https://youtube.com/shorts/DWdvP41aO8I?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/f8KHf0Bydq0?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/dQdKY3RE4rQ?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/5k8U5ouGhVs?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #బిల్వపత్ర_మహత్యం శనైశ్చరుని చరిత్ర🌹*
*శివుడిని బిల్వపత్రాలతో పూజించుట శ్రేష్టం. బిల్వ వృక్షం సాక్షాత్తు శివ స్వరూపమని దేవతలు భావిస్తారు. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం పార్వతీ - పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అప్పుడు మహా దేవుడైన శంకరుడు శని దేవుని విధి ధర్మాన్ని పరీక్షించేందుకు " నీవు నన్ను పట్టగలవా? " అని ప్రశ్నిస్తాడు. అందుకు శనిదేవుడు "తమ అనుగ్రహం ఉన్నంత వరకు నాకు అసాధ్యంమైందేదీ లేదు. తమర్ని అట్టే పట్టగలను. మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు శివుని పట్టుకోగలనని" శివునితో పలికాడు. శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలమందు శని నుంచి తప్పించుకోవడానికి బిల్వ వృక్ష రూపాన్ని దాల్చి.. ఆ వృక్షం నందు అగోచరంగా వశించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవాది దేవతలందరూ ముల్లోకాలను గాలించారు.*
*వారెవ్వరికీ పరమేశ్వరుడి జాడగానీ, శని జాడగానీ తెలియలేదు. సంధ్యా సమయానికి శివుడు బిల్వ వృక్షం నుంచి సాకార రూపంగా బయలు దేరాడు. ఆ మరుక్షణమే శని దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. శనీ నన్ను పట్టుకోలేక పోతివి! అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడు. అప్పుడు శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులైన తమరు ఈ బిల్వ వృక్ష రూపంగా వశించారు. నేనూ తమ తోడనే ఈ బిల్వవృక్షంలో అదృశ్య రూపాన నివసించాను కదా! ఐనా ఇదంతా శివలీల మహత్యమే గానీ, నా ప్రతిభ ఎంతమాత్రమూ కాదు. సర్వ జగత్కర్తలైన దివ్య విభూతి ముందు నేనెంతటి వాడని ప్రభూ" అని విన్నవించాడు.*
*శని దేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన పార్వతీ వల్లభుడు ఈశ్వరుడనైన నన్నే కొద్దికాలం పట్టి వశించడం చేత నేటి నుంచి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందగలుగుతావు. అంతేకాక శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం నన్ను బిల్వ దళములతో పూజించిన వారికి దోష నివృత్తి కలుగుతుంది. బిల్వపత్రితో పూజ చేసిన వారిని, శివ భక్తులను శనీశ్వరుడు బాధించడు" అని అభయ వర ప్రదానం చేశాడు శివుడు. అప్పటి నుంచి బిల్వవృక్షాన్ని శివ స్వరూపంగా భావించి పరమేశ్వరుని బిల్వ పత్రాలతో అర్చించుట ఆచారంగా వస్తుంది..*
*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*
https://youtube.com/shorts/G36iSwTnUtE?feature=share #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 కోరెధేల శివుని చేరేధేల
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 స్త్రీ జాతికి ధర్మరాజు ఇచ్చిన శాపం
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *శివార్చనలో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మంత్రానికి తెలుగులో అర్థం*
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ! మహాదేవాయ! త్రయంబకాయ! త్రిపురాన్తకాయ! త్రికాగ్నికాలాయ! కాలాగ్నిరుద్రాయ! నీలకంఠాయ!
మృత్యుంజయాయ! సర్వేశ్వరాయ! సదాశివాయ! శ్రీమన్మహాదేవాయనమః🙏🏼
నమస్తే అస్తు భగవన్
భగవన్:
ఐశ్వర్యం, ధర్మం, వైరాగ్యం, జ్ఞానం కలిగినవాడా! ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలిసినవాడా! శివా !
తే= నీకు, నమః= నమస్కారం. అస్తు= ఉండు గాక !
