v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
https://youtube.com/watch?v=EL9NJ_55KQo&si=TUnRCCUxnUBKtp6h #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా
youtube-preview
https://youtube.com/watch?v=y-ht6jyux9A&si=2aKGQY7ZjfzqJyKc #📙ఆధ్యాత్మిక మాటలు #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి
youtube-preview
#🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు 14-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రియే నంబరు వన్ పాత్రధారి, వారు పతితులను పావనముగా తయారుచేసే పాత్రను అభినయిస్తారు, తండ్రి వంటి పాత్రను ఎవ్వరూ అభినయించలేరు’’ ప్రశ్న:-సన్యాసుల యోగము భౌతిక యోగము, ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు, ఎలా? జవాబు:-సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడించడము నేర్పిస్తారు. కానీ అది నివసించే స్థానము. కావున అది భౌతిక యోగము అవుతుంది. తత్వాన్ని సుప్రీమ్ అని అనరు. పిల్లలైన మీరు సుప్రీమ్ ఆత్మతో యోగము జోడిస్తారు, అందుకే మీ యోగము ఆత్మిక యోగము. ఈ యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పించగలరు, ఇంకెవ్వరూ నేర్పించలేరు ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట:-నీవు ప్రేమ సాగరుడవు... ▶ ఓంశాంతి. పిల్లలూ, చాలామంది ఓం శాంతి అని అంటారు అనగా తమ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు కానీ వారు స్వయం ఏమీ అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలను చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడని అంటారు కానీ అలా కాదు. ఇక్కడ ఆత్మ ఓం శాంతి అని అంటుంది. ఆత్మనైన నా స్వధర్మమే శాంతి, అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరము, దీనితో నేను కర్మలను చేస్తాను. ఇది ఎంత సహజము. అలాగే తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. కానీ నేను అందరికీ తండ్రినైన కారణముగా, బీజరూపుడినైన కారణముగా రచన రూపీ వృక్షము అనగా కల్పవృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి నాకు తెలుసు. మీరు ఏ వృక్షాన్ని చూసినా సరే, దాని ఆదిమధ్యాంతాలను తెలుసుకోగలరు, ఆ బీజమైతే జడమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది కల్పవృక్షము, దీని ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకోలేరు, అవి నాకు తెలుసు. నన్ను జ్ఞానసాగరుడు అనే అంటారు. నేను కూర్చుని పిల్లలైన మీకు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నాను. ఈ నాటకాన్ని డ్రామా అని అంటారు, ఇందులో మీరు పాత్రధారులు. తండ్రి అంటారు, నేను కూడా పాత్రధారినే. పిల్లలంటారు - ఓ బాబా, పతిత-పావనా, పాత్రధారిగా అయి రండి, వచ్చి పతితులను పావనముగా తయారుచేయండి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పాత్రను అభినయిస్తున్నాను, నా పాత్ర కేవలం ఈ సంగమ సమయములోనే ఉంటుంది. నాకు నాదంటూ శరీరము లేదు. నేను ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. నా పేరు శివ. పిల్లలకే అర్థం చేయిస్తాను కదా. పాఠశాల కోతులకో, జంతువులకో ఉండదు. కానీ తండ్రి అంటారు, ఈ 5 వికారాలు ఉన్న కారణముగా ముఖము మనుష్యుల వలె ఉంది కానీ పనులు కోతుల వలె ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, అందరూ తమను తాము పతితులుగానే చెప్పుకుంటారు కానీ మనల్ని పతితముగా ఎవరు తయారుచేస్తారు మరియు మళ్ళీ పావనముగా ఎవరు వచ్చి తయారుచేస్తారు అనేది వారికి తెలియదు. పతిత-పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో, వారి గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోతారు. మేమంతా పాత్రధారులమని కూడా వారికి తెలియదు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాను. ఆత్మ పరంధామము నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఆటంతా భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ పావనముగా ఉండేది, భారత్ ను పతితముగా ఎవరు తయారుచేసారు. రావణుడు. రావణుడి రాజ్యము లంకలో ఉండేదని అంటూ ఉంటారు కూడా. తండ్రి అనంతములోకి తీసుకువెళ్తారు. ఓ పిల్లలూ, ఈ సృష్టి అంతా అనంతమైన ద్వీపము. అదైతే హద్దు లంక. ఈ అనంతమైన ద్వీపముపై రావణుడి రాజ్యముంది. ముందు రామ రాజ్యము ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యము ఉంది. బాబా, రామ రాజ్యము ఎక్కడ ఉండేది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, పిల్లలూ, అది ఇక్కడే ఉండేది కదా, దానిని అందరూ కోరుకుంటారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, మీరు హిందూ ధర్మానికి చెందినవారు కారు. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలూ, మొట్టమొదట మీరే భారత్ లో ఉండేవారు. మీకు ఆ సత్యయుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ యే ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంతమంది ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ముసల్మానుల రాజ్యము ఉన్నప్పుడు, చాలామందిని ముసల్మానులుగా చేసారు. క్రిస్టియన్ల రాజ్యము ఉన్నప్పుడు చాలామందిని క్రిస్టియన్లుగా చేసారు. బౌద్ధులదైతే ఇక్కడ రాజ్యము లేకపోయినా సరే చాలామందిని బౌద్ధులుగా చేసారు, తమ ధర్మములోకి కన్వర్ట్ చేసారు. ఆది సనాతన ధర్మము కనుమరుగైపోయినప్పుడే మళ్ళీ ఆ ధర్మ స్థాపన జరుగుతుంది. కనుక తండ్రి భారతవాసులైన మీ అందరికీ చెప్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మీరందరూ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ... వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణములోకి వెళ్ళేందుకని బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడుతారు కూడా, ముందు బ్రాహ్మణుల పేరును తీసుకుంటారు. బ్రాహ్మణులే భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇది ఉన్నదే భారత్ యొక్క ప్రాచీన యోగము. మొట్టమొదట ఏదైతే రాజయోగము ఉండేదో, దాని గురించే గీతలో వర్ణన ఉంది. గీతలో ఉన్న యోగాన్ని ఎవరు నేర్పించారు? ఈ విషయాన్ని భారతవాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, యోగాన్ని అయితే నేనే నేర్పించాను. ఇది ఆత్మిక యోగము. మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైనవారు భౌతిక యోగాన్ని నేర్పిస్తారు అనగా బ్రహ్మతత్వముతో యోగము జోడించమని నేర్పిస్తారు. అది రాంగ్ అవుతుంది. బ్రహ్మతత్వమైతే నివసించే స్థానము. అదేమీ పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విదేశాలలో యోగము ఉండేది కాదు. హఠయోగము మరియు రాజయోగము ఇక్కడే ఉన్నాయి. ఆ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. దాని గురించి తెలిసినవారే నేర్పించాలి. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయారు. అతని కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్యాన్ని విడిపించేవారు, అటువంటివారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు. ఈ సమయములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడిక పడిపోవడానికి సిద్ధముగా ఉంది. ఏ వృక్షమైనా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు, చివర్లో దానిని పడగొట్టవలసి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము కూడా తమోప్రధానముగా ఉంది, ఇందులో ఎటువంటి సారము లేదు. ఇది తప్పకుండా వినాశనము చెందుతుంది. దాని కంటే ముందే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఇక్కడ స్థాపన చేయవలసి ఉంటుంది. సత్యయుగములో ఎవరూ దుర్గతిలో ఉండరు. మనుష్యులు విదేశాలకు వెళ్ళి యోగాన్ని నేర్పిస్తారు కానీ అది హఠయోగము, అందులో జ్ఞానము అసలు ఉండదు. అనేక రకాల హఠయోగాలు ఉన్నాయి. ఇది రాజయోగము, దీనిని ఆత్మిక యోగమని అంటారు. అవన్నీ భౌతిక యోగాలు. అవి మనుష్యులు మనుష్యులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, నేను మీకు ఒక్కసారి మాత్రమే ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను, ఇంకెవ్వరూ ఎప్పటికీ నేర్పించలేరు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులు ఎప్పుడూ ఈ విధముగా చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది కొత్త విషయము. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహీ-అభిమానులుగా తయారుచేస్తున్నారు. తండ్రికి దేహము లేదు. వీరి తనువులోకి వచ్చి, వీరి పేరును మారుస్తారు ఎందుకంటే మరజీవాగా అయ్యారు. గృహస్థులు సన్యాసులుగా అయినప్పుడు మరజీవాగా అవుతారు, గృహస్థాశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని చేపడతారు. కనుక మీరు కూడా మరజీవాగా అవ్వడముతో పేర్లు మారుతాయి. ప్రారంభములో అందరి పేర్లు తీసుకువచ్చారు, కానీ తర్వాత కొంతమంది ఆశ్చర్యము కలిగించేలా విని, వర్ణించి, పారిపోయారు, కావున పేర్లు ఇవ్వడము ఆగిపోయింది, అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను పేరు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ వారు పారిపోతే అది వృధా అయిపోతుంది. ముందు వచ్చినవారికి ఏవైతే పేర్లు పెట్టారో, అవి చాలా రమణీకముగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడము లేదు. ఎవరైతే సదా స్థిరముగా నిలిచి ఉంటారో, వారికే పేర్లు పెట్టడము జరుగుతుంది. చాలామందికి పేర్లు పెట్టారు, కానీ తర్వాత తండ్రిని వదిలి పారిపోయారు, అందుకే ఇప్పుడు పేర్లు మార్చడము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానము క్రిస్టియన్ల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. భారత్ యొక్క యోగాన్ని నిరాకార తండ్రియే వచ్చి నేర్పించారని ఇంతమాత్రం అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే పాపాలు భస్మమవుతాయి మరియు మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే కన్వర్ట్ అయిపోయి ఉంటారో, వారు నిలుస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరని మీకు తెలుసు. ఈ దాదా కూడా మనిషే, వీరు అంటారు, నేను ఎవరికీ సద్గతినివ్వలేను. మీ సద్గతి కూడా స్మృతి ద్వారానే జరుగుతుందని బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, ఓ ఆత్మలూ, నాతో యోగము జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు మొదట బంగారుయుగము వారిగా, పవిత్రముగా ఉండేవారు, ఆ తర్వాత మాలిన్యము చేరుకుంది. ఎవరైతే మొదట దేవీ-దేవతలుగా, 24 క్యారెట్ల బంగారముగా ఉండేవారో, వారు ఇప్పుడు ఇనుపయుగములోకి వచ్చి చేరుకున్నారు. ఈ యోగాన్ని కల్ప-కల్పము మీరు నేర్చుకోవలసి ఉంటుంది. ఇందులో కూడా కొంతమంది పూర్తిగా తెలుసుకుంటారు, కొంతమంది తక్కువగా తెలుసుకుంటారని మీకు తెలుసు. కొంతమంది ఇక్కడ ఏమి నేర్పిస్తున్నారు అని ఊరికే చూడడానికి వస్తారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు కదా, ఇంతమంది వారికి పిల్లలుగా అయ్యరు, తప్పకుండా ఇక్కడ ఏదో ఉండి ఉంటుంది, కావుననే వెళ్ళి వారిని అడిగి చూద్దాము అని అనుకుంటారు. మీకు ప్రజాపిత బ్రహ్మా నుండి ఏమి లభిస్తుంది? అడగాలి కదా! కానీ ఈ మాత్రము బుద్ధి కూడా ఉండదు. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యారు, పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అయ్యారని అంటూ ఉంటారు - విశేషముగా భారత్ కోసమే ఇలా చెప్తారు. సత్య, త్రేతాయుగాలలో పారసబుద్ధి కలవారిగా, బంగారుయుగము వారిగా ఉండేవారు, ఆ తర్వాత వెండియుగములో రెండు కళలు తగ్గిపోయాయి, అందుకే చంద్రవంశీయులు అన్న పేరు వచ్చింది, ఎందుకంటే ఫెయిల్ అయిపోయారు. ఇది కూడా ఒక పాఠశాల. ఎవరికైతే 33 మార్కుల కన్నా తక్కువ వస్తాయో, వారు ఫెయిల్ అయిపోతారు. సీతా-రాములు మరియు వారి వంశావళి సంపూర్ణము అవ్వలేదు, అందుకే వారు సూర్యవంశీయులుగా అవ్వలేరు. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు కదా ఎందుకంటే పరీక్ష కూడా చాలా పెద్దది. పూర్వము ఐ.సి.ఎస్ అని గవర్నమెంట్ కు సంబంధించిన పెద్ద పరీక్ష ఉండేది. అందరూ దానికి చదవలేకపోయేవారు. కోట్లలో కొంతమందే వెలువడుతారు. మేము సూర్యవంశీ మహారాజా, మహారాణిగా అవ్వాలని ఎవరైనా కోరుకుంటే, మరి దానికి కూడా చాలా కృషి అవసరము. మమ్మా, బాబా కూడా శ్రీమతమనుసారముగా చదువుకుంటున్నారు. వారు మొదటి నంబరులో చదువుకుంటారు, మిగతా ఎవరైతే మాత-పితలను ఫాలో చేస్తారో, వారే వారి సింహాసనముపై కూర్చుంటారు. సూర్యవంశీయులది 8 తరాలు నడుస్తుంది. ఏ విధముగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, ది సెకెండ్ అన్న తరాలు నడుస్తాయి కదా. మీకు ఈ క్రిస్టియన్లతో ఎక్కువ కనెక్షన్ ఉంది. క్రిస్టియన్ వంశము భారత్ యొక్క రాజ్యాన్ని మింగేసింది, వారు భారత్ యొక్క అపారమైన ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. మరి ఆలోచించండి, సత్యయుగములో ఎంత అపారమైన ధనము ఉండి ఉంటుంది. అక్కడితో పోలిస్తే, ఇక్కడ అసలు ఏమీ లేదు. అక్కడ అన్ని గనులు నిండుగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి వస్తువుకు సంబంధించిన గనులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ చక్రము రిపీట్ అయినప్పుడు అన్ని గనులు నిండిపోతాయి. మధురాతి మధురమైన పిల్లలూ, మీరు ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటున్నారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఈ రావణుడు వస్తాడు, అప్పుడు మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతవాసులైన మీరు గవ్వ సమానముగా అయిపోయారు. నేను మిమ్మల్ని వజ్ర సమానముగా తయారుచేసాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానముగా తయారుచేసాడు. ఈ రావణుడు ఎప్పుడు వచ్చాడు, అతడిని మనము ఎందుకు కాలుస్తున్నాము అనేది ఎవరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడైతే పరంపరగా ఉన్నాడని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అర్ధకల్పము తర్వాత ఈ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. వికారులుగా అయిన కారణముగా తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. అందరికన్నా ఎక్కువ పేదవారిగా కూడా మీరే అయ్యారు. ఇతర ధర్మాలవారు తర్వాత వృద్ధి చెందుతారు. క్రైస్టు వచ్చారు, మొదటిలో చాలా కొద్దిమందే ఉండేవారు. చాలామంది తయారైనప్పుడు రాజ్యము చేయగలుగుతారు. మీకైతే ప్రారంభములోనే రాజ్యము లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే అర్ధకల్పము యొక్క తుప్పు పట్టి ఉంది. ఈ సమయములో బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడిస్తారు. దాని వలన వికర్మలు వినాశనమవ్వవు. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాల్సిందే. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తారు అనగా అందరి జ్యోతులు వెలుగుతాయి. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. మీరు హీరో-హీరోయిన్ పాత్రధారులు. భారతవాసులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు, మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని ఈ విధముగా తీసుకోరు. వారు బాహుబలముతో రాజ్యాన్ని తీసుకుంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే మళ్ళీ అవుతారు. కావున సత్యమైన రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. మనుష్యులు ఏదైతే నేర్పిస్తారో, అదంతా అయథార్థమైన యోగము. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు ఇది అంతిమము. అందరూ దుఃఖము నుండి విముక్తులవుతారు, మళ్ళీ నంబరువారుగా రావాల్సి ఉంటుంది. ముందు సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. చేతులు పని వైపు, హృదయము భగవంతుని వైపు ఉండాలని అంటారు. పనులు చేసుకుంటూ ఉండండి కానీ బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఆత్మలైన మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు. ఆత్మలందరినీ (ప్రేయసులను) పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. అనంతమైన ప్రేయసులకు అనంతమైన ప్రియుడు. వారు అంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను. తర్వాత నంబరువారు పురుషార్థానుసారముగా వెళ్ళి పదవిని పొందుతారు. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలను సంభాళించండి. ఓ ఆత్మా, నీ హృదయము తండ్రి వైపు ఉండాలి. స్మృతి యొక్క ఈ అభ్యాసాన్నే చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇప్పుడు మనము స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. విద్యార్థులైతే చాలా సంతోషముగా ఉండాలి. ఇది చాలా సహజము. డ్రామానుసారముగా అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఎవరితోనూ వాదించవలసిన అవసరము లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది. మనుష్యులు అనారోగ్యము నుండి విముక్తులైనప్పుడు వారికి అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడైతే మొత్తము ప్రపంచమంతా రోగగ్రస్థముగా ఉంది. కొద్ది సమయములో జయజయకారాలు జరుగుతాయి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి, చేతులతో పని చేస్తూ బుద్ధి ద్వారా ప్రియుడిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనము స్వర్గవాసులుగా అవుతున్నాము, ఈ సంతోషములో ఉండాలి. 2. సూర్యవంశీ రాజ్యములో సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రి సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా అయి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. వరదానము:-కిరీటాన్ని మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ ఎప్పుడైనా, ఎవరైనా సింహాసనముపై కూర్చుంటే తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటుంది. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకముపై సదా అవినాశీ ఆత్మ యొక్క స్థితి రూపీ తిలకము దూరము నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల పట్ల కళ్యాణము యొక్క శుభ భావన వారి నయనాల ద్వారా మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా సమానముగా ఉంటుంది. స్లోగన్:-సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాలను సరళముగా చేసుకోండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’ విజయులుగా అయ్యేందుకు పునాది - ‘‘నిశ్చయము’’, ఒకవేళ పునాది పక్కాగా ఉన్నట్లయితే బిల్డింగ్ కదలదు, నిశ్చింతగా ఉంటారు. కానీ కేవలము తండ్రి పట్ల నిశ్చయము ఉండటము కాదు, స్వయముపై కూడా నిశ్చయము మరియు డ్రామాపై కూడా నిశ్చయము ఉండాలి. వాహ్ డ్రామా వాహ్! ఒకవేళ డ్రామాపై నిశ్చయము ఉన్నట్లయితే అకళ్యాణ విషయము కూడా కళ్యాణములోకి మారిపోతుంది. "
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 14-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రియే నంబరు వన్ పాత్రధారి, వారు పతితులను పావనముగా తయారుచేసే పాత్రను అభినయిస్తారు, తండ్రి వంటి పాత్రను ఎవ్వరూ అభినయించలేరు’’ ప్రశ్న:-సన్యాసుల యోగము భౌతిక యోగము, ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు, ఎలా? జవాబు:-సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడించడము నేర్పిస్తారు. కానీ అది నివసించే స్థానము. కావున అది భౌతిక యోగము అవుతుంది. తత్వాన్ని సుప్రీమ్ అని అనరు. పిల్లలైన మీరు సుప్రీమ్ ఆత్మతో యోగము జోడిస్తారు, అందుకే మీ యోగము ఆత్మిక యోగము. ఈ యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పించగలరు, ఇంకెవ్వరూ నేర్పించలేరు ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట:-నీవు ప్రేమ సాగరుడవు... ▶ ఓంశాంతి. పిల్లలూ, చాలామంది ఓం శాంతి అని అంటారు అనగా తమ ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు కానీ వారు స్వయం ఏమీ అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలను చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడని అంటారు కానీ అలా కాదు. ఇక్కడ ఆత్మ ఓం శాంతి అని అంటుంది. ఆత్మనైన నా స్వధర్మమే శాంతి, అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరము, దీనితో నేను కర్మలను చేస్తాను. ఇది ఎంత సహజము. అలాగే తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. కానీ నేను అందరికీ తండ్రినైన కారణముగా, బీజరూపుడినైన కారణముగా రచన రూపీ వృక్షము అనగా కల్పవృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి నాకు తెలుసు. మీరు ఏ వృక్షాన్ని చూసినా సరే, దాని ఆదిమధ్యాంతాలను తెలుసుకోగలరు, ఆ బీజమైతే జడమైనది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది కల్పవృక్షము, దీని ఆదిమధ్యాంతాలను మీరు తెలుసుకోలేరు, అవి నాకు తెలుసు. నన్ను జ్ఞానసాగరుడు అనే అంటారు. నేను కూర్చుని పిల్లలైన మీకు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నాను. ఈ నాటకాన్ని డ్రామా అని అంటారు, ఇందులో మీరు పాత్రధారులు. తండ్రి అంటారు, నేను కూడా పాత్రధారినే. పిల్లలంటారు - ఓ బాబా, పతిత-పావనా, పాత్రధారిగా అయి రండి, వచ్చి పతితులను పావనముగా తయారుచేయండి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పాత్రను అభినయిస్తున్నాను, నా పాత్ర కేవలం ఈ సంగమ సమయములోనే ఉంటుంది. నాకు నాదంటూ శరీరము లేదు. నేను ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. నా పేరు శివ. పిల్లలకే అర్థం చేయిస్తాను కదా. పాఠశాల కోతులకో, జంతువులకో ఉండదు. కానీ తండ్రి అంటారు, ఈ 5 వికారాలు ఉన్న కారణముగా ముఖము మనుష్యుల వలె ఉంది కానీ పనులు కోతుల వలె ఉన్నాయి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, అందరూ తమను తాము పతితులుగానే చెప్పుకుంటారు కానీ మనల్ని పతితముగా ఎవరు తయారుచేస్తారు మరియు మళ్ళీ పావనముగా ఎవరు వచ్చి తయారుచేస్తారు అనేది వారికి తెలియదు. పతిత-పావనుడు అని ఎవరినైతే పిలుస్తారో, వారి గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోతారు. మేమంతా పాత్రధారులమని కూడా వారికి తెలియదు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తాను. ఆత్మ పరంధామము నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఆటంతా భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ పావనముగా ఉండేది, భారత్ ను పతితముగా ఎవరు తయారుచేసారు. రావణుడు. రావణుడి రాజ్యము లంకలో ఉండేదని అంటూ ఉంటారు కూడా. తండ్రి అనంతములోకి తీసుకువెళ్తారు. ఓ పిల్లలూ, ఈ సృష్టి అంతా అనంతమైన ద్వీపము. అదైతే హద్దు లంక. ఈ అనంతమైన ద్వీపముపై రావణుడి రాజ్యముంది. ముందు రామ రాజ్యము ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యము ఉంది. బాబా, రామ రాజ్యము ఎక్కడ ఉండేది అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు, పిల్లలూ, అది ఇక్కడే ఉండేది కదా, దానిని అందరూ కోరుకుంటారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, మీరు హిందూ ధర్మానికి చెందినవారు కారు. మధురాతి మధురమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలూ, మొట్టమొదట మీరే భారత్ లో ఉండేవారు. మీకు ఆ సత్యయుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ యే ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎంతమంది ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. ముసల్మానుల రాజ్యము ఉన్నప్పుడు, చాలామందిని ముసల్మానులుగా చేసారు. క్రిస్టియన్ల రాజ్యము ఉన్నప్పుడు చాలామందిని క్రిస్టియన్లుగా చేసారు. బౌద్ధులదైతే ఇక్కడ రాజ్యము లేకపోయినా సరే చాలామందిని బౌద్ధులుగా చేసారు, తమ ధర్మములోకి కన్వర్ట్ చేసారు. ఆది సనాతన ధర్మము కనుమరుగైపోయినప్పుడే మళ్ళీ ఆ ధర్మ స్థాపన జరుగుతుంది. కనుక తండ్రి భారతవాసులైన మీ అందరికీ చెప్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, మీరందరూ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ... వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణములోకి వెళ్ళేందుకని బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని పాడుతారు కూడా, ముందు బ్రాహ్మణుల పేరును తీసుకుంటారు. బ్రాహ్మణులే భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇది ఉన్నదే భారత్ యొక్క ప్రాచీన యోగము. మొట్టమొదట ఏదైతే రాజయోగము ఉండేదో, దాని గురించే గీతలో వర్ణన ఉంది. గీతలో ఉన్న యోగాన్ని ఎవరు నేర్పించారు? ఈ విషయాన్ని భారతవాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలూ, యోగాన్ని అయితే నేనే నేర్పించాను. ఇది ఆత్మిక యోగము. మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైనవారు భౌతిక యోగాన్ని నేర్పిస్తారు అనగా బ్రహ్మతత్వముతో యోగము జోడించమని నేర్పిస్తారు. అది రాంగ్ అవుతుంది. బ్రహ్మతత్వమైతే నివసించే స్థానము. అదేమీ పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విదేశాలలో యోగము ఉండేది కాదు. హఠయోగము మరియు రాజయోగము ఇక్కడే ఉన్నాయి. ఆ నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. దాని గురించి తెలిసినవారే నేర్పించాలి. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిపోయారు. అతని కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్యాన్ని విడిపించేవారు, అటువంటివారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు. ఈ సమయములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడిక పడిపోవడానికి సిద్ధముగా ఉంది. ఏ వృక్షమైనా శిథిలావస్థకు చేరుకున్నప్పుడు, చివర్లో దానిని పడగొట్టవలసి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము కూడా తమోప్రధానముగా ఉంది, ఇందులో ఎటువంటి సారము లేదు. ఇది తప్పకుండా వినాశనము చెందుతుంది. దాని కంటే ముందే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఇక్కడ స్థాపన చేయవలసి ఉంటుంది. సత్యయుగములో ఎవరూ దుర్గతిలో ఉండరు. మనుష్యులు విదేశాలకు వెళ్ళి యోగాన్ని నేర్పిస్తారు కానీ అది హఠయోగము, అందులో జ్ఞానము అసలు ఉండదు. అనేక రకాల హఠయోగాలు ఉన్నాయి. ఇది రాజయోగము, దీనిని ఆత్మిక యోగమని అంటారు. అవన్నీ భౌతిక యోగాలు. అవి మనుష్యులు మనుష్యులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, నేను మీకు ఒక్కసారి మాత్రమే ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను, ఇంకెవ్వరూ ఎప్పటికీ నేర్పించలేరు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులు ఎప్పుడూ ఈ విధముగా చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది కొత్త విషయము. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహీ-అభిమానులుగా తయారుచేస్తున్నారు. తండ్రికి దేహము లేదు. వీరి తనువులోకి వచ్చి, వీరి పేరును మారుస్తారు ఎందుకంటే మరజీవాగా అయ్యారు. గృహస్థులు సన్యాసులుగా అయినప్పుడు మరజీవాగా అవుతారు, గృహస్థాశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని చేపడతారు. కనుక మీరు కూడా మరజీవాగా అవ్వడముతో పేర్లు మారుతాయి. ప్రారంభములో అందరి పేర్లు తీసుకువచ్చారు, కానీ తర్వాత కొంతమంది ఆశ్చర్యము కలిగించేలా విని, వర్ణించి, పారిపోయారు, కావున పేర్లు ఇవ్వడము ఆగిపోయింది, అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు - నేను పేరు పెట్టి, ఆ తర్వాత మళ్ళీ వారు పారిపోతే అది వృధా అయిపోతుంది. ముందు వచ్చినవారికి ఏవైతే పేర్లు పెట్టారో, అవి చాలా రమణీకముగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడము లేదు. ఎవరైతే సదా స్థిరముగా నిలిచి ఉంటారో, వారికే పేర్లు పెట్టడము జరుగుతుంది. చాలామందికి పేర్లు పెట్టారు, కానీ తర్వాత తండ్రిని వదిలి పారిపోయారు, అందుకే ఇప్పుడు పేర్లు మార్చడము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ జ్ఞానము క్రిస్టియన్ల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. భారత్ యొక్క యోగాన్ని నిరాకార తండ్రియే వచ్చి నేర్పించారని ఇంతమాత్రం అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే పాపాలు భస్మమవుతాయి మరియు మనము మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే కన్వర్ట్ అయిపోయి ఉంటారో, వారు నిలుస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరని మీకు తెలుసు. ఈ దాదా కూడా మనిషే, వీరు అంటారు, నేను ఎవరికీ సద్గతినివ్వలేను. మీ సద్గతి కూడా స్మృతి ద్వారానే జరుగుతుందని బాబా మనకు నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఓ పిల్లలూ, ఓ ఆత్మలూ, నాతో యోగము జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు మొదట బంగారుయుగము వారిగా, పవిత్రముగా ఉండేవారు, ఆ తర్వాత మాలిన్యము చేరుకుంది. ఎవరైతే మొదట దేవీ-దేవతలుగా, 24 క్యారెట్ల బంగారముగా ఉండేవారో, వారు ఇప్పుడు ఇనుపయుగములోకి వచ్చి చేరుకున్నారు. ఈ యోగాన్ని కల్ప-కల్పము మీరు నేర్చుకోవలసి ఉంటుంది. ఇందులో కూడా కొంతమంది పూర్తిగా తెలుసుకుంటారు, కొంతమంది తక్కువగా తెలుసుకుంటారని మీకు తెలుసు. కొంతమంది ఇక్కడ ఏమి నేర్పిస్తున్నారు అని ఊరికే చూడడానికి వస్తారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు కదా, ఇంతమంది వారికి పిల్లలుగా అయ్యరు, తప్పకుండా ఇక్కడ ఏదో ఉండి ఉంటుంది, కావుననే వెళ్ళి వారిని అడిగి చూద్దాము అని అనుకుంటారు. మీకు ప్రజాపిత బ్రహ్మా నుండి ఏమి లభిస్తుంది? అడగాలి కదా! కానీ ఈ మాత్రము బుద్ధి కూడా ఉండదు. రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయ్యారు, పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అయ్యారని అంటూ ఉంటారు - విశేషముగా భారత్ కోసమే ఇలా చెప్తారు. సత్య, త్రేతాయుగాలలో పారసబుద్ధి కలవారిగా, బంగారుయుగము వారిగా ఉండేవారు, ఆ తర్వాత వెండియుగములో రెండు కళలు తగ్గిపోయాయి, అందుకే చంద్రవంశీయులు అన్న పేరు వచ్చింది, ఎందుకంటే ఫెయిల్ అయిపోయారు. ఇది కూడా ఒక పాఠశాల. ఎవరికైతే 33 మార్కుల కన్నా తక్కువ వస్తాయో, వారు ఫెయిల్ అయిపోతారు. సీతా-రాములు మరియు వారి వంశావళి సంపూర్ణము అవ్వలేదు, అందుకే వారు సూర్యవంశీయులుగా అవ్వలేరు. కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు కదా ఎందుకంటే పరీక్ష కూడా చాలా పెద్దది. పూర్వము ఐ.సి.ఎస్ అని గవర్నమెంట్ కు సంబంధించిన పెద్ద పరీక్ష ఉండేది. అందరూ దానికి చదవలేకపోయేవారు. కోట్లలో కొంతమందే వెలువడుతారు. మేము సూర్యవంశీ మహారాజా, మహారాణిగా అవ్వాలని ఎవరైనా కోరుకుంటే, మరి దానికి కూడా చాలా కృషి అవసరము. మమ్మా, బాబా కూడా శ్రీమతమనుసారముగా చదువుకుంటున్నారు. వారు మొదటి నంబరులో చదువుకుంటారు, మిగతా ఎవరైతే మాత-పితలను ఫాలో చేస్తారో, వారే వారి సింహాసనముపై కూర్చుంటారు. సూర్యవంశీయులది 8 తరాలు నడుస్తుంది. ఏ విధముగా ఎడ్వర్డ్ ది ఫస్ట్, ది సెకెండ్ అన్న తరాలు నడుస్తాయి కదా. మీకు ఈ క్రిస్టియన్లతో ఎక్కువ కనెక్షన్ ఉంది. క్రిస్టియన్ వంశము భారత్ యొక్క రాజ్యాన్ని మింగేసింది, వారు భారత్ యొక్క అపారమైన ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. మరి ఆలోచించండి, సత్యయుగములో ఎంత అపారమైన ధనము ఉండి ఉంటుంది. అక్కడితో పోలిస్తే, ఇక్కడ అసలు ఏమీ లేదు. అక్కడ అన్ని గనులు నిండుగా ఉంటాయి. ఇప్పుడైతే ప్రతి వస్తువుకు సంబంధించిన గనులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ చక్రము రిపీట్ అయినప్పుడు అన్ని గనులు నిండిపోతాయి. మధురాతి మధురమైన పిల్లలూ, మీరు ఇప్పుడు రావణుడిపై విజయాన్ని పొంది రాజ్యాన్ని తీసుకుంటున్నారు, మళ్ళీ అర్ధకల్పము తర్వాత ఈ రావణుడు వస్తాడు, అప్పుడు మీరు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతవాసులైన మీరు గవ్వ సమానముగా అయిపోయారు. నేను మిమ్మల్ని వజ్ర సమానముగా తయారుచేసాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానముగా తయారుచేసాడు. ఈ రావణుడు ఎప్పుడు వచ్చాడు, అతడిని మనము ఎందుకు కాలుస్తున్నాము అనేది ఎవరూ అర్థం చేసుకోరు. ఈ రావణుడైతే పరంపరగా ఉన్నాడని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అర్ధకల్పము తర్వాత ఈ రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. వికారులుగా అయిన కారణముగా తమను తాము దేవీ-దేవతలుగా చెప్పుకోలేరు. వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. మీ అంతటి సుఖాన్ని ఎవ్వరూ చూడలేరు. అందరికన్నా ఎక్కువ పేదవారిగా కూడా మీరే అయ్యారు. ఇతర ధర్మాలవారు తర్వాత వృద్ధి చెందుతారు. క్రైస్టు వచ్చారు, మొదటిలో చాలా కొద్దిమందే ఉండేవారు. చాలామంది తయారైనప్పుడు రాజ్యము చేయగలుగుతారు. మీకైతే ప్రారంభములోనే రాజ్యము లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే అర్ధకల్పము యొక్క తుప్పు పట్టి ఉంది. ఈ సమయములో బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సన్యాసులు బ్రహ్మతత్వముతో యోగము జోడిస్తారు. దాని వలన వికర్మలు వినాశనమవ్వవు. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాల్సిందే. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ తమోప్రధానముగా అయిపోతారో, అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తారు అనగా అందరి జ్యోతులు వెలుగుతాయి. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. మీరు హీరో-హీరోయిన్ పాత్రధారులు. భారతవాసులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు, మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని ఈ విధముగా తీసుకోరు. వారు బాహుబలముతో రాజ్యాన్ని తీసుకుంటారు. బాబా అర్థం చేయించారు, ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, వారే మళ్ళీ అవుతారు. కావున సత్యమైన రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. మనుష్యులు ఏదైతే నేర్పిస్తారో, అదంతా అయథార్థమైన యోగము. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు ఇది అంతిమము. అందరూ దుఃఖము నుండి విముక్తులవుతారు, మళ్ళీ నంబరువారుగా రావాల్సి ఉంటుంది. ముందు సుఖాన్ని చూస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని చూస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. చేతులు పని వైపు, హృదయము భగవంతుని వైపు ఉండాలని అంటారు. పనులు చేసుకుంటూ ఉండండి కానీ బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఆత్మలైన మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు. ఆత్మలందరినీ (ప్రేయసులను) పుష్పాలుగా తయారుచేసి తీసుకువెళ్తారు. అనంతమైన ప్రేయసులకు అనంతమైన ప్రియుడు. వారు అంటారు, నేను అందరినీ తీసుకువెళ్తాను. తర్వాత నంబరువారు పురుషార్థానుసారముగా వెళ్ళి పదవిని పొందుతారు. గృహస్థ వ్యవహారములో ఉండండి, పిల్లలను సంభాళించండి. ఓ ఆత్మా, నీ హృదయము తండ్రి వైపు ఉండాలి. స్మృతి యొక్క ఈ అభ్యాసాన్నే చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఇప్పుడు మనము స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. విద్యార్థులైతే చాలా సంతోషముగా ఉండాలి. ఇది చాలా సహజము. డ్రామానుసారముగా అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. ఎవరితోనూ వాదించవలసిన అవసరము లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది. మనుష్యులు అనారోగ్యము నుండి విముక్తులైనప్పుడు వారికి అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడైతే మొత్తము ప్రపంచమంతా రోగగ్రస్థముగా ఉంది. కొద్ది సమయములో జయజయకారాలు జరుగుతాయి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి, చేతులతో పని చేస్తూ బుద్ధి ద్వారా ప్రియుడిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనము స్వర్గవాసులుగా అవుతున్నాము, ఈ సంతోషములో ఉండాలి. 2. సూర్యవంశీ రాజ్యములో సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రి సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా అయి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. వరదానము:-కిరీటాన్ని మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ ఎప్పుడైనా, ఎవరైనా సింహాసనముపై కూర్చుంటే తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటుంది. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకముపై సదా అవినాశీ ఆత్మ యొక్క స్థితి రూపీ తిలకము దూరము నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల పట్ల కళ్యాణము యొక్క శుభ భావన వారి నయనాల ద్వారా మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా సమానముగా ఉంటుంది. స్లోగన్:-సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాలను సరళముగా చేసుకోండి.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’ విజయులుగా అయ్యేందుకు పునాది - ‘‘నిశ్చయము’’, ఒకవేళ పునాది పక్కాగా ఉన్నట్లయితే బిల్డింగ్ కదలదు, నిశ్చింతగా ఉంటారు. కానీ కేవలము తండ్రి పట్ల నిశ్చయము ఉండటము కాదు, స్వయముపై కూడా నిశ్చయము మరియు డ్రామాపై కూడా నిశ్చయము ఉండాలి. వాహ్ డ్రామా వాహ్! ఒకవేళ డ్రామాపై నిశ్చయము ఉన్నట్లయితే అకళ్యాణ విషయము కూడా కళ్యాణములోకి మారిపోతుంది. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు 13-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు శ్రీమతమనుసారముగా తత్వాల సహితముగా ప్రపంచమంతటినీ పావనముగా తయారుచేసే సేవను చేయాలి, అందరికీ సుఖము మరియు శాంతి యొక్క మార్గాన్ని తెలియజేయాలి’’ ప్రశ్న:-పిల్లలైన మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోయే పురుషార్థము చేస్తారు, అందుకే మీకు ఏ వస్తువు యొక్క అవసరము లేదు? జవాబు:-చిత్రాల అవసరము లేదు. ఈ చిత్రాన్నే (దేహాన్నే) మర్చిపోవాలి అన్నప్పుడు ఇక ఆ చిత్రాల అవసరమేముంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ విదేహీ తండ్రిని మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఈ చిత్రాలైతే చిన్న పిల్లల కోసము అనగా కొత్తవారి కోసము ఉన్నాయి. మీరైతే స్మృతిలో ఉండాలి మరియు అందరి చేత స్మృతి చేయించాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ సతోప్రధానముగా అయ్యేందుకు స్మృతిలోనే ఉండే అభ్యాసము చేయండి. పాట:-భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను... ▶ ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ మాటలను విన్నారు మరియు వెంటనే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకుని ఉంటాయి. తమ సౌభాగ్యాన్ని, స్వర్గము యొక్క భాగ్యాన్ని తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారని పిల్లలకు తెలుసు. ఈ విధముగా మరెక్కడా చెప్పరు. మనము తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని అనగా స్వర్గాన్ని తయారుచేసే పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. కేవలం స్వర్గవాసులుగా అయ్యేందుకే కాదు, కానీ స్వర్గములో ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. స్వర్గము యొక్క సాక్షాత్కారాన్ని చేయించే తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ నషా కూడా పిల్లలకు ఎక్కాలి. భక్తి ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. భగవంతుడు భక్తులను ఉద్ధరించేందుకు వస్తారని అంటారు ఎందుకంటే వారు రావణుడి సంకెళ్ళలో చిక్కుకుని ఉన్నారు. అనేకమంది మనుష్యులవి అనేక మతాలు ఉన్నాయి. మీరైతే తెలుసుకున్నారు. సృష్టి చక్రము అనాదిగా రచింపబడిన ఒక ఆటలా ఉంది. వాస్తవానికి మనము ప్రాచీన కొత్త ప్రపంచ నివాసులుగా ఉండేవారము, ఇప్పుడు పాత ప్రపంచ నివాసులుగా అయ్యాము అని కూడా భారతవాసులు భావిస్తారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారుచేసారు, రావణుడు మళ్ళీ నరకముగా చేసాడు. బాప్ దాదా యొక్క మతము అనుసారముగా మీరు ఇప్పుడు మీ కోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచము కోసం చదువుకుంటున్నారు. ఎవరు చదివిస్తున్నారు? ఎవరికైతే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని మహిమ ఉందో వారు. ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ చేయడము జరగదు. వారే పతిత-పావనుడు. మనమందరము పతితులము. పావన ప్రపంచపు స్మృతి ఎవ్వరికీ లేదు. తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం పావన ప్రపంచము ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ భారత్ యే ఉండేది. మిగిలిన ధర్మాలన్నీ శాంతిలో ఉండేవి. భారతవాసులైన మనము సుఖధామములో ఉండేవారము. మనుష్యులు శాంతిని కోరుకుంటారు కానీ ఇక్కడైతే ఎవరూ శాంతిగా ఉండలేరు. ఇది శాంతిధామమేమీ కాదు. శాంతిధామము నిరాకారీ ప్రపంచము, అక్కడి నుండి మనము వస్తాము. ఇకపోతే, సత్యయుగము సుఖధామము, దానిని శాంతిధామమని అనరు. అక్కడ మీరు పవిత్రత, సుఖ-శాంతులతో ఉంటారు, ఎటువంటి హంగామాలు ఉండవు. ఇంటిలో పిల్లలు గొడవ చేసినప్పుడు, వారిని శాంతిగా ఉండమని చెప్తారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు ఆ శాంతిదేశానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు గొడవల దేశములోకి వచ్చి కూర్చున్నారు. ఈ విషయము మీ బుద్ధిలో ఉంది. మీరు తండ్రి ద్వారా మళ్ళీ ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ స్కూల్ తక్కువైనదేమీ కాదు. ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్శిటీ. మొత్తము ప్రపంచమంతటిలో ఇది అన్నింటికన్నా పెద్ద యూనివర్శిటీ. ఇందులో అందరూ తండ్రి నుండి శాంతి మరియు సుఖము యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఒక్క తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మాకు మహిమ లేదు. తండ్రియే ఈ సమయములో వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇక తర్వాత సుఖమే సుఖముంటుంది. సుఖ-శాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమంతా వారిదే. సత్య, త్రేతాయుగాలలో ఎవరికీ మహిమ జరగదు. అక్కడైతే రాజధాని నడుస్తూ ఉంటుంది. మీరు వారసత్వాన్ని పొందుతారు, మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. మహిమ ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు క్రైస్ట్ ధర్మ స్థాపన చేస్తారు, అది వారు చేయాల్సిందే. ధర్మ స్థాపన చేస్తారు, అయినా కూడా కిందకు దిగుతూనే వస్తారు. ఇక మహిమ ఏముంది? మహిమ కేవలం ఒక్కరికి మాత్రమే ఉంది, వారిని పతిత-పావనుడు, ముక్తిదాత అని పిలుస్తారు. వారికి క్రైస్ట్, బుద్ధుడు మొదలైనవారు గుర్తుకువస్తూ ఉంటారని కాదు. స్మృతి ఎంతైనా ఒక్కరినే చేస్తారు, ఓ గాడ్ ఫాదర్ అని అంటూ తలచుకుంటారు. సత్యయుగములోనైతే ఎవరికీ మహిమ జరగదు. తర్వాత ఈ ధర్మాలు ప్రారంభమైనప్పుడు తండ్రి మహిమను పాడుతారు మరియు భక్తి ప్రారంభమవుతుంది. డ్రామా ఎలా తయారై ఉంది, చక్రము ఎలా తిరుగుతుంది అనేది తండ్రికి పిల్లలుగా అయినవారికి మాత్రమే తెలుసు. తండ్రి రచయిత. వారు కొత్త సృష్టి అయిన స్వర్గాన్ని రచిస్తారు. కానీ అందరూ అయితే స్వర్గములోకి రాలేరు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి నుండి సుఖపు వారసత్వము లభిస్తుంది. ఈ సమయములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ తిరిగి వెళ్ళాలి, ఆ తర్వాత సుఖములోకి వస్తారు. పిల్లలైన మీకు చాలా మంచి పాత్ర లభించి ఉంది. ఏ తండ్రికైతే ఇంతటి మహిమ ఉందో, వారు ఇప్పుడు సమ్ముఖములోకి వచ్చి కూర్చున్నారు మరియు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ పిల్లలే కదా. తండ్రి అయితే సదా సంతోషముగా ఉంటారు. వాస్తవానికి తండ్రి విషయములో ఇలా అనలేము ఎందుకంటే ఒకవేళ వారు సంతోషాన్ని పొందితే, మరి దుఃఖితులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. బాబా అయితే వీటన్నింటికీ అతీతమైనవారు. బాబా మహిమ ఏదైతే ఉందో, మీ మహిమ కూడా ఈ సమయములో అదే ఉంటుంది, ఆ తర్వాత భవిష్యత్తులో మీ మహిమ వేరే ఉంటుంది. ఏ విధముగా బాబా జ్ఞాన సాగరుడో, మీరు కూడా అలాగే ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి చక్రము యొక్క జ్ఞానముంది. తండ్రి సుఖ సాగరుడని, వారి నుండి అపారమైన సుఖము లభిస్తుందని మీకు తెలుసు. ఈ సమయములో మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి పిల్లలకు ఇప్పుడు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఉన్నారు, వీరు తప్పకుండా మునుపటి జన్మలో మంచి కర్మలను చేసారు, అందుకే ఈ పదవిని పొందారు. వీరు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ప్రపంచములోని వారెవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విధముగా తయారవుతున్నారు. మేము ఈ విధముగా ఉండేవారము, మళ్ళీ ఈ విధముగా తయారవుతాము అని మీ బుద్ధిలోకి వస్తుంది. తండ్రి కూర్చుని కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తారు, దాని ద్వారా మనము ఈ విధముగా తయారవుతాము. వారు శ్రీమతాన్ని ఇస్తారు కావున ఆ శ్రీమతాన్ని తెలుసుకోవాలి కదా. శ్రీమతము ద్వారా మొత్తం ప్రపంచాన్ని, తత్వాలు మొదలైనవాటన్నింటినీ శ్రేష్ఠముగా తయారుచేస్తారు. సత్యయుగములో అందరూ శ్రేష్ఠముగా ఉండేవారు. అక్కడ ఎటువంటి హంగామాలు మరియు తుఫానులు మొదలైనవి ఉండవు. ఎక్కువ చలి గాని, ఎక్కువ వేడి గాని ఉండవు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ మీరు ఎంత సుఖముగా ఉంటారు. ఖుదా బహిష్త్ ను అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారని వారు పాడుతారు కూడా. కనుక అందులో ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేయాలి. ఎల్లప్పుడూ - ఫాలో ఫాదర్ మదర్ అని అంటూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆత్మలమైన మనము తండ్రితో పాటు కలిసి వెళ్తాము. శ్రీమతమనుసారముగా నడుచుకుంటూ ప్రతి ఒక్కరికీ మార్గాన్ని తెలియజేయాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడిది నరకము. తప్పకుండా నరకములో ఉండగానే స్వర్గము యొక్క వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తవుతాయి, మళ్ళీ మనము మొదటి జన్మను స్వర్గములో తీసుకోవాలి. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఆ విధముగా తయారవ్వాలి. మనమే లక్ష్మీ-నారాయణులుగా అవుతాము. వాస్తవానికి ఈ చిత్రాల అవసరము లేదు. ఎవరైతే కచ్చాగా ఉంటారో, పదే-పదే మర్చిపోతారో, వారి కోసం చిత్రాలను పెట్టడము జరుగుతుంది. కొందరు శ్రీకృష్ణుని చిత్రాన్ని పెట్టుకుంటారు. శ్రీకృష్ణుడిని చూడకుండా స్మృతి చేయలేకపోతారు. చిత్రాలైతే అందరి బుద్ధిలోనూ ఉంటాయి. మీరు ఎటువంటి చిత్రాలను పెట్టుకోవలసిన అవసరము లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, మీరు మీ చిత్రాన్ని కూడా మర్చిపోవాలి. దేహ సహితముగా అన్ని సంబంధాలను మర్చిపోవాలి. తండ్రి అంటారు, మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ప్రియుడైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎటువంటి అవస్థ ఉండాలంటే, శరీరాన్ని విడిచిపెట్టే సమయములో, నేను ఈ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తాను అని భావించాలి. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు వెళ్ళాలి. తండ్రి ఆజ్ఞాపించారు - నన్ను స్మృతి చేయండి. కేవలం తండ్రిని మరియు స్వీట్ హోమ్ ను స్మృతి చేయండి. ఆత్మనైన నేను శరీరము లేకుండా ఉండేవాడిని, తర్వాత ఇక్కడ పాత్రను అభినయించేందుకు శరీరాన్ని ధారణ చేసాను అని బుద్ధిలో ఉంది. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితముగా అయిపోయాము. ఈ శరీరమైతే ఒక పాత చెప్పు. ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంది. పవిత్రమైన శరీరమైతే ఇక్కడ లభించజాలదు. ఇప్పుడు ఆత్మలమైన మనము తిరిగి ఇంటికి వెళ్తాము. ముందు రాకుమార, రాకుమారీలుగా అవుతారు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. రాధ-కృష్ణులు ఎవరు అనేది మనుష్యులకు తెలియదు. వారివురూ వేర్వేరు రాజధానులకు చెందినవారు, ఆ తర్వాత వారి స్వయంవరము జరుగుతుంది. పిల్లలైన మీరు ధ్యానములో స్వయంవరాన్ని చూసారు. ప్రారంభములో చాలా సాక్షాత్కారాలు కలిగేవి, ఎందుకంటే పాకిస్తాన్ లో మిమ్మల్ని సంతోషపరిచేందుకని ఈ పాత్ర అంతా నడిచేది. చివరిలోనైతే కొట్లాటలే ఉంటాయి. భూకంపాలు మొదలైనవి చాలా జరుగుతాయి. మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. మేము ఎటువంటి పదవిని పొందుతాము అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. అప్పుడిక, ఎవరైతే తక్కువగా చదువుకుని ఉంటారో, వారు చాలా పశ్చాత్తాపపడతారు. తండ్రి అంటారు, నీవూ చదువుకోలేదు, ఇతరులనూ చదివించలేదు, స్మృతిలో కూడా ఉండేవాడివి కాదు. స్మృతి ద్వారానే సతోప్రధానముగా అవ్వగలరు. పతిత-పావనుడు అయితే తండ్రి మాత్రమే. వారు అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యము తొలగిపోతుంది. స్మృతియాత్ర యొక్క పురుషార్థము చేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. కర్మలనైతే చేయవలసిందే కదా. కానీ బుద్ధియోగము అక్కడ ఉండాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఇక్కడే తయారవ్వాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు నన్ను స్మృతి చేయండి, అప్పుడే మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి ఇంకే కష్టము ఇవ్వరు. మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. సుఖధామానికి యజమానులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు మీరు స్మృతి చేయండి - బాబా కూడా నక్షత్రమే. వారు సర్వశక్తివంతుడని, చాలా తేజోమయుడని మనుష్యులు భావిస్తారు. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడిని. బీజమునైన కారణముగా సృష్టి ఆదిమధ్యాంతాలు నాకు తెలుసు. మీరు బీజము కాదు, నేను బీజాన్ని, అందుకే నన్ను జ్ఞాన సాగరుడని అంటారు. వారు మనుష్య సృష్టి యొక్క చైతన్య బీజము, ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది తప్పకుండా వారికి తెలుస్తుంది. ఋషులు, మునులు మొదలైనవారెవ్వరికీ రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతాలను గురించి తెలియదు. ఒకవేళ పిల్లలకు ఈ విషయము తెలిసినట్లయితే, వారు తండ్రి వద్దకు వెళ్ళడానికి సమయము పట్టదు. కానీ తండ్రి వద్దకు వెళ్ళే మార్గము ఎవ్వరికీ తెలియదు. పావన ప్రపంచములోకి అసలు పతితులు ఎలా వెళ్ళగలరు, అందుకే తండ్రి అంటారు, కామమనే మహాశత్రువుపై విజయము పొందండి. ఇదే మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. పిల్లలైన మీకు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, ఎటువంటి కష్టము లేదు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా అనగా యోగము ద్వారా పాపాలు భస్మమవుతాయి. సెకెండులో తండ్రి ద్వారానే రాజ్యాధికారము లభిస్తుంది. పిల్లలు స్వర్గములోకైతే వస్తారు కానీ స్వర్గములో కూడా ఉన్నత పదవిని పొందాలి, దాని కోసం పురుషార్థము చేయాలి. స్వర్గములోకైతే వెళ్ళాల్సిందే. కొద్దిగా విన్నా సరే, తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. మీరు అందరినీ మేలుకొలుపుతూ ఉంటారు. ఎవరైతే అనేకులను మేలుకొలుపుతారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థము చేయాలి. అందరూ ఒకే రకమైన పురుషార్థులుగా కాలేరు. ఇది చాలా పెద్ద స్కూల్. ఇది వరల్డ్ యూనివర్శిటీ. మొత్తము ప్రపంచమంతటినీ సుఖధామముగా మరియు శాంతిధామముగా తయారుచేయాలి. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఉంటారా. యూనివర్స్ అని మొత్తము ప్రపంచాన్ని అంటారు. తండ్రియే మొత్తము యూనివర్స్ యొక్క మనుష్యమాత్రులను సతోప్రధానముగా తయారుచేస్తారు అనగా స్వర్గాన్ని తయారుచేస్తారు. భక్తి మార్గములో ఏవైతే పండుగలను జరుపుకుంటారో, అవన్నీ ఇప్పటి సంగమయుగానికి చెందినవే. సత్య, త్రేతాయుగాలలో ఎటువంటి పండుగలు ఉండవు. అక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. పండుగలన్నీ ఇక్కడ జరుపుకుంటారు. హోలీ మరియు ధురియా, ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. గతంలో జరిగినదానికి సంబంధించి పండుగలన్నీ జరుపుకుంటూ వచ్చారు. అవన్నీ ఈ సమయానికి చెందినవే. హోలీ కూడా ఈ సమయానికి చెందినదే. ఈ 100 సంవత్సరాల లోపల అన్ని పనులు జరిగిపోతాయి. సృష్టి కూడా కొత్తగా తయారైపోతుంది. మనము అనేక సార్లు సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము అని మీకు తెలుసు. మనము మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని సంతోషము కలుగుతుంది. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. డ్రామానుసారముగా స్వర్గ స్థాపన తప్పకుండా జరగనున్నది. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో, అదే విధముగా కలియుగము తర్వాత తప్పకుండా సత్యయుగము రానున్నది. మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఇప్పుడు సమయము పూర్తవుతుంది, మనము శాంతిధామానికి వెళ్తాము. ఇది అంతిమ జన్మ. కర్మ భోగాన్ని అనుభవించడము కూడా సంతోషములో తేలికైపోతుంది. కొంత అనుభవించడము ద్వారా, కొంత యోగబలము ద్వారా లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. తండ్రి పిల్లలకు ఓదార్పును ఇస్తున్నారు, మీ కొరకు సదా సుఖము యొక్క రోజులు వస్తున్నాయి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. శరీర నిర్వహణార్థము ధనమైతే కావాలి కదా. బాబా అర్థం చేయించారు, వ్యాపారస్థులు ధర్మార్థము ధనము కేటాయిస్తారు. ఎక్కువ ధనము జమ అయినట్లయితే, ఎంతో దానము చేయవచ్చని భావిస్తారు. ఇక్కడ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరైనా రెండు పైసలు ఇచ్చినా సరే, దానికి రిటర్న్ లో వారికి 21 జన్మల కొరకు చాలా లభిస్తుంది. ఇంతకుముందు మీరు ఏవైతే దాన-పుణ్యాలు చేసేవారో, దానికి మరుసటి జన్మలో రిటర్న్ లభించేది. ఇప్పుడైతే 21 జన్మల కొరకు ఫలము లభిస్తుంది. పూర్వము సాధు-సన్యాసులు మొదలైనవారికి ఇచ్చేవారు. ఇప్పుడైతే మీకు తెలుసు, ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు నేను సమ్ముఖములోకి వచ్చాను కావున ఈ కార్యములో ఉపయోగించండి. అప్పుడు మీకు 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుంది. ఇంతకుముందు మీరు ఇన్ డైరెక్ట్ గా (పరోక్షముగా) ఇచ్చేవారు, ఇక్కడ డైరెక్ట్ (ప్రత్యక్షము) గా ఇస్తున్నారు. ఇక మీది మిగిలినదంతా సమాప్తమైపోతుంది. బాబా అంటూ ఉంటారు - ధనముంటే సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. సత్యమైన గీతా పాఠశాల అన్న పదాలు వ్రాయండి. భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తండ్రి సమానముగా మహిమా యోగ్యులుగా అయ్యేందుకు ఫాలో ఫాదర్ చేయాలి. 2. ఇది అంతిమ జన్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అందుకే సంతోషములో లోలోపలే భజంత్రీలు మోగుతూ ఉండాలి. కర్మభోగాన్ని కర్మయోగముతో అనగా తండ్రి స్మృతితో చాలా సంతోషముగా సమాప్తము చేసుకోవాలి. వరదానము:-బాలకుల నుండి యజమానులుగా అవుతాము అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి, ప్రాప్తి సంపన్న భవ మనము తండ్రి యొక్క సర్వ ఖజానాలకు బాలకులము మరియు యజమానులము, సహజ యోగులము, సహజ స్వరాజ్య అధికారులము. ఈ స్మృతి ద్వారా సర్వ ప్రాప్తి సంపన్నులుగా అవ్వండి. ‘‘పొందాల్సినదేదో పొందేసాను’’ అన్న ఈ పాటనే సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాను, పొందాను, పోగొట్టుకున్నాను, పొందాను... అన్న ఈ ఆటను ఆడుతూ ఉండకండి. పొందుతూ ఉన్నాను, పొందుతూ ఉన్నాను - ఇవి అధికారుల మాటలు కావు. ఎవరైతే సంపన్నమైన తండ్రి పిల్లలో, సాగరుని పిల్లలో వారు నౌకర్లలాగా శ్రమ చేయలేరు. స్లోగన్:-యోగబలము ద్వారా కర్మభోగముపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవటము - ఇదే శ్రేష్ఠ పురుషార్థము.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’ అన్నింటికంటే ముందు స్వయం పట్ల పూర్తి విశ్వాసము ఉండాలి, ఆ తర్వాత బాప్ దాదా మరియు పూర్తి పరివారములోని ఆత్మల పట్ల విశ్వాసము కలిగి ఉండాలి. ఎంతగా విశ్వాసపాత్రులుగా ఉంటూ నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ఏదైనా కర్తవ్యాన్ని చేస్తారో, విశ్వాసపాత్రులుగా ఉన్న కారణముగా సక్సెస్ ఫుల్ గా (సఫలతామూర్తులుగా) అవ్వనే అవుతారు. విశ్వాసపాత్రులుగా ఉన్న కారణముగా ప్రతి కర్తవ్యము, ప్రతి సంకల్పము, ప్రతి మాట పవర్ ఫుల్ గా (శక్తిశాలిగా) ఉంటుంది. "
#📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా #🇮🇳 మన దేశ సంస్కృతి 12-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - ఈ చదువు సంపాదనకు ఆధారము, దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, 21 జన్మల కొరకు సత్యమైన సంపాదన జరుగుతుంది’’ ప్రశ్న:-బాబా ఏవైతే మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారో, అవి ఎప్పుడు ధారణ అవుతాయి? జవాబు:-ఎప్పుడైతే బుద్ధిపై పరమతము లేక మన్మతము యొక్క ప్రభావముండదో, అప్పుడు ధారణ అవుతాయి. ఏ పిల్లలైతే చెప్పుడు మాటలపై నడుచుకుంటారో, వారి బుద్ధిలో ధారణ జరగదు. ఎవరైనా జ్ఞానము కాకుండా వేరే ఏవైనా విషయాలను వినిపిస్తే వారు శత్రువు వంటివారు. అసత్యమైన మాటలను వినిపించేవారు చాలామంది ఉన్నారు, అందుకే చెడు వినకండి, చెడు చూడకండి, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతముపైనే నడుచుకోవాలి. పాట:-మా తీర్థము అతీతమైనది... ▶ ఓంశాంతి. ఈ పాటలో మన మహిమను మనము చేసుకున్నట్లుగా ఉంది. వాస్తవానికి స్వయము యొక్క మహిమను చేసుకోవడము జరగదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఏ భారతవాసులైతే చాలా తెలివైనవారిగా ఉండేవారో, వారు ఇప్పుడు తెలివిహీనులుగా అయిపోయారు. అయితే, ఇంతకీ తెలివైనవారిగా ఎవరు ఉండేవారు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఇది ఎక్కడా కూడా వ్రాసి లేదు. మీరు గుప్తముగా ఉన్నారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. ఒకటేమో తండ్రి అంటారు, నా ద్వారానే పిల్లలు నన్ను తెలుసుకోగలరు, ఆ తర్వాత నా ద్వారా అన్నీ తెలుసుకుంటారు. సృష్టి ఆదిమధ్యాంతాల ఆట ఏదైతే ఉందో, దానిని అర్థం చేసుకుంటారు. ఇంకెవ్వరికీ తెలియదు. వారు ఒక ముఖ్యమైన పొరపాటును చేసారు, అదేమిటంటే - నిరాకార పరమపిత పరమాత్మ శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరు వేసారు. మొదటి నంబరు శాస్త్రముగా పిలవబడే శ్రీమత్ భగవద్గీతనే రాంగ్ అయిపోయింది, అందుకే, మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అన్నది నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అని అడగాలి. భారత్ ది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. ఒకవేళ కొత్త ధర్మము అంటే, అది బ్రాహ్మణ ధర్మమనే అంటారు. మొదట పిలక స్థానములో బ్రాహ్మణులుంటారు, ఆ తర్వాత దేవతలు. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణ ధర్మము. ఆ బ్రాహ్మణులను బ్రహ్మా ద్వారా పరమపిత పరమాత్మ రచిస్తారు, ఆ బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా అవుతారు. ముఖ్యమైన విషయము, భగవంతుడు అందరికీ తండ్రి, వారు కొత్త ప్రపంచ రచయిత. తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు కదా. కొత్త ప్రపంచములో కొత్త భారత్ ఉంటుంది. వారు జన్మ కూడా భారత్ లోనే తీసుకున్నారు. వారు భారత్ నే స్వర్గముగా తయారుచేస్తున్నారు, బ్రహ్మా ద్వారా. మిమ్మల్ని తమవారిగా చేసుకుని, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారు, ఆ తర్వాత బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు, ఆ తర్వాత దైవీ వర్ణములోకి వెళ్తారు. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒక ధర్మము నుండి అనేక ధర్మాలు ఏర్పడతాయి. ఆ తర్వాత అన్ని ధర్మాలలో కొమ్మలు-రెమ్మలు కూడా తయారవుతాయి, ప్రతి ధర్మము నుండి వెలువడుతాయి. మూడు శాఖలు ఉంటాయి కదా. అవి ముఖ్యమైనవి. ప్రతి ధర్మము నుండి వాటి-వాటి శాఖలు వెలువడుతాయి. ముఖ్యమైనది పునాది, ఆ తర్వాత మూడు శాఖలు ముఖ్యమైనవి. కాండము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. దానికి సంబంధించిన మీరంతా ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దిల్వాడా మందిరము చాలా బాగా నిర్మించబడింది, అందులో మొత్తం వివరణ ఉంది. పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు, కల్పక్రితం కూడా మీరు రాజయోగ తపస్య చేసారు. ఏ విధముగా క్రైస్ట్ స్మృతిచిహ్నము క్రిస్టియన్ దేశములో ఉంటుందో, అదే విధముగా పిల్లలైన మీరు ఇక్కడ తపస్య చేసారు కావుననే మీ స్మృతిచిహ్నము కూడా ఇక్కడ ఉంది. వాస్తవానికి ఇది చాలా సహజమే, కానీ దీని గురించి ఎవ్వరికీ తెలియదు. సన్యాసులు - ఇదంతా ఊహ, ఎవరు ఎలా ఊహిస్తే అలా అని అనుకుంటారు. వారు మీ గురించి కూడా - ఈ చిత్రాలు మొదలైనవన్నీ మీరు ఊహతో తయారుచేసారు అని అంటారు. ఎప్పటివరకైతే తండ్రిని తెలుసుకోరో, అప్పటివరకు ఊహ అనే భావిస్తారు. నాలెడ్జ్ ఫుల్ అయితే ఒక్క తండ్రియే కదా. కావున ముఖ్యమైనది తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు, కల్పక్రితము కూడా ఇచ్చారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. భారతవాసులకే 84 జన్మలు ఉంటాయి. ఆ తర్వాత సంగమయుగములో తండ్రి వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో అర్థం చేసుకున్నప్పుడు, బుద్ధిలో కూర్చున్నప్పుడు సంతోషము కూడా ఉంటుంది. ఈ చదువు సంపాదనకు గొప్ప ఆధారము. చదువు ద్వారానే మనుష్యులు బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేటటువంటిది. ప్రాప్తి ఎంత భారీగా ఉంది, ఇటువంటి ప్రాప్తిని ఇంకెవ్వరూ అందించలేరు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని గ్రంథ్ లో చెప్తూ ఉంటారు. కానీ మనుష్యుల బుద్ధి నడవదు. తప్పకుండా ఆ దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది, అందుకే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని వ్రాస్తారు. దేవతలు సత్యయుగములో ఉండేవారు, వారిని తప్పకుండా భగవంతుడు సంగమములో రచించి ఉంటారు. ఎలా రచించారు? అది తెలియదు. గురునానక్ కూడా పరమాత్ముని మహిమను గానము చేసారు, వారిని మహిమ చేసినట్లుగా ఇంకెవ్వరికీ మహిమ చేయలేదు, అందుకే గ్రంథ్ ను భారత్ లో చదువుతారు. గురునానక్ అవతరణ కలియుగములో జరుగుతుంది, వారు ధర్మస్థాపకుడు. రాజ్యమైతే తర్వాత ఏర్పడింది. తండ్రి అయితే ఈ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. వాస్తవానికి కొత్త ప్రపంచము బ్రాహ్మణులదనే అనాలి. పిలక బ్రాహ్మణులకు గుర్తు, కానీ రాజధాని దేవీ-దేవతలతో ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీ కోసం రాజధానిని స్థాపన చేసుకుంటారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. మొట్టమొదట మనకు తెలుస్తుంది, ఆ తర్వాత మన ద్వారా ఇతరులకు తెలుస్తుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మాకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి తెలియజేసినట్లయితే, పిల్లలందరికీ కూడా తెలియజేయవలసి ఉంటుంది. వారి తనువు ద్వారా కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇవి అనుభవముతో కూడిన విషయాలు. శాస్త్రాల ద్వారానైతే ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, మొత్తం కల్పములో ఒక్కసారి మాత్రమే నేను ఈ విధముగా వచ్చి అర్థం చేయిస్తాను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని, ఏక ధర్మస్థాపనను చేయిస్తాను. ఇది 5 వేల సంవత్సరాల ఆట. మనము 84 జన్మలను తీసుకున్నామని పిల్లలైన మీకు తెలుసు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు. బ్రహ్మా మరియు విష్ణువు ఎవరి పిల్లలు? ఇరువురు శివుని పిల్లలు. వారు (శివుడు) రచయిత, వీరు రచన. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. ఇవి కొత్త విషయాలని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు ఉండవు. జ్ఞానసాగరుడు తండ్రి, వారే గీతా భగవానుడు. భక్తి మార్గములో శివజయంతిని కూడా జరుపుకుంటారు, సత్య, త్రేతాయుగాలలో జరుపుకోరు, అంటే వారు తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు మరియు అర్థం చేయిస్తూ ఉంటారు. మీకు తండ్రి మహిమను ఏదైతే అర్థం చేయిస్తున్నారు, ఆ మహిమ పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి. ప్రేమసాగరులుగా, సుఖసాగరులుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. చాలా మధురముగా తయారవ్వాలి. పూర్వము పూర్తి చేదుగా విషము వలె ఉన్న మీరు నిర్వికారీ బ్రాహ్మణులుగా అవుతున్నారు, ఈశ్వరుని సంతానముగా అవుతున్నారు. వికారీ నుండి నిర్వికారీ దేవతలుగా అవుతున్నారు. అర్ధకల్పము నుండి మీరు పతితముగా అవుతూ-అవుతూ, ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నారు. పాతబడిపోయిన వస్త్రాలను కర్రతో బాదినట్లయితే అవి చిరిగిపోయి పీలికలుగా అయిపోతాయి. ఇక్కడ కూడా జ్ఞానమనే కర్రతో కొట్టినట్లయితే ముక్కలు, ముక్కలుగా అయిపోతారు. కొన్ని వస్త్రాలు ఎంత మురికిగా ఉన్నాయంటే, వాటిని శుభ్రము చేయడానికి చాలా సమయము పడుతుంది. ఆ తర్వాత అక్కడ కూడా వారికి చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలివాడు. మీరు కూడా వారితో పాటు సహాయకులు. చాకలివారు కూడా నంబరువారుగా ఉంటారు. ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు. చాకలివాడు వస్త్రాలను బాగా శుభ్రము చేయకపోతే, ఇతను మంగలివాడిలా ఉన్నాడే అని అంటారు కదా. ఈ రోజుల్లో వస్త్రాలను శుభ్రముగా ఉతకడము నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెల్లోనైతే చాలా మురికిపట్టిన వస్త్రాలను ఉతికేవారు. ఈ నైపుణ్యము కూడా బయటివారి (విదేశీయుల) నుండి వచ్చింది. విదేశాల వారు కొంత గౌరవాన్ని ఇస్తారు, ధనము మొదలైనవాటి విషయములో సహాయము చేస్తారు. వీరు చాలా గొప్ప వంశానికి చెందినవారని, ఇప్పుడు కింద పడిపోయారని వారికి తెలుసు. పడిపోయినవారిపై దయ కలుగుతుంది కదా. తండ్రి అంటారు, మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేసాను, మాయ ఎలాంటి పరిస్థితికి తీసుకువచ్చింది. మనము విజయమాలలో ఉండేవారము, ఆ తర్వాత 84 జన్మలను తీసుకుని ఎలా తయారయ్యాము అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఆశ్చర్యము కదా. భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారని మీరు అర్థం చేయించవచ్చు. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఆ తర్వాత కిందకు పడిపోతూ-పడిపోతూ నరకవాసులుగా కూడా అవ్వవలసి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటారు - పవిత్రముగా అయి స్వర్గవాసులుగా అవ్వండి. మన్మనాభవ. శివ భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతియాత్ర ద్వారా మీ పాపాలన్నీ నశిస్తాయి. పట్టపురాణిగా చేసుకునేందుకు శ్రీకృష్ణుడు ఎత్తుకువెళ్ళిపోయారని శాస్త్రాల్లో వ్రాసారు. మీరంతా చదువుకుంటున్నారు, పట్టపురాణులుగా అవుతున్నారు. కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము మీకు అర్థం చేయించడానికి వస్తాను, కనుక మొదట భగవంతుడు ఒక్కరేనని ఋజువు చేసి, ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు, రాజయోగాన్ని ఎవరు నేర్పించారు అనేది చెప్పండి. భగవంతుడే బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనాన్ని చేయిస్తారు, ఆ తర్వాత పాలన చేయిస్తారు. బ్రాహ్మణులుగా ఉన్న వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ విషయాలు కూడా ఎవరికి అర్థమవుతాయంటే, ఎవరైతే కల్పక్రితము అర్థం చేసుకున్నారో వారికి. సెకండు, సెకండు ఏదైతే ఇంతవరకు జరిగిందో, అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు చాలా పురుషార్థము చేయాలి. ఇప్పుడింకా మాకు అటువంటి అవస్థ ఏర్పడలేదని పిల్లలు అర్థం చేసుకుంటారు. సమయము పడుతుంది. కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే, అందరూ నంబరువన్ లో పాస్ అయిపోతారు, అప్పుడిక యుద్ధము కూడా మొదలవుతుంది. పరస్పరములో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా సరే, యుద్ధానికి ఏర్పాట్లు చేస్తున్నారని మీకు తెలుసు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఏదైతే దివ్యదృష్టితో చూసారో, అది మళ్ళీ ఈ కనులతో చూడాలి. వినాశనము యొక్క సాక్షాత్కారము కలిగింది కదా, దానిని మళ్ళీ అలాగే కనులతో చూస్తారు. స్థాపన యొక్క సాక్షాత్కారము కూడా కలిగింది, మళ్ళీ ప్రాక్టికల్ గా రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. ఇదైతే పాత తనువు. యోగముతో ఆత్మ పవిత్రముగా అయిపోతుంది, అప్పుడిక ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రము పూర్తవుతుంది, ఆ తర్వాత తప్పకుండా అందరికీ కొత్త శరీరాలు లభిస్తాయి. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సహజమైన విషయాలు. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా వస్తుందని అర్థం చేయించవచ్చు కూడా. అనేక ధర్మాల వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఆ తర్వాత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపనార్థం తండ్రికి రావలసి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకని బ్రాహ్మణులుగా అయ్యారు, ఇతరులెవ్వరూ ఇలా అవ్వలేరు. మనము శివబాబాకు చెందినవారిగా అయ్యామని, శివబాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. శివజయంతి అంటేనే భారత్ కు వారసత్వము లభించింది. శివబాబా వచ్చారు, వచ్చి ఏమి చేసారు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారైతే వచ్చి వారి-వారి ధర్మాలను స్థాపన చేసారు. బాబా వచ్చి ఏమి చేసారు. తప్పకుండా స్వర్గాన్ని స్థాపన చేసారు. స్థాపనను ఎలా చేసారు, స్థాపన ఎలా జరుగుతుంది, అది మీకు ఇప్పుడు తెలుసు. తర్వాత సత్యయుగములో ఇవన్నీ మర్చిపోతారు. 21 జన్మల వారసత్వాన్ని మనము ఇప్పుడు తీసేసుకుంటామని కూడా మీకు తెలుసు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. అతను తండ్రి, ఇతను కొడుకు, పిల్లలకు వారసత్వము లభిస్తుంది అని స్వర్గములో భావిస్తారు కానీ అది ఇప్పటి ప్రారబ్ధము. సత్యమైన సంపాదనను చేసుకుని మీరు ఇప్పుడు 21 జన్మల కోసం వారసత్వాన్ని పొందుతున్నారు. 84 జన్మలనైతే తీసుకోవలసిందే. సతోప్రధానము నుండి మళ్ళీ సతో, రజో, తమోలలోకి వస్తారు. దీనిని మంచి రీతిలో స్మృతి చేసినట్లయితే సంతోషముగా కూడా ఉంటారు. అర్థం చేయించడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది. ఇక అర్థం చేసుకున్న తర్వాత వారికి చాలా సంతోషము కలుగుతుంది. ఏ పిల్లలైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారో, వారు తిరిగి అనేకులకు అర్థం చేయిస్తూ ఉంటారు, ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు, వారసత్వము కూడా అనంతమైనదే లభిస్తుంది. అయితే, ఇందులో త్యాగము కూడా అనంతమైనదే. గృహస్థ వ్యవహారములో ఉంటూ మొత్తం ప్రపంచమంతటినీ త్యాగము చేయాలి, ఎందుకంటే ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే అనంతమైన సన్యాసము చేయిస్తారు. సన్యాసులది హద్దు సన్యాసము మరియు వారిది హఠయోగము. ఇందులో హఠము యొక్క మాటే ఉండదు. ఇది చదువు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదువుకోవాలి. ఇది శివ భగవానువాచ, శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుడిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు, హెవెన్లీ ప్రిన్స్ అని అంటారు. ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు, ఇవి అర్థం చేసుకోవలసినవి మరియు ధారణ చేయవలసినవి. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను నమ్మకూడదు. వ్యాసుడు వ్రాసిన విషయాలను నమ్ముతూ, నమ్ముతూ చెడు గతి ఏర్పడింది కదా. జ్ఞానము తప్ప ఇంకేమి వినిపించినా సరే, వీరు నా శత్రువు, దుర్గతిలోకి తీసుకువెళ్తారు అని భావించండి. ఎప్పుడూ కూడా పరమతాన్ని అనుసరించకూడదు. మన్మతాన్ని, పరమతాన్ని అనుసరించినట్లయితే మరణించినట్లే. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, అసత్యమైన విషయాలను చెప్పేవారైతే చాలామంది ఉన్నారు, మీరైతే తండ్రి నుండే వినాలి. చెడు వినకండి, చెడు చూడకండి... బాప్ దాదా వచ్చిందే మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి, కావున వారి శ్రీమతముపై నడుచుకోవాలి. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. ఇక్కడ తండ్రి సమానముగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా అవ్వాలి. సర్వ గుణాలను ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. 2. చెప్పుడు మాటలను ఎప్పుడూ నమ్మకూడదు, పరమతాన్ని అనుసరించకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి... వరదానము:-నేను అనే భావన యొక్క భారాన్ని సమాప్తము చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవము చేసే బాలకుల నుండి యజమానులుగా కండి ఏ విధమైన నేను అన్న భావన వచ్చినా కానీ భారము తల పైకి ఎక్కుతుంది. కానీ - మీ అన్ని భారాలను నాకు ఇచ్చేయండి, మీరు కేవలము నాట్యము చేయండి, ఎగరండి... అని బాబా ఆఫర్ చేస్తున్నప్పుడు, మరి - సేవ ఎలా జరుగుతుంది, భాషణ ఎలా చేస్తాము అనేటువంటి ప్రశ్నలు ఎందుకు? మీరు స్వయాన్ని కేవలం నిమిత్తముగా భావిస్తూ కనెక్షన్ ను పవర్ హౌస్ తో జోడించి కూర్చోండి, నిరాశకు, దుఃఖానికి లోనవ్వకండి, అప్పుడు బాప్ దాదా స్వతహాగా అంతా చేయించేస్తారు. బాలకుల నుండి యజమానులుగా అవుతాము అని భావిస్తూ శ్రేష్టమైన స్టేజ్ పై స్థితులై ఉండండి, అప్పుడు ప్రత్యక్షఫలము యొక్క అనుభూతిని చేస్తూ ఉంటారు. స్లోగన్:-జ్ఞాన దానముతో పాటుగా గుణ దానము చేయండి, అప్పుడు సఫలత లభిస్తూ ఉంటుంది.   అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’ ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా కానీ దానిని ఆటగా భావించటము ద్వారా కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. కొంతమంది పిల్లలలో ధైర్యము ఉంది, అందుకే ఏ విషయము జరిగినా కానీ - సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యమైతే ఉంది, కానీ నమ్మకము లేదు. నమ్మకము ఉన్నవారి మాటలు ఇలా ఉండవు. నమ్మకము ఉంది అంటే అర్థము - మనసా, వాచా, కర్మణా, ప్రతి విషయములోనూ నిశ్చయబుద్ధి కలిగి ఉండటము, వారి నోటి నుండి ఎప్పుడూ ధైర్యహీనులుగా చేసే మాటలు వెలువడవు. "
#🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 11-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - స్మృతియాత్రలో రేస్ చేసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు, స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది’’ ప్రశ్న:-బ్రాహ్మణ జీవితములో ఒకవేళ అతీంద్రియ సుఖము అనుభవమవ్వకపోతే ఏమని భావించాలి? జవాబు:-తప్పకుండా సూక్ష్మముగా అయినా సరే ఏదో ఒక పాపము జరుగుతుందని భావించాలి. దేహాభిమానములో ఉన్నట్లయితేనే పాపాలు జరుగుతాయి, దాని కారణముగా ఆ సుఖపు అనుభూతిని పొందలేరు. తమను తాము గోప-గోపికలుగా భావిస్తూన్నా సరే అతీంద్రియ సుఖపు అనుభూతి కలగటము లేదంటే, తప్పకుండా ఏదో తప్పు జరుగుతూ ఉంది, అందుకే తండ్రికి సత్యము చెప్పి శ్రీమతము తీసుకుంటూ ఉండండి. ఓంశాంతి. నిరాకార భగవానువాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివుడినే అంటారు. భక్తి మార్గములో వారికి ఎన్ని పేర్లను పెట్టారు, అనేక పేర్లున్నాయి కావుననే ఇంత విస్తారముంది. తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు - ఓ పిల్లలూ, మీ తండ్రినైన, శివుడినైన నన్ను మీరు - ఓ పతితపావనా అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరైతే తప్పకుండా ఒకటే ఉంటుంది. అనేక పేర్లు ఉండజాలవు. శివాయ నమః అని అంటున్నారంటే, ఒక్క శివ అన్న పేరే అన్నట్లు. రచయిత కూడా ఒక్కరే అన్నట్లు. అనేక పేర్లు ఉన్నట్లయితే తికమకపడతారు. ఉదాహరణకు మీ పేరు పుష్ప అనుకోండి, దానికి బదులుగా మిమ్మల్ని షీలా అని పిలిస్తే మీరు రెస్పాండ్ అవుతారా? అవ్వరు. ఇంకెవరినో పిలుస్తున్నారని భావిస్తారు. ఇది కూడా అలాంటి విషయమే. వారి పేరు ఒక్కటే కానీ భక్తి మార్గమున్న కారణముగా, చాలా మందిరాలను నిర్మించిన కారణముగా రకరకాల పేర్లను పెట్టేసారు. లేదంటే ప్రతి ఒక్కరికీ ఒక పేరే ఉంటుంది. గంగా నదిని, యమునా నది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక్క పేరే ప్రసిద్ధమవుతుంది. ఈ శివ అన్న పేరు కూడా ప్రసిద్ధమైనది. శివాయ నమః అని అంటూ ఉంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారు అని నిరాకారుడిని అంటారని మనుష్యుల బుద్ధిలో ఉంటుంది. వారి పేరు ఒక్కటే. బ్రహ్మాను బ్రహ్మా అని, విష్ణువును విష్ణువనే అంటారు. అనేక పేర్లు పెట్టినట్లయితే తికమకపడతారు. అలా చేస్తే రెస్పాంస్ కూడా లభించదు మరియు వారి రూపము గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడుతారు. శివాయ నమః అని అంటారు కావున ఆ ఒక్క పేరు సరిపోతుంది. శివ శంకర అని అనడము కూడా తప్పు అవుతుంది. ఏ విధముగా లక్ష్మీ-నారాయణ అన్న పేర్లు వేర్వేరో, అలా శివుడు, శంకరుడు అన్న పేర్లు వేర్వేరు. అక్కడ నారాయణుడిని లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లోనైతే స్వయానికి రెండేసి పేర్లు కూడా పెట్టుకుంటారు. దేవతలకు ఈ విధముగా డబల్ పేర్లు ఉండేవి కావు. రాధ పేరు వేరు, శ్రీకృష్ణుని పేరు వేరు, ఇక్కడైతే ఒకరికే రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అన్న పేర్లను పెట్టేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - రచయిత ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారినే తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రము వంటిదని అంటారు, మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. అంటే పరమాత్మ కూడా నక్షత్రమైనట్లే కదా. ఆత్మ చిన్నదిగా లేక పెద్దదిగా అవుతుందని కాదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటారు, మీరు ఓ పతిత-పావనా రండి అని పిలిచేవారు. కానీ వారు పావనముగా ఎలా తయారుచేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. గంగను పతిత-పావనిగా భావిస్తారు. పతిత-పావనుడు అయితే ఒక్క తండ్రియే. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కేవలం పేరు మార్చేసారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము దానంతటదే లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మన్మనాభవ అని చెప్పవలసిన అవసరము కూడా లేదు. కానీ తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు, అందుకే - తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్తాను. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేసినట్లయితే మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. కొడుకు జన్మించగానే వారసుడు వచ్చాడని తండ్రి అంటారు. కూతురు కోసం ఇలా అనరు. ఆత్మలైన మీరందరూ అయితే కొడుకులే. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని అంటారు కూడా. మరి అటువంటప్పుడు అంగుష్టము వలె ఎలా ఉండగలదు. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది, దానిని ఈ కళ్ళతో చూడలేము. అయితే, దానిని దివ్యదృష్టితో చూడగలము ఎందుకంటే అది అవ్యక్తమైనది. దివ్యదృష్టితో చైతన్యముగా కనిపించినట్లు కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. కానీ దాని వలన ఏమీ లభించదు, కేవలం సంతోషపడతారు. దానిని భక్తి యొక్క అల్పసుఖము అని అంటారు. అది భక్తి ఫలము. ఎవరైతే చాలా భక్తి చేసారో, వారికి ఆటోమెటిక్ గా, నియమానుసారముగా ఈ జ్ఞానము ద్వారా ఫలము లభించడము జరుగుతుంది. బ్రహ్మా మరియు విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు. భక్తికి ఫలముగా రాజ్యాధికారమనేది విష్ణువు రూపములో లభిస్తుంది. విష్ణువు మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలైతే చాలానే కలిగి ఉంటాయి. కానీ రకరకాల నామ-రూపాలకు భక్తి చేసారని అర్థం చేసుకోవడము జరుగుతుంది. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవ విధ భక్తి ద్వారా సాక్షాత్కారాలు కలిగాయి. ఇప్పుడు సాక్షాత్కారాలు కలగకపోయినా పర్వాలేదు. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతారు. ఇకపోతే పురుషార్థము చేయించేందుకని తండ్రి అంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, దేహము నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియులకు పనులు చేసుకుంటూన్నా కూడా మనసు ప్రియుని వైపు జోడించబడి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అయినా బుద్ధి వేరే వైపులకు పరుగెడుతుంది. మనకు దిగిపోవడానికి ఒక కల్పము పట్టిందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగము నుండి మొదలుకుని మెట్లు దిగుతారు. కొద్దికొద్దిగా మాలిన్యము చేరుతూ ఉంటుంది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా అయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. క్షణములో తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థము చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే శిక్షణను ఇస్తూనే ఉంటారు. నిజముగా చాలా కష్టమే అని మంచి-మంచి తెలివైన పిల్లలు స్వయంగా అనుభవం చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమందైతే అసలేమీ చెప్పరు. తమ అవస్థ గురించి తెలియజేయాలి. తండ్రిని స్మృతే చేయకపోతే ఇక వారసత్వము ఎలా లభిస్తుంది. నియమానుసారముగా స్మృతి చేయరు, మేమైతే శివబాబాకు చెందినవారిమే అని భావిస్తారు. స్మృతి చేయకపోవడము వలన పడిపోతారు. తండ్రిని నిరంతరము స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది, అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. ఎప్పటివరకైతే శరీరము ఉంటుందో, అప్పటివరకు పురుషార్థము కొనసాగుతూనే ఉంటుంది. స్మృతిని పదే-పదే మర్చిపోతున్నారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ యోగబలముతో మీరు రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకేలా పరుగు పెట్టలేరు, నియమము అలా లేదు. రేస్ లో కూడా కొంత తేడా ఉంటుంది. నంబర్ వన్ ఉంటారు, ఆ తర్వాత ప్లస్ లోకి వస్తారు. ఇక్కడ కూడా పిల్లల రేస్ జరుగుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి చేయడము. మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారనైతే మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పాపము చేస్తే అది వంద రెట్లు అయిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. పాపము చేస్తూ కూడా చెప్పనివారు చాలామంది ఉన్నారు. అప్పుడిక అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక చివరిలో ఫెయిల్ అయిపోతారు. చెప్పడానికి సిగ్గుపడతారు. సత్యము చెప్పకపోతే స్వయాన్నే మోసగించుకుంటారు. మా ఈ విషయాన్ని బాబా వింటే ఏమంటారో అని కొందరికి భయము కలుగుతుంది. కొందరైతే చిన్న తప్పును కూడా వినిపించడానికి వచ్చేస్తారు. కానీ బాబా అటువంటివారికి చెప్తున్నారు, పెద్ద-పెద్ద తప్పులను అయితే చాలా మంచి-మంచి పిల్లలు చేస్తారు, మంచి-మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు, మాయ శక్తిశాలిగా ఉన్నవారినే చక్రములోకి తీసుకువస్తుంది, ఇందులో ధైర్యవంతులుగా అవ్వవలసి ఉంటుంది. అబద్ధము నడవదు. నిజము చెప్పినట్లయితే తేలికవుతారు. బాబా ఎంతగా అర్థం చేయించినా కానీ, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అనేక రకాల విషయాలు ఉంటాయి. ఇప్పుడు బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి కావున బాబా అంటారు, బుద్ధిని వేరే వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది, 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. కొందరికి అంగవైకల్యముతో జన్మ కలుగుతుంది, వారిని డిఫెక్టెడ్ అని అంటారు. తమ కర్మల అనుసారముగానే అలా జరుగుతుంది. ఇకపోతే, మనుష్యులైతే మనుష్యులుగానే జన్మ తీసుకుంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో, పవిత్రముగా ఉండాలి, రెండవది, అబద్ధాలు, పాపాలు ఏమీ చేయకూడదు. లేదంటే చాలా నష్టము కలుగుతుంది. చూడండి, ఒకతని ద్వారా చిన్న తప్పు జరిగింది, అతను బాబా వద్దకు వచ్చి, బాబా క్షమించండి, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను అని చెప్పారు. బాబా అన్నారు, ఇలాంటి తప్పులు చాలామంది ద్వారా జరుగుతూ ఉంటాయి, నీవైతే సత్యము చెప్పావు, కొంతమందైతే కనీసం వినిపించరు కూడా. కొంతమంది ఫస్ట్ క్లాస్ కుమార్తెలు ఉన్నారు, వారి బుద్ధి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదు. ఉదాహరణకు బొంబాయిలో డాక్టర్ నిర్మల ఉన్నారు, వారు నంబర్ వన్. వారిది పూర్తిగా స్వచ్ఛమైన మనసు, ఎప్పుడూ మనసులో తప్పుడు ఆలోచనలు రావు, అందుకే వారు బాబా హృదయాన్ని అధిరోహించారు. ఇలాంటి కుమార్తెలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, కేవలం సత్యమైన మనసుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేయవలసిందే. బుద్ధియోగము తండ్రితో జోడింపబడి ఉండాలి. చేతులు పనివైపు, మనసు ప్రియుని వైపు ఉండాలి. ఈ అవస్థ చివరిలో ఏర్పడుతుంది. ఈ అవస్థను పొందినవారి గురించే గాయనము చేస్తారు, అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అని. వారు ఈ అవస్థను పొందుతారు. ఎవరైతే పాప కర్మలు చేస్తారో, వారికి ఈ అవస్థ తయారవ్వదు. బాబాకు చాలా బాగా తెలుసు, అందుకే భక్తి మార్గములో కూడా మంచి లేక చెడు కర్మల ఫలము లభిస్తుంది. ఇచ్చేవారైతే తండ్రియే కదా. ఎవరైనా ఎవరికైనా దుఃఖము ఇస్తే, వారు తప్పకుండా దుఃఖము అనుభవిస్తారు. ఎటువంటి కర్మలు చేసారో, ఆ విధముగా అనుభవించవలసిందే. ఇక్కడైతే తండ్రి స్వయం హాజరై ఉన్నారు కావున వారు అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కూడా ఇది గవర్నమెంట్, ధర్మరాజు నాతో పాటు ఉన్నారు కదా. ఈ సమయములో నా నుండి ఏదీ దాచి పెట్టకండి. బాబాకు తెలుసులే, మేము శివబాబా నుండి మనసులో క్షమాపణలు కోరుకుంటాము అని అనుకోకండి, ఏమీ క్షమింపబడదు. ఎప్పుడూ ఎవరి పాపము దాగి ఉండదు. పాపము చేసినట్లయితే రోజురోజుకు పాపాత్ములుగా అవుతూ ఉంటారు. భాగ్యములో లేకపోతే ఇక అలాగే జరుగుతుంది. రిజిస్టర్ పాడైపోతుంది. ఒక్కసారి అబద్ధము చెప్తే, నిజము చెప్పకపోతే, ఇక అలాంటి పనులు చేస్తూనే ఉంటారేమోనని భావించడము జరుగుతుంది. అబద్ధము ఎప్పుడూ దాగి ఉండదు. అయినా కూడా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఒక పైసను దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనము చేసినదానితో సమానమని అంటారు, అందుకే నా ద్వారా ఈ దోషము జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని చెప్తారు, మీ అంతట మీరే ఎందుకు చెప్పరు. చాలామంది పిల్లలు దాచిపెడతారని బాబాకు తెలుసు. తండ్రికి వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. ఎక్కడి నుండైనా ఉత్తరము వస్తే, ఏమని జవాబివ్వాలో అడగండి. వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. చాలామందిలో ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే, వారు దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని లభిస్తాయి. వేసుకోమని బాబా చెప్తే, అప్పుడు బాబా బాధ్యులవుతారు. అవస్థను చూసి కొంతమందికి యజ్ఞానికి పంపించమని చెప్తాను. దానిని మీకు మార్చి ఇచ్చినట్లయితే మంచిది, లేదంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. బాబా చాలా అప్రమత్తము చేస్తారు. మార్గము చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ సలహాను తీసుకోవాలి. ఉత్తరాన్ని కూడా ఈ విధముగా వ్రాసినట్లయితే బాణము తగులుతుందని బాబా శిక్షణయే ఇస్తారు, కానీ చాలామందిలో దేహాభిమానముంది. శ్రీమతముపై నడవకపోతే తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతముపై నడుచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ లాభమే ఉంటుంది. మార్గము ఎంత సహజమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తారు. ప్రజలను తయారుచేసుకోకపోతే రాజా-రాణిగా కూడా అవ్వలేరు, కానీ ఎంతైనా దాచిపెట్టే వారికన్నా అయితే ఉన్నత పదవిని పొందగలరు. అర్థం చేయించడము తండ్రి బాధ్యత. ఇక తర్వాత మాకు తెలియదని అనే విధముగా ఉండకూడదు. బాబా అన్ని డైరెక్షన్లను ఇస్తారు. తప్పును వెంటనే తెలియజేయాలి. పర్వాలేదు, మళ్ళీ చేయకండి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ప్రేమగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రికి చెప్పడములో కళ్యాణముంది. తండ్రి బుజ్జగించి ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే హృదయము నుండి ఒక్కసారిగా పడిపోతారు. వీరి హృదయము నుండి పడిపోయినట్లయితే శివబాబా హృదయము నుండి కూడా పడిపోయినట్లే. మేము డైరెక్ట్ గా శివబాబా నుండి తీసుకోగలమని అనుకోకండి, అలా ఏమీ జరుగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారో, అంతగా బుద్ధి బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి డైరెక్ట్ గా కూర్చుని అర్థం చేయిస్తారు, ఇవే తర్వాత శాస్త్రాలుగా తయారవుతాయి. వాటిలో గీతయే భారత్ యొక్క సర్వోత్తమమైన శాస్త్రము. సర్వశాస్త్రమయి శిరోమణి గీత, దానిని భగవంతుడు వినిపించారు అని అంటూ ఉంటారు కూడా. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి-తండ్రి అయితే మిగిలినవన్నీ పిల్లలు. గీతలోనే భగవానువాచ ఉంది. శ్రీకృష్ణుడినైతే దైవీ సాంప్రదాయానికి చెందినవారని అంటారు. దేవతలు అంటే కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు మాత్రమే. భగవంతుడైతే దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ముగ్గురినీ రచించేవారు శివుడు. ఇది పూర్తిగా స్పష్టముగా ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది, శ్రీకృష్ణుని ద్వారా స్థాపన జరుగుతుందని ఎప్పుడూ అనరు. బ్రహ్మా రూపాన్ని చూపించారు. దేని స్థాపన? విష్ణుపురి యొక్క స్థాపన. ఈ చిత్రమైతే మనసులో ముద్రింపబడిపోవాలి. మనము శివబాబా నుండి వీరి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి లేకపోతే తాతగారి ఆస్తి లభించదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు ఇలా చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు అని. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. గమ్యము చాలా ఉన్నతమైనది, అందుకే అడుగడుగులోనూ సర్జన్ నుండి సలహాను తీసుకోవాలి. శ్రీమతముపై నడవడములోనే లాభముంది, తండ్రి నుండి ఏదీ దాచి పెట్టకూడదు. 2. దేహము మరియు దేహధారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. వరదానము:-సదా ఏకరసమైన సంపన్న మూడ్ లో ఉండే పురుషార్థీ సో ప్రారబ్ధీ స్వరూప భవ బాప్ దాదా వతనము నుండి చూస్తూ ఉంటారు, కొంతమంది పిల్లల మూడ్ చాలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన మూడ్, ఒక్కోసారి ప్రశ్నార్థక మూడ్, ఒక్కోసారి తికమకపడే మూడ్, ఒక్కోసారి టెన్షన్, ఒక్కోసారి అటెన్షన్ అనే ఊయల... కానీ సంగమయుగము ప్రారబ్ధపు యుగము, అంతేకానీ పురుషార్థపు యుగము కాదు. అందుకే తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు, తండ్రి స్టేజ్ ఏదైతే ఉందో అదే పిల్లలది - ఇదే సంగమయుగపు ప్రారబ్ధము. కావున సదా ఏకరసమైన, సంపన్నమైన ఒకే మూడ్ లో ఉండండి, అప్పుడు తండ్రి సమానమైనవారు అనగా ప్రారబ్ధ స్వరూపము కలవారు అని అంటారు. స్లోగన్:-బాప్ దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సాగరములో కదిలిపోరు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’ విశ్వాసపాత్రుల మొదటి గుర్తు ఏమిటంటే - ప్రతి క్షణము, ప్రతి అడుగు శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుచుకోవడము. ఏక్యురేట్ మూర్తిగా అవ్వడము అనగా ఉలిదెబ్బలు పడటము వంటిది. ఉలిదెబ్బలు వేసి-వేసి మూర్తిని సరి చేస్తారు. మీరైతే ఉలిదెబ్బలు తినటములో అనుభవజ్ఞులుగా అయిపోయారు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఆటలా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు మరియు చిరునవ్వుతో ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా ఏక్యురేట్ పాత్రను అభినయించే నిశ్చయబుద్ధి నిశ్చింత ఆత్మ. సూచన:- ఈ రోజు మనందరి అతి ప్రియమైన, బాప్ దాదా యొక్క కంటిరత్నము, తమ హృదయ సింహాసనముపై బాప్ దాదాను కూర్చోబెట్టుకున్న మధురమైన గుల్జార్ దాదీజీ యొక్క పుణ్య స్మృతి దివసము. ఈ సందర్భముగా బ్రాహ్మణ కుల భూషణులైన సోదరీ, సోదరులైన మనమందరము, వారి ద్వారా ప్రియమైన అవ్యక్త బాప్ దాదా యొక్క పాలన ఏదైతే మనకు లభించిందో, ఆ పాలనకు రిటర్న్ ఇచ్చే శుభ సంకల్పము చేద్దాము. ఏ విధముగా దాదీజీ ప్రతి అడుగు శ్రీమతమనుసారముగా ఏక్యూరేట్ గా నుడుచుకున్నారో, సదా తమ చిరునవ్వుతో కూడిన ముఖముతో అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చారో మరియు తీసుకున్నారో, ఏక్యూరేట్ పాత్రను అభినయించారో, అలా మనమందరము వారి అడుగుజాడలలో నడిచి వారికి మన స్నేహ శ్రద్ధాంజలిని అర్పితము చేద్దాము, ఇదే వారి పట్ల మనము చూపించే సత్యమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి. "
#🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు 11-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - స్మృతియాత్రలో రేస్ చేసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు, స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది’’ ప్రశ్న:-బ్రాహ్మణ జీవితములో ఒకవేళ అతీంద్రియ సుఖము అనుభవమవ్వకపోతే ఏమని భావించాలి? జవాబు:-తప్పకుండా సూక్ష్మముగా అయినా సరే ఏదో ఒక పాపము జరుగుతుందని భావించాలి. దేహాభిమానములో ఉన్నట్లయితేనే పాపాలు జరుగుతాయి, దాని కారణముగా ఆ సుఖపు అనుభూతిని పొందలేరు. తమను తాము గోప-గోపికలుగా భావిస్తూన్నా సరే అతీంద్రియ సుఖపు అనుభూతి కలగటము లేదంటే, తప్పకుండా ఏదో తప్పు జరుగుతూ ఉంది, అందుకే తండ్రికి సత్యము చెప్పి శ్రీమతము తీసుకుంటూ ఉండండి. ఓంశాంతి. నిరాకార భగవానువాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివుడినే అంటారు. భక్తి మార్గములో వారికి ఎన్ని పేర్లను పెట్టారు, అనేక పేర్లున్నాయి కావుననే ఇంత విస్తారముంది. తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు - ఓ పిల్లలూ, మీ తండ్రినైన, శివుడినైన నన్ను మీరు - ఓ పతితపావనా అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరైతే తప్పకుండా ఒకటే ఉంటుంది. అనేక పేర్లు ఉండజాలవు. శివాయ నమః అని అంటున్నారంటే, ఒక్క శివ అన్న పేరే అన్నట్లు. రచయిత కూడా ఒక్కరే అన్నట్లు. అనేక పేర్లు ఉన్నట్లయితే తికమకపడతారు. ఉదాహరణకు మీ పేరు పుష్ప అనుకోండి, దానికి బదులుగా మిమ్మల్ని షీలా అని పిలిస్తే మీరు రెస్పాండ్ అవుతారా? అవ్వరు. ఇంకెవరినో పిలుస్తున్నారని భావిస్తారు. ఇది కూడా అలాంటి విషయమే. వారి పేరు ఒక్కటే కానీ భక్తి మార్గమున్న కారణముగా, చాలా మందిరాలను నిర్మించిన కారణముగా రకరకాల పేర్లను పెట్టేసారు. లేదంటే ప్రతి ఒక్కరికీ ఒక పేరే ఉంటుంది. గంగా నదిని, యమునా నది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక్క పేరే ప్రసిద్ధమవుతుంది. ఈ శివ అన్న పేరు కూడా ప్రసిద్ధమైనది. శివాయ నమః అని అంటూ ఉంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారు అని నిరాకారుడిని అంటారని మనుష్యుల బుద్ధిలో ఉంటుంది. వారి పేరు ఒక్కటే. బ్రహ్మాను బ్రహ్మా అని, విష్ణువును విష్ణువనే అంటారు. అనేక పేర్లు పెట్టినట్లయితే తికమకపడతారు. అలా చేస్తే రెస్పాంస్ కూడా లభించదు మరియు వారి రూపము గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడుతారు. శివాయ నమః అని అంటారు కావున ఆ ఒక్క పేరు సరిపోతుంది. శివ శంకర అని అనడము కూడా తప్పు అవుతుంది. ఏ విధముగా లక్ష్మీ-నారాయణ అన్న పేర్లు వేర్వేరో, అలా శివుడు, శంకరుడు అన్న పేర్లు వేర్వేరు. అక్కడ నారాయణుడిని లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లోనైతే స్వయానికి రెండేసి పేర్లు కూడా పెట్టుకుంటారు. దేవతలకు ఈ విధముగా డబల్ పేర్లు ఉండేవి కావు. రాధ పేరు వేరు, శ్రీకృష్ణుని పేరు వేరు, ఇక్కడైతే ఒకరికే రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అన్న పేర్లను పెట్టేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - రచయిత ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారినే తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రము వంటిదని అంటారు, మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. అంటే పరమాత్మ కూడా నక్షత్రమైనట్లే కదా. ఆత్మ చిన్నదిగా లేక పెద్దదిగా అవుతుందని కాదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటారు, మీరు ఓ పతిత-పావనా రండి అని పిలిచేవారు. కానీ వారు పావనముగా ఎలా తయారుచేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. గంగను పతిత-పావనిగా భావిస్తారు. పతిత-పావనుడు అయితే ఒక్క తండ్రియే. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కేవలం పేరు మార్చేసారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము దానంతటదే లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మన్మనాభవ అని చెప్పవలసిన అవసరము కూడా లేదు. కానీ తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు, అందుకే - తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్తాను. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేసినట్లయితే మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. కొడుకు జన్మించగానే వారసుడు వచ్చాడని తండ్రి అంటారు. కూతురు కోసం ఇలా అనరు. ఆత్మలైన మీరందరూ అయితే కొడుకులే. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని అంటారు కూడా. మరి అటువంటప్పుడు అంగుష్టము వలె ఎలా ఉండగలదు. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది, దానిని ఈ కళ్ళతో చూడలేము. అయితే, దానిని దివ్యదృష్టితో చూడగలము ఎందుకంటే అది అవ్యక్తమైనది. దివ్యదృష్టితో చైతన్యముగా కనిపించినట్లు కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. కానీ దాని వలన ఏమీ లభించదు, కేవలం సంతోషపడతారు. దానిని భక్తి యొక్క అల్పసుఖము అని అంటారు. అది భక్తి ఫలము. ఎవరైతే చాలా భక్తి చేసారో, వారికి ఆటోమెటిక్ గా, నియమానుసారముగా ఈ జ్ఞానము ద్వారా ఫలము లభించడము జరుగుతుంది. బ్రహ్మా మరియు విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు. భక్తికి ఫలముగా రాజ్యాధికారమనేది విష్ణువు రూపములో లభిస్తుంది. విష్ణువు మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలైతే చాలానే కలిగి ఉంటాయి. కానీ రకరకాల నామ-రూపాలకు భక్తి చేసారని అర్థం చేసుకోవడము జరుగుతుంది. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవ విధ భక్తి ద్వారా సాక్షాత్కారాలు కలిగాయి. ఇప్పుడు సాక్షాత్కారాలు కలగకపోయినా పర్వాలేదు. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతారు. ఇకపోతే పురుషార్థము చేయించేందుకని తండ్రి అంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, దేహము నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియులకు పనులు చేసుకుంటూన్నా కూడా మనసు ప్రియుని వైపు జోడించబడి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అయినా బుద్ధి వేరే వైపులకు పరుగెడుతుంది. మనకు దిగిపోవడానికి ఒక కల్పము పట్టిందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగము నుండి మొదలుకుని మెట్లు దిగుతారు. కొద్దికొద్దిగా మాలిన్యము చేరుతూ ఉంటుంది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా అయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. క్షణములో తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థము చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే శిక్షణను ఇస్తూనే ఉంటారు. నిజముగా చాలా కష్టమే అని మంచి-మంచి తెలివైన పిల్లలు స్వయంగా అనుభవం చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమందైతే అసలేమీ చెప్పరు. తమ అవస్థ గురించి తెలియజేయాలి. తండ్రిని స్మృతే చేయకపోతే ఇక వారసత్వము ఎలా లభిస్తుంది. నియమానుసారముగా స్మృతి చేయరు, మేమైతే శివబాబాకు చెందినవారిమే అని భావిస్తారు. స్మృతి చేయకపోవడము వలన పడిపోతారు. తండ్రిని నిరంతరము స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది, అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. ఎప్పటివరకైతే శరీరము ఉంటుందో, అప్పటివరకు పురుషార్థము కొనసాగుతూనే ఉంటుంది. స్మృతిని పదే-పదే మర్చిపోతున్నారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ యోగబలముతో మీరు రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకేలా పరుగు పెట్టలేరు, నియమము అలా లేదు. రేస్ లో కూడా కొంత తేడా ఉంటుంది. నంబర్ వన్ ఉంటారు, ఆ తర్వాత ప్లస్ లోకి వస్తారు. ఇక్కడ కూడా పిల్లల రేస్ జరుగుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి చేయడము. మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారనైతే మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పాపము చేస్తే అది వంద రెట్లు అయిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. పాపము చేస్తూ కూడా చెప్పనివారు చాలామంది ఉన్నారు. అప్పుడిక అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక చివరిలో ఫెయిల్ అయిపోతారు. చెప్పడానికి సిగ్గుపడతారు. సత్యము చెప్పకపోతే స్వయాన్నే మోసగించుకుంటారు. మా ఈ విషయాన్ని బాబా వింటే ఏమంటారో అని కొందరికి భయము కలుగుతుంది. కొందరైతే చిన్న తప్పును కూడా వినిపించడానికి వచ్చేస్తారు. కానీ బాబా అటువంటివారికి చెప్తున్నారు, పెద్ద-పెద్ద తప్పులను అయితే చాలా మంచి-మంచి పిల్లలు చేస్తారు, మంచి-మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు, మాయ శక్తిశాలిగా ఉన్నవారినే చక్రములోకి తీసుకువస్తుంది, ఇందులో ధైర్యవంతులుగా అవ్వవలసి ఉంటుంది. అబద్ధము నడవదు. నిజము చెప్పినట్లయితే తేలికవుతారు. బాబా ఎంతగా అర్థం చేయించినా కానీ, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అనేక రకాల విషయాలు ఉంటాయి. ఇప్పుడు బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి కావున బాబా అంటారు, బుద్ధిని వేరే వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది, 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. కొందరికి అంగవైకల్యముతో జన్మ కలుగుతుంది, వారిని డిఫెక్టెడ్ అని అంటారు. తమ కర్మల అనుసారముగానే అలా జరుగుతుంది. ఇకపోతే, మనుష్యులైతే మనుష్యులుగానే జన్మ తీసుకుంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో, పవిత్రముగా ఉండాలి, రెండవది, అబద్ధాలు, పాపాలు ఏమీ చేయకూడదు. లేదంటే చాలా నష్టము కలుగుతుంది. చూడండి, ఒకతని ద్వారా చిన్న తప్పు జరిగింది, అతను బాబా వద్దకు వచ్చి, బాబా క్షమించండి, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను అని చెప్పారు. బాబా అన్నారు, ఇలాంటి తప్పులు చాలామంది ద్వారా జరుగుతూ ఉంటాయి, నీవైతే సత్యము చెప్పావు, కొంతమందైతే కనీసం వినిపించరు కూడా. కొంతమంది ఫస్ట్ క్లాస్ కుమార్తెలు ఉన్నారు, వారి బుద్ధి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదు. ఉదాహరణకు బొంబాయిలో డాక్టర్ నిర్మల ఉన్నారు, వారు నంబర్ వన్. వారిది పూర్తిగా స్వచ్ఛమైన మనసు, ఎప్పుడూ మనసులో తప్పుడు ఆలోచనలు రావు, అందుకే వారు బాబా హృదయాన్ని అధిరోహించారు. ఇలాంటి కుమార్తెలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, కేవలం సత్యమైన మనసుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేయవలసిందే. బుద్ధియోగము తండ్రితో జోడింపబడి ఉండాలి. చేతులు పనివైపు, మనసు ప్రియుని వైపు ఉండాలి. ఈ అవస్థ చివరిలో ఏర్పడుతుంది. ఈ అవస్థను పొందినవారి గురించే గాయనము చేస్తారు, అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అని. వారు ఈ అవస్థను పొందుతారు. ఎవరైతే పాప కర్మలు చేస్తారో, వారికి ఈ అవస్థ తయారవ్వదు. బాబాకు చాలా బాగా తెలుసు, అందుకే భక్తి మార్గములో కూడా మంచి లేక చెడు కర్మల ఫలము లభిస్తుంది. ఇచ్చేవారైతే తండ్రియే కదా. ఎవరైనా ఎవరికైనా దుఃఖము ఇస్తే, వారు తప్పకుండా దుఃఖము అనుభవిస్తారు. ఎటువంటి కర్మలు చేసారో, ఆ విధముగా అనుభవించవలసిందే. ఇక్కడైతే తండ్రి స్వయం హాజరై ఉన్నారు కావున వారు అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కూడా ఇది గవర్నమెంట్, ధర్మరాజు నాతో పాటు ఉన్నారు కదా. ఈ సమయములో నా నుండి ఏదీ దాచి పెట్టకండి. బాబాకు తెలుసులే, మేము శివబాబా నుండి మనసులో క్షమాపణలు కోరుకుంటాము అని అనుకోకండి, ఏమీ క్షమింపబడదు. ఎప్పుడూ ఎవరి పాపము దాగి ఉండదు. పాపము చేసినట్లయితే రోజురోజుకు పాపాత్ములుగా అవుతూ ఉంటారు. భాగ్యములో లేకపోతే ఇక అలాగే జరుగుతుంది. రిజిస్టర్ పాడైపోతుంది. ఒక్కసారి అబద్ధము చెప్తే, నిజము చెప్పకపోతే, ఇక అలాంటి పనులు చేస్తూనే ఉంటారేమోనని భావించడము జరుగుతుంది. అబద్ధము ఎప్పుడూ దాగి ఉండదు. అయినా కూడా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఒక పైసను దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనము చేసినదానితో సమానమని అంటారు, అందుకే నా ద్వారా ఈ దోషము జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని చెప్తారు, మీ అంతట మీరే ఎందుకు చెప్పరు. చాలామంది పిల్లలు దాచిపెడతారని బాబాకు తెలుసు. తండ్రికి వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. ఎక్కడి నుండైనా ఉత్తరము వస్తే, ఏమని జవాబివ్వాలో అడగండి. వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. చాలామందిలో ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే, వారు దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని లభిస్తాయి. వేసుకోమని బాబా చెప్తే, అప్పుడు బాబా బాధ్యులవుతారు. అవస్థను చూసి కొంతమందికి యజ్ఞానికి పంపించమని చెప్తాను. దానిని మీకు మార్చి ఇచ్చినట్లయితే మంచిది, లేదంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. బాబా చాలా అప్రమత్తము చేస్తారు. మార్గము చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ సలహాను తీసుకోవాలి. ఉత్తరాన్ని కూడా ఈ విధముగా వ్రాసినట్లయితే బాణము తగులుతుందని బాబా శిక్షణయే ఇస్తారు, కానీ చాలామందిలో దేహాభిమానముంది. శ్రీమతముపై నడవకపోతే తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతముపై నడుచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ లాభమే ఉంటుంది. మార్గము ఎంత సహజమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తారు. ప్రజలను తయారుచేసుకోకపోతే రాజా-రాణిగా కూడా అవ్వలేరు, కానీ ఎంతైనా దాచిపెట్టే వారికన్నా అయితే ఉన్నత పదవిని పొందగలరు. అర్థం చేయించడము తండ్రి బాధ్యత. ఇక తర్వాత మాకు తెలియదని అనే విధముగా ఉండకూడదు. బాబా అన్ని డైరెక్షన్లను ఇస్తారు. తప్పును వెంటనే తెలియజేయాలి. పర్వాలేదు, మళ్ళీ చేయకండి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ప్రేమగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రికి చెప్పడములో కళ్యాణముంది. తండ్రి బుజ్జగించి ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే హృదయము నుండి ఒక్కసారిగా పడిపోతారు. వీరి హృదయము నుండి పడిపోయినట్లయితే శివబాబా హృదయము నుండి కూడా పడిపోయినట్లే. మేము డైరెక్ట్ గా శివబాబా నుండి తీసుకోగలమని అనుకోకండి, అలా ఏమీ జరుగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారో, అంతగా బుద్ధి బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి డైరెక్ట్ గా కూర్చుని అర్థం చేయిస్తారు, ఇవే తర్వాత శాస్త్రాలుగా తయారవుతాయి. వాటిలో గీతయే భారత్ యొక్క సర్వోత్తమమైన శాస్త్రము. సర్వశాస్త్రమయి శిరోమణి గీత, దానిని భగవంతుడు వినిపించారు అని అంటూ ఉంటారు కూడా. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి-తండ్రి అయితే మిగిలినవన్నీ పిల్లలు. గీతలోనే భగవానువాచ ఉంది. శ్రీకృష్ణుడినైతే దైవీ సాంప్రదాయానికి చెందినవారని అంటారు. దేవతలు అంటే కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు మాత్రమే. భగవంతుడైతే దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ముగ్గురినీ రచించేవారు శివుడు. ఇది పూర్తిగా స్పష్టముగా ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది, శ్రీకృష్ణుని ద్వారా స్థాపన జరుగుతుందని ఎప్పుడూ అనరు. బ్రహ్మా రూపాన్ని చూపించారు. దేని స్థాపన? విష్ణుపురి యొక్క స్థాపన. ఈ చిత్రమైతే మనసులో ముద్రింపబడిపోవాలి. మనము శివబాబా నుండి వీరి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి లేకపోతే తాతగారి ఆస్తి లభించదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు ఇలా చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు అని. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. గమ్యము చాలా ఉన్నతమైనది, అందుకే అడుగడుగులోనూ సర్జన్ నుండి సలహాను తీసుకోవాలి. శ్రీమతముపై నడవడములోనే లాభముంది, తండ్రి నుండి ఏదీ దాచి పెట్టకూడదు. 2. దేహము మరియు దేహధారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి. వరదానము:-సదా ఏకరసమైన సంపన్న మూడ్ లో ఉండే పురుషార్థీ సో ప్రారబ్ధీ స్వరూప భవ బాప్ దాదా వతనము నుండి చూస్తూ ఉంటారు, కొంతమంది పిల్లల మూడ్ చాలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన మూడ్, ఒక్కోసారి ప్రశ్నార్థక మూడ్, ఒక్కోసారి తికమకపడే మూడ్, ఒక్కోసారి టెన్షన్, ఒక్కోసారి అటెన్షన్ అనే ఊయల... కానీ సంగమయుగము ప్రారబ్ధపు యుగము, అంతేకానీ పురుషార్థపు యుగము కాదు. అందుకే తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు, తండ్రి స్టేజ్ ఏదైతే ఉందో అదే పిల్లలది - ఇదే సంగమయుగపు ప్రారబ్ధము. కావున సదా ఏకరసమైన, సంపన్నమైన ఒకే మూడ్ లో ఉండండి, అప్పుడు తండ్రి సమానమైనవారు అనగా ప్రారబ్ధ స్వరూపము కలవారు అని అంటారు. స్లోగన్:-బాప్ దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సాగరములో కదిలిపోరు.   అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’ విశ్వాసపాత్రుల మొదటి గుర్తు ఏమిటంటే - ప్రతి క్షణము, ప్రతి అడుగు శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుచుకోవడము. ఏక్యురేట్ మూర్తిగా అవ్వడము అనగా ఉలిదెబ్బలు పడటము వంటిది. ఉలిదెబ్బలు వేసి-వేసి మూర్తిని సరి చేస్తారు. మీరైతే ఉలిదెబ్బలు తినటములో అనుభవజ్ఞులుగా అయిపోయారు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఆటలా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు మరియు చిరునవ్వుతో ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా ఏక్యురేట్ పాత్రను అభినయించే నిశ్చయబుద్ధి నిశ్చింత ఆత్మ. సూచన:- ఈ రోజు మనందరి అతి ప్రియమైన, బాప్ దాదా యొక్క కంటిరత్నము, తమ హృదయ సింహాసనముపై బాప్ దాదాను కూర్చోబెట్టుకున్న మధురమైన గుల్జార్ దాదీజీ యొక్క పుణ్య స్మృతి దివసము. ఈ సందర్భముగా బ్రాహ్మణ కుల భూషణులైన సోదరీ, సోదరులైన మనమందరము, వారి ద్వారా ప్రియమైన అవ్యక్త బాప్ దాదా యొక్క పాలన ఏదైతే మనకు లభించిందో, ఆ పాలనకు రిటర్న్ ఇచ్చే శుభ సంకల్పము చేద్దాము. ఏ విధముగా దాదీజీ ప్రతి అడుగు శ్రీమతమనుసారముగా ఏక్యూరేట్ గా నుడుచుకున్నారో, సదా తమ చిరునవ్వుతో కూడిన ముఖముతో అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చారో మరియు తీసుకున్నారో, ఏక్యూరేట్ పాత్రను అభినయించారో, అలా మనమందరము వారి అడుగుజాడలలో నడిచి వారికి మన స్నేహ శ్రద్ధాంజలిని అర్పితము చేద్దాము, ఇదే వారి పట్ల మనము చూపించే సత్యమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి. "
https://youtube.com/shorts/fkjkXNfrGcU?si=XnY99RN4VMsMBmbS #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🕉️ గణపతి బప్పా మోరియా
https://youtube.com/live/E0oKdvQv5rQ?si=roiWjqun10IRzwlQ #🇮🇳 మన దేశ సంస్కృతి #🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview