హరికృష్ణ ఆచార్య
ShareChat
click to see wallet page
@68144036
68144036
హరికృష్ణ ఆచార్య
@68144036
ఓమ్ గురుభ్యోనమః
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #చారిత్రక ఆధారాలు, పురావస్తు శాస్త్రం మరియు ఆయా మతాల గ్రంథాల ప్రకారం ఈ మూడింటిలో **సనాతన ధర్మం (హిందూ మతం)** అత్యంత ప్రాచీనమైనది. దీనిని కాలక్రమానుసారం (Timeline) ఇలా అర్థం చేసుకోవచ్చు: ### 1. సనాతన ధర్మం (హిందూ మతం) * **కాలం:** దీనికి నిర్దిష్టమైన "స్థాపకుడు" అంటూ ఎవరూ లేరు. చరిత్రకారుల ప్రకారం దీని మూలాలు క్రీస్తుపూర్వం 5000 - 3000 సంవత్సరాల కంటే ముందే ఉన్నాయి. * **విశిష్టత:** ఇది ఒక జీవన విధానం (Way of Life). సింధు లోయ నాగరికత కంటే ముందే వేదాల జ్ఞానం ఉనికిలో ఉందని నమ్ముతారు. అందుకే దీనిని "సనాతన" (అంటే ఆది, అంతం లేనిది లేదా శాశ్వతమైనది) అని పిలుస్తారు. * ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతంగా దీనికి గుర్తింపు ఉంది. ### 2. క్రైస్తవం (Christianity) * **కాలం:** ఇది సుమారు **2000 సంవత్సరాల** క్రితం ప్రారంభమైంది. * **స్థాపకుడు:** యేసుక్రీస్తు (Jesus Christ). ఆయన బోధనల నుండి ఈ ధర్మం విస్తరించింది. * సనాతన ధర్మం వెలుగోందుతున్న వేల ఏళ్ల తర్వాత క్రైస్తవం ఉద్భవించింది. ### 3. ఇస్లాం (Islam) * **కాలం:** ఇది సుమారు **1400 సంవత్సరాల** క్రితం (క్రీ.శ. 7వ శతాబ్దం) ప్రారంభమైంది. * **ప్రవక్త:** మహమ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ సందేశం (ఖురాన్) ప్రజలకు చేరింది. * ఈ మూడింటిలో కాలక్రమం ప్రకారం ఇస్లాం చివరగా వచ్చింది. ### ఒక చిన్న పోలిక (Comparison Table) | ధర్మం | సుమారు వయస్సు | స్థాపకుడు | |---|---|---| | **సనాతన ధర్మం** | 5000+ సంవత్సరాలు (చరిత్ర ప్రకారం) | ఎవరూ లేరు (అపాౌరుషేయం) | | **క్రైస్తవం** | 2000 సంవత్సరాలు | యేసుక్రీస్తు | | **ఇస్లాం** | 1400 సంవత్సరాలు | మహమ్మద్ ప్రవక్త | ### గమనిక (ఆధ్యాత్మిక కోణం): * **ఇస్లాం ప్రకారం:** ముస్లింలు ఆదం (ఆదాము) నుండి ఇస్లాం ఉందని, మహమ్మద్ ప్రవక్త దానిని సంస్కరించి పరిపూర్ణం చేశారని నమ్ముతారు. * **సనాతన ధర్మం ప్రకారం:** ఇది సృష్టి ఆరంభం నుండి ఉందని, యుగయుగాలుగా కొనసాగుతోందని నమ్ముతారు. **ముగింపు:** చారిత్రక ఆధారాల (Historical Evidence) ప్రకారం చూస్తే, సనాతన ధర్మం అన్నిటికంటే ముందు పుట్టింది. దాని తర్వాత క్రైస్తవం, ఆ తర్వాత ఇస్లాం వచ్చాయి.
