#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 స్త్రీ జాతికి ధర్మరాజు ఇచ్చిన శాపం
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *శివార్చనలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మంత్రానికి తెలుగులో అర్థం*
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ! మహాదేవాయ! త్రయంబకాయ! త్రిపురాన్తకాయ! త్రికాగ్నికాలాయ! కాలాగ్నిరుద్రాయ! నీలకంఠాయ!
మృత్యుంజయాయ! సర్వేశ్వరాయ! సదాశివాయ! శ్రీమన్మహాదేవాయనమః🙏🏼
నమస్తే అస్తు భగవన్
భగవన్:
ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం కలిగినవాడా! ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలిసినవాడా! శివా !
తే= నీకు, నమః= నమస్కారం. అస్తు= ఉండు గాక !
విశ్వేశ్వరాయ:
విశ్వమునకు అధిపతి అయిన వానికొరకు ( నమస్కారం)
మహాదేవాయ:
దేవతలకు దేవతయిన వానికొరకు ( నమస్కారం) అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ( నమస్కారం)
త్రయంబకాయ:
చంద్రసూర్యాగ్నులు కన్నులుగా కలవానికొరకు ( నమస్కారం) గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలిసిన వానికొరకు ( నమస్కారం)
త్రిపురాన్తకాయ:
కమలాక్షుడికీ, తారకాక్షుడికీ, విద్యున్మాలికీ బ్రహ్మ మెచ్చి ఇచ్చిన మూడు నగరాలు కలసి త్రిపురం. ఈ మూడు పురములను నాశనము చేసినవానికి నమస్కారం. (రథం, బాణం వర్ణన "త్రిపుర సంహార ఘట్టం" లోనిది).
త్రిపుర సంహారమప్పుడు తేరు భూమి, చక్రములు సూర్యచంద్రులు, గుఱ్ఱములు వేదములు, చాపము మేరువు, నారి శేషుడు, బాణము విష్ణువు. ఇది భౌతికమైన యుద్ధం మాత్రమే కాదు, మనిషిలోని మూడు గుణాలను (సత్వ, రజో, తమో) లేదా మూడు అవస్థలను (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) దాటించి మోక్షాన్ని ఇచ్చే స్థితికి సంకేతం.
త్రికాగ్ని కాలాయ:
భూత, వర్తమాన మరియు భవిష్యత్తులతో కూడిన మూడు కాలములనే అగ్నిని మ్రింగివేసే వానికొరకు ( నమస్కారం).
మరో మాటలో చెప్పాలంటే, అతను కాలానికి అతీతుడు, అతను కాలాన్ని సృష్టించేవాడు, పోషించేవాడు మరియు నాశనం చేసేవాడు. కాలాగ్ని అనగా అందరిని దహించు ప్రళయాగ్ని.
త్రేత్రాగ్నులకు (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులకు) కాల స్వరూపుడైన వాడు అని మరొక అర్థం.
కాలాగ్నిరుద్రాయ:
అందరిని దహించు ప్రళయాగ్ని రూపములో ఉన్న అనగా సర్వ సంహార కర్త అయిన రుద్రుని కొరకు ( నమస్కారం).
రుద్రః శబ్దానికి ఏడిపించువాడు అనిఅర్థం. మరో మాటలో చెప్పాలంటే శివుడూ శిక్షించేవాడు, కర్మఫలదాత, కర్మఫలాలను ఇచ్చేవాడు. 84 కోట్ల ప్రాణులనీ వాటికి సంబంధించిన వివిధ వివిధ ఆహారాలనీ, అవి నిత్యం తినబడుతూంటే తరిగిపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చిగురించే మొక్కల్నీ (హరికేశేభ్యః...), ఇక ఒకే ఆహారపదార్థం కాకుండా ఒక్కో ప్రాణికీ అనేక ఆహార పదార్థాలనీ మనుష్యులకి యవలు మినుగులు నువ్వులు గోధుమలు - (యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే గోధూమాశ్చమే) ఇలా అడక్కుండా నేనిస్తూంటే, ఈ ద్రవ్యాలని సద్వినియోగ పరుచుకోకుండా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారనీ ద్వేషం, అసూయ, పగ... మొదలైన వాటితో ఎందుకు ఐకమత్యంతో ఉండటం లేదనీ ఆయన తన కన్నులని ఎర్రజేస్తే, ఆ ఎర్రని కన్నులు ‘రుద్రు’ డనే పేరుని తనకి రప్పించాయి.