విశ్వేశ్వరాయ:
విశ్వమునకు అధిపతి అయిన వానికొరకు ( నమస్కారం)
మహాదేవాయ:
దేవతలకు దేవతయిన వానికొరకు ( నమస్కారం) అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ( నమస్కారం)
త్రయంబకాయ:
చంద్రసూర్యాగ్నులు కన్నులుగా కలవానికొరకు ( నమస్కారం) గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలిసిన వానికొరకు ( నమస్కారం)
త్రిపురాన్తకాయ:
కమలాక్షుడికీ, తారకాక్షుడికీ, విద్యున్మాలికీ బ్రహ్మ మెచ్చి ఇచ్చిన మూడు నగరాలు కలసి త్రిపురం. ఈ మూడు పురములను నాశనము చేసినవానికి నమస్కారం. (రథం, బాణం వర్ణన "త్రిపుర సంహార ఘట్టం" లోనిది).
త్రిపుర సంహారమప్పుడు తేరు భూమి, చక్రములు సూర్యచంద్రులు, గుఱ్ఱములు వేదములు, చాపము మేరువు, నారి శేషుడు, బాణము విష్ణువు. ఇది భౌతికమైన యుద్ధం మాత్రమే కాదు, మనిషిలోని మూడు గుణాలను (సత్వ, రజో, తమో) లేదా మూడు అవస్థలను (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) దాటించి మోక్షాన్ని ఇచ్చే స్థితికి సంకేతం.
త్రికాగ్ని కాలాయ:
భూత, వర్తమాన మరియు భవిష్యత్తులతో కూడిన మూడు కాలములనే అగ్నిని మ్రింగివేసే వానికొరకు ( నమస్కారం).
మరో మాటలో చెప్పాలంటే, అతను కాలానికి అతీతుడు, అతను కాలాన్ని సృష్టించేవాడు, పోషించేవాడు మరియు నాశనం చేసేవాడు. కాలాగ్ని అనగా అందరిని దహించు ప్రళయాగ్ని.
త్రేత్రాగ్నులకు (గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులకు) కాల స్వరూపుడైన వాడు అని మరొక అర్థం.
కాలాగ్నిరుద్రాయ:
అందరిని దహించు ప్రళయాగ్ని రూపములో ఉన్న అనగా సర్వ సంహార కర్త అయిన రుద్రుని కొరకు ( నమస్కారం).
రుద్రః శబ్దానికి ఏడిపించువాడు అనిఅర్థం. మరో మాటలో చెప్పాలంటే శివుడూ శిక్షించేవాడు, కర్మఫలదాత, కర్మఫలాలను ఇచ్చేవాడు. 84 కోట్ల ప్రాణులనీ వాటికి సంబంధించిన వివిధ వివిధ ఆహారాలనీ, అవి నిత్యం తినబడుతూంటే తరిగిపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చిగురించే మొక్కల్నీ (హరికేశేభ్యః...), ఇక ఒకే ఆహారపదార్థం కాకుండా ఒక్కో ప్రాణికీ అనేక ఆహార పదార్థాలనీ మనుష్యులకి యవలు మినుగులు నువ్వులు గోధుమలు - (యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే గోధూమాశ్చమే) ఇలా అడక్కుండా నేనిస్తూంటే, ఈ ద్రవ్యాలని సద్వినియోగ పరుచుకోకుండా ఎందుకు వ్యర్థపరుచుకుంటున్నారనీ ద్వేషం, అసూయ, పగ... మొదలైన వాటితో ఎందుకు ఐకమత్యంతో ఉండటం లేదనీ ఆయన తన కన్నులని ఎర్రజేస్తే, ఆ ఎర్రని కన్నులు ‘రుద్రు’ డనే పేరుని తనకి రప్పించాయి.
ఆ పేరుని మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకి తెప్పించాం తప్ప ఆయన ఎప్పుడూ (స్మేరాననః) చిరునవ్వుతో కనిపించే బేల శంకరుడు. (బోళా శంకరుడని లోకానికొచ్చింది. అమాయకుడని సరైన అర్థం.
నీలకంఠాయ:
నీలవర్ణపు కంఠము కలవాని కొరకు ( నమస్కారం)
సూర్యుణ్ని గాని తేరిపార చూస్తే సూర్యబింబం ముందుగా మరింత ఎర్రగా కన్పిస్తుంది (వి-లోహితః) . అలా చూస్తూన్న దశలో ఎర్రని రంగులో నీలిరంగు గుండ్రని బిళ్ల కూడా కనిపిస్తుంది (నీల - గ్రీవః). నీలిరంగు అనేది జలానికి సంకేతం. అందుకే సముద్రాలని గుర్తించే సందర్భంలో దేశ పటాల్లో సముద్రానికి నీలి రంగుని పులుముతారు.