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ೧ 9 ೧ 9 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #వజ్ర సంకల్పం ఉంటే... అన్నీ సుసాధ్యమే* కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేది ఒక చలనచిత్రంలోని పాట చరణం. ఈ చరణంలో విజ్ఞానమే కాక ప్రేరణాయుతమైన భావన కూడా ఉంది. దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఇందులోని అంతరార్థంగా చెప్పవచ్చు. మహాత్మా తులసీదాస్ కూడా ఎన్నో స్పూర్తిదాయకమైన పద్యాలు రాసి ప్రజల్ని మేల్కొలిపే ప్రయత్నం చేశాడు. ఆయన రాసిన దోహావళి అనే కావ్యంలోనిదే ప్రస్తుత పద్యం. "గంగా యమునా సురసతి సాత్ సింధు భర్పూర్ తులసీ చాతక్ కే మతే బిన్ స్వాతీ సబ్ ధూర్' భూమ్మీద గంగా యమునా సరస్వతీ వంటి నదులు మంచి నీటిలో ఉన్నా, సప్త సాగరాలు నీటితో ఉన్నా చాతక పక్షికి ఇవేవి పనికిరానివే. చాతక పక్షి కేవలం వర్షరుతువులోని స్వాతి నక్షత్రంలో మేఘాల నుంచి కురిసే నీటిని నేరుగా తాగి మాత్రమే తన దాహాన్ని తీర్చుకుంటుంది. అది అయిపోయిన తర్వాత తిరిగి సంవత్సర మంతా వాన చినుకుల కోసం మబ్బుల వైపు చూస్తూ బతుకుతుంది అంటాడు తులసీదాసు. భక్తుడు కూడా భగవంతుని దర్శన భాగ్యం కోసం చాతక పక్షివ వలె పట్టుదలతో కష్టాల కోర్చి ఎదురుచూడాలన్నదే భక్త శిరోమణి గోస్వామి తులసీదాసు అభిప్రాయం. ఆది శంకరులు కూడా ఒకానొక సందర్భంలో తన శిష్యులు శివ సాన్నిధ్యం చేరడానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో బోధించారు. చాతక పక్షి స్వాతి నక్షత్రంలో కురిసే వర్షం చినుకులు మాత్రమే తాగుతుంటుంది. అందుకే అది నిండైన మేఘాల కోసమే ఎదురుచూస్తుంది. హంస తామర తూళ్ళను మాత్రమే తింటుంది. అందుకే ఆది పద్మాలతో నిండి ఉన్న సరోవరాల కోసమే వెతుకుతూంటుంది. చకోర పక్షికి వెన్నెలే ఆహారం. అందుకే అది చంద్రోదయానికై ఎదురుచూస్తుంటుంది. అలాగే నిజమైన భక్తుడు పరమేశ్వరుని చేరడానికి అనేక కష్టాలను ఎదిరిస్తూ ఆయన కోసం నిరీక్షిస్తాడు అన్నారు. పట్టుదలతో అనుకున్నది సాధించే వరకూ నిద్రపోని వారిని భగీరథునితో పోలుస్తారు. అందుకే ఎవరైనా కఠోర పరిశ్రమ, చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేసారంటారు. దీనికి కారణం ఎన్నో కష్టనష్టాలకోర్చి భగీరథుడు దివి నుంచి గంగను భువికి తీసుకువచ్చాడు. ఈ భగీరథుని విషయం రామాయణ, భారత, భాగవతాల్లో కూడా కనిపిస్తుంది. భగీరథుని విషయం బహుళ ప్రచారంలో ఉన్నదే. అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశరథ మహారాజు పూర్వీకుడైన సగరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఆయనకు ఇద్దరు _ భార్యలు. వారిలో కేశిని అనే ఆమెకు అసమంజసుడు అనే కుమారుడు, రెండో భార్య సుమతికి అరవై వేల మంది కుమారులు కలిగారు. సగరుడు మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగం తలపెట్టాడు. యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. దాని వెంట తన కుమారులను పంపించాడు. సగరుడు చేసే అశ్వమేధయా గంతో అతను తనతో సమానుడై