ఆ పేరుని మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకి తెప్పించాం తప్ప ఆయన ఎప్పుడూ (స్మేరాననః) చిరునవ్వుతో కనిపించే బేల శంకరుడు. (బోళా శంకరుడని లోకానికొచ్చింది. అమాయకుడని సరైన అర్థం.
నీలకంఠాయ:
నీలవర్ణపు కంఠము కలవాని కొరకు ( నమస్కారం)
సూర్యుణ్ని గాని తేరిపార చూస్తే సూర్యబింబం ముందుగా మరింత ఎర్రగా కన్పిస్తుంది (వి-లోహితః) . అలా చూస్తూన్న దశలో ఎర్రని రంగులో నీలిరంగు గుండ్రని బిళ్ల కూడా కనిపిస్తుంది (నీల - గ్రీవః). నీలిరంగు అనేది జలానికి సంకేతం. అందుకే సముద్రాలని గుర్తించే సందర్భంలో దేశ పటాల్లో సముద్రానికి నీలి రంగుని పులుముతారు.
మరో విశేషం కూడా ఉంది. నీల-గ్రీవః అంటే నీలిరంగుతో ఉన్నవాడనేది మాత్రమే అర్థం కాకుండా నీలిరంగు కిరణాల ప్రసారం కూడా చేయగల శక్తి ఉన్నవాడని మరో అర్థం కూడా కనిపిస్తుంది. నీలిరంగు అనేది జలానికి సంకేతం కాబట్టే సూర్యుని నుండి పడే కిరణాలు నీటిని పీల్చి మేఘాలని ఏర్పాటు చేస్తాయి. ఆ నీరుపడే ఎండనే నీరెండ అని, అలాంటి నీరెండ పడే కాలంలో నీళ్లని తెచ్చుకునే స్త్రీల గమ్యం (వెళ్లే చోటు) ‘నీలాటి రేవు’ అనీ (నీరు+ఆడు+ రేవు - నీటితో నిండిన కిరణాలు ప్రసరిస్తున్న చెరువు ఒడ్డు) వ్యాఖ్యాన కర్తలు చెప్పారు. ఈ రెండు నామాలనే ఇటు శంకరునిక్కూడా సమన్వయించుకు చూడాల్సి ఉంది. ‘నీల - నీలి' రంగు కల, గ్రీవః - మెడ కలవాడు శివు’డని దీనర్థం. శంకరుడు విషాన్ని స్వీకరించినప్పుడు గుటక వేయకుండా పార్వతి ఆయన కంఠాన్ని పట్టుకుంటే, అక్కడే పేరుకున్న విషం కాస్తా ‘నీలి రంగు’ మచ్చగా మెడమీద నిలిచిపోయింది. శంకరుడు నల్లని కంఠం కలవాడు కాడు. నీలకంఠుడు మాత్రమే.
మృత్యుంజయాయ:
మృత్యువును జయించినవాని కొరకు ( నమస్కారం)
ఈశ్వరుడే సర్వోన్నతుడు అని గ్రహింపబడే వరకు మృత్యువు తానే గొప్పవాడని భావించాడు. దీని గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. మార్కండేయ కథలో ఈశ్వరుని మృత్యుంజయాంశం చెప్పబడింది.
సర్వేశ్వరాయ:
సర్వ లోకాల ప్రభువయిన వాని కొరకు ( నమస్కారం) భూః, భువః మరియు సువః.
భూః( భూమి) భువః ( అంతరిక్షము) , సువః ( స్వర్గ లోకము) అను మూడింటికి , వివిధ దేవతలతో సహా అన్ని జీవులకు ప్రభువు.
సదాశివాయ:
ఎల్లపుడు క్షేమం కలిగించేవానికొరకు ( నమస్కారం)
మహేశ్వరుడు లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక (చాలా ఎక్కువ) ప్రళయం, మహా ప్రళయం అని మూడు లయాలను పరమదయతో చేస్తాడు. అందుకే ఆయనకు ’సదాశివ’ అని వేదం బిరుదిచ్చింది.
శ్రీమన్మహాదేవాయ నమః:
సంపద కలిగిన శోభ కలిగిన దేవతలకు దేవతయిన వానికే నమస్కారం! అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ఈ నమస్కారం!!.