మరో విశేషం కూడా ఉంది. నీల-గ్రీవః అంటే నీలిరంగుతో ఉన్నవాడనేది మాత్రమే అర్థం కాకుండా నీలిరంగు కిరణాల ప్రసారం కూడా చేయగల శక్తి ఉన్నవాడని మరో అర్థం కూడా కనిపిస్తుంది. నీలిరంగు అనేది జలానికి సంకేతం కాబట్టే సూర్యుని నుండి పడే కిరణాలు నీటిని పీల్చి మేఘాలని ఏర్పాటు చేస్తాయి. ఆ నీరుపడే ఎండనే నీరెండ అని, అలాంటి నీరెండ పడే కాలంలో నీళ్లని తెచ్చుకునే స్త్రీల గమ్యం (వెళ్లే చోటు) ‘నీలాటి రేవు’ అనీ (నీరు+ఆడు+ రేవు - నీటితో నిండిన కిరణాలు ప్రసరిస్తున్న చెరువు ఒడ్డు) వ్యాఖ్యాన కర్తలు చెప్పారు. ఈ రెండు నామాలనే ఇటు శంకరునిక్కూడా సమన్వయించుకు చూడాల్సి ఉంది. ‘నీల - నీలి' రంగు కల, గ్రీవః - మెడ కలవాడు శివు’డని దీనర్థం. శంకరుడు విషాన్ని స్వీకరించినప్పుడు గుటక వేయకుండా పార్వతి ఆయన కంఠాన్ని పట్టుకుంటే, అక్కడే పేరుకున్న విషం కాస్తా ‘నీలి రంగు’ మచ్చగా మెడమీద నిలిచిపోయింది. శంకరుడు నల్లని కంఠం కలవాడు కాడు. నీలకంఠుడు మాత్రమే.
మృత్యుంజయాయ:
మృత్యువును జయించినవాని కొరకు ( నమస్కారం)
ఈశ్వరుడే సర్వోన్నతుడు అని గ్రహింపబడే వరకు మృత్యువు తానే గొప్పవాడని భావించాడు. దీని గురించి చాలా ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. మార్కండేయ కథలో ఈశ్వరుని మృత్యుంజయాంశం చెప్పబడింది.
సర్వేశ్వరాయ:
సర్వ లోకాల ప్రభువయిన వాని కొరకు ( నమస్కారం) భూః, భువః మరియు సువః.
భూః( భూమి) భువః ( అంతరిక్షము) , సువః ( స్వర్గ లోకము) అను మూడింటికి , వివిధ దేవతలతో సహా అన్ని జీవులకు ప్రభువు.
సదాశివాయ:
ఎల్లపుడు క్షేమం కలిగించేవానికొరకు ( నమస్కారం)
మహేశ్వరుడు లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక (చాలా ఎక్కువ) ప్రళయం, మహా ప్రళయం అని మూడు లయాలను పరమదయతో చేస్తాడు. అందుకే ఆయనకు ’సదాశివ’ అని వేదం బిరుదిచ్చింది.
శ్రీమన్మహాదేవాయ నమః:
సంపద కలిగిన శోభ కలిగిన దేవతలకు దేవతయిన వానికే నమస్కారం! అపరిమితముగా ప్రకాశించే వానికొరకు ఈ నమస్కారం!!.
గమనిక: నేనుసేకరించిన విషయాన్ని ఆస్తికులైన నా వార్కి ఉపయోగిస్తుందని వితరణ చేస్తున్నా. ఊకదంపుడుగా మనం( నేను) వింటున్న రుద్ర పారాయణలో మంత్రం తదర్థ భావనమ్ యుండాలి గదా! అనే భావనతో ఇలా అర్థభావన కల్పింపచేయ ప్రయత్నించగల్గితిని!!
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #శివుడు “భావగ్రాహి" అది ఎలాగో తెలుసుకుందాం*🌷
“భావగ్రాహి శివుడు” అనే వాక్యం చాలా గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పుతుంది. ఇది Shiva తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన భావం. 🕉️
1️⃣ “భావగ్రాహి” అంటే ఏమిటి?
భావ + గ్రాహి
భావం → మనసులోని నిజమైన భక్తి, ప్రేమ, సమర్పణ
గ్రాహి → స్వీకరించేవాడు
అంటే
👉 మనసులోని నిజమైన భక్తిని స్వీకరించే వాడు శివుడు.
