హరికృష్ణ ఆచార్య
ShareChat
click to see wallet page
@68144036
68144036
హరికృష్ణ ఆచార్య
@68144036
ఓమ్ గురుభ్యోనమః
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఈ స్తోత్ర మహాత్యం తెలుసుకున్నాక మీకు ఇష్టమైతే రోజూ భక్తితో పటించండి.........!! శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం మహా మహిమాన్వితం శక్తివంతం,ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది,మీ ఇంట్లో ఉండే వారి కోసం కుడా ఈ స్తోత్రాన్ని పఠిన్చి స్వామి వారి అనుగ్రహం పొందండి ... శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం....... ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ । తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥ పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః । సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥ నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః । ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥ ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః । మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥ క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం । రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥ గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు । రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥ శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ । ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥ || ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః. ||
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - eadles htuiitinan Calasy S2A F eadles htuiitinan Calasy S2A F - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఓం శ్రీ అరుణాచల శివ 🔱 🌼🌹🌼🙏🏼🌼🌹🌼 మీకు టైమ్ తో రోజు తో పని లేదు. 100% ప్రేమ భక్తి ఉంటే చాలు శివ అభిషేకం ఎపుడైన చేయొచ్చు. ప్రతి క్షణం శివునికి దగ్గరగా ఉండండి చాలు...🙏🏼 ఇప్పటి వరకు శివ అభిషేకం చేయని వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు శుద్ధ జలంలో విభూది కలిపి గుడికి వెళ్ళిన లేదా మీ ఇంట్లో ఉన్న శివలింగానికి స్మరణ చేస్తూ మాత్రమే అభిషేకం చేయండి. రోజు చేస్తు చేస్తు ఉంటే మీ మనస్సులో మార్పులు మొదలవుతాయి మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. ఓం నమః పార్వతి పతయే శివ హర హర హర మహా దేవా శంభో శివ శంకరా .... 📿🧘🏻‍♀️📿
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - .555 .555 - ShareChat
https://youtu.be/5PE6rbez1jg #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
youtube-preview
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🙏*లింగాష్టకమ్*🙏 బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 || దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ | రావణ దర్ప వినాశక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 || సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ | సిద్ధ సురాసుర వందిత లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 || కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ | దక్ష సుయఙ్ఞ నినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 || కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ | సంచిత పాప వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 || దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ | దినకర కోటి ప్రభాకర లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 || అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ | అష్టదరిద్ర వినాశన లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 || సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ | పరమపదం పరమాత్మక లింగం తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 || లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే || 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 మహాశివరాత్రి రోజు రాత్రి, ముఖ్యంగా అర్థరాత్రి (నిశిత కాలం) సమయంలో శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు.ఫిబ్రవరి 15 అర్ధరాత్రి, సుమారు 12:09 నుండి 12:59 నిమిషాల వరకు ఈ పవిత్ర కాలం ఉంటుంది, ఈ సమయంలో శివలింగానికి అభిషేకం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ-విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా (జ్యోతిర్లింగం) ఉద్భవించిన సమయం. ఈ సమయంలో శివునికి రుద్రాభిషేకం, బిల్వదళాలతో పూజించడం, పంచాక్షరీ మంత్ర జపం చేయడం చాలా విశేషం. ఈ సమయంలో శివుడిని ఆరాధిస్తే సకల దోషాలు తొలగి, జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం.