గమనిక: నేనుసేకరించిన విషయాన్ని ఆస్తికులైన నా వార్కి ఉపయోగిస్తుందని వితరణ చేస్తున్నా. ఊకదంపుడుగా మనం( నేను) వింటున్న రుద్ర పారాయణలో మంత్రం తదర్థ భావనమ్ యుండాలి గదా! అనే భావనతో ఇలా అర్థభావన కల్పింపచేయ ప్రయత్నించగల్గితిని!!
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #శివుడు “భావగ్రాహి" అది ఎలాగో తెలుసుకుందాం*🌷
“భావగ్రాహి శివుడు” అనే వాక్యం చాలా గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పుతుంది. ఇది Shiva తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన భావం. 🕉️
1️⃣ “భావగ్రాహి” అంటే ఏమిటి?
భావ + గ్రాహి
భావం → మనసులోని నిజమైన భక్తి, ప్రేమ, సమర్పణ
గ్రాహి → స్వీకరించేవాడు
అంటే
👉 మనసులోని నిజమైన భక్తిని స్వీకరించే వాడు శివుడు.
శివుడికి బాహ్య ఆచారాల కంటే హృదయ భక్తి ముఖ్యము.
2️⃣ ఎందుకు శివుడిని భావగ్రాహి అంటారు?
Shiva గురించి పురాణాలు చెబుతున్న ముఖ్యమైన విషయం:
పెద్ద యజ్ఞాలు అవసరం లేదు
ఖరీదైన పూజా సామగ్రి అవసరం లేదు
శుద్ధమైన మనసు చాలు
అందుకే శివునికి
బిల్వ పత్రం
నీళ్లు
ఒక “ఓం నమః శివాయ”
ఇంత చాలు.
3️⃣ పురాణాల్లో ఉదాహరణ
ఒక ప్రసిద్ధ కథ ఉంది.
Shiva భక్తుడు అడవిలో వేటాడే వ్యక్తి. అతనికి పూజ విధానం తెలియదు.
అతను చెట్టుపై కూర్చొని రాత్రంతా జాగారం చేస్తూ నీళ్లు కింద పడేస్తూ ఉండేవాడు.
కింద ఉన్నది శివలింగం.
అతనికి తెలియకుండా
నీరు అభిషేకం అయింది
చెట్టు నుండి పడిన ఆకులు బిల్వ పత్రం అయ్యాయి
జాగారం శివరాత్రి వ్రతం అయింది.
శివుడు అతని భావం చూసి కృప చేశాడు.
4️⃣ ఈ వాక్యం లోని లోతైన తత్త్వం
“భావగ్రాహి శివుడు” అంటే:
మనసు శుద్ధి ముఖ్యం
భక్తి నిజమైనది అయితే సరిపోతుంది
ఆచారం కన్నా ఆత్మ సమర్పణ గొప్పది
అందుకే శివుడు అతి సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు.
శివుని పూజ చేస్తూ “ఓం నమః శివాయ” జపం చేస్తున్నారంటే —
శివుడికి అది కాశీ లో చేసిన పూజతో సమానం.
ఎందుకంటే శివుడు స్థలాన్ని కాదు, భావాన్ని చూస్తాడు.
🕉️ చివరగా ఒక గొప్ప వాక్యం:
“పాత్రం కాదు – హృదయం ముఖ్యం
మంత్రం కాదు – భక్తి ముఖ్యం
విధానం కాదు – సమర్పణ ముఖ్యం
అందుకే శివుడు భావగ్రాహి.”
🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻
🙏 *శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః !* 🙏
🙏 *వాగర్ధావివ సంప్రుక్తౌ వాగర్థః ప్రతిపత్తయే*
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.....!* 🙏
🚩🙏 *సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు* 🚩🙏🌹🎻🙏🌹
*ఈ పోస్ట్ మీకు నచ్చితే పది మందికి షేర్ చెయ్యండి ఈ సందేశాలు అందరికీ అందేలా జాయిన్ చేయించండి*
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #త్రివేండ్రం రాజవంశీకురాలు ....
లక్షల కోట్లకు కస్టోడియన్
ప్రజలు రాణి అని పిలుస్తారు. కానీ ఆమె దేవుడికి దాసిని అంటుంది.
తమ కుటుంబం కట్టించిన ఆలయాలకు ప్రతిరోజూ, రాజ భవనం నుంచి వెంట ఒక్క మనిషి కూడా లేకుండా దర్శనానికి వస్తుంది. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే దైవ దర్శనం చేసుకుని,
అందరూ నమస్కరిస్తుంటే తనుకూడా
అందరికీ దండం పెట్టుకుంటూ పోతుంది.
ఆమె ఎవరో తెలియని కొత్తవారు ఆమెను చూసి ఆలయం చిమ్మే పనిమనిషి అనుకుంటారు. ఎందుకంటే వస్తూనే ఆలయంలో చీపురు పట్టి శుభ్రం చేస్తుంది..
ఉన్నత వ్యక్తిత్వం అంటే ఇదే !!
పరి పూర్ణమైన ,పరి పక్వత నిండిన
దాస్య భక్తి అంటే ఇదే !!
రాజ వంశీయుల రియాలిటీ అంటే ఇదే !!
గర్వం లేని హుందాతనం !!
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఓం నమో వేంకటేశాయ నమః అంగరంగ వైభవంగా అనంతరాధపురం లక్ష్మీపాలెం గ్రామం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుచున్నది గోవిందాయ నమః
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #మన సమస్యలకి సుందరకాండ అతిశక్తివంతమైన తాంత్రిక పరిష్కారాలు...........!!
సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి
-----------------------------------
శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
*లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
21 దినములు , 108 సార్లు , శక్తి కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.
2. విద్యాప్రాప్తికి
----------------------
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
3. భూతబాధ నివారణకు
--------------------------------
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన
4. సర్వ కార్య సిద్దికి
------------------------
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను
5. శత్రు నాశనముకు
--------------------------
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను .
6. వాహనప్రాప్తికి
---------------------
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .
7. మనః శాంతికి
--------------------
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
8. స్వగృహం కోరువారికి
------------------------------
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పారాయణ చేయవలెను. అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను .
9. యోగక్షేమాలకు
------------------------
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు 27 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
10. ఉద్యోగప్రాప్తికి
-----------------------
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను .
11. రోగ నివారణకు
------------------------
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను .
12. దుఃఖనివృత్తికి
-------------------------
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు 21 దినములు పారాయణ చేయవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను
13. దుస్వప్న నాశనానికి
---------------------------------
27వ సర్గ ఏకాగ్రతతో 1 సార్లు ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు
------------------------------------
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి , 21 దినములు నిష్ఠతో పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
15. ధనప్రాప్తికి
-------------------
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి 40 దినములు పఠించవలెను.*
*అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము 32 వ సర్గ 1 సారి , 40 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
16. దైవాపచారా ప్రాయశ్చిత్తం
------------------------------------
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు 27 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను .
17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు
------------------------------------
19 వ అతినిష్ఠతో రోజుకు ఒకసారి 1 సంవత్సరము పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు
----------------------
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
------------------------------------
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి 68 రోజులు చదువవలెను. నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును .
19. కన్యా వివాహమునకు
--------------------------------
9 దినములలో ఒకసారి పూర్తిగా 68 దినాలలో పఠించవలెను. సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించవలెను. అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను .
20. విదేశీ యానమునకు
-----------------------------
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు 30 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను .
21. ధననష్ట నివృత్తికి
----------------------------
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు 30 దినములు పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, పనస నివేదన చేయవలెను.
22. వ్యాజ్యములో విజయమునకు
-----------------------------------
42 సర్గ అతి ఏకాగ్రతతో 3
సార్లు , 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను .
23. వ్యాపారాభివృద్ధికి
---------------------------
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు 21 దినములు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .
24. పుత్ర సంతానానికి
---------------------------
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో 68 రోజులు పారాయణ చేయవలెను . శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ , నివేదన చేయవలెను. శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును .
25. ఋణ విముక్తికి
--------------------------
28 వ సర్గ చాలా నిష్ఠగా , రోజుకి 1 సారి 41 రోజులు పఠించవలెను. శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను .
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #పద్మావతి దేవి ఎలా పుట్టింది? పూర్తి కథ తెలుసా? 👑✨*
*పూర్వకాలంలో ఆకాశరాజు అనే ధర్మపరుడు నారాయణవనం ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన ప్రజలను ప్రేమతో చూసుకునే మంచి రాజు. కానీ రాజు మరియు అతని భార్య ధరణిదేవి ఒక పెద్ద బాధతో ఉండేవారు — వారికి సంతానం లేకపోవడం. సంతానం కోసం వారు దేవతలను ప్రార్థిస్తూ అనేక యజ్ఞాలు, పూజలు నిర్వహించారు🔥*
*చివరికి ఒక రోజు పెద్ద యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించారు. యజ్ఞం కోసం భూమిని సిద్ధం చేస్తుండగా, రాజు పొలాన్ని దున్నుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. భూమిలో నుంచి ఒక అందమైన కమలపుష్పం 🌺 బయటపడింది.*
*ఆ కమలంలో ఒక ప్రకాశవంతమైన చిన్న బాలిక 👶 కనిపించింది. ఆకాశరాజు మరియు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బాలిక దేవుని వరమని భావించి, రాజు ఆమెను ఎంతో ప్రేమతో దత్తత తీసుకున్నాడు ❤️.*
*కమలంలో లభించినందుకే ఆమెకు పద్మావతి 🌸 అనే పేరు పెట్టారు. పద్మావతి* *చిన్నప్పటి నుంచే ఎంతో అందంగా, వినయంగా, భక్తితో పెరిగింది. ఆమె రూపం, స్వభావం దేవిలా ఉండేది 🙏💛.*
*అదే సమయంలో శ్రీమహావిష్ణువు భూమిపై శ్రీనివాస స్వామిగా తిరుమలలో అవతరించి నివసిస్తున్నాడు. తరువాత కాలంలో శ్రీనివాస స్వామి పద్మావతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు 💑.*
*ఈ విధంగా పద్మావతి జన్మ ఒక దివ్య సంఘటనగా భావించబడింది. తరువాత జరిగిన శ్రీనివాస–పద్మావతి వివాహం కూడా ఒక మహోత్సవంగా జరిగింది 🎉.*
*📌 నీతి:*
*దేవుని కృప ఉంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి… విశ్వాసం ఎప్పుడూ ఫలిస్తుంది
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #శబ్దం_మరియు_పరధ్యానాలతో నిండిన ప్రపంచంలో, నంది నిశ్శబ్దాన్ని ఎంచుకోండి.*
*అతను మహాదేవుడి ముందు స్థిరంగా దృష్టి కేంద్రీకరించి, ఎప్పుడూ తన దృష్టిని తిప్పుకోడు.*
*ఎంతమంది ప్రజలు దాటినా లేదా పరిసరాలు ఎంత గందరగోళంగా ఉన్నా, అతని చూపు శివుడిపైనే ఉంటుంది.*
*ఇది భక్తి; స్థిరంగా, ఓపికగా, కదలకుండా. జీవితం గందరగోళం, అపార్థాలు లేదా భావోద్వేగ తుఫానులను తెచ్చినప్పుడు, ఆలోచనలు మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నించినప్పుడు - మీ హృదయంలో నందిలా కూర్చోండి.*
*ప్రతి ఆలోచనను వెంబడించవద్దు. ప్రతి అలజడికి ప్రతిస్పందించవద్దు.*
*మీ అంతర్గత దృష్టిని మహాదేవ్ పై ఉంచండి. క్రమంగా, మనస్సు నిశ్చలతను నేర్చుకుంటుంది, హృదయం బలాన్ని పొందుతుంది..*
*మరియు బయటి ఏదీ లోపల ఉన్న శాంతిని కదిలించఅండి - ఓం నమో నందీశ్వరాయ శివాయ నమః ఓం!🙏*
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 నాకు కళ్లు వద్దు, మోక్షం వద్దు. మళ్లీ భారత దేశంలో బ్రాహ్మణుడిగా పుట్టాలన్నదే నా కోరిక.
జగద్గురు రామభద్రాచార్య
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🙏🕉️🙏మనం స్పందిస్తేనే కదా ఎదుటివారి కోపానికైనా, ద్వేషానికైనా,అప్పటి పరిస్థితికి అయినా అర్ధం ఉంటుంది...ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో అయినా ఫలితం కాలానికి వదిలేసి మౌనంగా ముందుకు నడిస్తే కాలమే* *సమాధానం ఇస్తుంది...ఏ స్పందనకు అయినా ప్రతి స్పందన వల్లే విలువ* *పెరుగుతుంది...లేకుంటే దాని ఫలితం శూన్యం అవుతుంది...*
*ఈశ్వరా...ఎలాంటి పరిస్థితిలో అయినా మౌనంగా,శాంతంగా,సహనంగా ఉండే సద్బుద్ధిని నాకు నిత్యం ఇస్తూ నా చేయి పట్టుకుని నడుపు తండ్రీ...*
*నమః శివాయ🙏*