శివుడికి బాహ్య ఆచారాల కంటే హృదయ భక్తి ముఖ్యము.
2️⃣ ఎందుకు శివుడిని భావగ్రాహి అంటారు?
Shiva గురించి పురాణాలు చెబుతున్న ముఖ్యమైన విషయం:
పెద్ద యజ్ఞాలు అవసరం లేదు
ఖరీదైన పూజా సామగ్రి అవసరం లేదు
శుద్ధమైన మనసు చాలు
అందుకే శివునికి
బిల్వ పత్రం
నీళ్లు
ఒక “ఓం నమః శివాయ”
ఇంత చాలు.
3️⃣ పురాణాల్లో ఉదాహరణ
ఒక ప్రసిద్ధ కథ ఉంది.
Shiva భక్తుడు అడవిలో వేటాడే వ్యక్తి. అతనికి పూజ విధానం తెలియదు.
అతను చెట్టుపై కూర్చొని రాత్రంతా జాగారం చేస్తూ నీళ్లు కింద పడేస్తూ ఉండేవాడు.
కింద ఉన్నది శివలింగం.
అతనికి తెలియకుండా
నీరు అభిషేకం అయింది
చెట్టు నుండి పడిన ఆకులు బిల్వ పత్రం అయ్యాయి
జాగారం శివరాత్రి వ్రతం అయింది.
శివుడు అతని భావం చూసి కృప చేశాడు.
4️⃣ ఈ వాక్యం లోని లోతైన తత్త్వం
“భావగ్రాహి శివుడు” అంటే:
మనసు శుద్ధి ముఖ్యం
భక్తి నిజమైనది అయితే సరిపోతుంది
ఆచారం కన్నా ఆత్మ సమర్పణ గొప్పది
అందుకే శివుడు అతి సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు.
శివుని పూజ చేస్తూ “ఓం నమః శివాయ” జపం చేస్తున్నారంటే —
శివుడికి అది కాశీ లో చేసిన పూజతో సమానం.
ఎందుకంటే శివుడు స్థలాన్ని కాదు, భావాన్ని చూస్తాడు.
🕉️ చివరగా ఒక గొప్ప వాక్యం:
“పాత్రం కాదు – హృదయం ముఖ్యం
మంత్రం కాదు – భక్తి ముఖ్యం
విధానం కాదు – సమర్పణ ముఖ్యం
అందుకే శివుడు భావగ్రాహి.”
🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻
🙏 *శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః !* 🙏
🙏 *వాగర్ధావివ సంప్రుక్తౌ వాగర్థః ప్రతిపత్తయే*
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.....!* 🙏
🚩🙏 *సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు* 🚩🙏🌹🎻🙏🌹
*ఈ పోస్ట్ మీకు నచ్చితే పది మందికి షేర్ చెయ్యండి ఈ సందేశాలు అందరికీ అందేలా జాయిన్ చేయించండి*
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #త్రివేండ్రం రాజవంశీకురాలు ....
లక్షల కోట్లకు కస్టోడియన్
ప్రజలు రాణి అని పిలుస్తారు. కానీ ఆమె దేవుడికి దాసిని అంటుంది.
తమ కుటుంబం కట్టించిన ఆలయాలకు ప్రతిరోజూ, రాజ భవనం నుంచి వెంట ఒక్క మనిషి కూడా లేకుండా దర్శనానికి వస్తుంది. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా దూరం నుంచే దైవ దర్శనం చేసుకుని,
అందరూ నమస్కరిస్తుంటే తనుకూడా
అందరికీ దండం పెట్టుకుంటూ పోతుంది.
ఆమె ఎవరో తెలియని కొత్తవారు ఆమెను చూసి ఆలయం చిమ్మే పనిమనిషి అనుకుంటారు. ఎందుకంటే వస్తూనే ఆలయంలో చీపురు పట్టి శుభ్రం చేస్తుంది..
ఉన్నత వ్యక్తిత్వం అంటే ఇదే !!
పరి పూర్ణమైన ,పరి పక్వత నిండిన
దాస్య భక్తి అంటే ఇదే !!
రాజ వంశీయుల రియాలిటీ అంటే ఇదే !!
గర్వం లేని హుందాతనం !!