తన పదవికి ఎక్కడ పోటీ అవుతుందో అని భావించి ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని మాయం చేసి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటున్న మహావిష్ణు అవతారమైన కపిల మహా ముని ఆశ్రమం వద్ద కట్టివేసాడు. సగరుని కుమారులు అరవై వేల మంది దానిని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్లారు. అశ్వం కపిలాశ్రమం వద్ద కనబడే సరికి ఆయనే తమ అశ్వాన్ని కట్టివేసా డని భావించి కపిలునితో యుద్ధానికి దిగారు. సమాధినిష్టుడై ఉన్న కపిలుడికి వీరి అలజడితో భంగం కలిగింది. వారు తన పైకి యుద్ధానికి దిగడం చూసి తీక్షణం గా చూసే సరికి వారంతా భస్మమై అరవై వేల బూడిద కుప్పలుగా మారారు. వారెంతకూ తిరిగిరాక పోవడంతో సగరుడు, అసంమంజసుడి క మారుడైన అంశుమంతుని తమ పెద నాన్నల జాడ తెలుసుకురమ్మని పంపాడు. అతడు వెతుకుతూ పాతాళానికి వెళ్ళి ఆరవైవేల బూడిద కుప్పలు చూసి దగ్గరలోని కపిలుని వద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారికి సద్గతి ప్రాప్తించడం కోసం ఏమి చేయాలని కోరాడు. దానికి ఆయన ఆకాశంలో ప్రవహించే సుర గంనను భూమి మీదకు తెచ్చి వారి బూడిద కుప్పలపైగా పారిస్తే వారికి సద్గతి ప్రాప్తిస్తుందని చెప్పాడు. అది సాధ్యమయ్యే పని కాదని అంశుమంతుడు ఈ విషయం సగరునికి చెప్పాడు. అది విని ఆయన మనోవ్యాధితో బాధపడుతూ కొంత కాలానికి మరణించాడు. ఆయన తర్వాత అతని కొడుకు దిలీపుడు, దిలీపుని కొడుకు భగీరథుడు రాజులయ్యారు. వారిలో భగీరథుడు తన పూర్వీకులకు సద్గతి ప్రాప్తించేందుకు గంగను భువిపైకి తేవాలనే దృఢ సంకల్పంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన గంగను భూమిపైకి ప్రవహింపజేయడానికి అనుమతించాడు. ఆయన గంగానదిని కోరగా ఆమె అంగీకరిం చింది. అయితే తాను ఆకాశం నుంచి భూమిపైకి పడితే ఆ వేగానికి భూమి బద్దలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయం బ్రహ్మకు తెలపగా ఆయన ఆమె వేగాన్ని అదుపుచేయగలవాడు పరమేశ్వరుడేనని తెలిపాడు. భగీరథుడు మళ్లీ పరమేశ్వరుని కోసం తపస్సు చేసాడు. ఆయన ప్రత్య క్షమై గంగను భరించేందుకు అంగీకరించాడు. అలాగే గంగ శివుని జటాజూటంలోకి చేరింది. భగీరథుడు గంగను విడవాల్సిందిగా పరమేశ్వరుని కోరాడు. ఆయన తన జటాజూటం నుంచి సన్నని పాయను వదిలాడు. ఆ విధంగా గంగ భువి పైకి వచ్చింది. అయితే నా ప్రవాహమార్గం ఏమిటని ఆమె అడగ్గా తనని అనుసరించమ న్నాడు భగీరథుడు. ఆయన ముందు కదలగా గంగ వెంట రాసా గింది. దానిలో ఆయన జహ్ను మహర్షి ఆశ్రమం పక్కగా నడుస్తుం డగా గంగా ప్రవాహ వేగానికి ఆయన ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆ మహర్షి కోపించి గంగను మొత్తం తాగేశాడు. భగీరథుడు అతనిని ప్రార్దించి గంగను వదలమనగా ఆయన కరుణించి తన చెవి నుంచి వదిలాడు. ఆయన శరీరంలో నుంచి వచ్చిది కనుక గంగను జహ్నుని కుమార్తెగా భావించి జాహ్నవి అని పిలవడం జరిగింది. ఆ తరువాత భగీరథుని పూర్వీకుల బూడిద కుప్పల మీదుగా ఆమె ప్రవహించడం వారికి సద్గతులు ప్రాప్తించడం