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🕉 శివరాత్రి సందర్భంగా 🕉 🔅 చిత్తూరు జిల్లా : గుడిమల్లం 🔅 శ్రీ పరశురామేశ్వర ఆలయం : గుడిమల్లం. 🙏 తన ఒడికి చేర్చుకునే గుడిమల్లం దేవుడు శివుడు 🙏 🔅 ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించలేదు . కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది . 👉 అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు , ఎప్పుడు ప్రతిష్టించారో మాత్రం తెలియటం లేదు . ఆలయంలోని శివ లింగం ఆకారం మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది . దానిమీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటాడు . 👉శివుడి కుడిచేతిలో జింక , ఎడమ చేతిలో భిక్షపాత్ర , ముంజేతికి కడియం , చెవులకి కుండలాలు , భుజం మీద గండ్ర గొడ్డలి , తలకు తాటికాయలు కిరీటం , మొలకు ధోవతి స్పష్టంగా కనిపిస్తాయి . 👉చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు . వాళ్ళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని " తిరువిప్పురమ్ బేడు " అని పిలిచినట్టు తెలుస్తోంది . అంటే తెలుగులో ' శ్రీ విప్రపీఠం ' అంటారు . పల్లపుల నిర్వహణలోకి వచ్చాక ఇది గుడిపల్లంగా మారిపోయింది . కాలక్రమంలో అదే గుడిమల్లంగా మారిపోయింది. 👉ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం. శివలింగములన్నీ ఆద్యంతములులేని స్తంభమువలె లింగరూపంలో దర్శనమిస్తాయి. 👉 ఆలయమందు శివుడు పరశురామేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు. 👉గర్భాలయంలో ప్రతిష్ఠించబడిన శివస్వరూపం జ్యోతిర్లింగ ఆలయాలు మరియు ఇతర శివాలయాల మాదిరిగా లింగ రూపంలో కాక పురుషాంగాన్ని పోలి ఐదుఅడుగుల పొడవు ఒక అడుగు వెడల్పుతో ముదురు కాఫీరంగు రాతితో చేయబడి వేటగానితూపంలో శివుడు యక్షుని భుజాలపై నిలబడి రుద్రుని భంగిమలో దర్శనమిస్తాడు. 👉రెండు చేతులందు తలక్రిందులుగా గొర్రెపోతు కాళ్ళు కుడిచేతితో, చేతిలో చిన్నపాత్ర పట్టుకొని తలకట్టుతో, చెవులకు రింగులు మరియు ఆభరణాలు ధరించి నడుమునుండి మోకాళ్ళ వరకూ వస్త్రముధరించి యజ్ఞోపవీతం లేని వేటగానివలె కనపడతాడు. ఎడమభుజం ఆనుకొని గొడ్డలిఉంది. పలుచని వస్త్రమునుండి స్వామివారి శరీరభాగములు స్పష్టంగా కనపడతాయి. తలపాగా, దోవతిధరించిన రుద్రుని వస్త్రధారణ రుగ్వేదకాలం నాటిదని తెలుస్తూంది. 👉భాగవతపురాణ కధనంప్రకారం శ్రీమహావిష్ణువు పది అవతారాలో ఆరవ ఆవతారం పరశురాముడు. జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి కుమారుడు. 👉జమదగ్ని మరియు రేణుకాదేవికి వాసు, విశ్వావసు, బ్రిహుద్యను, బృత్వకన్వ మరియు భద్రరామ అను అయిదుగురు కుమారులు. ఇందు భద్రరామ తరువాత కాలంలో పరశురాముడని పిలువబడ్డాడు. 👉రేణుకాదేవి మహాసాధ్వీ మరియు తన భర్తకు గొప్ప భక్తురాలు. ఒకరోజు ఆమె నదికినీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తున్న గంధర్వుడిని చూసి మోహించినది. అందువలన ఆమెకు గల దైవికశక్తులు నశించినవి. దివ్యదృష్టితో ఆ విషయం తెలుసుకొన్న జమదగ్ని ముందుగా తన నలుగురు కుమారులను పిలిచి తల్లి శిరస్సు ఖండించమని ఆదేశించాడు. 👉వారు అంగీకరించక పోవడంతో పరశురామునితో సోదరులను, తల్లిని వధించమని ఆదిశించాడు . తన తండ్రి ఆజ్ఞతో తల్లి మరియు సోదరులకు శిరచ్ఛేదం చేసిన తరువాత, పరశురాముడు తన తల్లి మరియు సోదరులను తిరిగి బ్రతికించుటకు తండ్రి నుండి వరం కోరుకున్నాడు. 👉తల్లిని చంపిన మాతృహత్యా దోషంనుండి విముక్తి కొరకు శివలింగం పూజించవలసిందిగా తండ్రి చేసిన సలహాతో శివలింగం కొరకు వెతకి పరశురాముడు అడవి మధ్యలో శివలింగం చూచి సమీపంలో చెరువుతవ్వి పూజించసాగాడు.. .. 👉ఆ చెరువు నందు ప్రతిరోజు ఒక దైవికపుష్పం పెరుగుతూ ఉండగా పరశురాముడు శివునికి పూజించేవాడు. పువ్వును జంతువులనుండి రక్షణకొరకు చిత్రసేనుడను యక్షుడుని కాపలాగా ఉంచాడు. 👉ఒకమారు పరశురాముడు లేని సమయంలో బ్రహ్మభక్తుడైన చిత్రసేనుడు ఆపుష్పంతో శివుని పూజించాడు. ఇది తెలిసిన పరశురాముడు కోపోధ్రిక్తుడై చిత్రసేనునీతో పద్నాలుగు సంవత్సరాలు యుద్ధంచేశాడు. 👉వారు ఇరువురు యుద్ధం చేసిన ప్రదేశం గుంటవలే తయారై గుడిపల్లం అని పేరు వచ్చిందని స్థానిక కధనం. 👉యుద్ధం ముగియకపోవడంతో శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింపజేశాడు. శివుడు వారి భక్తికి తృప్తి చెంది వారిలో రెండు భాగాలుగా లీనమయ్యడు.. అందువల్ల శివలింగం ఒకభాగం విష్ణు రూపమైన పరశురామునిగా ఒకచేతిలో వేటాడిన మృగంతో, రెండవచేతిలో కల్లుకుండతో - రెండవభాగం చిత్రసేనుడు బ్రహ్మవలె మరియు శివుడు లింగరూపంతో మలచబడినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది. 👉దీనినిబట్టి ఈక్షేత్రంలోఉన్న శివలింగం త్రిమూర్తి స్వరూపం అనునది సుస్ఫష్టం. 👉 సూర్యకిరణాలు ఉత్తరాయణ, దక్షిణాయణములలో శివలింగం నుదిటిపై నేరుగా ప్రసరిస్తాయి. 👉 ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయాలు ఏమి ఉండవు. ✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - Ling Shival in Parasurameswar Temple పరశురామేశ్వర ఆలయంలో శివలింగం Ling Shival in Parasurameswar Temple పరశురామేశ్వర ఆలయంలో శివలింగం - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఓం నమశ్శివాయ మాఘమాసం చివరి సోమవారం శుభాకాంక్షలు అనంతగిరి క్షేత్రం మృత్యుంజయాలయం జ్యోతిర్లింగా పడిపూజ విశేషముగా జరిగి ఉన్నది ఓం నమశ్శివాయ
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - 6 0   6 0 - ShareChat