర్తించబడిన స్త్రీ లేయా. ✨️ ఆయన యందు విశ్వాసముంచు వారు ఎప్పటికి సిగ్గుపరచబడరు అనే వాగ్దానం రుజువు చేయబడింది లేయా విషయంలో..లేయా వలె అంతర్గ సౌందర్యవతిగా ఉండటానికి ప్రభువును ఆశ్రయించి ఆయన ద్వార మనము కూడా అనేక ఈవులను పొందడానికి సిద్ధపడండి.!
#📀యేసయ్య కీర్తనలు🎙 కొరకు కోర్టు మెట్లు ఎక్కిన అన్నదమ్ములు - కేసును చూసి షాక్ కు గురి అయిన జడ్జి:* *విచిత్ర సంఘటన…* *ఇటీవల సౌదీ రియాద్ హైకోర్ట్ లో ఒక కేసు బెంచ్ ముందుకొచ్చింది. జడ్జి కేసు చదువుతుండగా కేసు వేసిన వారు అన్న దమ్ములు. అన్న వయస్సు 80 సం.రాలు, తమ్ముని వయస్సు 70 సం.రాలు. బహుశా ఇది ఆస్తి కి సంభందించిన కేసు ఏమో! ఇంత పెద్ద వయస్సులో వీరికి ఆస్తి ఎందుకో అనుకుంటూ కేసు పూర్తిగా చదివాకా జడ్జి కి దిమ్మ దిరిగింది. ఇంత వరకు ఇటువంటి కేసు తన ముందుకు రాలేదు. వారికి ఆస్తి పాస్తులు కూడ ఎక్కువ లేవు.* *కేసు పూర్వ పరాలు ఏమిటంటే తన అన్న వద్ద తల్లి ( 110 సం.రాలు. ) గత 40 సం.రాలుగా ఉంటుంది. ఆలనా పాలన బాగానే చూసుకుంటాడు. తమ్ముని బాధ ఏమిటంటే తన తల్లిని తన వద్దకు పంపమని, సంవత్సరాల తరబడి ప్రాదేయబడ్డా కూడ తన అన్న తల్లిని తమ్ముని వద్దకు పంపడం లేదు. జడ్జి ఇద్దరినీ పిలిచి విడి విడిగా మీరే ఒక నిర్ణయానికి రండి అని అడిగాడు, కానీ ఇద్దరు అన్నదమ్ములు కూడ తల్లి తన వద్దనే ఉండాలని పట్టుబట్టారు. తుదకు తల్లిని స్ట్రెచ్చర్ లో కోర్టులో హాజరు పర్చారు. జడ్జి తల్లిని అడిగాడు ఎవరి వద్ద ఉంటావు అని, అప్పుడు ఆ తల్లి తనకు ఇద్దరు కుమారులు సమానమేననీ, ఇంతకన్నా ఏమి చెప్పలేనని, మీరు ఏం చెప్తే నేను అక్కడే ఉంటాను కానీ నేను ఎవరి మనసును గాయ పరిచలేను అంది.* *జడ్జి ఇద్దరన్నదమ్ముల ఆరోగ్య సమాచారం సేకరించి తల్లిని తమ్ముని వద్ద ఉండాలని ఆదేశించాడు. ఆ ఆదేశాలతో అన్న అక్కడే కుప్పకూలి పోయాడు. ఇది ప్రేమ అంటే...ఈ రోజుల్లో తల్లి తండ్రులను పోషించలేక కొట్టి చంపడమో, లేక వృద్ధ శ్రమంలో చేర్పించడమో లేక వంతుల వారిగా పోషించడమో చూస్తున్నాము కానీ ఇటువంటి కేసు వినలేదు. తల్లి తండ్రుల పాదాల కింద స్వర్గం ఉంటుందని ఎంత మందికి తెలుసు. అందుకే తమ పిల్లలకు చిన్నప్పటి నుండి ఇంట్లో మరియు బడులలో వారి విలువలను గుర్తించేటట్లు బోధించాలి.*