జరిగింది. కఠోర పరిశ్రమతో ఎన్ని అడ్డుకులెదురైనా వాటిని సమర్ధంగా ఎదుర్కొన్నాడు కనుకే భగీరథుడు పట్టుదలకు పెట్టింది పేరుగా ప్రసిద్ధి పొందాడు. ఈనాడూ ఇటువంటి వజ్రసంకల్పులు ఉన్నారు. కూలిపనులతో పొట్టపోసుకునే కార్మికుని కొడుకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా బాగా చదివి కలెక్టరైన సంఘటన, ఆటో డ్రైవర్ కుమార్తె విమానం పైలెట్ కావడం వెనుక ఉన్నది భగీరథ ప్రయత్నమేనని గుర్తించాలి. 🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻 🙏 *శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః !* 🙏 🙏 *వాగర్ధావివ సంప్రుక్తౌ వాగర్థః ప్రతిపత్తయే* *జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.... *ఈ పోస్ట్ మీకు నచ్చితే పది మందికి షేర్ చెయ్యండి
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #నాయనార్ల చరిత్రలు - కోచెన్ గాట్ చోళ నాయనారు" (లోహితాక్షుడు)**చరిత్ర 🚩 శివభక్తిలో తరించిన మహారాజు: కోచెన్ గాట్ చోళ నాయనారు (లోహితాక్షుడు) చరిత్ర 🚩 శివ భక్తికి కులమతాలే కాదు, జన్మలతో కూడా సంబంధం లేదని నిరూపించిన మహనీయుడు కోచెన్ గాట్ చోళ నాయనారు. ఈయన పూర్వజన్మ వృత్తాంతం నుండి రాజుగా మారే వరకు అంతా ఒక శివలీల! 🕸️ పూర్వజన్మ వృత్తాంతం (సాలెపురుగు - ఏనుగు భక్తి): 'గజారణ్యం'(జంబులింగేశ్వరం)అనే శైవక్షేత్రం చుట్టూ అలంకరించిన పూలమాలికవలె, దివ్య కావేరీవారి ప్రవాహం ఉంది. అక్కడ వేదం తెల్లనేరుడు చెట్టురూపం ధరించి తపం చేస్తుండగా, వేదమూలమైన శంకరుడు ఆ జంబూవృక్ష మూలంలో లింగరూపంలో సన్నిధి చేసాడు. ఈశ్వరుడు పూర్వం పార్వతీదేవిచే జలలింగంగా అక్కడ ఆవిర్భవించి, స్వయంజ్యోతి రూపమై వెలసి సేవనీయుడు అయ్యాడు. అక్కడికి ఒక ఏనుగు కావేరీ నదీజలాలను తన తుండంతో కొనితెచ్చి, ఆ శివలింగాన్ని అభిషేకించేది. ఆ చెట్టుపై నివసించే ఒక సాలెపురుగు తన నోటినుంచి ఉద్భవించే దారాలతో, ఆ శివలింగం మీద గొడుగువలె చాందినీలు నిర్మించేది. ప్రతిదినం ఏనుగు లింగాభిషేకం చేయుటకు అడ్డుగా ఉన్న సాలెపురుగు అల్లిన తంతు వితానమును, తన తుండంతో తొలగించివేసేది. అది సాలెకు కోపంతెచ్చింది. ఒకనాడు ఎప్పటిలాగే, మదేభం నీటిని తీసుకొని వచ్చి, లింగంపైని సాలెగూళ్ళను ఛేదించి లింగాన్ని అభిషేకించింది. సాలెకు ఒళ్ళుమండి, చెట్టుపైనుంచి వేలాడి ఏనుగు తుండంమీదకు ఉరికింది. ఏనుగు దానిని గుర్తించకముందే, అది తుండ రంధ్రంలోంచి లోపలికి పోయి అక్కడ కుట్టసాగింది. ఏనుగు ఆ దారుణ బాధను తట్టుకోలేక, తొండం నేలకేసి కొట్టుకునీ ఆ శివసన్నిధిలోనే ప్రాణం విడిచింది. సాలెపురుగు మెలికపడి తుండంనుంచి బయటకు రాలేక, ఊపిరి ఆడక మత్తేభ దేహంలోనే సమాధి అయింది. పరమేశ్వరుడు ఏనుగుకు మోక్షాన్నిచ్చాడు. స్వీయతంతు సముదాయంతో నిత్యం తనకు ఛత్రసేవ చేసినా, 'సాలెపురుగు యొక్క శుభకర్మలో గజహింస అంతర్భవించుటచేత, మోక్షార్హం కాదు' అని నిర్ణయించి, దానికి మరొక జన్మ విధించాడు శివుడు. 👶 "లోహితాక్షుడు" పేరు వెనుక ఉన్న రహస్యం: చోళ రాజు శంభుదేవుడు, రాణి కమలావతి సంతానం కోసం పరమశివుడిని ప్రార్థించారు. ఫలితంగా ఆ సాలెపురుగు వారి గర్భాన జన్మించింది. రాణి ప్రసవ వేదన పడుతున్నప్పుడు, జ్యోతిష్కులు ఒక అద్భుతమైన గడియ గురించి చెప్పారు. "మరో కొద్ది నిమిషాలు ఆగి బిడ్డ పుడితే, అతడు ముల్లోకాలను ఏలే చక్రవర్తి అవుతాడు" అని చెప్పారు. శివభక్తురాలైన ఆ తల్లి, గొప్ప యోగ వేత్త కూడ తన బిడ్డ గొప్ప రాజు కావాలని కోరుకుంటూ.. తన కాళ్ళను పైకి కట్టి, తలకిందులుగా వేలాడదీయమని కోరింది. సరిగ్గా శుభ ముహూర్తానికి బిడ్డ పుట్టాడు. ప్రసవం ఆలస్యం కావడం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా లేక బిడ్డ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అందుకే ఆ బిడ్డకు **"కోచెన్ గన్నన్"** (తమిళంలో 'చెన్' అంటే ఎరుపు, 'కణ్' అంటే కన్ను - ఎర్రని కన్నులు కలవాడు) అని పేరు వచ్చింది. సంస్కృతంలో దీనినే **"లోహితాక్షుడు"** అంటారు.ఆ బిడ్డకు జన్మ ఇచ్చి తల్లి మరణించింది, బాలుడు శుక్ల పక్ష చంద్రుడి వలె పెరిగి పెద్దవాడు అయ్యాడు, రాజు అతనిని బాధ్యతలు అప్పచెప్పి వానప్రస్తు గా మారాడు. 🏰 మాడ కోవెలల నిర్మాణకర్త (Elephant-Proof Temples): రాజు అయ్యాక లోహితాక్షుడు మంత్రిమండలి యొక్క వివేక ధర్మోపదేశాల ప్రకారం నడుచుకొంటూ, మనుచక్రవర్తిలా పాలించాడు. అతడు పూర్వజన్మ స్మృతి కలిగి గజారణ్యమునకు వెళ్ళి, జంబూ వృక్షపు మొదట ఉన్న జంబుకేశ్వర స్వామిని అర్చించి, శ్రీకర్మ నిర్వర్తించి, శిల్పులచే ఆలయాన్ని నిర్మాణం చేయించసాగాడు. గర్భాలయం, విమానం, మహామండపం, దానికి ఎదురుగా అర్థమండపం మొదలైనవి నిర్మించాక, ఆలయంలో పరివార దేవతా మూర్తులను ప్రతిష్ఠింపచేసాడు. ప్రాకార నిర్మాణం మొదలయ్యేసరికి నిధులు నిండుకున్నాయి. అప్పుడు జంబులింగేశ్వరుడు తాపసి వేషంలో వచ్చి పని చేసే వారికి, శిల్పులకు భస్మం ఇచ్చి మీ శక్తి కొలది శివ కైంకర్యంగా పని చేయండి భస్మే బంగారం అవుతుంది అని ఉత్సాహం నింపాడు అలా సప్త ప్రాకారాలు పూర్తి అయ్యాయి తాపసి మాయం అయ్యాడు. నమ్మి భస్మ తీసుకుని గుడి నిర్మాణం చేసిన వారికి నిజంగానే బంగారంగా మారి సంపన్నులను చేసింది.నమ్మని వారికి బూడిద గానే మిగిలింది. శోణాక్షుడు వచ్చి ఈ మహాద్భుతాన్ని తిలకించి, సాక్షాత్ శివుడే వచ్చి నిర్మింపచేసిన ఆ 'శ్రీభస్మసాలము'ను ఒక శుభముహూర్తంలో పరమేశ్వరునికి అంకితం చేసి, శివప్రీతికై ఆవిష్కరించాడు. మహాదేవుడికి మహోత్సవాన్ని నిర్వహించాడు. వీటితో పాటుగా పూర్వజన్మలో ఏనుగు తన సాలె గూటిని పాడు చేసిందన్న జ్ఞాపకం ఈ జన్మలో కూడా ఆయనకు ఉంది. అందుకే ఆయన తన రాజ్యంలో సుమారు **70 శివాలయాలను** నిర్మించారు. వీటిని **"మాడ కోవెలలు"** అంటారు. > **ప్రత్యేకత:** ఈ ఆలయాల గర్భాలయంలోకి వెళ్లే దారి చాలా ఇరుకుగా, ఎత్తుగా ఉంటుంది. ఒక ఏనుగు లోపలికి ప్రవేశించలేని విధంగా మెట్లు, ద్వారాలు నిర్మించారు. ఏనుగుల వల్ల శివుడికి ఆటంకం కలగకూడదనేది ఆయన ఉద్దేశ్యం. 🔱 ఆధ్యాత్మిక జీవనం - ముక్తి: ఇలా అనేక శైవక్షేత్రాల నిర్మాణ, పునర్నిర్మాణ కార్యక్రమాలను ఎన్నో చేపట్టి, చివరికి చిదంబరం చేరుకున్నాడు. అక్కడ పది సంవత్సరములు ఉండి, ఆ నటేశునికి శక్తివంచన లేకుండా సేవా కైంకర్యములను నిర్వర్తించి, మేదినీ వలయాన్ని (రాజ్యాన్ని)గొప్పదక్షతతో పాలించి, చిత్సభాపతి కరుణచే ముక్తిని పొందాడు. **నీతి:** మన భక్తి ద్వేషం తో కూడి ఉండకూడదు నిర్మలంగా ఉండాలీ. నిర్మల భక్తి తో సేవ చేసిన ఏనుగు అదే జన్మలో ముక్తి పొందింది. సాలె గూడు తీయడంలో దానికి దురుద్దేశం లేదు ఇది చెత్త అనుకుంది,కానీ సాలెపురుగు నేను అల్లింది ఇది తీస్తుందా అన్న అహంకారం కల్గి ఉంది అందుకే మళ్ళీ జన్మ వచ్చింది. ద్వేషం తో ఉన్నా భక్తి భక్తే కనుక గొప్ప రాజుగా భక్తుడిగా పుట్టాడు,మళ్ళీ ఆ ద్వేషం పోలేదు అందుకే ఏనుగులు దూరనీ శివాలయాలు కట్టాడు. ఈసారి హృదయం లో ప్రేమ ఉంది ఏనుగు వల్ల స్వామికి ఇబ్బంది కలగ వద్దు అని అందుకే ముక్తి కలిగింది. భక్తితో చేసే చిన్న పని అయినా (సాలెపురుగు అల్లిన గూడు వంటిది), భగవంతుడు దానిని మెచ్చి గొప్ప జన్మను, కీర్తిని ప్రసాదిస్తాడు అన్న గొప్ప నీతి ఇందులో ఉంది. **ఓం నమః శివాయ!** 🕉️🙏 ఈ మహనీయుడి చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో షేర్ చేసి వారు కూడా శివానుగ్రహం పొందేలా చేయండి.
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - కోచెనెగాటిచోశిగాయనారు(ోహితాక్షుడు gerercted cortert కోచెనెగాటిచోశిగాయనారు(ోహితాక్షుడు gerercted cortert - ShareChat
https://youtube.com/watch?v=NOmwxvLPFhs&si=_YlNl9ebPE4Id17Z #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *ఈరోజు (01-04-26) సాయంకాలం, పౌర్ణమి సందర్భంగా, నందవరం చౌడేశ్వరి పల్లకీ సేవ*
youtube-preview
https://youtu.be/E20gvzEbps8 #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
youtube-preview
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🙏 శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే? . ನವಾಸನಾಮ ಅತ್ತುಲ್ಯಂರಾಮ ನಾಮ ಏರಾನನ್ !! ೧೦ భక్తిసమాచారం మీసమీ సటుంబ సన్యులందరిః  రామ నేదో ಭಾಕಾಂತಲು శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే? . ನವಾಸನಾಮ ಅತ್ತುಲ್ಯಂರಾಮ ನಾಮ ಏರಾನನ್ !! ೧೦ భక్తిసమాచారం మీసమీ సటుంబ సన్యులందరిః  రామ నేదో ಭಾಕಾಂತಲು - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 మకరతోరణం అంటే ఏమిటి? దాని విశేషం ఏమి..........!! దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది.... పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది. మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు. ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు. ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు. ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే మకరతోరణం అని పేరు వచ్చింది. @highlight Following
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat